HYD: ఈ-సిగరెట్ల కలకలం.. విద్యార్థులే టార్గెట్‌ | Rayadurgam SOT Police Caught Electronic Cigarettes Racket - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఈ-సిగరెట్ల కలకలం.. స్టూడెంట్స్‌ టార్గెట్‌.. ముఠాలోనూ విద్యార్థులే!

Published Thu, Sep 7 2023 12:51 PM

Rayadurgam SOT Police Caught Electronic Cigarettes Racket - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఈ-సిగరెట్ల ముఠా గుట్టు రట్టయ్యింది. రాయదుర్గం పరిధిలో ఎస్‌వోటీ(Special Operation Team) భారీగా ఈ-సిగరెట్లను పట్టుకుంది. వాటిని అమ్ముతున్న,  కొంటున్న విద్యార్థులనూ అదుపులోకి తీసుకున్నారు. 

నగరంలోని ఇంటర్నేషన్‌ స్కూల్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు కేటుగాళ్లు. అందులోని నికోటిక్‌కు బానిసలవుతున్నారు. ఈ క్రమంలో వాట్సాప్‌ ద్వారా ఈ-సిగరెట్ల క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు ఎస్‌వోటీ గుర్తించింది. నిఘా వేసి.. భారీగా ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకుంది. వీటి విలువ  సుమారు మూడు లక్షల విలువ దాకా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

ఈ-సిగరెట్ల విక్రయానికి పాల్పడుతున్న ఇండియన్ బిజినెస్ స్కూల్ విద్యార్థి మాధవను (19) పోలీసులు అరెస్ట్‌ చేశారు. ICFAi, IBS  స్కూళ్లలో పదిమంది విద్యార్థులు, మహీంద్రా యూనివర్సిటీ, సంస్కృతి డిగ్రీ కాలేజ్,  ఆకాష్ ఇన్స్టిట్యూట్, గీతం కాలేజ్ , అమిటీ  కాలేజ్ విద్యార్థులకు ఈ సిగరెట్లు అమ్మినట్లు గుర్తించారు. మాధవ్‌ నుంచి 22 ఈ-సిగరెట్ల తో పాటు రెండు మొబైల్స్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. 

అలాగే.. అమిటి కాలేజీలో చదువుతున్న అచ్యుత్.. 71 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఈ-సిగరెట్లు అమ్మినట్లు గుర్తించారు. వీళ్లిద్దరితో పాటు మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Advertisement
Advertisement