తెలుగువారిని అడ్డగోలుగా విడగొడతారా? | ys jagan mohan reddy takes on kiran, chandra babu naidu | Sakshi
Sakshi News home page

తెలుగువారిని అడ్డగోలుగా విడగొడతారా?

Jan 7 2014 4:15 PM | Updated on Jul 28 2018 6:43 PM

తెలుగువారిని అడ్డగోలుగా విడగొడతారా? - Sakshi

తెలుగువారిని అడ్డగోలుగా విడగొడతారా?

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.

గాంధీ సర్కిల్ (పీలేరు): టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. వారివురూ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలోని పీలేరులో సమైక్యశంఖారావం సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. తెలుగు వారిని కేంద్ర అడ్డగోలుగా విడగొడుతుందన్నారు. ఇది తెలుగు వాడి ఆత్మ గౌరవానికి, ఢిల్లీ అహంకారానికి జరుగుతున్న పోరాటమన్నారు.రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

 

అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ల సమావేశానికి కిరణ్, చంద్రబాబులకు ఎందుకు వెళ్లకుండా దాకుడు మూతలు ఆడుతున్నారని విమర్శించారు. ఇది దేనికి పరాకాష్టా వారే చెప్పాలని జగన్ ప్రశ్నించారు. ప్రస్తుతం కిరణ్, చంద్రబాబులు కలిసి కుమ్మక్క రాజకీయం ఆడటం లేదా?అని నిలదీశారు. ప్రస్తుతం కనీవిని ఎరుగని విధంగా రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టాక అసెంబ్లీలో చర్చ జరిపి లాభం ఏమీ ఉండదన్నారు. మొదట ప్రజలతో చర్చించాలి, ఆ తర్వాలే రాష్ట్రాన్ని విడగొట్టాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement