-
Balaji Division: బాలాజీ పట్టాలెక్కేనా!
సాక్షి, రాజంపేట: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించడంపై అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నా తమ చిరకాల వాంఛ నెరవేరలేదనే భావన ఉమ్మడి వైఎస్సార్ జిల్లా రైలు ప్రయాణికులు, ఉద్యోగులు, కార్మికులు, అధికారులను వేధిస్తోంది. కొత్త జోన్ ఏర్పడిన తరుణంలో కొత్త డివిజన్గా యేళ్లతరబడి ప్రతిపాదనలో ఉన్న బాలాజీ డివిజన్ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. తూర్పుకోస్తా పరిధిలోని వాల్తేరు డివిజన్లో కొంతభాగం విశాఖ రైల్వేజోన్లో కలపడం కన్నా, తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్గా చేయాలని సీమ వాసుల నుంచి కేంద్రానికి వినతులు వెళుతున్నాయి. గుంతకల్కు వెళ్లాలంటే దూరాభారం... తరచూ సమావేశాలకు గుంతకల్ డివిజన్ కేంద్రానికి వెళ్లి రావాలంటే అధికారులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతకల్, గుంటూరు, విజయవాడ నాలుగు డివిజన్లతోపాటు కొత్తగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేసి విశాఖజోన్లో కలిపితే బాగుంటుందని రైల్వే నిపుణులు అంటున్నారు. ఆ దిశగా ఎంపీలు రైల్వేమంత్రిత్వశాఖపై వత్తిడి తీసుకురావాలని సీమవాసులు కోరుతున్నారు. బాలాజీ డివిజన్ ఏర్పాటైతే.. బాలాజీ డివిజన్ ఏర్పాటైతే ఇందులో తిరుపతి–గూడూరు (92.96 కి.మీ), తిరుపతి–కాట్పాడి (104.39 కి.మీ), పాకాల–మదనపల్లె (83 కి.మీ), రేణిగుంట–కడప (125 కి.మీ)లైను కలిపే అంశాన్ని గతంలోనే రైల్వే అధికారులు పరిశీలించారు. నంద్యాల–పెండేకల్లు (102 కి.మీ)లైను గుంటూరు డివిజన్లోకి విలీనం చేయాలని పరిశీలించారు. కాగా జిల్లా మీదుగా వెలుగొండ అడవుల్లో నుంచి వెళ్లే కృష్ణపట్నం రైల్వేలైన్ కూడా విజయవాడ డివిజన్లోకి వెళ్లింది. కొత్తడివిజన్ ఏర్పడితే నందలూరుకు పూర్యవైభవం.. కొత్త డివిజన్ ఏర్పడితే బ్రిటీషు కాలం నాటి రైల్వేకేంద్రానికి పూర్వవైభవం సంతరించుకుంటుంది. బాలాజీ డివిజన్ కేంద్రానికి దగ్గరలో ఉన్న రేణిగుంట జంక్షన్ తర్వాత నందలూరు రైల్వేకేంద్రం రైల్వేపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. డివిజన్కు రైల్వే ప్రత్యామ్నాయ పరిశ్రమను ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో రైల్వేమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా రాజ్యసభలో నందలూరులో రైల్వేపరిశ్రమ ఏర్పాటును ప్రకటించిన సంగతి తెలిసిందే. రైల్వేపరిశ్రమ వస్తే గుంతకల్కు ప్రాధాన్యత తగ్గిపోతుందని రైల్వే ఉన్నతాధికారులు భావించినట్లు తెలుస్తోంది. విశాఖ జోన్ ఏర్పడిన నేపథ్యంలో గుంతకల్ డివిజన్ నుంచి వేరుచేసి ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వరకు బాలాజీ డివిజన్గా ఏర్పాటుచేసే ప్రతిపాదన కార్యరూపం దాల్చేందుకు పాలకులు నడుం బిగించాలని పలువురు కోరుతున్నారు. బాలాజీ డివిజన్ ఏర్పాటు అవసరం బాలాజీ డివిజన్ ఏర్పాటు ఎంతైనా అవసరం. విశాఖజోన్ ఏర్పడుతున్న క్రమంలో కొత్త డివిజన్లను ఏర్పాటు చేయాల్సి వస్తే అది ముందుగా బాలాజీ డివిజన్ ఉంటుంది. డివిజన్ కావడానికి అన్ని అర్హతలు బాలాజీ డివిజన్కు ఉన్నాయి. అందరికి ఉపయోగకరం. కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ ఆ దిశగా అడుగులు వేయాలి. –షేక్ కమాల్బాషా, మాజీ కార్మికనేత, రైల్వే మజ్దూర్ యూనియన్ దశాబ్దాల నుంచి బాలాజీ డివిజన్ ప్రతిపాదన బాలాజీ డివిజన్ ఏర్పాటైతే నందలూరుకు మళ్లీ పూర్వవైభవం సంతరించుకున్నట్లే. రైల్వేపరిశ్రమ పెట్టేందుకు మార్గం సుగమమవుతుంది. బాలాజీ డివిజన్లో రేణిగుంట తర్వాత ప్రాముఖ్యత కలిగిన రైల్వేకేంద్రం నందలూరు. ఈ డివిజన్ ప్రతిపాదన దశాబ్దాల కాలం నాటిది. –పులి భాస్కరయ్య, రిటైర్డ్ లోకోపైలెట్, నందలూరు బాలాజీ డివిజన్ను బలపరచాలని ఎంపీలను కోరుతాం విశాఖ జోన్ ఏర్పాటు నిర్ణయం శుభపరిణామం. ఈ నేపథ్యంలో బాలాజీ డివిజన్ ప్రతిపాదనను బలపరచాలని ఎంపీలను కోరతాము. గుంతకల్ కారణంగా నందలూరుకు ప్రాముఖ్యత లేకుండా పోయింది. బాలాజీ డివిజన్ ఏర్పాటు వల్ల నందలూరుకు పూర్వవైభవం వస్తుందని రైల్వేనిపుణులు చెబుతున్నారు. –సయ్యద్అమీర్, వైఎస్సార్సీపీ, మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాలు: వైఎస్సార్, అన్నమయ్య ప్రధాన రైల్వేకేంద్రం: నందలూరు ప్రధాన స్టేషన్లు: కడప, ఎర్రగుంట్ల, ఓబులవారిపల్లె ఉమ్మడి వైఎస్సార్ జిల్లా మీదుగా నడిచే రైళ్లు: 30 (డౌన్, అప్) గూడ్స్రైళ్లు: 40 స్టేషన్లు: 25 కార్మికులు: 4000 కిలోమీటర్లు: 180 -
తెరపైకి బాలాజీ డివిజన్
రాజంపేట: తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు ఊరిస్తోంది. డివిజన్ ఏర్పాటుకు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు రైల్వే వర్గాల సమాచారం. గుంతకల్ రైల్వే డివిజన్ నుంచి వేరు చేసి బాలాజీ డివిజన్ ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నారు. బాలాజీ డివిజన్ ఏర్పాటులో భాగంగా లైన్లను విడగొట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కడప వరకు బాలాజీ డివిజన్ను విస్తరించేందుకు రైల్వే శాఖ యోచిస్తోంది. ఇదే జరిగితే కడప రైల్వేలకు మహర్ధశ కలిగినట్లే. గుంతకల్ రైల్వే డివిజన్లో కడప రైల్వేల విషయంలో వివక్ష ఉందన్న విమర్శలు ఉన్నాయి. బాలాజీ డివిజన్లోకి కడప విలీనం కావడమే మేలు అన్న భావనలో జిల్లా వాసులు ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం కొత్త రైల్వే జోన్కు అంకురార్పణ జరగనున్న క్రమంలో కొత్త డివిజన్లను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని రైల్వే శాఖ పరిశీలిస్తున్న క్రమంలో బాలాజీ డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కాళ్లొచ్చాయి. అందరూ సానుకూలమే.. బాలాజీ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి కార్మికసంఘాల నేతలు, ఉన్నతాధికార్ల నుంచి రైల్వేబోర్డు అభిప్రాయాలను తీసుకున్నట్లు సమాచారం. కొద్ది నెలల క్రితం బాలాజీ డివిజన్ ఏర్పాటుకు అనుకూలంగా నివేదికలు కూడా వెళ్లాయని కార్మికవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దేశంలోనే పుణ్యక్షేత్రంగా తిరుపతి విరాజిల్లుతున్న క్రమంలో రైల్వే ఉన్నతాధికారులు తిరుపతిని సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో ప్రొటోకాల్ ప్రకారం అనంతపురం జిల్లాలోని గుంతకల్ కేంద్రం నుంచి డివిజన్ స్ధాయి అధికారులు తరుచుగా రావాలంటే విధి నిర్వహణ కష్టంగా మారుతోంది. బాలాజీ డివిజన్ ఏర్పాటు జరిగితే ఈ సమస్య ఉండదనే అభిప్రాయం డివిజన్ ఉన్నతాధికారుల్లో నెలకొంది. విడిపోనున్న లైన్లు ఇవే బాలాజీ డివిజన్ ఏర్పాటులో భాగంగా గుంతకల్లు డివిజన్ నుంచి 404 కిలోమీటర్ల మేర రైల్వేలైను విడిపోనుంది. రేణిగుంట-కడప మధ్య ఉన్న 125 కి.మీ, తిరుపతి-గూడూరు మధ్య ఉన్న 92 కి.మీ, తిరుపతి-కాట్పాడి మధ్య ఉన్న 104 కి.మీ, పాకాల-మదనపల్లె మధ్య ఉన్న 83 కి.మీ లైన్లను బాలాజీ డివిజన్లో కలిపే అంశాన్ని అధికారవర్గాలు పరిశీలిస్తున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా గుంతకల్ డివిజన్లో ఈ రైల్వే లైన్లు కొనసాగుతున్నాయి. బాలాజీ డివిజన్ ఏర్పాటుతో జిల్లాకు కొత్తరైళ్ల రాకతోపాటు రైల్వేల అభివృద్ధికి బీజం పడినట్లు అవుతుందని అటు కార్మికనేతలు, ఇటు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.కాగా రాజంపేట పార్లమెంటు పరిధిలోని రైల్వేలైన్ బాలాజీ డివిజన్లోకి వెళ్లినా.. కడప పార్లమెంటు స్థానంలో కొంత లైన్, రైల్వేస్టేషన్లు గుంతకల్ డివిజన్లోనే కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement