-
పకడ్బందీగా రక్త నమూనాల సేకరణ
● ప్రపంచ ఆర్యోగ సంస్థ రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్ శిరీష లోకేశ్వరం: గ్రామాల్లో బోధకాలుకు సంబంధించిన రక్త నామూనాల సేకరణ పకడ్బందీగా చే పట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్ శిరీష అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో రక్త నమూనాల సేకరణ కు సంబంధించిన రికార్డులను బుధవారం పరి శీలించారు. ఈసందర్భంగా శిరీష మాట్లాడు తూ ఇంటింటికీ తిరిగి రక్త నాములు సేకరించా లన్నారు. పీహెచ్సీకి వచ్చే రోగులకు రక్త పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఆమె వెంట వైద్యురాలు తేజస్విని, ల్యాబ్ టెక్నీషియన్ మహేష్, ఏఎన్ఎం స్వప్న ఉన్నారు. -
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య
● జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రవేశాలు ● ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన వారే అర్హులు ● ఈనెల 30వరకు ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశంనిర్మల్చైన్గేట్: పేద విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతిభ ఉన్న విద్యార్థుల ఉన్నత చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుకావొద్దనే ఉద్దేశంతో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘కార్పొరేట్ విద్య’ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కింద విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో రిజర్వేషన్ల వారీగా ప్రవేశాలు కల్పిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీ–ఈ, బీసీ–సీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు అర్హులు. కార్పొరేట్ కళాశాలల్లో.. పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ఇంటర్మీడియట్ కార్పొరేట్ కళాశాలల్లో చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఎంపికై న ప్రతీ విద్యార్థికి ఫీజు కింద రూ.35 వేలు, ఖర్చుల కింద ఏటా రూ.3 వేలు అందిస్తారు. ఉచితంగా వసతి సదుపాయం కల్పిస్తారు. జిల్లాతోపాటు పథకం కింద ఎంపికై న రాష్ట్రంలోని ఏకార్పొరేట్ కళాశాలలో ప్రవేశానికై నా విద్యార్థులు దరఖాస్తు చేసుకునే వీలుంది. వీరు అర్హులు.. పదో తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 7 జీపీఏ ఆపైన పాయింట్లు సాధించి ఉండాలి. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, కస్తూరి బాగాంధీ బాలికా విద్యాలయాలు, ప్రభుత్వ గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్, నవోదయ పాఠశాలల్లో చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. కేటగిరీల వారీగా ఎక్కువ దరఖాస్తులు వస్తే మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తులు ఇలా.. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఈనెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈపాస్ వెబ్సైట్లో కార్పొరేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తులో వివరాలు నమోదు చేయాలి. విద్యార్థుల కులం, ఆదాయం ధ్రువపత్రాలు, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, పదోతరగతి మెమో, ఆధార్ కార్డు, వసతి గృహాల్లో 8, 9, 10వ తరగతి చదివితే హాస్టల్ ధ్రువీకరణ పత్రం, రెండు పాస్ఫొటోలు, రేషన్ కార్డు జిరాక్స్ అప్లోడ్ చేయాలి. దివ్యాంగులు వైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఇక గ్రామీణ ప్రాంత విద్యారుల తల్లిదండ్రుల ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.2 లక్షలకు మించొద్దు.అర్హులు దరఖాస్తు చేసుకోవాలిప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూల్, కేజీబీవీల్లో పదో తరగతి చదివి 7.0 జీపీఏ ఆపైగా జీపీఏ సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు అర్హులు. గతేడాది జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వివిధ కార్పొరేట్ కళాశాలల్లో సీటు పొందారు. – రాజేశ్వర్గౌడ్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి -
ధాన్యం తూకంలో జాప్యం చేయొద్దు
● చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి ● నీటిపారుదల శాఖ కార్యదర్శి, ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ● కలెక్టర్తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలననిర్మల్ రూరల్/సోన్: కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం తూకం వేయడంలో కేంద్రాల నిర్వాహకులు అలసత్వం వహిచొద్దని ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. నిర్మల్ రూరల్ మండలం రత్నపూర్ కాండ్లిలో, సోన్ మండలం న్యూబొ ప్పారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి రైతులతో మాట్లాడారు. కేంద్రాల్లో సదుపాయాల గురించి తెలుసుకున్నారు. కేంద్రంలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, కొనుగోలు చేయాల్సిన ధాన్యం వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. తడిసిన ధాన్యం తూకం వేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. తరుగు ఏమైనా తీస్తున్నారా అని రైతులను అడుగగా, ఏమీ లేదని రైతులు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తూకం వేసిన ధాన్యం వివరాలు ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. తూకం వేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కేంద్రంలో రైతులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్రాల వద్ద సరిపడా హమాలీలు, రైస్ మిల్లుల వద్ద ధాన్యం అన్లోడ్కు కూలీలు సిద్ధంగా ఉండేలా చూడాలన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 228 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1,02,698 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కేంద్రాల్లో రైతులకు సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియను క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని జిల్లా అధికారుల వరకు ప్రతి ఒక్కరూ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. వారి వెంట అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి నందిత, డీఆర్డీవో విజయలక్ష్మి, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకళ, డీఏవో అంజిప్రసాద్, మార్కెటింగ్ ఏడీ అశ్వాక్, డీసీవో నర్సయ్య, ఎంపీడీవోలు గజానంద్, సురేష్, ఎంపీవో గంగామణి, తహసీల్దార్లు సంతోష్, మల్లేశ్, ఐకేపీ సిబ్బంది, రైతులు ఉన్నారు.అదనపు కలెక్టర్ సందర్శన..ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్, సుర్జాపూర్, బాదన్కుర్తి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను, పట్టణంలోని మార్కెట్ యార్డులోని కేంద్రాన్ని అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ బుధవారం సందర్శించారు. వాతావరణ మార్పుల దృష్ట్యా తూకంలో జాప్యం చేయకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. తూకం వేసిన ధాన్యం ఎప్పటికప్పుడు లారీల్లో మిల్లులకు తరలించాలని ఆదేశించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి అశ్వక్హైమద్, తహసీల్దార్ శివరాజ్, ఆర్ఐ రాజేశ్వర్, సెక్రటరీ సయ్యద్ అజాం అలీ తదితరులు ఉన్నారు. -
గౌరవ వేతనం ఇవ్వాలి
● పీఆర్టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి నిర్మల్ రూరల్:అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల విధులు నిర్వహించిన సెక్టోరిల్ అధికారులు ఆపై ఉన్నతాధికారులకు ఒక నెల వేతనం గౌరవ వేతనంగా ఇవ్వాలని పీఆర్టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు వై.సాయన్న మాట్లాడారు. పోలింగ్ సిబ్బందికి 2 రోజుల శిక్షణ, 3 రోజుల పని దినంగా మొత్తం 5 రోజుల పని దినాలుగా భావించి, గౌరవ భృతితో పాటు ఐదు రోజుల సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రాల హరిప్రసాద్, నాయకులు వొడ్నాల రవిరాజ్, సోప్పర్వార్ శంకర్, సరికొండ శ్రీనివాస్, ఆడే నూర్సింగ్, మోహన్, సురేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నిర్మాణం నిబంధనల మేరకు లేదని..
భైంసాటౌన్: భవనం నిర్మించిన మూడేళ్ల తర్వాత.. ఆ భవనం నిబంధనల ప్రకారం నిర్మించలేదని లంచం డిమాండ్ చేశాడు భైంసా మున్సిపల్ కమిషనర్. ఆస్తిపన్ను తక్కువ కడుతున్నారని, లక్షల రూపాయల బిల్లు చెల్లించాలని భయపెట్టారు. తక్కువ బిల్లు కట్టాలంటే తనకు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈమేరకు బిల్ కలెక్టర్ ద్వారా ఒత్తిడి చేశాడు. అంత ఇచ్చుకోలేని బాధితుడు బతిమిలాడినా వినలేదు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. రెండేళ్ల క్రితం నిర్మాణం.. ఏసీబీ డీఎస్పీ వీవీ.రమణమూర్తి తెలిపిన వివరాలిల ప్రకారం.. భైంసా పట్టణానికి చెందిన లాలాసరఫి రాధేశ్యాం భైంసా–నిర్మల్ జాతీయ ర హదారి పక్కన 2022లో కమర్షియల్ భవన నిర్మా ణం చేపట్టాడు. ఈమేరకు మున్సిపాలిటీ నుంచి అ నుమతులు కూడా తీసుకున్నాడు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.790 ఆస్తిపన్ను సైతం ఇటీవలే చెల్లించాడు. అయితే ఆ భవనం నిబంధనల మేరకు లేదని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్రావు బిల్ కలెక్టర్ విద్యాసాగర్రావు ద్వారా ఈనెల 16న నోటీసులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం భవనానికి లక్షల ఆస్తిపన్ను చెల్లించాలని, ఎందుకు చర్యలు తీసుకోకూడాదో వివరణ ఇవ్వాలని పేర్కొన్నాడు. దీంతో రాధేశ్యాం బిల్ కలెక్టర్ను కలిశాడు. పన్ను చెల్లించొద్దంటే.. కమిషనర్కు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేనని.. దీంతో బాధితుడు ఈనెల 18న నేరుగా కమిషనర్ వెంకటేశ్వర్రావును కలిశాడు. రూ.30 వేలు ఇచ్చుకోలేనని బతిమిలాడాడు. కానీ, కమిషనర్ అడిగినంత ఇచ్చుకోవాల్సిందే అని స్పష్టం చేశాడు. దీంతో రాధేశ్యాం ఏసీబీని ఆశ్రయించాడు. అధికారుల సూచన మేరకు బుధవారం రూ.30 వేలు తీసుకుని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాడు. నగదు బిల్ కలెక్టర్ విద్యాసాగర్కు ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్పై కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే తమను సంప్రదించాలని సూచించారు. కరీంనగర్ డీఎస్పీ 91543 8854, ఆదిలాబాద్ డీఎస్పీ 9154388963 నంబర్లలో కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. రూ.30 వేలు డిమాండ్ చేసిన భైంసా మున్సిపల్ కమిషనర్ బిల్ కలెక్టర్ ద్వారా ఒత్తిడి.. అంత ఇచ్చుకోలేనన్న బాధితుడు.. కుదరదన్న కమిషనర్.. ఏసీబీని ఆశ్రయించడంతో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు నా ప్రమేయం లేదు.. భవన నిర్మాణ విషయమై ఎలాంటి లంచం డిమాండ్ చేయలేదు. ఇందులో నా ప్రమేయం లేదు. నిబంధనల ప్రకారం పన్ను చెల్లించకపోవడంతోనే నోటీసులు ఇచ్చాం. లంచం డిమాండ్ చేశామనడం అబద్ధం. – వెంకటేశ్వర్రావు, కమిషనర్ -
No Headline
నిర్మల్: రెండేళ్లక్రితం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన నిర్మల్ మున్సిపాలిటీలోని 44 పబ్లిక్హెల్త్ వర్కర్(పీహెచ్డబ్ల్యూ) పోస్టులు, భైంసాలో 18 పోస్టుల వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. ఈ ఘటనలో బాధ్యుడైన అప్పటి నిర్మల్ మున్సిపల్(ప్రస్తుత తుర్కయాంజల్) కమిషనర్ సత్యనారాయణరెడ్డిని, భైంసా అప్పటి కమిషనర్ అలీంను సీడీఎంఏ దివ్యదేవరాజన్ మంగళవారం సస్పెండ్ చేశారు. మరోవైపు నిర్మల్ ఘటనకు సంబంధించి కీలక ఫైల్ మిస్ అయినట్లు తెలుస్తోంది. నాడు ఉద్యోగాల నియామకాల్లో భారీగా అవకతవకలు, బంధుప్రీతీ, ముడుపుల వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయంగానూ దుమారం రేపింది. ఎట్టకేలకు చర్యలు చేపట్టడం, ఇదే సమయంలో ఫైల్ మిస్ కావడం చర్చనీయాంశమైంది. నోటిఫికేషన్ నుంచే.. గ్రేడ్–2 మున్సిపాలిటీగా ఉన్న నిర్మల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లా కేంద్రమైన తర్వాత ఉన్న కార్మికులపై భారం పెరిగింది. ఈక్రమంలో పబ్లిక్ హెల్త్వర్కర్(పీహెచ్డబ్ల్యూ) పోస్టుల భర్తీకి మున్సి పల్ శాఖ అనుమతి ఇచ్చింది. ఈమేరకు 2021 డి సెంబర్లో నిర్మల్ మున్సిపాలిటీలో 44 పోస్టుల భ ర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక పోస్టును ఎస్టీ–1, ఓసీ జనరల్–18, ఓసీ మహిళ–07, ఎస్సీ జనరల్– 04, ఎస్సీ మహిళ–01, బీసీ(ఏ) జనరల్–03, మ హిళ–03, బీసీ(బీ) జనరల్–03, మహిళ–01, బీసీ (డీ) జనరల్–02, బీసీ(ఈ) జనరల్–01 చొప్పున కేటాయించారు. మున్సిపల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకు 20 మంది చొప్పున 880 మంది నిరుద్యోగులకు ఉపాధికల్పన శాఖ కాల్లెటర్లు పంపింది. వీరికి 2022, ఫిబ్రవరి 14న కలెక్టరేట్లో ఇంటర్వ్యూలను నిర్వహించారు. అనంతరం రిజర్వేషన్, రోస్టర్, మెరిట్, జీవోల ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. కానీ.. ఇంటర్వ్యూతో సంబంధం లేకుండా తమకు నచ్చిన వారిని ఎంపిక చేయడం సంచలనంగా మారింది. భైంసాలోనూ.. భైంసా మున్సిపాలిటీలోనూ పీహెచ్డబ్ల్యూ పోస్టుల నియామకాలను చేపట్టారు. ఇక్కడ 18 పోస్టులను భర్తీ చేశారు. నిర్మల్లో జరిగినట్లే ఇక్కడా విధివిధానాలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టినట్లు తేలింది. దీంతో అప్పట్లో ఇక్కడ కమిషనర్గా చేసిన ప్రస్తుత బాన్సువాడ కమిషనర్ అలీంను కూడా సీడీఎంఏ సస్పెండ్ చేశారని తెలిసింది. ఆరోపణలు.. ఆందోళనలు.. 44 పోస్టుల వ్యవహారంలో భారీగా ముడుపులు తీసుకుని అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం రాజకీయంగానూ సంచలనంగా మారింది. అప్పట్లో అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులపై ప్రతిపక్షపార్టీలు ఆరోపణలు చేయడంతోపాటు మున్సిపల్ ముట్టడి చేపట్టాయి. ఒక్కో పోస్టుకు రూ.లక్షల్లో ముడుపులు తీసుకున్నారని, మున్సిపల్కు చెందిన ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులు, బంధువులు, అనుయాయులకే పోస్టులు కేటాయించారని నిరసనలు కొనసాగాయి. రద్దు చేస్తున్నట్లు ప్రకటన.. ఇదిలా ఉంటే.. నిర్మల్లో 44 పోస్టులపై ఆరోపణలు, ఆందోళనలు వెల్లువెత్తడంతో అప్పటి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి 2022, మే 27న సదరు పోస్టులను నిలిపివేయిస్తున్నట్లు చెప్పారు. అప్పటి కలెక్టర్ ముషరఫ్అలీకి ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలో అదేరోజు అప్పటి కలెక్టర్ ముషరఫ్అలీ పోస్టుల అవకతవకలపై విచారణ చేపట్టాలని అప్పటి నిర్మల్ ఆర్డీవోకు ఆదేశించారు. కానీ ఆ తర్వాత ఎలాంటి విచారణ నివేదిక ఇవ్వలేదు. ఫైల్ ఎక్కడ మిస్సైనట్టు.. మున్సిపల్ పోస్టుల వ్యవహారంలో ఓవైపు అప్పటి కమిషనర్ సత్యనారాయణరెడ్డి సస్పెండ్ కాగా, మ రోవైపు ఈ అంశానికి సంబంధించిన ఫైల్ కలెక్టరేట్లో మిస్సయినట్లు తెలుస్తోంది. దీనిపై కలెక్టర్ సీరి యస్ అయినట్లు తెలిసింది. ఆ ఫైల్ ఆఫీస్ మార్పిడి సమయంలో మిస్ అయిందా.. లేక కోర్టులకు వెళ్లినప్పుడు మర్చిపోయారా.. అనేవిషయంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. కీలక ఫైల్ కనిపించకపోవడం, కమిషనర్ సస్పెండ్ కావడంతో 44 పోస్టుల వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. -
నిర్మల్
ఇక ‘స్థానిక’ సమరం! పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని సీఎం తెలపడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది.గురువారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 20248లోuవిరబూసిన మే పుష్పంనిర్మల్టౌన్: మే నెలలో మాత్రమే వికసించే మే పుష్పం నిర్మల్ పట్టణంలోని వివేక్నగర్లో బుధవారం విరబూసింది. కాలనీకి చెందిన ఆదుముల్ల మమత– శ్రీహరి నివాసంలో ఈ పుష్పం వికసించింది. ఈ పుష్పాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు వస్తున్నారు.● నిర్మల్, భైంసా పీహెచ్డబ్ల్యూ పోస్టుల్లో అవకతవకలపై కదలిక●● తాజాగా అప్పటి కమిషనర్లపై వేటు ● కీలక ఫైల్ మాయంపై కలెక్టర్ ఆగ్రహంకోర్టుకు వెళ్లడంతో..44 పోస్టుల వ్యవహారంపై పలువురు హైకోర్టుకు వెళ్లారు. నోటిఫికేషన్, పోస్టుల కేటాయింపులపై కొందరు వెళ్లగా, తమకు కేటాయించిన పోస్టులను ఇవ్వాలంటూ మరికొందరు కోర్టు తలుపుతట్టారు. ఈ అంశంలోనే ఇటీవల నోటిఫికేషన్ సమయంలో ఉన్న అప్పటి అధికారులకూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎంపికై న వారికి వేతనాలివ్వాలని సూచించింది. మరోవైపు నోటిఫికేషన్ సమయంలో అప్పటి అధికారులు ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకోలేదని తెలుస్తోంది. ఈక్రమంలోనే వారికి వేతనాలు ఇవ్వడం లేద ని సమాచారం. ఇందులో భాగంగా పోస్టుల భర్తీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అప్పటి నిర్మల్, ప్రస్తుత రంగారెడ్డిజిల్లా తుర్కయాంజ ల్ మున్సిపల్ కమిషనర్గా ఉన్న సత్యనారా యణరెడ్డిని మంగళవారం సస్పెండ్ చేసింది.న్యూస్రీల్ -
కమిషనర్ తీరును నిరసిస్తూ కౌన్సిలర్ రాజీనామా
ఖానాపూర్: పట్టణంలోని రోడ్డుపై జరుగుతు న్న ఆక్రమణలను మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆరో వార్డు కౌన్సి లర్ ఆఫ్రినాబేగం తన పదవికి రాజీనామా చే స్తున్నట్లు ప్రకటించారు. పట్టణంలోని మున్సి పల్ కార్యాలయంలో చైర్మన్ చిన్నం సత్యం స మక్షంలో కమిషనర్ మనోహర్కు రాజీనామా పత్రం అందజేశారు. పట్టణంలో జరుగుతున్న ఆక్రమణలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా క మిషనర్ క్షేత్రస్థాయికి వెళ్లడం లేదని తెలిపారు. బీజేపీ నాయకులతో తనకు వివాదం సృష్టించా లని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రో డ్డు పై పెరుగుతున్న ఆక్రమణలను ఆపడంలో విఫ లమైన తీరును కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తన రా జీనామా ఆమోదించాలని కోరతానని తెలిపారు. -
సారూ.. మమ్మల్ని అన్యాయం చేయకండి
● దిలావర్పూర్లో ఇళ్లులేని నిరుపేదల ఆక్రందన దిలావర్పూర్: మండల కేంద్రమైన దిలావర్పూర్లో ఐదేళ్లక్రితం నూతన టెక్నాలజీతో 30 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మాణం చేపట్టారు. మూడేళ్లు కావస్తున్నా అర్హులైన నిరుపేదలకు ఇవ్వకపోవడంతో 15 రోజుల క్రితం గ్రామంలోని ఇండ్లులేని నిరుపేదలు వాటిని ఆక్రమించి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా మంగళవారం కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసుల అధికారులు వారిని అందులో నుండి ఖాళీ చేయించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఆందోళన నెలకొనడంతో తహసీల్దార్ స్వాతి, సీఐ శ్రీనివాస్ అక్కడకు చేరుకుని వారితో మాట్లాడుతూ అర్హులైన వారిని త్వరలోనే గుర్తించి తగిన న్యాయం చేస్తామని చెప్పడంతో ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అనంతరం పంచాయతీ రాజ్ ఇంజనీర్ శివకుమార్ అన్ని రూంలను సీజ్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
● మరొకరికి తీవ్రగాయాలుజైనథ్: మండలంలోని భోరజ్ సమీపంలో సోమవారం రాత్రి ట్రాక్టర్ను కారు వెనుకనుంచి ఢీకొన్న ఘటనలో బాలుడు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిరాల గ్రామానికి చెందిన భోయర్ జగదీష్ పక్కింట్లోని ఛాయాబాయి, లక్ష్మణ్ దంపతుల కుమారుడు పవార్ కృష్ణ (11)తో కలిసి కారులో ఆదిలాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా భోరజ్–బేల జాతీయ రహదారిపై ఎరువుల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనక నుంచి ఢీకొన్నాడు. కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఘటనలో జగదీష్, కృష్ణకు తీవ్రగాయాలు కావడంతో 108లో జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించారు. కృష్ణ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మంగళవారం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. జగదీశ్ పరిస్థితి సైతం ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతుని తల్లి ఛాయాబాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
గంజాయి కేసులో అన్నదమ్ముల అరెస్ట్
జైనథ్: గంజాయి కేసులో మండలంలోని లక్ష్మీపూర్కు చెందిన అన్నదమ్ములు సోర్తె రుపేష్ బాబు, సోర్తే ప్రవీణ్ బాబులను అరెస్ట్ చేసినట్లు జైనథ్ సీఐ డి.సాయినాథ్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జైనథ్, లక్ష్మీపూర్ ఎక్స్రోడ్ సమీపంలో ఎస్సై పురుషోత్తం వాహనాలు తనిఖీ చేస్తుండగా రూపేష్ బాబు, ప్రవీణ్ బాబు పల్సర్ బైక్పై గంజాయిని ఆదిలాబాద్కు తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 140 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు. అన్నదమ్ములిద్దరూ కొంత కాలంగా తమ చేన్లో పత్తి పంటలో గంజాయిని అంతర పంట సాగు చేసున్నట్లు వెల్లడించారు. -
క్లుప్తంగా
గంజాయి స్వాధీనం బజార్హత్నూర్: మండలంలోని టెంబి గ్రామంలో పంట చేనులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయిని మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన ఉర్వత జలీంషా పంట పొలంలో తనిఖీ చేయగా 500 గ్రాముల (రూ.12వేలు) గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దాడిచేసిన ఇద్దరిపై కేసు ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన శ్రీకాంత్, అరుణ్, సతీష్పై దాడి చేసిన రవితేజ, చెప్పు అనే వ్యక్తులపై టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై లాల్సింగ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 20న క్రాంతినగర్ రోడ్డుపై అడ్డంగా రవితేజ, చెప్పు అనే ఇద్దరు ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ చేశారు. ఆ రోడ్డు గుండా వెళ్తున్న శ్రీకాంత్, అరుణ్ వాహనం వారికి తాకగా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. వీరితో పాటు మరో వ్యక్తి సతీష్పై కూడా దాడికి దిగారు. శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
ఆర్టీసీ బస్సులో చైన్ స్నాచింగ్
జైనథ్: 44వ నంబరు జాతీయ రహదారిపై గల మాండగాడ బస్స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులో పన్నాల భారతి అనే మహిళ మెడలోంచి 3 తులాల గొలుసు చోరీకి యత్నించిన మండలంలోని పిప్పర్వాడకు చెందిన డిడాకర్ శ్యాంసుందర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పన్నాల భారతి మహారాష్ట్రలోని చిన అర్లి గ్రామానికి వెళ్లి సోమవారం రాత్రి ఆర్టీసీ బస్సులో తిరుగు ప్రయాణం అయ్యింది. మండలంలోని మాండగాడ బస్ స్టాప్ వద్ద బస్సు ఆగడంతో ఆమె వెనక ఉన్న శ్యాంసుందర్ మెడలోంచి మంగళ సూత్రం లాక్కొని పరిగెత్తాడు. గమనించిన తోటి ప్రయాణికులు, స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. చైన్ను స్వాధీనం చేసుకొని మంగళవారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు
● 62 శాతంమే సేకరణ ● నెలాఖరుకు మొత్తం కొనేలా చర్యలు ● రైతులకు పూర్తిస్థాయిలో అందని డబ్బులుభైంసాటౌన్: జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఏటా సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇటీవలి అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారు. సకాలంలో కొనుగోళ్లు జరుగక ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోతోంది. దీంతో ధాన్యం కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించడం రైతులకు ఉపశమనం కలిగించే విషయం. ఇదిలా ఉండగా, జిల్లాలో డీఆర్డీఏ, పీఏసీఎస్, డీసీఎంఎస్, జీసీసీ ఆధ్వర్యంలో 227 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పటివరకు 62 శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఈ నెలాఖరు వరకు కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అందని ధాన్యం డబ్బులు... జిల్లా వ్యాప్తంగా ఆయా కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 20వేల మంది రైతులు 91,569 మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించారు. వీరికి రూ.112.92 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఈనెల 19నాటికి 6,088 మంది రైతులకు రూ.60.82 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా 13 వేలకుపైగా రైతులకు ధాన్యం విక్రయించిన డబ్బులు జమ కావాల్సి ఉంది. డీఆర్డీఏ, పీఏసీఎస్, డీసీఎంఎస్, జీసీసీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన ధాన్యం ఇప్పటి వరకు 87,059.480 మెట్రిక్ టన్నులు రైస్మిల్లులకు తరలించారు. ఇంకా 4,600 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. 60,289.160 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయగా, 31,370.400 మెట్రిక్ టన్నుల ధాన్యం ఎంట్రీలు చేయాల్సి ఉంది.కొనుగోళ్లు ఇలా..కొనుగోలు లక్ష్యం 1,45,730 మె.టన్నులు పూర్తయిన కొనుగోళ్లు 91,659.560 మె.టన్నులు ధాన్యం విక్రయించిన రైతులు 20,005 రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.112.92 కోట్లు ఇప్పటివరకు చెల్లించింది రూ.60.82కోట్లు డబ్బులు పొందిన రైతులు 6,088 -
ఆదర్శం భీంపూర్ ఎంపీపీ
తాంసి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతుండటంతో ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వ వైద్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మంగళవారం భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఎంపీపీ కుడ్మెత రత్నప్రభ సైతం తోటి మహిళలతో కలిసి వచ్చి ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆటో చోరీ ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన రౌతు విక్కి ఈ నెల 19న రాత్రి తన ఇంటి ముందు ఆటోను పార్కింగ్ చేసి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం చూసే సరికి ఆటో కనిపించకుండా పోయింది. దీంతో ఆయన చుట్టుపక్కల గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్సై లాల్సింగ్ నాయక్ తెలిపారు. పీడీఎస్ బియ్యం పట్టివేత ఖానాపూర్: మండలంలోని దిలావర్పూర్ గ్రామం మీదుగా టాటా సుప్రో వాహనంలో ఖానాపూర్కు తరలిస్తున్న పీడీఎస్ బియ్యన్ని పట్టుకున్నామని ఎస్సై లింబాద్రి తెలిపారు. గోసంపల్లి గ్రామానికి చెందిన కడమంచి లక్ష్మణ్ నాలుగు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో వాహనాలు తనిఖీ చేసి పట్టకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వసతిగృహాల్లో మరమ్మతులెప్పుడో?
ఈ ఫొటోలో కనిపిస్తున్నది గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల వంటగదిలో ఫ్లోరింగ్ పగిలిపోయి ఉన్న దృశ్యం. అలాగే విద్యార్థులు నివాసం ఉండే డార్మెంటరీ ఫ్లోరింగ్ పగిలిపోయి సమస్యలు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు. ● నివేదికలు ప్రతిపాదనలకే పరిమితం ● జూన్లో విద్యాసంస్థలు ప్రారంభం ● సమస్యలకు స్వాగతం ● ఎన్నికల కోడ్ అమలు కారణంగా పనుల్లో జాప్యమంటున్న అధికారులుఆదిలాబాద్రూరల్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ శా ఖల పరిధిలో పలు వసతిగృహాలు కొనసాగుతుండగా ఏటా వందలాది మంది విద్యార్థులు విద్యను అ భ్యసిస్తున్నారు. గత నెలలో వేసవి సెలవులు ఇవ్వడ ంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లారు. ఆయా వసతిగృహా ల్లోని మరుగుదొడ్లు, స్నానపు గదులు, పైపులైన్లు, తలుపులు, కిటికీలు, తదితర మరమ్మతు పనులను సంబంధించిన ప్రతిపాదనలను వేసవి సెలవుల్లో ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ ఏడాది ప్రతిపాదనలు పంపించినా ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు. జూన్లో విద్యాసంస్థలు ప్రారంభం కానుండగా మరమ్మతులు చేపట్టకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదనలకే పరిమితం.. జిల్లాలో ఐటీడీఏ ద్వారా 133 వసతి, రెసిడెన్షియల్ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఆయా వసతి గృహాల్లో వివిధ మరమ్మతుల కోసం రూ.16 కోట్ల నిధులు అవసరం ఉందని సంబంధిత శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో జిల్లాలో 14 ప్రీ, పోస్టుమెట్రిక్ వసతిగృహాలు ఉన్నాయి. వాటిలో 7 వసతి గృహాల్లో మరమ్మతు చేసేందుకు సాంఘిక సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారులు కొలతలు సేకరించారు. వాటికి రూ. 87.70 లక్షలు అవసరముంటుందని ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. దళిత అభివృద్ధిశాఖ పరిధిలో 18 ప్రీమెట్రిక్, 3 పోస్టుమెట్రిక్ వసతి గృహాలు ఉన్నా యి. వాటిలో రెండేళ్ల కిందట రూ.1.20 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టారు. ఈసారి తాత్కాలిక మరమ్మతు ఉంటే ఆయా వసతి గృహాలకు సంబంధించిన హెచ్డబ్ల్యూవోలు తమ దృష్టికి తీసుకువస్తే నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సకాలంలో ప్రారంభించకుంటే అంతే? జిల్లాలోని ఆయా శాఖల పరిధిలో కొనసాగుతున్న వసతి గృహాలలో వివిధ రకాల మరమ్మతుల పనులు సకాలంలో ప్రారంభించకపోతే పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభం రోజే సమస్యలతో స్వాగతం పలుకనున్నాయి. అలాగే పనుల్లో సైతం నాణ్యత లోపించే అవకాశం ఉంటుందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతు పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వసతి గృహాలలో మరమ్మతుల విషయంపై ‘సాక్షి’ ఆయా శాఖల అధికారులను సంప్రదించగా పాఠశాలలు పునః ప్రారంభంలోగా ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని, ఎన్నికల కోడ్ అమలు కారణంగా నిధుల మంజూరులో జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు. ఇక్కడ కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని బాలుర గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థుల దాహార్తి తీర్చే నీటి కుళాయిలు. వందలాది మంది విద్యార్థులకు గానూ ప్రస్తుతం రెండు మాత్రమే పని చేస్తున్నాయి. విద్యాసంస్థల పునఃప్రారంభంలోగా మిగతా వాటిని బిగించాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతు చేపట్టలేదు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్
● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ జానకీషర్మిల హెచ్చరించారు. నకిలీ విత్తనాల రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొంతమంది అక్రమార్కులు ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ విత్తనాలు రైతులకు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. నకిలీ, కల్తీ విత్తనాలు స్మగ్లింగ్పై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నకిలీ, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు జిల్లా పరిధిలో పోలీస్ అధికారులు అప్రమత్తతతో సమాచారం సేకరిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని విత్తన, ఎరువుల దుకాణాలను, గోదాములను తనిఖీ చేస్తామన్నారు. అనుమానం వచ్చిన విత్తనాల శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపిస్తామని తెలిపారు. లైసెన్సులు లేకుండా ఎరువులు, విత్తనాలు విక్రయించే వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసేలా ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు జిల్లాలోకి రాకుండా సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. తాలు, తప్ప లేకుండా చూడాలి● అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ లోకేశ్వరం: రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యంలో తాలు, తప్ప లేకుండా చూడాలని అదనపు కలెక్టరు కిశోర్కుమార్ సూచించారు. మండలంలోని గడ్చాందలో ఏర్పాటు చేసిన డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ధాన్యం తూకం వేగవంతం చేయాలని సూచించారు. వారం రోజుల్లో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. -
ధాన్యంలో తరుగుపై రైతుల ఆందోళన
నిర్మల్ రూరల్: ధాన్యంలో తరుగు, తూకం వేసిన ధాన్యం తరలింపులో జాప్యంపై మండలంలోని వెంగాపేట్ గ్రామంలో రైతులు మంగళవారం ఆందోళన చేశారు. ఐదు రోజుల క్రితం తూకం వేసిన ధాన్యం కూడా కొనుగోలు కేంద్రంలోనే ఉందని తె లిపారు. లారీలు రావడం లేదని పేర్కొన్నారు. ధాన్యం తూకంలో కూడా తరుగు పేరుతో బస్తాకు 3 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారని పేర్కొన్నారు. క్వింటాల్కు 9 కిలోలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తరుగు కచ్చితంగా ఉంటుందని పేర్కొంటున్నారని తెలిపారు. అధికారులు స్పందించి తరుగు లేకుండా ధాన్యం తూకం వేయించాలని, తూకం వేసిన ధాన్యం వెంటవెంటనే తరలించేలా లారీలను పంపించాలని డిమాండ్ చేశా రు. ఆందోళనలో రైతులు గుడాల అశోక్, దశరథ్, శ్రీనివాస్, గణపతి, ఆడెపు భూమన్న పాల్గొన్నారు. -
ఇన్చార్జి వీసీ ఇంకెన్నాళ్లు..!?
● ‘బాసర’కు రెగ్యులర్ వీసీని ఇవ్వరా.. ● ట్రిపుల్ఐటీ సమస్యలు పట్టించుకోరా.. ● ఇప్పటికీ విడుదలకు నోచుకోని నోటిఫికేషన్ ● వర్సిటీపై ప్రభుత్వానికి పట్టింపు కరువు..!భైంసా: చదువులతల్లి కొలువైన బాసర సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్రంతో పాటు ఇక్కడే ఉన్న ట్రిపుల్ఐటీ విద్యాక్షేత్రంపైనా ప్రభుత్వం చిన్నచూపు చూస్తూనే ఉంది. బాసర ఆర్జీయూకేటీ 2024–25 విద్యాసంవత్సరం నోటిఫికేషన్ కూడా ఇప్పటికీ విడుదల కాలేదు. ఏళ్లు గడుస్తున్నా.. ఇక్కడ ఇన్చార్జి వైస్ చాన్స్లర్లతోనే కాలం వెళ్లదీస్తున్నారు. రాష్ట్రంలోని ఏకై క ట్రిపుల్ఐటీగా ఉన్నా పట్టించుకునే వారే లేరు. రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తున్నా.. ఐఏఎస్లను ఇన్చార్జీలుగా పెడుతున్నా.. బాసర వర్సిటీని మాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా బాసర క్యాంపస్లో మార్పు రావడం లేదు. ట్రిపుల్ఐటీ ప్రారంభం నుంచి ఇప్పటివరకు విద్యార్థులు దశలవారీగా పోరాటాలు చేస్తున్నా సమస్యలు పరిష్కరించే సరైన అధికారి కనిపించడం లేదు. ఇప్పటికై నా రెగ్యులర్ వీసీని ఇస్తారా? లేదా? అన్న అనుమానాలే కొనసాగుతున్నాయి. చిన్నచూపు ఎందుకు? పేదింటి పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దే విద్యాక్షేత్రంపై చిన్నచూపు కొనసాగుతోంది. దాదాపు తొమ్మిదివేల మంది విద్యార్థులు ఉండే వర్సిటీకి రెగ్యులర్ వీసీ లేకపోవడం, ఇన్చార్జి వీసీ ఉన్నా ఆయన వర్సిటీలో ఉండకపోవడం దారుణం. ఏదైనా ఘటన జరిగినప్పుడు.. క్యాంపస్లో కార్యక్రమం ఉన్నప్పుడే వచ్చివెళ్తున్నారు. స్థానికంగా ఉండే డైరెక్టర్ను కూడా తాజాగా మాతృసంస్థకు పంపించారు. దీంతో ట్రిపుల్ఐటీ పరిస్థితి ‘అందరూ ఉనా అనాధ’లా మారింది. వర్సిటీలో బాధ్యతలను డీన్లకే అప్పగించి చేతులు దులుపుకొనే పరిస్థితి కనిపిస్తోంది. పాత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆర్జీయూకేటీని పట్టించుకోవడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో... ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదివిన వాళ్లు, మంచి మెరిట్ ఉన్న విషయ నిపుణులతో బాసర ట్రిపుల్ ఐటీ కళకళలాడేది. అలాంటి విద్యావంతుల బోధనతో వేలమంది విద్యార్థులు ఉన్నతస్థానాలకు ఎదిగారు. క్రమంగా తమ ఉద్యోగ భద్రత అగమ్యగోచరంగా మారడంతో సదరు అధ్యాపకులు ఇతర ఉద్యోగాల వైపు వెళ్లిపోతున్నారు. దాదాపు తొమ్మిదివేల మంది విద్యార్థులు ఉండే వర్సిటీలో కనీసం 350 మంది వరకు అధ్యాపకులు ఉండాలి. కానీ 125 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో రెగ్యులర్ వాళ్లు 20 మంది వరకే ఉండడం గమనార్హం. ఇన్చార్జి వీసీలతోనే.. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు ఆర్జీయూకేటీకి చాలా తేడా ఉంది. చుట్టూ ప్రహరీతో పూర్తిగా రెసిడెన్షియల్ క్యాంపస్గా ఉండే ఈ సువిశాల ప్రాంగణంలో దాదాపు వేలమంది విద్యార్థులుంటారు. ఇంతపెద్ద విద్యాసంస్థలో అప్పుడప్పుడు ఏదో ఒక ఘటన జరగడం సహజమే. కానీ తరచూ విద్యార్థుల ఆత్మహత్యలు, వారికి పెట్టే భోజనంతో సహా యూనిఫాం, ల్యాప్టాప్స్, షూస్.. ఇలా ఎన్నో వాటిలో సమస్యలు వస్తూనే ఉన్నాయి. స్థానికంగా పర్యవేక్షిస్తూ.. ప్రభుత్వంతో అనుసంధానిస్తూ.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించగలిగే వాళ్లు ఇక్కడ అత్యవసరం. గతంలోనూ ఇన్చార్జి వీసీల పాలన కారణంగానే విద్యార్థులు ఉద్యమం చేపట్టే దాకా వెళ్లింది. అప్పుడు ఎన్నో హామీలిచ్చిన ప్రభుత్వం మళ్లీ పాత తప్పే చేసింది. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్గా ఉన్న వెంకటరమణకు ఇన్చార్జి వీసీ బాధ్యతలిచ్చి చేతులు దులుపుకుంది. ఇప్పుడు ఆయన కూడా స్థానికంగా ఉండటం లేదు. తనకు ఇదొక అదనపు బాధ్యత మాత్రమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అరకొర పట్టింపుతోనే ఆర్జీయూకేటీ జాతీయ స్థాయి అవార్డులు సాధిస్తోంది. ఇక పూర్తిస్థాయి వీసీని, సరిపడా అధ్యాపకులను నియమించి సమస్యలు లేని వర్సిటీని చేస్తే అంతర్జాతీయంగా పేరు తీసుకువస్తామని ఇక్కడి విద్యార్థిలోకం చెబుతోంది. సీఎం హామీ ఇచ్చారు.. బాసర సరస్వతీ మాత చెంత ఉన్న ట్రిపుల్ ఐటీని ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగించాలన్నది మా ప్రయత్నం. అందులో భాగంగానే ఇక్కడ ఇన్చార్జి వీసీని తొలగించి రెగ్యులర్ వీసీని నియమించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరాం. వర్సిటీలకు సంబంధించి కమిటీ వేశామని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. – పవార్ రామారావు పటేల్, ఎమ్మెల్యే, ముధోల్ -
● కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నెలాఖరులోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి నిర్మల్చైన్గేట్: ఈ నెల 31 లోగా జిల్లాలో ధా న్యం కొనుగోళ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత శా ఖల అధికారులతో మంగళవారం సమీక్ష ని ర్వహించారు. రైతుల వారీగా కొనుగోళ్లు, సా గు విస్తీర్ణం, ధాన్యం వివరాలను నిర్వాహకులు ప్రతిరోజూ ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వెంటవెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎస్వో శ్రీకళ, జిల్లా వ్యవసాయ అధి కారి అంజిప్రసాద్, డీసీవో నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఏకరూప దుస్తులు పరిశీలిస్తున్న కలెక్టర్నిర్మల్చైన్గేట్: ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించేందుకు అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా చేపట్టిన పనులు నాణ్యతతో చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియం సమీపంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో చేపట్టిన పనులను మంగళవారం పరిశీలించారు. బడుల పునఃప్రారంభానికి ముందే పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లకు నీటి సరఫరా, ప్రహరీల నిర్మాణం ఇతర మరమ్మతులు చేపట్టాలని వివరించారు. మహిళా సంఘాలు, విద్యాశాఖ అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అనంతరం సోఫీనగర్లోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏకరూప దుస్తుల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని 52,264 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టిస్కొ ద్వారా ఒక జత ఏకరూప దుస్తుల వస్త్రం దాదాపు 1,12, 600 మీటర్లు జిల్లా కేంద్రానికి చేరిందని తెలిపారు. మండలాల వారీగా ఏకరూప దుస్తుల వస్త్రాన్ని అందించడం జరుగుతుందన్నారు. ఎంఈవోలు, నోడల్ అధికారులు, ఏపీఎంల ఆధ్వర్యంలో స్వయం సహాయ సంఘాల గ్రూపుల ద్వారా జూన్ 5వ తేదీలోపు విద్యార్థులందరికీ ఒక జత ఏకరూప దుస్తులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.. మంజూలాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లు నిరంతరం చేపట్టాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలని సూచించారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అవసరమైన గన్నీ బ్యాగ్స్, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. రోజువారీ ధాన్యం వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. కలెక్టర్ వెంట డీఈవో రవీందర్రెడ్డి, చేనేత శాఖ ఏడీ రమ్య, సీఎంవో ప్రవీణ్, సివిల్ సప్లయిస్ డీఎం శ్రీకళ, రైతులు ఉన్నారు. -
‘సాధారణ బోగీల సంఖ్య పెంచాలి’
ఆదిలాబాద్: దేశంలోని ప్రతీ రైలులో సాధారణ బోగీల సంఖ్య ఐదుకు పెంచాలని సాధారణ భోగిల సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం దేశవ్యాప్తంగా ప్రధానికి కోటి ఉత్తరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కొన్నికోట్ల మంది ప్రజలు రైలు ద్వారా ప్రయాణించడం జరుగుతుందన్నారు. చవకై న రైలు ప్రయాణాల ద్వారా ఎంతో మంది సామాన్యులు లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే నిరుపేదల సమస్యలను, జనాభాను దృష్టిలో ఉంచుకొని ప్రతి రైలులో ఐదు సాధారణ భోగిలను అదనంగా ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రికి విన్నవించుకోవడం జరుగుతుందన్నారు. -
నకిలీ విత్తనంపై టాస్క్ఫోర్స్!
● నేటి నుంచి తనిఖీలు ● వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన ● కొనుగోలు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచన నిర్మల్చైన్గేట్: దిగుబడి ఆశచూపి రైతులకు నకిలీ విత్తనాలు అంటిగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకోసం వ్యవసాయ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశారు. నకిలీ విత్తనాలు, పురుగుల మందుల విక్రయాలపై ఈ బృందాలు నిఘా పెట్టనున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు ఈనెల 22 నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నాయి. విత్తన వ్యాపారులపై నిఘా.. జిల్లాలో లైసెన్స్ ఉన్న ఎరువులు, విత్తన దుకాణాలు 150కి పైగా ఉన్నాయి. ప్రధానంగా విత్తనాల వ్యాపారం చేసే వారిపై టాస్క్ఫోర్స్ బృందాలు నిఘా పెట్టనున్నాయి. జిల్లా వ్యాప్తంగా పర్యటించి సోదాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే వ్యవసాయ అధికారులు ఎరువులు, విత్తన దుకాణాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 19 బృందాలు.. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో అనుమతి లేని విత్తనాలు, నకిలీ విత్తనాలను వ్యాపారులు మార్కెటింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇందులో కొందరు లైసెన్సు ముసుగులో నకిలీ వ్యాపారంతో రైతులను మోసం చేస్తున్నారు. దీనిని అరికట్టేందుకు వ్యవసాయ, పోలీస్ శాఖ సంయుక్తంగా టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాయి. ఈ బృందంలో వ్యవసాయ శాఖ ఏడీఏ, విత్తన ధ్రువీకరణ అధికారి, సీఐ, ఎస్సై, ఎస్వోటీ ఉంటారు. వీరు ఎరువులు, విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి విత్తనాలు, ఎరువుల స్టాక్, దుకాణాల లైసెన్సు పరిశీలిస్తారు. రైతులకు అవగాహన.. ఒకవైపు తనిఖీలు నిర్వహిస్తూనే మరోవైపు రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దళారులు, వ్యాపారులు నకిలీ విత్తనాలు అంటగడుతున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయనున్నారు. ఈమేరకు వ్యవసాయాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి..నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటాం. రైతు విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో రశీదు తప్పనిసరిగా పొందాలి. రైతు కొనుగోలు చేసిన విత్తన ప్యాకెట్ను పంట వచ్చేవరకు భద్రపరుచుకోవాలి. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలి. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
రికార్డులు సక్రమంగా నిర్వహించాలి
● జెడ్పీ సీఈవో గోవింద్నాయక్ లోకేశ్వరం: మండల పరిషత్ కార్యాలయంలో రికార్డులను సక్రమంగా నిర్వహించాలని నిధులకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని జెడ్పీ సీఈవో గోవింద్నాయక్ సూచించారు. మండల కేంద్రంలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, నర్సరీ, మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే రికార్డులను మంగళవారం పరిశీలించారు. నర్సరీలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు సంబంధించిన పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో సోలమాన్రాజ్, సూపరింటెండెంట్ రమేశ్, సీనియర్ అసిసెంట్ భూమరావు, ఏపీవో జగన్నాథ్, టీఏలు శారద, మంజూల, రవీందర్ ఉన్నారు. -
నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి
● రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ డైరెక్టర్ గోపి లోకేశ్వరం: నకిలీ విత్తనాలపై వ్యవసాయాధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి సూచించారు. రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు నిర్వహిస్తున్న రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్ మంగళవారం లోకేశ్వరం రైతు వేదికలో మండల వ్యవసాయాధికారులు, రైతులతో నిర్వహించారు. ఏఈవోలు ప్రతీ గ్రామంలో పర్యటించాలని సూచించారు. ఈనెల 23, 24లోపు ఏఈవోలు గ్రామాలను సందర్శించే నివేదికలను వ్యవసాయ కార్యాలయంలో అందజేయాలన్నారు. మండల కేంద్రంలోని ప్రతీ ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. లూస్ విత్తనాలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రైతునేస్తం కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, ఏవో గణేశ్, ముథోల్ ఏవో వీణ, ఏఈవోలు మౌనిక, భూమేశ్ పాల్గొన్నారు. -
నిర్మల్
అమ్మ ఆదర్శ పాఠశాల పనులు నాణ్యతతో చేయాలిసారూ.. అన్యాయం చేయకండి.. దిలావర్పూర్లో ఐదేళ్లక్రితం 30 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మాణం చేపట్టారు. పేదలు 15 రోజుల క్రితం ఆక్రమించుకున్నారు. వాటిని పోలీసులు ఖాళీ చేయించారు.9లోu8లోuబుధవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2024కావాల్సిన విత్తనాలు క్వింటాళ్లలో.. పత్తి 1,710 వరి 23,900 సొయా 25,000 మొక్కజొన్న 1,440 కంది 360 ఇతరాలు 150 అవసరమయ్యే ఎరువులు టన్నుల్లో ఎరువు కావాల్సినవి అందుబాటులో ఉన్నవి యూరియా 34,500 13,000 డీఏపీ 6,500 2,600 ఏపీఆర్ ఎరువులు 12,000 9,000మంత్రి సీతక్కను కలిసిన స్వీపర్లుకడెం: ప్రభుత్వ పాఠశాలల స్వీపర్ల సంఘం జిల్లా నాయకులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను హైదరాబాద్ ప్రజాభవన్లో మంగళవారం కలిశారు. 40 ఏళ్లుగా చాలీచాలని వే తనాలతో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని కోరారు. తమను రెగ్యులరైజ్ చేయాలని, ఆంధ్రప్రదేశ్లో మాది రిగా టైం స్కేల్ రూ.19,500 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో స్వీ పర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ హుస్సేన్, ఉపాధ్యక్షుడు బాబు, లింగయ్య, నర్సయ్య తదితరులు ఉన్నారు.● జిల్లా యాక్షన్ ప్లాన్ రూపొందించిన అధికారులు ● 4.33 లక్షల ఎకరాల్లో పంటలు సాగు ● 53 వేల మెట్రిక్ టన్నుల ఎరువులకు ప్రతిపాదనలునిర్మల్చైన్గేట్: జిల్లాలో రైతులు వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సాగుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. సాగయ్యే పంటలు, అవసరమైన ఎరువులు, విత్తనాలకు సంబంధించి అంచనా ప్రణాళికను జిల్లా వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో నేల స్వభావాన్ని బట్టి ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉందనే అంచనా మేరకు మండలాల వారీగా ప్రణాళిక తయారు చేశారు. జూన్ నుంచి వానాకాలం సీజన్ ప్రారంభం కానుండడంతో ఆలోగా అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు తెప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 4.33 లక్షల ఎకరాల్లో సాగు... జిల్లా వ్యవసాయశాఖ గత అనుభవాలు, ప్రభుత్వ ఆదేశాల క్రమంలో అంచనా నివే దికలు రూపొందించింది. జిల్లావ్యాప్తంగా గత వానాకాలంలో 4,27,500 ఎకరాల్లో వివిధ పంటలు సాగవగా ఈసారి 4,33,300 ఎకరాల్లో పంటలు వేస్తారని అంచనా వేశారు. ఏఈవో నుంచి ఏవో తదుపరి వ్యవసాయ డివిజన్లలో ప్రణాళికను రూపొందించగా సదరు వివరాల క్రోడీకరణ ద్వారా జిల్లా ప్రణాళికను రూపొందించారు. జిల్లాలో పలు చోట్ల వరికి, మెట్టప్రాంతాల్లో పత్తికి ప్రాధాన్యత నిచ్చారు. ఇక వివిధ పంటలకు అన్నిరకాల ఎరువులు కలిపి 53 వేల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేశారు. విత్తనాలు 52,560 క్వింటాళ్లు అవసరమని గుర్తించారు. పెరుగుతున్న పత్తి సాగు... పత్తి, వరి సాగు విస్తీర్ణం జిల్లాలో ఏటా పెరుగుతోంది. నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం వరి సాగు వద్దని స్పష్టం చేయగా విస్తీర్ణం తగ్గగా రెండేళ్ల నుంచి విపరీతంగా సాగు విస్తీర్ణం పెరిగింది. రెండేళ్ల క్రితంతో పోలిస్తే పత్తి సాగు విస్తీర్ణం తగ్గుతుండగా మొక్కజొన్న సాగు అంతంత మాత్రంగానే ఉంది. ఒకప్పుడు పత్తి లక్ష ఎకరాల్లో సాగవగా మొక్కజొన్న 32 వేల ఎకరాల్లో సాగయ్యేది. తాజా గణాంకాల ప్రకారం గణనీయంగా తగ్గింది. ఏటా అపరాలు, తృణ ధాన్యాల సాగు పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నా అన్నదాతల్లో మార్పు రావడం లేదు. దీంతో అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. న్యూస్రీల్పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలి..రైతులు వానాకాలం సీజన్లో పంటల మార్పిడిపై దృష్టి సారించాలి. దీనివల్ల భూసారం పెరిగి అధిక దిగుబడులు వచ్చే ఆస్కారం ఉంటుంది. తొలకరి వర్షాలకు ముందే రైతులు దుక్కులు సిద్ధం చేసుకోవాలి. సాగులో మెలకువలపై క్షేత్రస్థాయిలోని ఏఈవోలు, ఏవోల సూచనలను పాటించాలి. జిల్లావ్యాప్తంగా ఈ సీజన్లో 4.33 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నాం. ఇందుకు సంబంధించి ఎరువులు, విత్తనాలను సీజన్ ప్రారంభం నాటికే సిద్ధంగా ఉంచుతాం. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిసాగు అంచనాపంట గతేడాది ప్రస్తుత సాగు అంచనా వరి 1,10,000 1,35,000 పత్తి 1,45,000 1,68,000 సోయాబీన్ 1,15,000 1,01,000 మొక్కజొన్న 32,000 18,000 కంది 9,500 10,000బీమాతో ధీమా..ఇక గతేడాది వరకు పంటల బీమా పథకం అమలు చేయలేదు. గతేడాది వచ్చిన వరదలకు, అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నా రైతులకు ఎలాంటి పరిహారం అందలేదు. ఈ వానాకాలం నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలోనూ అమలు చేయాలని నిర్ణయించారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటే పరిహారం పొందే వీలుంటుంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- తెలుగు రాష్ట్రాల్లో డెత్ ట్రావెల్స్
- ఛాన్స్ వచ్చినా మోదీ బయోపిక్లో నటించను: సత్యరాజ్
- భారత సంతతి శాస్త్రవేత్తకు ‘షా’ అవార్డ్
- భూతల్లి పై ఒట్టేయ్...
- ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్లో..?
- World Para Athletics Championships 2024: దీప్తితో మాటామంతి
- ఆ వీడియో ఫేకా? ఒరిజినలా?: మంత్రి అంబటి
- ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు
- Delhi CM Arvind Kejriwal: ప్రధాని కావాలని లేదు
- మరీ ఇంత ‘పచ్చ’పాతమా!
Advertisement