రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Published Sat, Feb 13 2016 7:59 AM

one person died in road accident in srikakulan district

శ్రీకాకుళంసిటీ: జిల్లాకేంద్రంలోని డే అండ్ నైట్ జంక్షన్ వద్ద కొత్తబ్రిడ్జి సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరిని వెనక నుంచి ఓ ప్రభుత్వ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీకాకుళం పట్టణానికి చెందిన దాసరి విద్యాధర్ రావు(18) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా..ఊటపల్లి విశ్వనాథ్(30) అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement