గంట్యాడ: మండలంలోని తాటిపూడి రిజర్వాయర్ సాగునీటి కాలువల అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయకపోవడంపై జపాన్ బృంద సభ్యులు కాంట్రాక్టర్, సంబంధిత అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గడువులోపల పనులు పూర్తి చేయకపోతే నిధులను నిలిపి వేస్తామని స్పష్టం చేశారు. జపాన్ నిధులు రూ.23కోట్లతో మండలంలో అభివృద్ధి చేస్తున్న తాటిపూడి ఆయకట్టు సాగునీటికాలువ పనులను జపాన్ బృంద సభ్యులు మరియామా,కిమోవా,ఢిల్లీకి చెందిన సిన్హాలు బుధవారం పరిశీలించారు. 2011లో మంజూరైన అయకట్టు కాలువల అభివృద్ధి పనులు గడువులోపల పూర్తి కాకపోవడంతో ఒకసారి గడువు అడిగారు. 2015 ఖరీఫ్ ప్రారంభం నాటికి ఇచ్చిన గడు వు పూర్తి అయినప్పటికీ పనులు 60 శాతం మాత్రమే జరిగాయి.
దీనిపై మళ్లీ 2016 మార్చి వరకు సంబంధిత కాంట్రాక్టర్ గడువు కోరారు.ఈమేరకు వళ్లీ గడువు ఇస్తే పనులు పూర్తి చేయగలరా, లేదోనని జపాన్ బృంద సభ్యులు కాలువను పరిశీలించారు. మార్చివరకు కోరిన గడువును డిసెంబర్ వరకు మాత్రమే ఇస్తామని అప్పటిలోగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల నాన్యతపై వేరే సిబ్బంది పర్యవేక్షిస్తారన్నా రు. అనంతరం తాటిపూడి రిజర్వాయర్ను పరిశీలించి రిజర్వాయర్ నిర్మా ణం, రిజర్వాయర్ అయకట్టు,విస్తీర్ణం నీటి నిల్వ సామర్థ్యం, ఇన్ఫ్లో తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుక న్నారు. అనంతరం సీఈఓ శివరామ ప్రసాద్ మాట్లాడు తూ జపాన్ నిధులతో చేపట్టిన అభి వృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని బృంద సభ్యులు సూచించారన్నా రు. డిసెంబర్లోగా పనులు పూర్తి చే సేందుకు కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ నాగేశ్వర్రావు, ఈఈ రమణమూర్తి,డీఈ అప్పలనాయుడు, ఏఈ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
అక్టోబర్కు పనులు పూర్తిచేయాల్సిందే
వేములాపల్లి (శృంగవరపుకోట): వేములాపల్లి గ్రోయిన్ పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని జపాన్ నుంచి వచ్చిన జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ(జె.ఐ.సి.ఏ) సభ్యులు బుధవారం నిర్ద్వంద్వంగా చెప్పారు. తాటిపూడి రాజర్వాయర్ ఆధునికీకరణకు జపాన్ నిధుల్లో భాగంగా 2012లో రూ.24.64కోట్లు కేటాయించగా వాటిలో వేములాపల్లి ఆనకట్ట నిర్మాణానికి రూ.3.5కోట్లు కేటాయించారు. గత ఏడాది ప్రారంభించిన వేములాపల్లి గ్రోయిన్ పనులను జపాన్ బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో బుధవారం పరిశీలించారు.
ముందుగా ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ ఆనకట్ట ఆయకట్టు, నిర్మాణం, పనులు ప్రగతి, ఆనకట్ట వల్ల గ్యాప్ ఆయకట్టు 2326 ఎకరాల్లో భాగంగా చివరి భూములకు నీరు అందింస్తామంటూ జపాన్ బృందానికి చెప్పారు. పనులకు సంబంధించిన రిపోర్టులు, డ్రాయింగ్లు చూపారు. ఈసందర్భంగా జపాన్ బృంద సభ్యులు మాట్లాడుతూ పనులు ఎప్పుడు పూర్తిచేస్తారని అడగ్గా ఇరిగేషన్ అధికారులు మార్చినాటికి పూర్తిచేస్తాం అంటూ చెప్పారు. దీంతో వారు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ నాటికి పూర్తిచేయాలి. లేకుంటే ఫండింగ్ చేయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జపాన్ ప్రతినిధి బృందంతో పాటు ఇరిగేషన్ సీఈ శివరామప్రసాద్, ఎస్ఈ నాగేశ్వరరావు, ఈఈ ఎం.వి.రమణ, డీఈ అప్పలనాయుడు, జేఈ శివరామకృష్ణ తదితర ఉద్యోగులు, కాంట్రాక్టరు, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.
గడువు దాటితే నిధులకు బ్రేక్
Published Thu, Jul 30 2015 12:11 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
స్పైస్జెట్కు రూ.60 వేల జరిమానా
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
ఓటింగ్ శాతం పెంచాలి
ఉమ్మరకోట్ సొంతం!
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
తప్పక చదవండి
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement