ముంబై లక్ష్యం 153 పరుగులు | Sakshi
Sakshi News home page

ముంబై లక్ష్యం 153 పరుగులు

Published Tue, May 5 2015 9:54 PM

ముంబై లక్ష్యం 153 పరుగులు

ముంబై: ఐపీఎల్-8లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో ముంబై జట్టుకు 152 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యువరాజు సింగ్ చెలరేగి ఆడటంతో ఢిల్లీ స్కోరు పరుగులు పెట్టింది. ఇంతలో ముంబై బౌలర్ మలింగ్ బంతి మాయజాలంతో యువరాజ్ సింగ్ దూకుడుకు కళ్లెం వేశాడు. దాంతో 44 బంతుల్లో 57 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసి పెవిలియన్కు చేరాడు.

ఢిల్లీ మిగతా ఆటగాళ్లు డుమినీ 28, కేదార్ జాదవ్ 16, మాథ్యుస్ 12, తివారీ 13 నాటౌట్, కోల్టర్ నిల్ 3 పరుగులతో నాటౌట్గా నిలిచారు. కాగా, ముంబై బౌలర్లు మలింగ, హార్భజన్ సింగ్ రెండేసి వికెట్లు, సుచిత్, పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement