న్యాయ నియామకాలపై సుప్రీం తీర్పు ప్రకారం అధికారం తీసుకున్నాం
* విధివిధానాల ముసాయిదాపై న్యాయశాఖ ఉద్ఘాటన
న్యూఢిల్లీ: ఉన్నత స్థాయి న్యాయ నియామకాలకు సంబంధించిన విధివిధానాలు, అధికార పరిధులపై కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియంల మధ్య భిన్నాభిప్రాయాల నేపథ్యంలో.. న్యాయనియామకాలపై సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తాను అధికారాన్ని తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. న్యాయమూర్తుల నియామక వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ధర్మాసనం 2015 డిసెంబర్లో ఇచ్చిన తీర్పులో ఉద్ఘాటించిందని న్యాయశాఖలోని ఉన్నతస్థాయి వర్గాలు శుక్రవారం ఉటంకించాయి.
కొలీజియం వ్యవస్థను మెరుగుపరిచే మార్గాలపై ఇచ్చిన ఆ తీర్పులో.. ధర్మాసనానికి నియమించబోయే అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవటానికి మరింత విస్తృత పరిధి ఉండాలని కూడా పేర్కొందని గుర్తుచేశాయి. ఆ తీర్పు ఆధారంగానే న్యాయ నియామకాలపై సవరించిన విధివిధానాల పత్రం ముసాయిదాను రూపొందించటం జరిగిందని చెప్పాయి. ఆమేరకు.. అభ్యర్థుల పేర్లు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు అందరి నుంచీ రావాలన్నది ప్రభుత్వ వైఖరిగా చెప్పాయి. ‘ఒక హైకోర్టు కొలీజియానికి పేర్లను సూచించే స్వేచ్ఛ సదరు హైకోర్టు న్యాయమూర్తులు అందరికీ ఉండాలి.
ఆ కొలీజియం ఆ పేర్లను పరిశీలించి నియామకాలకు ఎవరిని సిఫారసు చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటుంది. సుప్రీంకోర్టుకు కూడా ఇదే విధానం వర్తింపజేయాలి. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇదే సూత్రాన్ని పాటిస్తోంది’ అని ఆ వర్గాలు వివరించాయి. అలాగే.. ముఖ్యమంత్రులకు, అడ్వొకేట్ జనరళ్లకు కూడా తమ రాష్ట్ర హైకోర్టు కొలీజియంలకు అభ్యర్థులను సూచించే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాయి. సుప్రీంకోర్టుకు అభ్యర్థులను సూచించే అవకాశం అటార్నీ జనరల్కు ఇవ్వాలన్నాయి. న్యాయనియామకాలకు సంబంధించి మార్గదర్శకాల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధివిధానాల పత్రం ముసాయిదాలో పలు మార్పులు చేయాలని చెప్తూ సుప్రీంకోర్టు కొలీజియం గతంలో కేంద్రానికి తిప్పిపంపిన విషయం తెలిసిందే.
ఇందులో కొలీజియం డిమాండ్లు కొన్నిటికి అంగీకరిస్తూ సవరించిన ముసాయిదాను కేంద్రం ఈ నెల 3వ తేదీన కొలీజియానికి పంపించింది. అభ్యర్థుల ఎంపికకు ప్రతిభ - సీనియారిటీ ప్రాతిపదికగా ఉండాలన్న మార్గదర్శకాన్ని.. సీనియారిటీ-ప్రతిభ ప్రాతిపదికగా మార్చటానికి కేంద్రం ఆంగీకరించింది. అయితే సీనియారిటీని కాదనటానికి.. ఒక హైకోర్టు నుంచి ఎక్కువ మంది న్యాయమూర్తులు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు చోటు ఇవ్వటం, ఒక న్యాయమూర్తి అత్యద్భుత పనితీరు, ఒక ప్రధాన న్యాయమూర్తి పనితీరు బాగోలేకపోవటం వంటి కారణాలను వినియోగించుకోవచ్చునని పేర్కొంది.
న్యాయమూర్తి అయ్యేందుకు అవసరమైన కనీస వయసును నిర్ణయించే అంశాన్ని న్యాయవ్యవస్థకే వదిలిపెట్టింది. అయితే.. ఒకసారి నిర్ణయించిన వయసును సడలించటానికి వీలు ఉండకూడదని స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల స్థాయి లో.. అభ్యర్థుల పనితీరు అంచనా, మదింపుల కమిటీలు ఉండాలన్న నిబంధనను భారత ప్రధాన న్యాయమూర్తి తిరస్కరించినప్పటికీ.. సర్కారు దానిపై మళ్లీ పట్టుపట్టింది.
తీర్పు మేరకే కేంద్రానికి అధికారాలు
Published Sat, Aug 20 2016 1:19 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
హనీమూన్ ఎక్స్ప్రెస్: 'క్యూట్గా స్వీట్గా' సాంగ్ వచ్చేసింది..
విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు
ఇంటర్ కూడా ఇక్కడే..
శృంగార వల్లభునికి రూ.4.04 లక్షల ఆదాయం
ఇంటర్ సప్లిమెంటరీకి రెడీ
అన్నదాత కన్నీరు తుడిచేలా..
No Headline
గ్రూప్–2 మెయిన్ పరీక్షకు ఉచిత శిక్షణ
ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు
బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- బీజేపీ ఎంపీ- ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో వైరల్!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement