రాజంపేట: తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు ఊరిస్తోంది. డివిజన్ ఏర్పాటుకు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు రైల్వే వర్గాల సమాచారం. గుంతకల్ రైల్వే డివిజన్ నుంచి వేరు చేసి బాలాజీ డివిజన్ ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నారు. బాలాజీ డివిజన్ ఏర్పాటులో భాగంగా లైన్లను విడగొట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కడప వరకు బాలాజీ డివిజన్ను విస్తరించేందుకు రైల్వే శాఖ యోచిస్తోంది. ఇదే జరిగితే కడప రైల్వేలకు మహర్ధశ కలిగినట్లే. గుంతకల్ రైల్వే డివిజన్లో కడప రైల్వేల విషయంలో వివక్ష ఉందన్న విమర్శలు ఉన్నాయి. బాలాజీ డివిజన్లోకి కడప విలీనం కావడమే మేలు అన్న భావనలో జిల్లా వాసులు ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం కొత్త రైల్వే జోన్కు అంకురార్పణ జరగనున్న క్రమంలో కొత్త డివిజన్లను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని రైల్వే శాఖ పరిశీలిస్తున్న క్రమంలో బాలాజీ డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కాళ్లొచ్చాయి.
అందరూ సానుకూలమే..
బాలాజీ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి కార్మికసంఘాల నేతలు, ఉన్నతాధికార్ల నుంచి రైల్వేబోర్డు అభిప్రాయాలను తీసుకున్నట్లు సమాచారం. కొద్ది నెలల క్రితం బాలాజీ డివిజన్ ఏర్పాటుకు అనుకూలంగా నివేదికలు కూడా వెళ్లాయని కార్మికవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దేశంలోనే పుణ్యక్షేత్రంగా తిరుపతి విరాజిల్లుతున్న క్రమంలో రైల్వే ఉన్నతాధికారులు తిరుపతిని సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో ప్రొటోకాల్ ప్రకారం అనంతపురం జిల్లాలోని గుంతకల్ కేంద్రం నుంచి డివిజన్ స్ధాయి అధికారులు తరుచుగా రావాలంటే విధి నిర్వహణ కష్టంగా మారుతోంది. బాలాజీ డివిజన్ ఏర్పాటు జరిగితే ఈ సమస్య ఉండదనే అభిప్రాయం డివిజన్ ఉన్నతాధికారుల్లో నెలకొంది.
విడిపోనున్న లైన్లు ఇవే
బాలాజీ డివిజన్ ఏర్పాటులో భాగంగా గుంతకల్లు డివిజన్ నుంచి 404 కిలోమీటర్ల మేర రైల్వేలైను విడిపోనుంది. రేణిగుంట-కడప మధ్య ఉన్న 125 కి.మీ, తిరుపతి-గూడూరు మధ్య ఉన్న 92 కి.మీ, తిరుపతి-కాట్పాడి మధ్య ఉన్న 104 కి.మీ, పాకాల-మదనపల్లె మధ్య ఉన్న 83 కి.మీ లైన్లను బాలాజీ డివిజన్లో కలిపే అంశాన్ని అధికారవర్గాలు పరిశీలిస్తున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా గుంతకల్ డివిజన్లో ఈ రైల్వే లైన్లు కొనసాగుతున్నాయి. బాలాజీ డివిజన్ ఏర్పాటుతో జిల్లాకు కొత్తరైళ్ల రాకతోపాటు రైల్వేల అభివృద్ధికి బీజం పడినట్లు అవుతుందని అటు కార్మికనేతలు, ఇటు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.కాగా రాజంపేట పార్లమెంటు పరిధిలోని రైల్వేలైన్ బాలాజీ డివిజన్లోకి వెళ్లినా.. కడప పార్లమెంటు స్థానంలో కొంత లైన్, రైల్వేస్టేషన్లు గుంతకల్ డివిజన్లోనే కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.
తెరపైకి బాలాజీ డివిజన్
Published Thu, Jul 31 2014 4:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement