ఆర్టీసీ బస్సు- ట్రాక్టర్ ఢీ: మహిళ మృతి | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు- ట్రాక్టర్ ఢీ: మహిళ మృతి

Published Sat, May 23 2015 7:02 AM

road accident kills one women in karnataka boarder village

చిత్తూరు: ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృత్యువాత పడింది. ఈ సంఘటన శనివారం తెల్లవారు జామున కర్ణాటక సరిహద్దు గ్రామమైన గౌనేపల్లి వద్ద చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లి-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కర్ణాటకకు వెళుతుండగా గౌనేపల్లి వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. దీంతో ట్రాక్టర్‌లో ఉన్న ఓ మహిళ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో గాయపడిన మరో పదిమంది స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మృతురాలు కర్ణాటకకు చెందిన వ్యక్తిగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement