ఎన్నో బాధలు పడ్డాం: నాయిని | Sakshi
Sakshi News home page

ఎన్నో బాధలు పడ్డాం: నాయిని

Published Mon, Apr 27 2015 11:47 PM

so many struggles are faced

అబిడ్స్: తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ పోలీసులు ఉద్యమకారులను ఎన్నో రకాలుగా వేధింపులకు గురిచేశారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జుమ్మెరాత్‌బజార్‌లో అడ్‌హక్ కమిటీ సభ్యులు నందకిషోర్ వ్యాస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ ఉద్యమం, అమరవీరుల త్యాగఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తుందన్నారు. అడ్‌హక్ కమిటీ సభ్యులు నందకిషోర్‌వ్యాస్ మాట్లాడుతూ... గోషామహల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement