తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published Sun, Oct 26 2014 8:44 AM

Heavy Devotees Rush in Tirumala

తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయింది. క్యూ కాంప్లెక్స్ వెలుపల భక్తులు భారీగా బారులు తీరారు.  శ్రీవారి సర్వదర్శనానికి 25 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనం టికెట్ల విక్రయాన్ని టీటీడీ అధికారులు నిలిపివేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.  శనివారం ఒక్కరోజే శ్రీవారిని 71,318 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement