టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌

Published Fri, Jun 23 2017 7:45 AM

today news updates

పీఎస్‌ఎల్‌వీ-సీ38 ప్రయోగం
నేడు పీఎస్‌ఎల్‌వీ-సీ38 రాకెట్‌ ప్రయోగం. నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 9: 29 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనున్న రాకెట్‌. కార్టోశాట్‌-2 ఉపగ్రహంతో సహా మొత్తం 31 ఉపగ్రహాలను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు.

రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌
ఢిల్లీ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా నేడు నామినేషన్‌ వేయనున్న రామ్‌నాథ్‌ కోవింద్‌. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నామినేషన్‌ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

చర్చలు సఫలం
అమరావతి: ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి గంటా శ్రీనివాసరావు జరిపిన చర్చలు సఫలం కావడంతో నేటి 'చలో అమరావతి' కార్యక్రమాన్ని టీచర్లు విరమించుకున్నారు.

గ్రూప్‌-2పై స్టే పొడిగింపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రూప్‌-2 నియామక ప్రక్రియపై విధించిన స్టే ఉత్తర్వులను హైకోర్టు జులై 14 వరకు పొడిగించింది. ఈ వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేసేందుకు టీఎస్‌పీఎస్సీకి మరో 10 రోజులు గడువునిచ్చింది.

స్మార్ట్‌ సిటీల జాబితా
న్యూఢిల్లీ: నేడు స్మార్ట్‌సిటీల మరో జాబితాను విడుదల చేయనున్న కేంద్రం.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌ మహిళల సింగిల్స్‌లో నేడు టాప్‌ సీడ్‌ తైజుయింగ్‌తో తలపడనున్న పీవీ సింధు. మరో మ్యాచ్‌లో ఆరోసీడ్‌ సున్‌యుతో తలపడనున్న సైనా నెహ్వాల్‌.

భారత్‌, వెస్టిండీస్‌ తొలి మ్యాచ్‌
వెస్టిండీస్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత్‌ తొలి వన్డే ఆడనుంది. టెన్‌-3లో సాయంత్రం 6:30 నుంచి ప్రత్యక్ష ప్రసారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement