-
రాష్ట్రపతి ముర్ము తొలి జ్యుడీషియల్ నియామకం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అండ్ లద్ధాఖ్ హైకోర్టు కొత్త అదనపు న్యాయమూర్తిగా రాజేశ్ సెఖ్రీ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. ఉత్తర్వుపై సంతకం చేశారు. రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలి జ్యుడీషియల్ నియామకం ఇదే. దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గత సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. ప్రతిభా పాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవిని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము మరో రికార్డు సృష్టించారు. ఇదీ చదవండి: Draupadi Murmu: ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం.. ‘భారత్కు ఉద్వేగభరిత క్షణం’.. -
ఈ వివాదం సరికాదు
న్యాయమూర్తుల నియామకాలపై సుప్రీంకోర్టుకూ, కేంద్ర ప్రభుత్వానికీ ఎడతెగకుండా కొనసాగుతున్న వివాదంలో మరో కొత్త అంకానికి తెర లేచింది. మరోసారి ఇరు పక్షాలూ మాటల యుద్ధానికి దిగాయి. ఈసారి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ అఖిల భారత సదస్సు దీనికి వేదికైంది. వివిధ హైకోర్టుల్లో 500 న్యాయమూర్తుల ఖాళీలున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ అంటే... కింది స్థాయి కోర్టుల్లో 5,000 న్యాయాధికారుల నియామకాల మాటేమిటని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చురకంటించారు. ఈ రెండూ నిజమే. సమస్యల్లా రెండింటి విష యంలోనూ ఇరు పక్షాలూ కూర్చుని మాట్లాడుకోకపోవడమే! అలాంటి సందర్భమే అసలు రానట్టు ఇరువురూ బహిరంగ వేదికలపై సంవాదం జరుపుకోవడం వారి కెలా ఉందో గానీ చూసేవారికి మాత్రం అయోమయంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకోకుండా అలాంటి పరిస్థితి తలెత్తితే వేరు. కానీ పదే పదే ఇది పునరావృతమవుతోంది. ప్రభుత్వ విభాగాలు లక్ష్మణరేఖ దాటకూడదని జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ అంటే... న్యాయవ్యవస్థకూ ఆ రేఖ ఉంటుందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ గుర్తుచేశారు. రవిశంకర్ ప్రసాద్ అయితే అత్యవసర పరిస్థితి చీకటి రోజుల్ని గుర్తుచేసి అప్పుడు హైకోర్టులన్నీ ధైర్యసాహసాలను ప్రదర్శిస్తే సుప్రీంకోర్టు దారుణంగా విఫలమైందని చెప్పారు. మౌలిక సమస్య నుంచి ఇరు పక్షాలూ చాలా దూరం జరిగాయని దీన్నంతా గమనిస్తే అర్ధమవుతుంది. అసలు సమస్య పరి ష్కారమై ఉంటే ఇలా పరస్పరం చురకలంటించుకునే స్థితి ఏర్పడేది కాదని సుల భంగానే చెప్పొచ్చు. లక్ష్మణ రేఖ ప్రస్తావనకు రావడం ఇది మొదటిసారేమీ కాదు. సరిగ్గా ఆర్నెల్ల క్రితం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా ఈ మాటే చెప్పారు. అంతకు నాలుగేళ్ల మునుపే 2012లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్. హెచ్. కపాడియా కూడా దీన్ని అంగీ కరించారు. అందువల్ల ఒక్కోసారి సమతుల్యత దెబ్బతింటున్న మాట వాస్తవమే అయినా ‘న్యాయం చేయాలన్న ఆత్రుతే’ అందుకు కారణమని సంజాయిషీ ఇచ్చు కున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకం ఎలా ఉండాలన్న అంశంపై ప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకూ మధ్య విభేదాలున్నాయి. కొన్ని దశాబ్దా లుగా అనుసరిస్తున్న కొలీజియం విధానంలో లోపాలున్నాయని, కమిషన్ ఏర్పాటు చేసి నియామకాల ప్రక్రియ సాగిస్తే పారదర్శకత ఉంటుందని కేంద్రం చెబుతోంది. అది కార్యనిర్వాహక వ్యవస్థ ఆధిపత్యానికి దారితీస్తుందన్నది న్యాయ వ్యవస్థ అభ్యంతరం. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే కమిషన్ ఏర్పాటు ప్రయత్నం జరి గినా సాధ్యపడలేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఆ బాధ్యతను స్వీకరించి జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని, అందుకనుగుణంగా రాజ్యాంగ సవరణను చేసింది. అయితే అవి చెల్లుబాటుకావని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసం కొట్టే సింది. ఆ తర్వాత చాన్నాళ్లు అనిశ్చితి కొనసాగినా న్యాయవ్యవస్థ అడగ్గా అడగ్గా కేంద్రం విధానపత్రం(ఎంఓపీ) విడుదల చేసింది. అయితే జాతీయ భద్రత రీత్యా ఏ నియామకాన్నయినా, పదోన్నతినైనా జాతీయ భద్రత రీత్యా తిరస్కరించే హక్కు కార్యనిర్వాహక వ్యవస్థకు ఉండాలన్న అందులోని నిబంధనను న్యాయ వ్యవస్థ అంగీకరించలేదు. ఈ నిబంధన తమ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని అది భావించింది. దానిపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇద్దరి మధ్యా ఏకాభిప్రాయం కుదరనంత మాత్రాన నియామకాలు ఆగిపోలేదు. కానీ అవి అనుకున్న స్థాయిలో వేగంగా జరగటం లేదన్నది న్యాయ వ్యవస్థ ఫిర్యాదు. ఆ పంచాయతీ సాగుతుండగానే మళ్లీ సుప్రీంకోర్టు కొలీజియం నుంచి 77 మందితో నియామకాల జాబితా వెళ్లింది. అందులో 34 నియామకాలను కేంద్రం అంగీకరించి మిగిలిన 43 పేర్లను తిప్పి పంపింది. ‘జాతీయ భద్రతా కారణాల రీత్యా’ వీరి నియామకాలను అంగీకరించలేమని స్పష్టం చేసింది. ఇంతవరకూ అనుసరిస్తున్న పద్ధతి ప్రకారమైతే కేంద్రం కాదన్న పేర్లను సుప్రీంకోర్టు వెనక్కి పంపేది. అప్పుడిక కేంద్రం అంగీకరించాల్సివచ్చేది. ఇప్పుడు మాత్రం అలా చేసే ఉద్దేశం మోదీ ప్రభు త్వానికి లేదు. అందుకే ముందు ఎంఓపీ సంగతి తేల్చమని అంటున్నది. అంతే కాదు... ఎంతసేపూ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల గురించే ఎందుకు మాట్లాడతారు.. సబార్డినేట్ కోర్టుల నియామకాలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా, కేసులు పెండింగ్ పడుతున్నాయని ఆందోళనపడుతున్నవారు ఆ విషయంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించింది. ఇదే ప్రశ్న గతంలోనూ వినిపించింది. కానీ న్యాయవ్యవస్థ నుంచి జవాబు లేదు. పైగా నియామకాల విషయంలో తమను నిందించడం సరికాదని ప్రభుత్వం అంటోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది 120 ఖాళీలను భర్తీ చేయడమే తమ చిత్తశుద్ధికి తార్కాణమంటోంది. ఎవరి అధికారాలను ఎవరు కబ్జా చేస్తున్నారన్న అంశం సామాన్యులకు పెద్దగా పట్టదు. వారికి కావలసిందల్లా సత్వర న్యాయం. ఏళ్ల తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరిగే స్థితి పోవాలని వారు కోరుకుంటున్నారు. డబ్బూ, సమయమూ వృథా అవుతున్నదని ఆందోళనపడుతున్నారు. న్యాయస్థానాల్లో, న్యాయవాదుల కార్యాల యాల్లో ఫైళ్లే కనిపిస్తాయిగానీ వాటి వెనక లక్షలాది పౌరుల జీవన్మరణ సమస్యలుం టాయి. వారి కష్టాలు, కన్నీళ్లు, ఆవేదన, ఆరాటం ఉంటాయి. వాటిని గమనంలోకి తీసుకున్నప్పుడే సమస్య తీవ్రత అర్ధమవుతుంది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ సదస్సులో జరిగిన సంవాదాన్నిబట్టి కేంద్రం వైఖరి మారదని తేలింది. ఇప్పటికైనా ప్రతిష్టకు పోకుండా, ఎవరిది పైచేయన్న ధోరణికి పోకుండా సామరస్యపూర్వకంగా పరిష్కారాన్ని వెదకడంపై ఇరుపక్షాలూ దృష్టిపెట్టాలి. ఎవరికి ఏ లక్ష్మణరేఖ ఉన్నా, అధికారం ఉన్నా అవి రాజ్యాంగం నుంచి, అంతిమంగా ప్రజల నుంచి సంక్రమించి నవే. వారి సంక్షేమం, ప్రయోజనాలు మాత్రమే దేనికైనా గీటురాయి కావాలి తప్ప ఆధిపత్య పోరుగా, అహంభావ సమస్యగా మారకూడదు. -
తీర్పు మేరకే కేంద్రానికి అధికారాలు
న్యాయ నియామకాలపై సుప్రీం తీర్పు ప్రకారం అధికారం తీసుకున్నాం * విధివిధానాల ముసాయిదాపై న్యాయశాఖ ఉద్ఘాటన న్యూఢిల్లీ: ఉన్నత స్థాయి న్యాయ నియామకాలకు సంబంధించిన విధివిధానాలు, అధికార పరిధులపై కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియంల మధ్య భిన్నాభిప్రాయాల నేపథ్యంలో.. న్యాయనియామకాలపై సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తాను అధికారాన్ని తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. న్యాయమూర్తుల నియామక వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ధర్మాసనం 2015 డిసెంబర్లో ఇచ్చిన తీర్పులో ఉద్ఘాటించిందని న్యాయశాఖలోని ఉన్నతస్థాయి వర్గాలు శుక్రవారం ఉటంకించాయి. కొలీజియం వ్యవస్థను మెరుగుపరిచే మార్గాలపై ఇచ్చిన ఆ తీర్పులో.. ధర్మాసనానికి నియమించబోయే అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవటానికి మరింత విస్తృత పరిధి ఉండాలని కూడా పేర్కొందని గుర్తుచేశాయి. ఆ తీర్పు ఆధారంగానే న్యాయ నియామకాలపై సవరించిన విధివిధానాల పత్రం ముసాయిదాను రూపొందించటం జరిగిందని చెప్పాయి. ఆమేరకు.. అభ్యర్థుల పేర్లు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు అందరి నుంచీ రావాలన్నది ప్రభుత్వ వైఖరిగా చెప్పాయి. ‘ఒక హైకోర్టు కొలీజియానికి పేర్లను సూచించే స్వేచ్ఛ సదరు హైకోర్టు న్యాయమూర్తులు అందరికీ ఉండాలి. ఆ కొలీజియం ఆ పేర్లను పరిశీలించి నియామకాలకు ఎవరిని సిఫారసు చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటుంది. సుప్రీంకోర్టుకు కూడా ఇదే విధానం వర్తింపజేయాలి. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇదే సూత్రాన్ని పాటిస్తోంది’ అని ఆ వర్గాలు వివరించాయి. అలాగే.. ముఖ్యమంత్రులకు, అడ్వొకేట్ జనరళ్లకు కూడా తమ రాష్ట్ర హైకోర్టు కొలీజియంలకు అభ్యర్థులను సూచించే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాయి. సుప్రీంకోర్టుకు అభ్యర్థులను సూచించే అవకాశం అటార్నీ జనరల్కు ఇవ్వాలన్నాయి. న్యాయనియామకాలకు సంబంధించి మార్గదర్శకాల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధివిధానాల పత్రం ముసాయిదాలో పలు మార్పులు చేయాలని చెప్తూ సుప్రీంకోర్టు కొలీజియం గతంలో కేంద్రానికి తిప్పిపంపిన విషయం తెలిసిందే. ఇందులో కొలీజియం డిమాండ్లు కొన్నిటికి అంగీకరిస్తూ సవరించిన ముసాయిదాను కేంద్రం ఈ నెల 3వ తేదీన కొలీజియానికి పంపించింది. అభ్యర్థుల ఎంపికకు ప్రతిభ - సీనియారిటీ ప్రాతిపదికగా ఉండాలన్న మార్గదర్శకాన్ని.. సీనియారిటీ-ప్రతిభ ప్రాతిపదికగా మార్చటానికి కేంద్రం ఆంగీకరించింది. అయితే సీనియారిటీని కాదనటానికి.. ఒక హైకోర్టు నుంచి ఎక్కువ మంది న్యాయమూర్తులు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు చోటు ఇవ్వటం, ఒక న్యాయమూర్తి అత్యద్భుత పనితీరు, ఒక ప్రధాన న్యాయమూర్తి పనితీరు బాగోలేకపోవటం వంటి కారణాలను వినియోగించుకోవచ్చునని పేర్కొంది. న్యాయమూర్తి అయ్యేందుకు అవసరమైన కనీస వయసును నిర్ణయించే అంశాన్ని న్యాయవ్యవస్థకే వదిలిపెట్టింది. అయితే.. ఒకసారి నిర్ణయించిన వయసును సడలించటానికి వీలు ఉండకూడదని స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల స్థాయి లో.. అభ్యర్థుల పనితీరు అంచనా, మదింపుల కమిటీలు ఉండాలన్న నిబంధనను భారత ప్రధాన న్యాయమూర్తి తిరస్కరించినప్పటికీ.. సర్కారు దానిపై మళ్లీ పట్టుపట్టింది. -
'పారదర్శకత' ఓ పరిమితి మేరకే సాధ్యం: సుప్రీం
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయవ్యవస్థలో జడ్జీల నియామకంలో పారదర్శకతను ఒక పరిమితికి మించి పాటించటం సాధ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. 'ఒక వ్యక్తి కులాభిమాని, మతాభిమాని లేదా నిజాయితీ లేని వ్యక్తి అయినా కూడా.. నియామకాలకు పరిగణనలోకి తీసుకునేటప్పుడు ఆ విషయాన్ని ఎలా నిరూపిస్తారు?' అని ప్రశ్నించింది. కొలీజియం స్థానంలో న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా.. కొలీజియం న్యాయ నియామకాల్లో మరింత పారదర్శకత తేవాలని న్యాయవాది రామ్జఠ్మలానీ వాదించినపుడు సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యాదాద్రీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
ఉరివేసుకొని యువకుడి బలవన్మరణం
తెలంగాణను పాలించే హక్కు కాంగ్రెస్కే ఉంది
ద్వంద్వ పౌరసత్వం కల్పించేందుకు కృషి
అరచేతిలో ఎన్నికల సమాచారం
ఈవీఎంల కమిషనింగ్ పరిశీలన
సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్పై రాయితో దాడి
టీ20 ప్రపంచకప్కు ఉగ్ర ముప్పు
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని మంటలు.. ఐదుగురు మృతి!
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement