సాక్షి, హైదరాబాద్: పదేళ్ల తర్వాత హైదరాబాద్ పట్టణం ఎలా ఉండబోతుందో ముందుగానే ఊహించాం. అప్పటి పరిస్థితులు, అవసరాలను తీర్చే ప్రాజెక్ట్ను నిర్మించాలనుకున్నాం. అందుకే ఒకే ప్రాజెక్ట్లో నివాస, వాణిజ్య సముదాయాలే కాకుండా కేజీ నుంచి పీజీ స్థాయి వరకు విద్యా సంస్థలు, ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు, ఐటీ, ఫార్మా వంటి అనేక రంగాల కార్యాలయాలు, ఇండోర్, అవుట్ డోర్ ఆట స్థలాలు, థీమ్ పార్క్ వంటివెన్నో కొలువుదీరే సరికొత్త సిటీని నిర్మించనున్నాం. దక్షిణ భారతదేశంలోనే తొలి స్మార్ట్ సిటీ అవార్డ్ను సొంతం చేసుకున్న డిస్కవరీ సిటీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రాజెక్ట్ వివరాలను రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ లిమిటెడ్ జీఎం (సేల్స్, మార్కెటింగ్) కేవీ రాజ్నారాయన్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు.
ఇంకా ఏమన్నారంటే..
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 10 నిమిషాల ప్రయాణ దూరంలోనే ఉన్న మహేశ్వరం మండలంలోని శ్రీనగర్ అనే గ్రామంలో 600 ఎకరాల్లో డిస్కవరీ సిటీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ను నిర్మిస్తున్నాం. రూ.5 వేల కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న డిస్కవరీ సిటీ ప్రాజెక్ట్ను 4 ఫేజుల్లో పదేళ్ల లోపు పూర్తి చేస్తాం. ఫేజ్-1లో రూ. 300 కోట్ల పెట్టుబడితో 30 ఎకరాల్లో ‘గార్డెనియా గ్రూవ్ విల్లా’ను నిర్మిస్తున్నాం. ఇందులో విల్లాలు, ఫ్లాట్లలతో పాటు పాఠశాల కూడా ఉంటుంది. ఇప్పటికే 5 ఎకరాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పాఠశాల నడుస్తోంది.
గార్డెనియా గ్రూవ్లో మొత్తం 228 విల్లాలొస్తాయి. 200 గజాల నుంచి 300 గజాల విస్తీర్ణాల్లో ఉంటాయి. ధర రూ.57 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 2, 3 పడక గదుల ఫ్లాట్లు 400 నిర్మిస్తున్నాం. వీటి విస్తీర్ణం 730 చ.అ. నుంచి 1,800 చ.అ. మధ్య ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 150 వరకు నిర్మిస్తున్నాం. వీటి విస్తీర్ణం 350 చ.అ. నుంచి 550 చ.అ. మధ్య ఉంటుంది. ఇప్పటికే 32 విల్లాలు, 60 ఫ్లాట్లు విక్రయించేశాం.
పుణెలోని మగర్పట్టా, అహ్మదాబాద్లోని శాంతిగ్రామ్, చెన్నై, జైపూర్లలోని మహీంద్రా వరల్డ్ సిటీలతో పాటు దుబాయ్, కౌలాలంపూర్ వంటి విదేశాల్లోని స్మార్ట్ సిటీలను రెండేళ్ల పాటు క్షేత్ర స్థాయిలో క్షుణ్నంగా పరిశీలించాకే హైదరాబాద్లోనూ అలాంటి స్మార్ట్ సిటీని నిర్మించేందుకు ముందుకొచ్చాం. విమానాశ్రయం చుట్టూ కనీసం 25 కి.మీ. వరకు అభివృద్ధి అనేది ఎల్లవేళలా ఉంటుంది. అందుకే శ్రీనగర్ ప్రాంతాన్ని ఎంచుకున్నాం. ప్రాజెక్ట్ వెనుక భాగంలో 3 వేల ఎకరాల్లో కొంగరకలాన్ రిజర్వ్ ఫారెస్ట్ ఉండటం కలిసొచ్చే అంశం. ఎందుకంటే చుట్టూ చక్కని ప్రకృతి, పుష్కలమైన నీటి వనరులు ప్రాజెక్ట్ సొంతం. డిస్కవరీ సిటీ ప్రాజెక్ట్లో ఎకరం, అర ఎకరం విస్తీర్ణంలో కూడా విల్లాలను నిర్మిస్తున్నాం. అయితే ఇవి ఫేజ్-4లో వస్తాయి.
రూ.5 వేల కోట్లతో ‘డిస్కవరీ సిటీ’
Published Sat, Apr 19 2014 2:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement