రోడ్డుప్రమాదంలో ఇద్దరి దుర్మరణం | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

Published Thu, May 18 2017 10:03 AM

రోడ్డుప్రమాదంలో ఇద్దరి దుర్మరణం - Sakshi

తాళ్లపూడి: పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. గుంటూరుకు చెందిన పిట‍్ల ప్రశాంత్‌ (22), కార్తీక్‌ (23) అనే యువకులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా అదుపు తప్పి రోడ్డుపక్కనున్న సైన్‌ బోర్డుకు ఢీకొంది. ఈ సంఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు గుంటూరు నగరం మంగళఘాట్‌నగర్‌కు చెందినవారు. ఇద్దరూ పెట్రోలు బంకులో పనిచేస్తున్నారు. ద్వారకా తిరుమలలో పెళ్ళికి హాజరై వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement