-
మహిళకు పదోసారి గర్భం: భర్తతో అదృశ్యం
టీ.నగర్: పదోసారి గర్భం దాల్చిన 52 ఏళ్ల మహిళ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సకు భయపడి భర్తతో అదృశ్యమైంది. దీంతో పోలీసులు సదరు మహిళ కోసం గాలిస్తున్నారు. తమిళనాడులోని పుదుకోటై జిల్లా అరంతాంగి సమీపం వేదియన్కుడికి చెందిన ఆనందన్ (55). భార్య ఆరాయి (52). ఈమెకు ఇది వరకే తొమ్మిది ప్రసవాలు ఇంట్లోనే జరిగాయి. ఒక బిడ్డ ప్రసవంలోనే మృతి చెందగా ఎనిమిది మంది సంతానం ఉన్నారు. వీరిలో నలుగురికి వివాహాలయ్యాయి. ఇదిలాఉండగా ఆరాయి మళ్లీ గర్భం దాల్చింది. ఇటీవల ఆమె సింగవనం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పరీక్షల నిమిత్తం వెళ్లింది. ఆమెను వైద్యులు పరిక్షించగా మధుమేహం, బీపీ ఉన్నట్లు తెలిసింది. మెరుగైన చికిత్సల కోసం ఆమెను పుదుకోటై ప్రభుత్వ ఆస్పత్రి వైద్య కళాశాలకు పంపారు. అక్కడ చికిత్స పొందిన ఆరాయి సొంత ఊరికి చేరుకుంది. ఆరాయికి ఆగస్టు 18న ప్రసవం తేదీగా వైద్యులకు తెలిసింది. డాక్టర్ అయ్యప్పన్ ఆధ్వర్యంలోని వైద్య బృందం గత నాలుగో తేదిన వేదియన్కుడికి వెళ్లి ఆరాయికి పరీక్షలు నిర్వహించారు. బిడ్డ ఆరోగ్యకరంగా పుట్టేందుకు అంబులెన్స్ ద్వారా పుదుకోటై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేరాల్సిందిగా సూచించారు. అయితే ఆనందన్, నిండు చూళాలైన భార్యతోపాటు అదృశ్యమయ్యాడు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లి ఉండొచ్చని సమాచారం. వైద్యబృందం, రెవెన్యూ సిబ్బంది ఆరాయి, ఆమె భర్త కోసం అనేకచోట్ల గాలించినా వారి జాడ తెలియలేదు. డాక్టర్ అయ్యప్పన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగుడి పోలీసులు కేసు నమోదు చేసి ఆరాయి కోసం గాలిస్తున్నారు. 16 మంది పిల్లల కోసం ఆశ: దీనిపై స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఆనందన్, అతని భార్యకు 16 మంది పిల్లలను కనాలన్న ఆశ ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకుంటే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేస్తారనే భయంతో ఆరాయి తన భర్తతో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిపారు. మాతాశిశు సంరక్షణకు పథకం: ప్రసవం సమయంలో మాతాశిశు మరణాలను నిరోధించేందుకు సర్కరైయిల్ అక్కరై పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు మంత్రి విజయభాస్కర్ వెల్లడించారు.ఈ పథకం ఈ నెల 15వ తేదీ నుంచి రానున్న జనవరి 26 వరకు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా గర్భిణులకు రక్త పోటు, తదితర వైద్య పరీక్షలు జరిపి తగిన చికిత్స అందచేయనున్నట్లు తెలిపారు. -
పట్టుకోమని ఇస్తే.. పట్టుకుపోయింది!
పసిగుడ్డుతో మహిళ పరారీ పోలీసులకు ఫిర్యాదుచేసిన తల్లి మైలవరం: టాయ్లెట్కు వెళ్లి వస్తాను బిడ్డను పట్టుకోమని యిస్తే సదరు మహిళ బిడ్డతో పాటు మాయమైన ఘటన మైలవరం బస్టాండ్లో మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామానికి చెందిన బాణావతు సంధ్య స్థానికంగా వున్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చింది. ఆస్పత్రిలో చూపించుకుని తిరిగి రుద్రవరం వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్లోకి వచ్చింది. ఈ లోగా టాయ్లెట్కు వెళ్లే అవసరం రావడంతో పక్కనే వున్న తమ వర్గానికి చెందిన గిరిజన మహిళకు తన మూడు నెలల మగ బిడ్డను అప్పగించి వెళ్లింది. టాయ్లెట్ నుంచి తిరిగి వచ్చేసరికి బిడ్డతో పాటు మహిళ మాయమైంది. వెంటనే బాధితురాలు ఇంటికి వెళ్లి బంధువులకు సమాచారమివ్వడంతో వారు హుటాహుటిన మైలవరం చేరుకుని అన్నిచోట్ల పసికందును తీసుకుపోయిన మహిళ కోసం వెదికి, ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూజివీడు డిఎస్పీ వెంకటరమణ, మైలవరం సీఐ వెంకటరమణ బాధితురాలిని, కుటుంబ సభ్యులను పిలిచి వివరాలు సేకరిస్తున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)
ఆసీస్ యువ సంచలనానికి లక్కీ ఛాన్స్.. వరల్డ్కప్ జట్టులో చోటు!?
పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
తారక్ అభిమానుల మంచి మనసు.. 'రా ఎన్టీఆర్ 2.0' టీమ్ రక్తదానం
నా ఆల్టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడే: టీమిండియా స్టార్
సెంటరాఫ్ అట్రాక్షన్గా ఉండాలనే తపన ..!
తప్పక చదవండి
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement