చంద్రబాబుకు చెప్పు చూపించిన మహిళ | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు చెప్పు చూపించిన మహిళ

Published Sun, May 29 2016 6:10 PM

చంద్రబాబుకు చెప్పు చూపించిన మహిళ - Sakshi

తిరుపతి: టీడీపీ మహానాడులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. తిరుపతిలో టీడీపీ నిర్వహించిన మహానాడులో ఆదివారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ మహిళ చెప్పు చూపించింది.

ఈ హఠాత్పరిణామంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు బిత్తరపోయారు. చంద్రబాబు అన్నీ అబద్దాలు మాట్లాడుతున్నారంటూ ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement