- వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన
- వైఎస్ జగన్ను భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు కుట్ర
సాక్షి, హైదరాబాద్: మహానాడులో టీడీపీ నేతలుజగన్ వ్యక్తిత్వంపై దాడి చేస్తూ మాట్లాడారని, అయితే ఆ వ్యక్తిత్వమే తమకు ఆస్తి అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబులా గా అధికారం కోసం ఎవరి కాళ్లయినా పట్టుకునే అమీబాలాంటి వ్యక్తి తమ జగన్ కాదని చెప్పారు. ‘మా జగన్లో నిబద్ధత ఉంది. పోరాటపటిమ, ఉద్యమ స్ఫూర్తి ఉన్నాయి. ఎవరికీ తలవంచని నైజం మా నాయకుడిది. చంద్రబాబులాగా అమీబా కాదు మా నేత. ఒళ్లంతా వెన్నెముక, ధైర్యం, దేహమంతా గుండె కలిగినవాడు మా జగన్ అని’ భూమన అన్నారు. చంద్రబాబును తాను విద్యార్థి దశ నుంచీ ఎరుగుదునని.. ఆయనకున్నంత కులగ జ్జి, డబ్బు మీద వ్యామోహం మరొకరికి లేవని అన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో టేపులతో అడ్డంగా దొరికిపోయి, తనపై చార్జిషీటు దాఖలు చేసినా.. కేసీఆర్, మోదీ కాళ్లు పట్టుకొని జైలుకు పోకుండా తప్పించుకున్న సమర్థత చంద్రబాబుదని ఆయన మండిపడ్డారు.
ఆటవిక జాతరలా సాగిన మహానాడు..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహానాడులో మాట్లాడిన తీరు చూస్తుంటే తమ నాయకుడు ైవె ఎస్ జగన్మోహన్రెడ్డిని భౌతికంగా నిర్మూలించే కుట్ర జరుగుతోంద నే అనుమానం ప్రజలకు కలుగుతోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. ఒక రాజకీయ పార్టీ మహాసభలాగా కాకుండా ఆదిమానవులు ఆటవిక జాతరలాగా సాగిన ఈ మహానాడులో వైఎస్సార్సీపీ తొందరలోనే ఖాళీ అయిపోతుందని చంద్రబాబు చెప్పడాన్ని బట్టి ఈ అనుమానం బలపడుతోందని చెప్పారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హెలికాప్టర్ ప్రమాదంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడానికి ఒక్క రోజు ముందు కూడా ఎవరు ఫినిష్ అవుతారో త్వరలో తెలుస్తుందని చంద్రబాబు అన్న మాటలు తమకింకా గింగురుమంటున్నాయని ఆయన తెలిపారు. చంద్రబాబు అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నందునే జగన్పై మహానాడులో సీఎం విమర్శలు చేయించారని భూమన అన్నారు. దీన్ని బట్టి ప్రతిపక్ష నేతగా నూటికి నూరు శాతం జగన్మోహన్రెడ్డి విజయవంతం అయినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.
లోకేశ్ను సూట్కేసు బాబు అంటున్నారు
చంద్రబాబు తనయుడు లోకేశ్బాబు అవినీతి కార్యకలాపాలను చూసి ఆయన్ను సూట్కేస్ బాబుగా ప్రజలు పిలుచుకుంటున్నారని భూమన ఎద్దేవా చేశారు.
కలియుగదైవానికి వైభవం తెచ్చింది నువ్వా
కలియుగ దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామికి వైభవాన్ని తెచ్చింది తామేనని టీడీపీ పీఠాధిపతి, పరమపూజ్య, పరమహంస, పరివ్రాజక శ్రీశ్రీశ్రీ నారా చంద్రబాబా స్వామి వారు చెప్పుకోవడం ఆయన స్వోత్కర్ష శృతి మించినదనడానికి నిదర్శనమని భూమన ఎద్దేవా చేశారు.ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే నని అన్నారు.
జగన్ వ్యక్తిత్వమే మా ఆస్తి
Published Tue, May 31 2016 1:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement