సాక్షి, ముంబై : దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) కరోనా , లాక్డౌన్ సంక్షోభంతో భారీ నష్టాలను నమోదు చేసింది. జూన్ 30తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 249.4 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 1,435.5 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. ఆదాయం 79 శాతం క్షీణించి, 4,106.5 కోట్లకు చేరుకోగా, 2019 జూన్లో 19,720 కోట్ల రూపాయల ఆధాయాన్ని సాధించామని బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ఎంఎస్ఐ తెలిపింది. జూన్ త్రైమాసికం అపూర్వమైందనీ, మొత్తం త్రైమాసికంలో ఉత్పత్తి కేవలం రెండు వారాల పనికి సమానమని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. అయితే ఎనలిస్టుల అంచనాలను అధిగమించింది.
మారుతి నికర అమ్మకాలు రూ .3,677.5 కోట్లకు తగ్గాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ .18,735.2 కోట్లు. మొదటి త్రైమాసికంలో మొత్తం 76,599 వాహనాలను విక్రయించగా, దేశీయ మార్కెట్లో అమ్మకాలు 67,027 యూనిట్లు, ఎగుమతులు 9,572 యూనిట్లు. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ 4,02,594 యూనిట్లను విక్రయించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా, ఇది కంపెనీ చరిత్రలో ఇదొక అసాధారణమైన త్రైమాసికమని కంపెనీ పేర్కొంది. లాక్డౌన్ నిబంధనల కారణంగా అమ్మకాలు, ఉత్పత్తి నిలిచిపోయాయని తెలిపింది. మే నెల చివరిలో మాత్రమే చిన్నగా కార్యకలాపాలను ప్రారంభిచినట్టు తెలిపింది. ముఖ్యంగా వినియోగదారులు, సప్లయ్ చెయిన్ అంతటా ఉద్యోగులు, ఇతరుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇచ్చినట్టు వెల్లడించింది. మొత్తం త్రైమాసికం కేవలం రెండు వారాల రెగ్యులర్ పనికి సమానమనీ ప్రస్తుత త్రైమాసిక ఫలితాలను ఈ కోణంలో చూడాలని కంపెనీ తెలిపింది. కాగా ఒక దశాబ్దం తరువాత నష్టాలను నమోదు చేయడం ఇదే మొదటిసారి. దీంతో మారుతి సుజుకి దాదాపు 2 శాతం నష్టంతో కొనసాగుతోంది.
కరోనా కష్టాలు : మారుతికి నష్టాలు
Published Wed, Jul 29 2020 3:26 PM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
T20 World Cup 2024: అదే జరిగితే పాక్ క్వాలిఫయర్స్ ఆడాల్సి ఉంటుంది..!
బాలీవుడ్ భామ బర్త్ డే.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన భర్త!
జూన్ 13న లాంచ్ అయ్యే బీఎండబ్ల్యూ బైక్ ఇదే - వివరాలు
ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
సిమ్రాన్, అవినాష్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం
మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
T20 World Cup 2024 IND VS PAK: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
టెస్లా విజయం వెనుక ఇండియన్.. థాంక్స్ చెప్పిన మస్క్
ఆర్ఆర్ఆర్ చాలా నచ్చింది.. ఆ హీరోతో పని చేయాలనుంది: హాలీవుడ్ డైరెక్టర్
కేంద్ర కేబినెట్లోకి నడ్డా
తప్పక చదవండి
- ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
- మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
- అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
- రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..!
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్పైనే?
Advertisement