-
హంస వాహనంపై అమ్మవారు
-
హంస వాహనంపై అమ్మవారు
తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లోగురువారం రాత్రి అలమేలు మంగమ్మ సరస్వతీ దేవి రూపంలో హంస వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం పెద్దశేష వాహనంపై ఊరేగారు. తిరుచానూరు : పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం ఉదయం పెద్దశేష వాహనసేవ వైభవంగా జరిగింది. వైకుంఠనాథుని అలంకరణలో అమ్మవారు పెద్దశేషునిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున 4 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి వేంచేపుగా వాహనమండపానికి తీసుకొచ్చి పెద్దశేష వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర, వజ్రవైఢూర్య ఆభరణాలతో వైకుంఠనాథునిగా అలంకరించారు. అనంతరం 8 గంటలకు భక్తుల కోలాటం, మంగళవాయిద్యాలు, జియ్యర్ స్వాముల ప్రబంధ పారాయణం నడుమ అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం జరిగిన హంస వాహనసేవలో అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులను కటాక్షించారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆలయ స్పెషల్గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెంట్లు శేషాద్రిగిరి, వరప్రసాద్ పాల్గొన్నారు. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజైన శుక్రవారం ఉదయం 8 గంటలకు ముత్యపుపందిరి వాహనం, రాత్రి 8గంటలకు సింహవాహనంపై తిరువీధుల్లో పద్మావతి అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు ఆస్థాన మండపంలో ఊంజల్సేవ జరుగుతాయి. తిరుచానూరు : శ్రీపద్మావతి అమ్మవారికి పలు రకాల ప్రసాదాలను నైవేద్యంగా అర్చకులు ని వేదిస్తారు. ప్రతిరోజూ తెల్లవారుజామున, ఉద యం, సాయంత్రం అమ్మవారికి ప్రసాదాలను నివేదిస్తారు. ఈ ప్రసాదాలను అమ్మవారి ఆల యంలోని పోటులో తయారుచేస్తారు. మొదటి నివేదన : అమ్మవారికి తెల్లవారుజామున మొదటి నివేదనకు దద్దోజనం(పెరుగన్నం), పులిహోర, వెన్ పొంగల్, చక్కెర పొంగలి, మాత్ర(తిరుగబాత పెట్టకుండా పెరుగు, వెన్నతో చేసిన అన్నం), లడ్డు, వడ, సీర(కేసరి) నైవేద్యంగా అమ్మ వారికి సమర్పిస్తారు. రెండో నివేదన ఉదయం 9గంటలకు నిర్వహించే రెండవ నివేదనలో పులిహోర, చక్కెర పొంగలి, వెన్ పొంగళ్, దద్దోజనాన్ని సమర్పిస్తారు. మూడో నివేదన సాయంత్రం 6.30గంటలకు నిర్వహించే మూ డవ నివేదనలో దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి, మిరియాల పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. శుక్రవారం రోజు : శుక్రవారం వేకువజాము నిర్వహించే అభిషేకానికి వెన్పొంగళ్, లక్ష్మీపూజకు సీర, కల్యాణోత్సవానికి చక్కెర పొంగలి, పులిహోర, వెన్పొంగళ్, అప్పంను సమర్పిస్తారు. అలాగే కదంబం(కూరగాయలతో చేసిన అన్నం), పా యసం, మధ్యాహ్నం ఉద్యానవనంలో జరిగే అభిషేకానికి అమ్మవారికి కారం పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు. తిరుప్పావడ సేవకు : ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పావడ సేవకు లడ్డు, వడ, జిలేబి, మురుకు, దోసె, అప్పం సమర్పిస్తారు. ధనుర్మాసంలో.. ధనుర్మాసంలో అమ్మవారికి వెన్పొంగళ్, బెల్లం దోసె, సుఖీలను నైవేద్యంగా సమర్పిస్తారు. బ్రహ్మోత్సవంలో.. బ్రహ్మోత్సవంలో అన్ని ప్రసాదాలతో పాటు వాహన సేవ సమయంలో గంగుండ్ర మం డపం వద్ద అమ్మవారికి దోసెను నైవేద్యంగా సమర్పిస్తారు. పర్వదినాల్లో : పర్వ దినాల్లో ప్రత్యేకంగా క్షీరాన్నం(పాలు కలిపిన అన్నం), కొబ్బరి అన్నం, చిత్రాన్నం, వడపప్పు, సుండల్, పానకం, బాదుషా, మైసూర్పాకును నైవేద్యంగా సమర్పిస్తారు. -
కనరో భాగ్యము..
బ్రహ్మ కడిగిన పాదము.. బ్రహ్మము తానైన పాదము.. శ్రీహరి దర్శనమే మహా భాగ్యం. సేవలలో పాల్గొనడం మహదానందం. విశాఖ నగరమే స్వర్ణభారతికి తరలివచ్చిందా.. అన్నట్టు సుప్రభాతం పలికేందుకు తెల్లవారుజాము 5 గంటల నుంచి రాత్రి ఏకాంత సేవ ముగిసేవరకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. వేంకటేశుని వైభవాన్ని తిలకించి పరవశించిపోతున్నారు. మాటలకందని మధురానుభూ తికి లోనై అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. గురువారం తిరుప్పావడ సేవను అర్చక స్వాములు కనుల పండువగా నిర్వహించారు. వారాంతపు సేవల్లో ఎంతో విశిష్టమైనది తిరుప్పావడ సేవ. తిరుమలలో ప్రతి గురువారం శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి రెండవ అర్చనానంతరం జరిగే సేవ ఇది. వేంకటేశుని మూలవిరాట్టుకు ఉన్న ఆభరణాలన్నింటినీ తొలగించి, నొసటి నామాన్ని తగ్గించి నేత్రాలు స్పష్టంగా భక్తులకు కనిపించేవిధంగా చేశారు. అనంతరం స్వామివారికి ఎదురుగా బంగారు వాకిలి ముందు ఏడుకొండల ఆకారంలో పులిహోరని రాశిగా ఏర్పాటు చేశారు. జిలేబీలను మురుకులను చక్కగా అమర్చి పూలతో అలంకరించారు. పులిహోర రాశిని నేరుగా గర్భాలయంలోని స్వామివారికి నివేదించారు. నివేదించిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. స్వామివారి నేత్ర దర్శనంతో భక్తులు పులకించిపోయారు. చల్లని చూపుతో అందరినీ అనుగ్రహించేలా లోకలను ఏలే స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. గోవిందుని నేత్ర దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. స్వామివారి నిజరూప దర్శనంతో పరవశించిపోయారు. భక్తుల ఆనంద తాండవం రెండో రోజు కూడా నిత్య సేవల్లో వేలాదిమంది పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు సుప్రభాతంతో మొదలై రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ వరకు ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు వ్యాఖ్యానంతో సాగిన శ్రీవారి సేవలను భక్తులు తన్మయత్మంతో తిలకించారు. ఇంకా తోమలసేవ, అర్చన, సహస్రదీపాలంకరణ, వీధి ఉత్సవం నిర్వహించారు. ఉత్తరాంధ్ర, ఒరిస్సా నుంచి వచ్చిన భక్తులు గోవిందా.. గోవిందా అంటూ నృత్యాలు చేశారు. స్టేడియం భక్తులతో నిండిపోవడంతో బయట ఆవరణలో స్క్రీన్ల వద్ద నిలుచొని అనేకమంది భక్తులు పూజలను తిలకించారు. టీటీడీ అధ్యాత్మిక పుస్తక ప్రదర్శన వద్ద సైతం అధిక సంఖ్యలో సందర్శకులు కనిపించారు. ఆరోగ్య శిబిరం సేవలను అనేకమంది వినియోగించుకున్నారు. నేటి సేవ అభిషేకం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మూలమూర్తికి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే అభిషేకాన్ని శుక్రవారాభిషేకం అంటారు. ఈ సేవ 614వ సంవత్సరం పూర్వం నుంచే జరుగుతుందని అంచనా. భాగవద్రామానుజుల వారు స్వామివారి వక్ష స్థలంలో బంగారు ఆలివేలు మంగ ప్రతిమను అలంకరింప చేసింది శుక్రవారం కావడంతో అప్పటి నుంచి ఈ అభిషేకం జరిగేలా ఏర్పాటు చేశారు. శ్రీనివాసుని యధాతథమైన రూపాన్ని వక్ష స్ధల లక్ష్మీతో సహా ఈ అభిషేక సమయంలో మాత్రమే దర్శించుకునేందుకు వీలవుతుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్లో పలువురి చేరిక
చిరు జల్లులతో ఉపశమనం
మత్స ్య సంపద ౖపైపెకి..
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement