'మేమంతా ఆత్మహత్య చేసుకుంటున్నాం' | Sakshi
Sakshi News home page

'మేమంతా ఆత్మహత్య చేసుకుంటున్నాం'

Published Sat, Jan 31 2015 6:48 PM

'మేమంతా ఆత్మహత్య చేసుకుంటున్నాం' - Sakshi

హైదరాబాద్‌ వనస్థలిపురంలో ఓ కుటుంబం అదృశ్యమైంది. ఎన్జీవో కాలనీకి చెందిన సుబ్బరావు అనే వ్యాపారి తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా కనిపించకుండా పోయాడు. తాను, తన కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోదరునికి సూసైడ్‌ నోట్‌ రాసిపెట్టాడు.

ఆర్థిక ఇబ్బందులు తాళలేకే సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో రాశాడు. అదృశ్యమైనవారిలో సుబ్బారావు, ఆయన భార్య గిరిజ, కుమారుడు త్రివిక్రమ్, కూతురు సన్నిహిత ఉన్నారు. సుబ్బరావు సోదరుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సెల్‌ఫోన్‌ నెంబర్ ఆధారంగా కేసు ఛేదించేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
Advertisement