టీడీపీ నేతలంతా రాజీనామాలు చేయాలి | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలంతా రాజీనామాలు చేయాలి

Published Tue, Oct 13 2015 11:27 PM

టీడీపీ నేతలంతా రాజీనామాలు చేయాలి - Sakshi

గాలికొండ సభ్యుడు జాంబ్రి డిమాండ్
 
చింతపల్లి:   అధికార పార్టీలో ఉంటూ  పదవులు అనుభవిస్తున్న వారంతా వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేసి బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాల్లో ముమ్మరంగా పాల్గొనాలని మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ సభ్యుడు జాంబ్రి డిమాండ్‌చేశారు. జి.కె.వీధి మండలాల సరిహద్దు ప్రాంతంలో మంగళవారం బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులతో కలిసి ఆందోళన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీలో పోలీసు ఔట్‌పోస్టులు, అదనపు స్టేషన్ల ఏర్పాట్లను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇప్పటికే పోలీసు బలగాలు మన్యంలో గాలింపు చర్యల పేరిట ఎంతో మంది అమాయక గిరిజనులను నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు.

బాక్సైట్ పునరావాస కమిటీలను వెంటనే రద్దు చేయాలని, వారంతా తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి గిరిజనులతో కలిసి బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొనాలన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మరని, బాక్సైట్ తవ్వకాలపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
 
 

Advertisement
Advertisement