బౌద్ధ వాణి
ఒక అడవిలో నాలుగు రకాల జింకలున్నాయి. ఆ అడవిని ఆనుకొని ఒక రైతు తన పొలంలో బాగా ఏపుగా పచ్చగడ్డి పెంచాడు. ఆ గడ్డిని చూసి ఆశపడ్డ కొన్ని జింకలు వచ్చి పొలంలో పడి మేస్తూ, రైతు పన్నిన వలల్లో పడి, రైతుకి చిక్కాయి. అలా చిక్కిన జింకల్ని చూసిన కొన్ని జింకలు పచ్చగడ్డి అంటేనే భయపడిపోయి, నట్టడివిలోకి పారిపోయాయి. అక్కడ వాటికి ఆహారం దొరక్క, తిరిగి మరల వచ్చి, అదే పొలంలో మేస్తూ, రైతుకు చిక్కాయి. ఈ రెండు జింకల్ని చూసిన కొన్ని జింకలు, అడవిలో పొదలమాటున దాగి, రైతు లేడని తెలుసుకుని, జాగ్రత్తగా వచ్చి మేస్తూ ఉండేవి.
ఇలా మేస్తున్న జింకల స్థావరాల్ని వెదికి, కనుగొన్న రైతు, వాటి స్థావరాల దగ్గరే వలపన్ని వాటినీ పట్టుకున్నాడు. ఇక కొన్ని జింకలు మాత్రం తమ స్థావరాలని ఆ రైతు కనిపెట్టనంత దూరానికి పోయి, అతనికి చిక్కకుండా, పొలంలో పట్టుబడకుండా కాపాడుకున్నాయి. జ్ఞానంతో, ధైర్యంగా జీవించాయి– అని, బుద్ధుడు ఈ కథ చెప్పి, ‘‘భిక్షువులారా! మనుషుల్లో విషయలోలత్వం కలిగిన దురాశాపరులు మొదటి రకం జింకలవంటివారు. విషయాలపట్ల భయపడి సమాజానికి దూరంగా అడవులకు పోయి, శరీరాన్ని ఎండకట్టుకుని ఫలితం లేదని తెలుసుకుని, తిరిగి మరలా ఆశల వలలో చిక్కుకునేవారు రెండోరకం వారు. వాదవివాదాలు, తర్కవితర్కాలే జ్ఞానంగా భావించి, కేవలం ఆచరణ లేని సిద్ధాంత రాద్ధాంతాలు ఎరిగిన వారు మూడోరకం వారు.
కోర్కెల్ని అదుపులో ఉంచుకుని, తనను తాను తెలుసుకుని, తనను తాను పరిశుద్ధి చేసుకునేవారు నాలుగో రకం జింకలవంటివారు’’ అని ప్రబోధించాడు.
ఏది మేలైన మార్గమో తెలుసుకున్న భిక్షువులు బుద్ధునికి ప్రణామం చేశారు.
– డాక్టర్ బొర్రా గోవర్ధన్
నాలుగు దారులు
Published Sun, Mar 19 2017 12:09 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement