మార్టూరు : అక్షరాస్యత శాతం పెరిగితేనే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ విజయ్కుమార్ పేర్కొన్నారు. సమాజంలో గుర్తింపు రావాలన్నా.. మంచి జీవితం గడపాలన్నా విద్య ఎంతో అవసరమన్నారు. మార్టూరు జెడ్పీహెచ్ఎస్లో శనివారం బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత కలెక్టర్ మాట్లాడారు. వివిధ కార్యక్రమాలు నిర్వహించి పిల్లలు బడిబయట లేకుండా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. చదువుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని, డబ్బుతో కూడా పనిలేదన్నారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం ఆరు నుంచి 14 ఏళ్లలోపు వయసున్న పిల్లలు పాఠశాలలో ఉండేలా చూడాలన్నారు. విద్య మంచి ఆలోచనా శక్తిని, జ్ఞానాన్ని పెంపొందిస్తుందన్నారు. బడిఈడు పిల్లలను బడిలో చేర్చడంలో మార్టూరు మండలం ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తోందని చెప్పారు. పిల్లలంతా పాఠశాలలకు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కూడా పిల్లలు పాఠశాలకు వెళ్లేలా చూడాలని కోరారు.
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. ఇప్పటికీ వందకు 29 మంది విద్యార్థులు బడి బయట ఉన్నారని, వారిని పాఠశాలలో చేర్పించాలన్నారు. డీఈఓ విజయభాస్కర్ మాట్లాడుతూ.. బడిబయట ఉన్న పిల్లలను ఇప్పటికే పాఠశాలలో చేర్పించామని స్పష్టం చేశారు. ఇంకా ఎవరైనా బడి బయట ఉంటే బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా పాఠశాలకు వచ్చేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ తిరుపతి కిషోర్బాబు, ఎంపీడీఓ సింగయ్య, మార్టూరు సర్పంచ్ దేవుని దయానాయక్, మార్టూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం జెన్నెట్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అక్షరాస్యత పెరిగితేనే అభివృద్ధి
Published Sun, Jul 27 2014 1:01 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
గుడిలో కమెడియన్ పెళ్లి.. వధువు బ్యాక్గ్రౌండ్ ఇదే!
ఎవరికి ఏ శాఖ ?..మోదీ కేబినెట్ మీటింగ్
టీ20 ప్రపంచకప్ 2024లో తొలి వికెట్ డౌన్
చంద్రబాబు కేబినెట్.. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ?
రయ్.. రయ్.. గూబ గుయ్!
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
రోడ్డు ప్రమాదంలో నలుగురు యూట్యూబర్ల దుర్మరణం
కేంద్ర మంత్రిగా ఎర్రన్న తనయుడు
నిర్మాతగా బాలకృష్ణ కూతురు.. సినిమా ప్రకటించిన బోయపాటి
తెలుగు కేంద్ర మంత్రులపై సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర ట్వీట్
తప్పక చదవండి
- టీ20 ప్రపంచకప్ 2024లో తొలి వికెట్ డౌన్
- రోడ్డు ప్రమాదంలో నలుగురు యూట్యూబర్ల దుర్మరణం
- గ్రూప్–1 పరీక్ష రాసి వస్తుండగా విషాదం
- ఆల్టైమ్హైలో స్టాక్మార్కెట్ సూచీలు.. 23,400 మార్కు చేరిన నిఫ్టీ
- IND VS PAK: మా బ్యాటింగ్ కుప్పకూలినప్పుడు వారికి ఎందుకు జరుగదు: రోహిత్
- వందేభారత్, జనశతాబ్ధి రైళ్లకు తప్పిన ప్రమాదం
- ప్రియుడితో సినీ నటి ప్లాన్.. స్నేహితురాలిని బర్త్డే పార్టీకి పిలిచి ఆపై..
- Rasi Phalalu: ఈ రాశివారికి దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి
- ఒడిశా సీఎంగా సురేశ్ పూజారి?
- పాత మోదీపై ‘కొత్త మోదీ’ నెగ్గగలరా?
Advertisement