పుష్కర పనుల తీరుపై సీఎం అసంతృప్తి | Sakshi
Sakshi News home page

పుష్కర పనుల తీరుపై సీఎం అసంతృప్తి

Published Thu, Jul 2 2015 10:51 AM

పుష్కర పనుల తీరుపై సీఎం అసంతృప్తి - Sakshi

రాజమండ్రి: గోదావరి పుష్కర పనుల తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఆయన రాజమండ్రిలో పనుల తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రాజమండ్రి మునిసిపల్ కమిషనర్, ఇతర అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయంతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. పుష్కరాల పనులపై మంత్రుల కమిటీ, సమన్వయ కమిటీ, కార్యాచరణ కమిటీలు ఏర్పాటు చేయించారు. నాలుగో బ్రిడ్జి రోడ్డు కూలిపోవడంపై కాంట్రాక్టర్లను సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Advertisement
Advertisement