రాజమండ్రి రూరల్: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం ఆటోనగర్ వద్ద ఒక గ్యారేజీలో నిల్వ ఉంచిన 300 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.