వడ్డీ కట్టలేదని మహిళపై కరెంట్ వైర్లతో దాడి | Sakshi
Sakshi News home page

వడ్డీ కట్టలేదని మహిళపై కరెంట్ వైర్లతో దాడి

Published Tue, Apr 21 2015 11:24 AM

వడ్డీ కట్టలేదని మహిళపై కరెంట్ వైర్లతో దాడి - Sakshi

హైదరాబాద్: హైదరాబాద్ శివారు ప్రాంతమైన కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజురోజూకు శృతిమించుతున్నాయి. మంగళవారం తాజాగా తీసుకున్న నగదుపై వడ్డీ చెల్లించలేదంటూ వడ్డీ వ్యాపారులు ఓ మహిళపై వైర్ల, రోకలి బండతో దాడి చేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధిత మహిళ కూషాయిగూడ పోలీసులకు ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి... ఆమెను ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వడ్డీ వ్యాపారులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement