వైఎస్సార్సీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి
మేనిఫెస్టోలో 200 హామీలిచ్చారు.. ఒక్కటీ అమలు కాలేదు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ పూర్తిగా విఫలమైంది. రైతు, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీతోపాటు 9 గంటల ఉచిత విద్యుత్, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి.. ఇలా మేనిఫెస్టోలో పొందుపరిచిన 200 హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు.
దీంతో జనం నిలదీస్తుండడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో జనానికి ముఖం చూపించలేక పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తెలంగాణలో పూర్తిగా ఖాళీ అవుతోంది’’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం అనంతపురంలో జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ అధ్యక్షతన జిల్లా కమిటీలతో సమావేశం నిర్వహించారు.
విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘అనంత’ రైతుల శ్రేయస్సును చంద్రబాబు పూర్తిగా విస్మరించారని ఆయన విమర్శించారు. అనంతపురానికి సాగునీటి వనరుల కల్పనలోనూ పూర్తిగా నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారన్నారు. ‘‘రుణమాఫీ చేయకపోవడంతో రైతులు పంటల బీమా ప్రీమియాన్ని చెల్లించలేకపోయారు. ఉత్తరాంధ్రలో హుద్హుద్ తుపానుతో 4 లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. ప్రీమియం చెల్లించి ఉంటే ఒక్కొక్క రైతుకు రూ.23 వేలు చొప్పున పరిహారం వచ్చేది. బాబు పుణ్యంతో చిల్లిగవ్వ కూడా రాని పరిస్థితి తలెత్తింది’’ ’’ అని విమర్శించారు.
చంద్రబాబు నిర్వాకంతో రాష్ట్రంలో డ్వాక్రా మహిళల పరిస్థితి తలకిందులైందన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన పావలావడ్డీ, వడ్డీలేని రుణాలతోపాటు కేంద్రమిచ్చే ఏడుశాతం వడ్డీ కూడా పోయిందని, ఇప్పుడు 14 శాతం వడ్డీని చెల్లించాల్సి వస్తోందన్నారు. డ్వాక్రా రుణాలు నాలుగేళ్లల్లో 20 శాతం చొప్పున చెల్లిస్తామని బాబు అంటున్నారని, అంటే అప్పటివరకు రుణగ్రస్తులుగానే వారిని ఉంచుతారా? అని ప్రశ్నించారు. చరిత్రలో హామీల్ని నిలబెట్టుకున్న ఘనత ఎన్టీఆర్, వైఎస్లకు మాత్రమే దక్కుతుందన్నారు. రుణమాఫీ చేయని బాబుపై నవంబర్ 5న ప్రజలంతా దండయాత్ర చేయాలని పిలుపునిచ్చారు.
టీడీపీని వీడేందుకు ఎమ్మెల్యేలు సిద్ధం
Published Sat, Nov 1 2014 1:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement