'సాక్షాత్తు చంద్రబాబే అన్నారు' | Sakshi
Sakshi News home page

'సాక్షాత్తు చంద్రబాబే అన్నారు'

Published Tue, May 31 2016 10:57 AM

somu veerraju takes on tdp

ఒంగోలు : నల్లధనం వెనక్కి తీసుకురావడంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తనమేనని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... నల్లధనంకు సంబంధించిన జాబితాపై దర్యాప్తు జరుగుతోందన్నారు. టీడీపీ మాటలపై మేము స్పందించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన కరవు మానవ తప్పిదమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని కాదని సాక్షాత్తు సీఎం చంద్రబాబే అన్నారని ఈ సందర్భంగా సోము వీర్రాజు గుర్తు చేశారు.

Advertisement
Advertisement