బ్రహ్మ కడిగిన పాదము.. బ్రహ్మము
తానైన పాదము.. శ్రీహరి దర్శనమే మహా భాగ్యం. సేవలలో పాల్గొనడం మహదానందం. విశాఖ నగరమే స్వర్ణభారతికి తరలివచ్చిందా.. అన్నట్టు సుప్రభాతం పలికేందుకు తెల్లవారుజాము 5 గంటల నుంచి రాత్రి ఏకాంత సేవ ముగిసేవరకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. వేంకటేశుని వైభవాన్ని తిలకించి పరవశించిపోతున్నారు. మాటలకందని మధురానుభూ తికి లోనై అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. గురువారం తిరుప్పావడ సేవను అర్చక స్వాములు కనుల పండువగా నిర్వహించారు.
వారాంతపు సేవల్లో ఎంతో విశిష్టమైనది తిరుప్పావడ సేవ. తిరుమలలో ప్రతి గురువారం శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి రెండవ అర్చనానంతరం జరిగే సేవ ఇది. వేంకటేశుని మూలవిరాట్టుకు ఉన్న ఆభరణాలన్నింటినీ తొలగించి, నొసటి నామాన్ని తగ్గించి నేత్రాలు స్పష్టంగా భక్తులకు కనిపించేవిధంగా చేశారు. అనంతరం స్వామివారికి ఎదురుగా బంగారు వాకిలి ముందు ఏడుకొండల ఆకారంలో పులిహోరని రాశిగా ఏర్పాటు చేశారు. జిలేబీలను మురుకులను చక్కగా అమర్చి పూలతో అలంకరించారు. పులిహోర రాశిని నేరుగా గర్భాలయంలోని స్వామివారికి నివేదించారు. నివేదించిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. స్వామివారి నేత్ర దర్శనంతో భక్తులు పులకించిపోయారు. చల్లని చూపుతో అందరినీ అనుగ్రహించేలా లోకలను ఏలే స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. గోవిందుని నేత్ర దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. స్వామివారి నిజరూప దర్శనంతో పరవశించిపోయారు.
భక్తుల ఆనంద తాండవం
రెండో రోజు కూడా నిత్య సేవల్లో వేలాదిమంది పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు సుప్రభాతంతో మొదలై రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ వరకు ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు వ్యాఖ్యానంతో సాగిన శ్రీవారి సేవలను భక్తులు తన్మయత్మంతో తిలకించారు. ఇంకా తోమలసేవ, అర్చన, సహస్రదీపాలంకరణ, వీధి ఉత్సవం నిర్వహించారు. ఉత్తరాంధ్ర, ఒరిస్సా నుంచి వచ్చిన భక్తులు గోవిందా.. గోవిందా అంటూ నృత్యాలు చేశారు. స్టేడియం భక్తులతో నిండిపోవడంతో బయట ఆవరణలో స్క్రీన్ల వద్ద నిలుచొని అనేకమంది భక్తులు పూజలను తిలకించారు. టీటీడీ అధ్యాత్మిక పుస్తక ప్రదర్శన వద్ద సైతం అధిక సంఖ్యలో సందర్శకులు కనిపించారు. ఆరోగ్య శిబిరం సేవలను అనేకమంది వినియోగించుకున్నారు.
నేటి సేవ
అభిషేకం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మూలమూర్తికి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే అభిషేకాన్ని శుక్రవారాభిషేకం అంటారు. ఈ సేవ 614వ సంవత్సరం పూర్వం నుంచే జరుగుతుందని అంచనా. భాగవద్రామానుజుల వారు స్వామివారి వక్ష స్థలంలో బంగారు ఆలివేలు మంగ ప్రతిమను అలంకరింప చేసింది శుక్రవారం కావడంతో అప్పటి నుంచి ఈ అభిషేకం జరిగేలా ఏర్పాటు చేశారు. శ్రీనివాసుని యధాతథమైన రూపాన్ని వక్ష స్ధల లక్ష్మీతో సహా ఈ అభిషేక సమయంలో మాత్రమే దర్శించుకునేందుకు వీలవుతుంది.
కనరో భాగ్యము..
Published Fri, Jul 25 2014 12:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement