- 27 జిల్లాలతో దసరా రోజునే తుది నోటిఫికేషన్
- అదే రోజున ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు
- కొత్తగా 44 మండలాలు, 4 రెవెన్యూ డివిజన్లు
- కొన్ని మండలాలు మాత్రం అటు ఇటు మార్పు
- అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ రోజున.. నిర్ణీత ముహూర్తంలోనే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఆవిర్భావం జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. అదే రోజున ఉదయం కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని.. ఆ వెంటనే ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. గురువారం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో కొత్త జిల్లాలకు ముహూర్తం, తుది నోటిఫికేషన్, బతుకమ్మ ఉత్సవాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. కొత్త జిల్లాల ముసాయిదాపై వచ్చిన అభ్యంతరాలు, ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తుల వివరాలను తెలుసుకున్నారు. ప్రజల్లో స్పందనపై వివిధ సర్వేల ద్వారా వచ్చిన నివేదికలను పరిశీలించారు. అనంతరం పలు నిర్ణయాలు తీసుకున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం... ప్రతిపాదిత జిల్లాల సంఖ్యలో మార్పేమీ ఉండదని, 27 జిల్లాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.
ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం..
కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి ఆగస్టు 22న రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి రెండ్రోజుల ముందే అఖిలపక్ష నేతలతో సమావేశం ఏర్పాటు చేసి, అభిప్రాయాలు స్వీకరించింది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ చేపడతామని.. అవసరమైతే మరో రెండుసార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ఇంతకుముందే సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఆవిర్భావానికి ముందు మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలా, వద్దా అన్న దానిపై గురువారం సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకోనున్నారు.
ఇక ముసాయిదాపై ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు 44 కొత్త మండలాలు, మూడు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. శంషాబాద్ జిల్లాలోకి మరో మూడు మండలాలను కలపాలని నిర్ణయించి.. వాటిని తుది నోటిఫికేషన్లో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వారంలో కేబినెట్ సమావేశం నిర్వహించి తుది నోటిఫికేషన్ను ఆమోదించనున్నారు. దసరా రోజున సిద్దిపేట జిల్లా ఆవిర్భావ ఉత్సవానికి హాజరవుతానని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. మరికొందరు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు.. యాదాద్రి, కొత్తగూడెం జిల్లాల ఆవిర్భావ వేడుకలకూ సీఎం హాజరయ్యే అవకాశాలున్నాయి.
జిల్లాల్లో మార్పేమీ లేనట్లే
ముసాయిదాలో ప్రతిపాదించిన 27 జిల్లాలను అలాగే తుది నోటిఫికేషన్లో ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఒకటీ రెండు మండలాలు అటు ఇటు మార్చాలనే డిమాండ్లు ఉండడంతో.. వాటిని సైతం పరిశీలించి ఒకట్రెండు రోజుల్లోనే తుది స్వరూపం ఖరారు చేయాలని నిర్ణయించారు. భౌగోళిక సరిహద్దులు సహా జిల్లాల తుది స్వరూపం నిర్ణయించేందుకు మరోసారి జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఇరుగు పొరుగు జిల్లాలు, వివాదాలున్న ప్రాంతాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ముఖాముఖి చర్చిస్తారు. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో పలు సమస్యలున్నట్లు గుర్తించారు.
హన్మకొండ జిల్లా ఏర్పాటుకే మొగ్గు
ముసాయిదాలో ప్రతిపాదించిన హన్మకొండ జిల్లా ఏర్పాటుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ప్రస్తుతమున్న వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించడం, వరంగల్ కేంద్రంలోనే హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేయడం పట్ల స్థానికంగా తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. ఒక దశలో హన్మకొండ బదులు వరంగల్ రూరల్ (కాకతీయ) జిల్లా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం యోచించింది. కానీ రెండు జిల్లాలు ఒకే కేంద్రంలో ఉంటే బదిలీల బాధ తప్పుతుందని ఉద్యోగ వర్గాలు మద్దతు పలకడంతో... హన్మకొండ జిల్లానే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక ప్రతిపాదిత మల్కాజ్గిరి జిల్లాను మేడ్చల్ జిల్లాగా మార్చనున్నారు.
చెరువులన్నీ నింపండి
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలు, ప్రాజెక్టుల్లో నీటి మట్టాలపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. మహబూబ్నగర్ జిల్లాలో జూరాలపై ఉన్న నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాలు.. శ్రీశైలంపై ఉన్న కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలో ఉన్న అన్ని చెరువులను నింపాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులకు భారీ ఇన్ఫ్లో ఉన్నందున వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ముసాయిదా జిల్లాలే ఫైనల్!
Published Fri, Sep 30 2016 3:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒకప్పుడు ఎన్నో కష్టాలు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు!
వేసవిలో నెయ్యిని తీసుకుంటే బోలెడన్ని లాభాలు!
టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు
HBD Pat Cummins: సన్రైజర్స్ కెప్టెన్ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
జేపీ నడ్డాకు పోలీసుల సమన్లు
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు: లక్ష్మీ పార్వతి
ఉద్యోగుల తొలగింపు..టీసీఎస్లో అసలేం జరుగుతోంది?
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
తప్పక చదవండి
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement