-
సుదూర విశ్వంలో అఖండ జలనిధి! భూమి కంటే 140 లక్షల కోట్ల రెట్లు
ఖగోళ శాస్త్రవేత్తలు సంచలన విషయాన్ని కనుగొన్నారు. మనకు తెలిసిన విశ్వంలో ఇప్పటివరకు ఎవరూ కనుక్కోని ఊహకే అందనంత అతిపెద్ద, అత్యంత సుదూర నీటి మేఘాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిపై ఉన్న నీటి కంటే 140 లక్షల కోట్ల రెట్ల భారీ జలనిధిని బహిర్గతం చేశారు. యూనిలాడ్ (UNILAD) అనే బ్రిటిష్ ఇంటర్నెట్ మీడియా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. క్వేసార్ (quasar) అని పిలిచే ఒక భారీ ఫీడింగ్ బ్లాక్ హోల్ చుట్టూ ఇది నీటి ఆవిరి రూపంలో విస్తరించింది. ఈ విస్తారమైన కాస్మిక్ నీటి వనరు వేల కోట్ల కాంతి సంవత్సరాల కంటే ఎక్కువ దూరంలో ఉంది. అంతరిక్షంలో ఉన్న నీటితో పోలిస్తే ఈ నీటి ఆవిరి మేఘం వెచ్చగా ఉంటుంది. భూమిపై ఉండే వాతావరణం కంటే 300 లక్షల రెట్లు తక్కువ సాంద్రత ఉంటుంది. పరిమాణానికి తగ్గట్టే అంతరిక్షంలోని ఈ నీటి మేఘం వందల కాంతి సంవత్సరాల విస్తీర్ణాన్ని ఆక్రమిస్తుంది. నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి చెందిన మ్యాట్ బ్రాఫోర్డ్ ఈ ఆవిష్కరణ ప్రాముఖ్యతను తెలియజేశారు. అత్యంత ప్రారంభ సమయాల్లోనే నీరు విశ్వం అంతటా వ్యాపించి ఉందనటానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. -
జూరాల రైతుకు కన్నీళ్లే
జూరాల ప్రాజెక్టులో 5.4 టీఎంసీల నీరున్నప్పుడే నీరు విడుదల చేస్తామని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. ఇప్పుడు నీటినిల్వ 5.85టీఎంసీలకు చేరింది. అయినా, సాగునీరు లేదు.. కేవలం తాగు నీటికే విడుదల చేయాలని కృష్ణా వాటర్బోర్డు తీర్మానించింది. ఈ తీర్మానంతో జూరాల ఆయకట్టు రైతులు ఆందోళనలో పడ్డారు. జూరాల : కృష్ణా ట్రిబ్యునల్ యాజమాన్య బోర్డు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల ద్వారా కేవలం తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడం జూరాల ఆయకట్టు రైతులకు కన్నీళ్లు మిగిల్చేలా ఉంది. ఈ నెల 20వ తేదీ నుంచి జూరాలకు ఇన్ఫ్లో వస్తుండడంతో పాటు కర్ణాటకలో నారాయణపూర్ ఆయకట్టుకు విడుదలవుతున్న నీటి పరిమాణం, రీ జనరేట్ వాటర్ను పరిగణనలోకి తీసుకోకుండా ఈ అంశాన్ని పక్కనబెట్టారు. దీంతో మరోసారి కృష్ణాబోర్డు సమావేశమయ్యేదాకా జూరాల ఆయకట్టు రైతులు నీటి విడుదల కోసం ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తుంది. ఐదు రోజులుగా జూరాల రిజర్వాయర్కు స్థా నిక వర్షాలతో పాటు పై నుంచి రీజనరేట్ వాటర్ వ స్తుండడంతో ఇన్ఫ్లో రోజురోజుకు పెరుగుతూ వస్తుం ది. ఇలా ఐదురోజుల్లోనే ఒక టీఎంసీ నీటినిల్వ రిజర్వాయర్లో పెరిగింది. కర్ణాటకలో గత రబీ సీజన్లో క్రాప్హాలిడే ఉన్నప్పటికీ జూరాల రిజర్వాయర్లో ఉన్న ఐదు టీఎంసీల నీటి ఆధారంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇలా ప్రతీ రబీ సీజ న్లోనూ నాలుగేళ్లుగా నారాయణపూర్ ఆయకట్టు రీజనరేట్ వాటర్పై ఆధారపడి సాగునీటిని అందించారు. గ త నెల 21న నారాయణపూర్ ప్రాజెక్టు ఆయకట్టుకు ప్ర ధాన కాలువల ద్వారా సాగునీటిని విడుద ల చేయడం ప్రారంభించారు. వాస్తవానికి పది రోజుల్లోనే నారాయణపూర్ ఆయకట్టుకు విడుదలైన నీటిలో 10శాతం నీళ్లు జూరాలకు ఇన్ఫ్లోగా చేరాల్సి ఉంది. కర్ణాటకలో నదిలో ఉన్న అక్రమ మినీ పథకాల కారణంగా జూరాలకు చేరాల్సిన రీజనరేట్ వాటర్ నెల ఆలస్యమైంది. ఈ నెల 20న రాయచూర్ జిల్లాలో కురిసిన వర్షాలతో నదిలో నీటి ప్రవాహం పెరిగి జూరాలకు ఇన్ఫ్లో ప్రారంభమైంది. మొదటిరోజు 850 క్యూసెక్కులతో ప్రారంభమైన ఇన్ఫ్లో బుధవారం నాటికి 941 క్యూసెక్కులుగా ఉంది. ఈ ఐదురోజుల్లో దాదాపు ఒక టీఎంసీ నీటినిల్వ రిజర్వాయర్లో పెరిగినట్లయింది. డెడ్స్టోరేజీ నుంచి బయటపడి... జూరాల రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా ఇందులో 5 టీఎంసీల మి నిమం లెవల్కు తగ్గితే డెడ్స్టోరేజీగా నిర్ణయించారు. ఈ నెల 20 నాటికి జూరాల రిజర్వాయర్ నీటినిల్వ కేవలం 4.8 టీఎంసీలతో డెడ్స్టోరేజీలోకి వెళ్లింది. ఇలాంటి తరుణంలో ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమైన ఇన్ప్లో డెడ్స్టోరేజీ నుంచి జూరాల రిజర్వాయర్ను గట్టెక్కిం చింది. ప్రస్తుతం జూరాల రిజర్వాయర్లో డెడ్స్టోరజీని దాటి అదనంగా 0.85 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. ఈ తరుణంలో రెండు ప్రధాన కాలువల ద్వారా 800 క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తే నారుమడులను సిద్ధం చేసుకునేందుకు ఈ నీళ్లు ఉపయోగపడతాయి. ఆయకట్టులో నారు మడులను సిద్ధం చేసుకోవడానికి 10 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. ఈ లోగా కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు విడుదలవుతున్న నీటిలో రీజనరేట్ వాటర్ జూరాల రిజర్వాయర్కు చేరితే ఈ సీజన్ వరకు ఆ నీటి ని ఆయకట్టుకు కొనసాగించేందుకు అవకాశం ఉంటుం ది. రీ జనరేట్ వాటర్ జూరాల రిజర్వాయర్కు చేరకుండానే కర్ణాటకలో ఆవిరైతే ఆయకట్టులో పంట ప్రశ్నార్థకమవుతుంది. దీనిపై అధికారులు ఏ నిర్ణయం తీసుకోలేక మల్లగుల్లాలు పడుతున్నారు. ఐఏబీ సమావేశంలో నీటి విడుదలపై నిర్ణయం... జూలై 23న జరిగిన జిల్లా ఐఏబీ సమావేశంలో జూరాల ఆయకట్టుకు ఆగస్టు 4నుంచి నీటి విడుదలను చేయాల ని తీర్మానించారు. తీర్మానం చేసినప్పుడు జూరాల రిజ ర్వాయర్లో నీటినిల్వ 5.4 టీఎంసీలు మాత్రమే ఉంది. ఆగస్టు 4వ తేదీన 5.2 టీఎంసీల నీటినిల్వ ఉన్నప్పటికీ 3వ తేదీ సాయంత్రం వరకు నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 3వ తేదీన జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డులో ప్రాజెక్టుల నుంచి సాగునీటికి నీటివిడుదల చే యడం లేదని తాగునీటికి మాత్రమే విడుదల చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అప్పట్లో జూరాల నుం చి నీటి విడుదలను వాయిదా వేశారు. ప్రస్తుతం జూ రా ల రిజర్వాయర్లో నీటినిల్వ 5.85 టీఎంసీలకు చేరింది. 317 మీటర్లకు చేరితేనే ఆయకట్టుకు నీళ్లు... సీఈ ఖగేందర్. జూరాల ఆయకట్టులో పంటలకు సాగునీటిని ప్రస్తుతం ఉన్న నీటిమట్టంతో విడుదల చేయలేం. కర్ణాటక నుంచి జూరాల రిజర్వాయర్కు వస్తున్న ఇన్ఫ్లో వర్షాల ద్వా రానే వస్తుంది. పూర్తిగా రీ జనరేట్ వాటర్ రావడం ప్రా రంభమైనట్లు సమాచారం లేదు. మరో పదిరోజులు గ డిస్తే రీజనరేట్ వాటర్ వస్తుందా..? స్థానిక వర్షాలతో ఇ న్ఫ్లో వస్తుందా అన్నది స్పష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయకట్టుకు నీళ్లిచ్చి ఇబ్బందుల్లో ఇరుక్కోవడం కన్నా 317 లెవల్కు నీటిమట్టం చేరితే ఖరీఫ్కు నీళ్లిచ్చేందుకు ఆలోచించవచ్చు. -
అమ్మో.. రాక్షస పిరానాలు కనిపించాయి
సియోల్: పిరానా చిత్రాన్ని మీరు చూసే ఉంటారుగా. అందులో ఉండే పిరానా చేపలు ఎంతటి బీభత్సం సృష్టిస్తాయి కదా.. ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచేంత క్రూరంగా అవి ప్రవర్తిస్తాయి. స్వయంగా మాంసాహారులైన ఫిరానాలు ఒక చెరువులో చేరాయంటే మొత్తం చేపలన్నీ మాయమవ్వాల్సిందే. ఎందుకంటే ఇవి వాటిని అమాంతం తినేసి చెరువును డొల్ల చేస్తాయి. ఎవరైనా అందులోకి దిగారంటే కుక్కలకంటే హీనంగా పీక్కు తింటాయి. అరుదైన జలాల్లోనే ఇవి నివాసం ఉంటాయి. అలాంటి ఈ రాక్షస చేపలు నాలుగింటిని దక్షిణ కొరియాలోని ప్రభుత్వాధికారులు గుర్తించారు. ఇవి మంచి నీళ్లల్లో ఉండటమనేది అత్యంత అరుదైన విషయంకాగా.. హోంగ్సియాంగ్ రాష్ట్రంలోని ఓ పర్వత పాదం వద్ద ఉన్న పదివేల స్క్వేర్ మీటర్లు విశాలమైన మంచినీటి రిజర్వాయర్ లో ఇవి కనిపించడంతో అక్కడి వారు ఆందోళన చెందడం ప్రారంభించారు. తొలుత ఓ స్థానికుడు ఈ చేపను గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకాలజీ ప్రత్యేక గాలింపు చర్యలు ప్రారంభించి తొలుత 19 సెంటీ మీటర్ల ఫిరానాను గుర్తించారు. ఆతర్వాత మరో రోజు 15 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్ల ఫిరానాలను గుర్తించారు. ఫిరానా చేపలు అత్యంత ప్రమాదకరమైనవి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement