అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైన గురుకుల పాఠశాల విద్యార్థులు | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైన గురుకుల పాఠశాల విద్యార్థులు

Published Tue, Aug 4 2015 8:21 PM

Gurukul School Students selected for International conference

కర్నూలు (శ్రీశైలం ప్రాజెక్టు) : ఏపీ గిరిజన గురుకుల ప్రతిభా పాఠశాల విద్యార్థులు అమెరికా హార్వర్డ్ యూనివర్శిటీ, ఐక్యరాజ్యసమితి సంయుక్తంగా నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైనట్లు ఐటీడీఏ పీఓ ఈసా రవీంద్రబాబు తెలిపారు.  ఈ సదస్సు హైదరాబాద్‌లో ఈ నెల 13 నుంచి 16 వ తేదీ వరకు జరుగనుంది.

ఇంటర్మీడియట్ చదువుతున్న తాటి వెంకటలక్ష్మి, భూమని చెంచులక్ష్మి, యాకసిరి శివకుమార్, చేవూరి నాగరాజులు సదస్సులో పాల్గొంటున్నారని చెప్పారు. ఈ సదస్సుకు దేశ,విదేశాల నుంచి నిపుణులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొని విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, అటవీ సంరక్షణలపై చర్చలు జరుపుతారని చెప్పారు.

Advertisement
Advertisement