ఆదాయం పెంపుదలే లక్ష్యం శ్రీకాకుళం
కాంప్లెక్స్లో 1.5 ఎకరాల స్థలం లీజుకు
రంగం సిద్ధం చేసిన అధికారులు
శ్రీకాకుళం అర్బన్ : ఆదాయమే లక్ష్యంగా... నష్టాలనుంచి గట్టెక్కడమే ధ్యేయంగా ఆర్టీసీ కొత్త మార్గాలను వెదుకుతోంది. సంస్థ పరిధిలోని స్థలాలను లీజుకి వ్వడం ఆర్థికంగా నిలదొక్కుకోవాలని యోచిస్తోంది. జిల్లాలోని ఐదు డిపోల పరిధిలో దాదాపు రూ. 20 కోట్ల మేర నష్టాల్లో ఉన్నప్పటికీ రాజమండ్రి పుష్కరాలు ఆర్టీసీకి కలిసొచ్చాయి. ప్రైవేటు వాహనాల హవా కొనసాగినా ప్రయాణికులు ఆర్టీసీనే నమ్ముకుని అధిక సంఖ్యలో ప్రయాణించారు. దీంతో సంస్థ కొంతమేర
నష్టాల నుంచి గట్టెక్కింది. మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా స్థలాన్ని లీజుకు ఇస్తామని సంస్థ ఎండీ ఇప్పటికే ప్రకటించారు. జోన్-1 పరిధిలో తుని, రాజమండ్రి, విశాఖ, ఎస్.కోట, చోడవరం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే భారీ స్థాయిలో ఆర్టీసీ స్థలాలను లీజుకు కట్టబెట్టిన అధికారులు ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం పట్టణాలపై దృష్టి సారించారు.
టెండర్ల కోసం ప్రతిపాదనలు
విజయనగరంలోని ఆర్ఎం కార్యాలయం ఎదురుగా ఉన్న మూడెకరాల స్థలాన్ని, విశాఖలోని మద్దిలపాలెం డిపో పరిధిలో ఆరెకరాలు, శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో 1.5 ఎకరాల స్థలాన్ని 33 ఏళ్లపాటు లీజుకు ఇవ్వాలని ఉన్నతాధికారులకు స్థానిక అధికారులు ప్రతిపాదనలు పంపించారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ 16.82 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో బస్టాండ్తోపాటు శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోలు ఉన్నాయి. అదే ప్రాంతంలో ఇప్పటికే కొన్ని భవనాలు నిర్మించి అద్దెలకు ఇచ్చారు. మరికొంత స్థలం ఖాళీగా ఉంది. ఈ స్థలంలో ద్విచక్ర వాహనాల పార్కింగ్తోపాటు సులభ్ కాంప్లెక్స్ ఉంది. దీనిపై వచ్చే ఆదాయం కంటే లీజుద్వారా వచ్చే భారీ మొత్తమే ఉపయోగపడుతుందని భావించి ఉన్నతాధికారులు ఫైలును హైదరాబాదుకు పంపించినట్లు తెలుస్తోంది. సుమారు ఎకరంన్నర స్థలాన్ని బీవోటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) ప్రాతిపదికన కట్టబెట్టేందుకు యోచిస్తున్నారు.
బ్యాంకు చిక్కులు తప్పేనా...
ఆర్టీసీ పరిధిలో ఉన్న కొంత స్థలాన్ని బ్యాంకులో తాకట్టుపెట్టి రుణం తెచ్చారు. ప్రస్తుతం వాయిదాలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు అదేస్థలంలో ఉన్న కొంత భాగాన్ని దీర్ఘకాలిక లీజుకు ఇచ్చే యోచనలో ఉన్నారు. ఇదేవిషయం గుర్తించిన బ్యాంకు సిబ్బంది ఆర్టీసీ అధికారులను వివరణ కోరినట్లు తెలుస్తోంది. తమవద్ద స్థలం తాకట్టుపెట్టి రుణం తీసుకున్న సందర్భంలో అదే స్థలం పరిధిలో ఉన్న స్థలాన్ని లీజుకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తోంది. బ్యాంకు నుంచి ఎన్వోసీ వస్తే లీజుకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించేది లేదని, న్యాయపరంగానే లీజుకు ముందుకు వెళతామని ఆర్టీసీలోని ముఖ్య ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.
ఆర్టీసీ లీజుబాట
Published Wed, Nov 25 2015 3:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement