సాక్షి, తిరుమల: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు గురువారం ఉదయం తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలుత భూ వరాహస్వామిని దర్శించుకున్నారు. పుష్కరిణి నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. తర్వాత ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. వేంకటేశ్వర స్వామి, వకుళమాతను దర్శించుకుని హుం డీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ గవర్నర్ దంపతులకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
కాన్వాయ్లో ఆగిన గవర్నర్ కారు.. మరో కారులో ప్రయాణం
తిరుమల పర్యటనలో గురువారం ఉదయం గవర్నర్ కారు మధ్యలో ఆగింది. అతిథి గృహం నుంచి ఆలయానికి వెళ్లే సమయంలో రాంబగీచా వద్ద కారులో హఠాత్తుగా వాసన రావడంతో పాటు ముందుకు కదలలేదు. దీంతో గవర్నర్ నరసింహన్ దంపతులు కాన్వాయ్లో వెనుకే వస్తున్న మరో కారులో ఆలయం వద్దకు చేరుకున్నారు. హ్యాండ్ బ్రేక్ను డ్రైవర్ రిలీజ్ చేయకుండానే కారు నడపడంతో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారులు వెల్లడించారు. దీనిపై పోలీసు దర్యాప్తునకు ఆదేశించినట్టు సమాచారం.
చక్రస్నానంలో..
తిరుచానూరు: పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం మధ్యాహ్నం పుష్కరిణిలో నిర్వహించిన చక్రస్నానానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. పంచమీతీర్థం మండపంలో అమ్మవారు, చక్రతాళ్వార్లకు నిర్వహించిన స్నపన తిరుమంజనంను తిలకించారు. అనంతరం పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో గవర్నర్ దంపతులకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
అమ్మవారికి శ్రీవారి సారె
సాక్షి, తిరుమల/తిరుచానూరు: తన పట్టపురాణి అయిన పద్మావతి అమ్మవారికి వేంకటేశ్వర స్వామివారు సారె పంపారు. గురువారం తిరుమలలో ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ వైదిక కార్యక్రమం నిర్వహించటం సంప్రదాయం. ఆలయం నుంచి పసుపు, కుంకుమ, పుష్పాలు, తులసిమాల, నూతన వస్త్రాలు, ఇతర ఆభరణాలతో కూడిన సారెను టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు, డెప్యూటీఈవో చిన్నంగారి రమణ మేళతాళాలతో ఊరేగింపు నిర్వహిం చారు. కార్యక్రమంలో జీయరు స్వాము లు, అర్చకులు, డాలర్ శేషాద్రి పాల్గొన్నారు.
తిరుపతిలోని శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్న సారెను టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్కు అందజేశారు. అక్కడి నుంచి మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు నడు మ ఏనుగు అంబారిపై సారెను ఊరేగింపుగా కోమలమ్మ సత్రం, కోదండరామస్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం మీదుగా తిరుచానూరు పసుపు మండపానికి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత తిరువీధుల్లో ఊరేగింపుగా ఆలయం మీదుగా పంచమీతీర్థ మండపానికి తీసుకొచ్చి ఆలయ అర్చకులకు అప్పగించారు.
వేడుకగా స్నపన తిరుమంజనం
పద్మావతి అమ్మవారి చక్రస్నానం పురస్కరించుకుని గురువారం పుష్కరిణిలోని పంచమీతీర్థం మండపంలో అమ్మవారికి, చక్రతాళ్వార్లకు ఆలయ అర్చకులు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుమల నుంచి అమ్మవారికి శ్రీవారి సారె వచ్చిన తరువాత 10.30 గంటలకు పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పచ్చల హారాన్ని అలంకరించారు. జియ్యర్ స్వాముల సమక్షంలో పాంచరాత్ర ఆగమ పండితులు మణికంఠభట్టర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం చక్రతాళ్వార్లకు చక్రస్నానం వేడుకగా నిర్వహించారు.
తిరుప్పావడ సేవలో గవర్నర్ దంపతులు
Published Fri, Nov 28 2014 2:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement