-
ఆ ఇద్దరికి అగ్నిపరీక్ష!
* కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు కీలకంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు * మేయర్ పీఠం రాకపోయినా మెరుగైన ఫలితాలు ఆశిస్తున్న కాంగ్రెస్ * వరంగల్ ఓటమి తరువాత ఉత్తమ్కు అసలు పరీక్ష * బీజేపీలోనూ అదే పరిస్థితి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆ రెండు జాతీయ పార్టీల రాష్ట్ర అధినేతలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. అలాగని జీహెచ్ఎంసీ పీఠం ఎగరేసుకురావాలని ఈ రెండు పార్టీల అధినాయకత్వాలు కోరుకోవడం లేదు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక వంటి ఘోర పరాజయం పునరావృతం కాకుండా ఉంటే చాలునని ఈ పార్టీల అధినాయకత్వాలు భావిస్తున్నాయి. వారి అంచనాలకు తగ్గట్టు కాంగ్రెస్, బీజేపీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తాయా... ఇప్పుడు ఈ రెండు పార్టీల్లో ఏ ఇద్దరు కలసినా ఇదే చర్చ. మరి మెరుగైన ఫలితాల సాధన కోసం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తగిన వ్యూహాలతో ముందుకెళ్లడం లేదని, స్థానిక నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవట్లేదని ఆ పార్టీల సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే పదవీ కాలం పూర్తి చేసుకున్న కిషన్రెడ్డి మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఈ ఎన్నికలే కీలకం కానున్నాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులకు సొంత పార్టీలోనే వ్యతిరేక కూటములు తయారవుతున్నాయి. ఉత్తమ్ నాయకత్వానికి అసలు పరీక్ష పీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్కుమార్కు ఈ ఎన్నికలు అసలు సిసలు పరీక్షే. వరంగల్ ఉప ఎన్నిక ఘోర పరాజయానికి అభ్యర్థి ఎంపికలో అధిష్టానం తప్పిదాలు కూడా తోడవడంతో ఉత్తమ్ దాన్నుంచి తేలిగ్గానే బయటపడ్డారు. అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యవహారాన్ని అధిష్టానం పూర్తిగా పీసీసీ నాయకత్వానికే వదిలేసింది. అభ్యర్థుల ఎంపికలో ఢిల్లీ జోక్యం ఏ మాత్రం లేదని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయానికి విలువ ఇవ్వడం లేదని నలుగురు మాజీలు నామినేషన్లకు ఆఖరు రోజైన ఆదివారం పార్టీ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో తాము ఓడిపోవడానికి కారణమైన వారికి టికెట్లు ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, భిక్షపతి యాదవ్, శ్రీశైలం గౌడ్, లక్ష్మారెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. పీసీసీ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. నామినేషన్ల ఘట్టం కూడా ముగియకముందే కాంగ్రెస్లో కొట్లాట మొదలుకావడం గమనార్హం. ‘మా నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారో, ఎవరు గట్టి పోటీ ఇస్తారో మాకే బాగా తెలుసు. కానీ, మా ప్రమేయం లేకుండానే ఇష్టం వచ్చిన వారికి టికెట్లు ఇస్తే దానికి బాధ్యులు ఎవరు. ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన సంఖ్యలో డివిజన్లు గెలుచుకోకపోతే పార్టీలో ఎవరూ ఉండరు. ఆ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వాపోయారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు సరిపడా సమయం ఉన్నా, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్ రాష్ట్ర పర్యటనకు వచ్చేదాకా పీసీసీ తరఫున ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదని పార్టీ రాజ్యసభ సభ్యుడొకరు మండిపడ్డారు. జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని గెలుచుకోవాలన్న ఆశ కాంగ్రెస్లో కనిపించడం లేదు. పార్టీలో ఏ ఒక్కరిని కదిలించినా 25 డివిజన్లు వచ్చినా చాలు అన్న రీతిలో మాట్లాడుతున్నారు. ఈ సంఖ్యలో కూడా గెలవకపోతే ఉత్తమ్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడం మంచిదని సీనియర్ నేత ఒకరు అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి సరైన పోటీ ఇవ్వలేని స్థితికి ఎందుకు దిగజారిందో అధిష్టానం విశ్లేషించుకోవాలని ఉత్తర తెలంగాణకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. పొత్తులు తేలక కమలం అప్రతిష్టపాలు బీజేపీ ఎన్నికలకు సమాయత్తమవడం అటుంచి టీడీపీతో పొత్తునే నామినేషన్ల చివరి రోజుదాకా తేల్చలేకపోయింది. టీడీపీకి ఎక్కువ సీట్లు కేటాయించడంతో ఆశావహులు, వారి వెనుక ఉండి మద్దతు ఇస్తున్న సీనియర్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డిపై ఆరోపణలు గుప్పించడం మొదలుపెట్టారు. కిషన్రెడ్డిని తొలగించాలంటూ ఎన్నికలకు ముందే గ్రేటర్లో ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగంగా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి నష్టం వాటిల్లకూడదని అనుకోబట్టే తాము మౌనంగా ఉన్నామని లేదంటే కిషన్రెడ్డి ఒక్క క్షణం కూడా ఆ పదవిలో ఉండటానికి అనర్హుడని నగరానికి చెందిన పార్టీ ఎమ్మెల్యే ఒకరన్నారు. నామినేషన్ల ఆఖరు రోజు సమయం ముగిసిన తరువాత కూడా బీజేపీ అభ్యర్థుల పేర్లను రహస్యంగా ఉంచడంపై ఓ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్
హమీలు నెరవేర్చని అధికార టీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెబుతారు: పొంగులేటి సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజారంజక, సంక్షేమ పాలనే తమ ఎజెండా అని... అలాంటి పాలనను కోరుకుంటున్న ప్రజలు తమ అభ్యర్థిని గెలిపిస్తారని పేర్కొంది. మంగళవారం హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వరంగల్ లోక్సభ ఉప ఎన్నికకు నల్లాసూర్యప్రకాశ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ ఎన్నిక ల కోసం అయ్యే వ్యయం కోసం పార్టీ తరఫున వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన రూ.25 లక్షల చెక్కును, బీ-ఫారాన్ని అందజేశారు. అనంతరం పార్టీనాయకులు కె.శివకుమార్,కొండా రాఘవరెడ్డి, గుణ్ణం నాగిరెడ్డి, ముజ్తఫా, జయరాజ్లతో కలసి పొంగులేటి విలేకరులతో మాట్లాడారు. ఈ ఉప ఎన్నికలు ఎందుకొచ్చాయి, అందుకు కారణమేమిటో ప్రజలకు తెలుసునని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఎన్ని హామీలిచ్చిందో, ఎన్ని నెరవేర్చిందో అందరూ చూస్తున్నారని... సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తుంగలో తొక్కిన అధికార టీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. దళితుల హక్కుల కోసం కృషి చేసిన వ్యక్తిగా సూర్యప్రకాశ్కు ఎంతో పేరు, గుర్తింపు ఉన్నాయని, పార్టీ స్థాపించిన నాటి నుంచి సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చడానికి ఆయన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ హయాం నాటి పాలనను, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు కోరుకుంటున్నారని, వారి ఆశీస్సులే తమ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని పొంగులేటి చెప్పారు. బుధవారం సూర్యప్రకాశ్ నామినేషన్ దాఖలు చేస్తారని.. ప్రచారంలో జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి సూర్యప్రకాశ్ను గెలిపించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలసి ఉమ్మడి అభ్యర్థిని పోటీకి నిలుపుదామని పొంగులేటి పిలుపునిచ్చారు. అధికార టీఆర్ఎస్ను ఓడించాలన్న చిత్తశుద్ధి ప్రతిపక్షాలకు ఉంటే ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు ముందుకు రావాలన్నారు. అధికార పార్టీతో కొన్ని ప్రతిపక్షాలు కుమ్మక్కు కావడాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీపై పోటీకి వైఎస్సార్సీపీ అభ్యర్థిని నిలిపితే కుమ్మక్కయ్యారంటూ కొన్ని పార్టీలు, నాయకులు విమర్శించడం హాస్యాస్పదమని పొంగులేటి అన్నారు. టీఆర్ఎస్తో వైఎస్సార్సీపీ ప్రతిపక్షంగానే వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. 13 ఏళ్ల పోరాట ఫలితంగా రాష్ట్ర విభజన అనంతరం టీఆర్ఎస్ గెలుపొందందని ఇప్పుడు అందుకు భిన్నమైన తీర్పు వస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా పొంగులేటి చెప్పారు. ఒక కార్యకర్తకు గౌరవమిచ్చారు: నల్లా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తగా తనకు వరంగల్ లోక్సభ ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశమిచ్చి గౌరవించారని, ఇందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని నల్లా సూర్యప్రకాశ్ చెప్పారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన సందర్భంగా సూర్యప్రకాష్ విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను ఎండగట్టేందుకు ఈ ఎన్నికలు ఒక సాధనమన్నారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ, దొర పోకడలను ఈ ఎన్నికల ప్రచారంలో ఎత్తిచూపుతామన్నారు. వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనన్నారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ కండువా కప్పుకుని మిత్రపక్షంగా పోటీ చేశారని... ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా విప్ను జారీ చేశారని మండిపడ్డారు. ఉపఎన్నికల్లో తనకు టికెట్ వచ్చేందుకు సహకరించిన వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
కొందరు సై.. మరి కొందరు నై!
సిరిసిల్ల రాజయ్య అభ్యర్థిత్వంపై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా సిరిసిల్ల రాజ య్యను ప్రకటించడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత సాధారణ ఎన్నికల్లో 4 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన సిరిసిల్ల రాజయ్యకే మళ్లీ టికెట్ ఇవ్వడంపై కొందరు పెదవి విరుస్తుండగా మరికొందరు సమర్థిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం కోసం గట్టిగా మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీల బృందంలో ఒకరిగా, వరంగల్ లోక్సభ పరిధిలో పాత పరిచయాలున్నందున పలువురు నేతలు ఆయనకు మద్దతు పలుకుతున్నారు. పోటీపడిన ముగ్గురు నేతల్లో సిరిసిల్ల రాజయ్య మినహా మరో ప్రత్యామ్నా యం లేకుండా పోయిందని టీపీసీసీ ముఖ్య నేతలు చెబుతున్నారు. వివేక్ పోటీ చేస్తే కాం గ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఇంకా ఎక్కువగా ఉండేదంటున్నారు. అభ్యర్థిత్వాన్ని ఆశిం చిన సర్వే సత్యనారాయణ, రాజయ్య మధ్య పోటీలో రాజయ్య అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపాల్సి వచ్చిందంటున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు, హామీలిచ్చి మోసం చేసే టీఆర్ఎస్ మధ్య పోరాటమని అంటున్నారు. ఆఫీసు బేరర్ల సమావేశం వరంగల్ లోక్సభలోని ఒక్కో మండలానికి ఒక్కో ముఖ్య నేతను ఇన్చార్జిగా నియమించాలని టీపీసీసీ ఆఫీసు బేరర్ల సమావేశంలో నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్లో ఆఫీసు బేరర్ల సమావేశం జరిగింది. ఇం దులో ఉపాధ్యక్షులు ఉద్దెమర్రి నర్సిం హారెడ్డి, ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్రావు, హరి రమాదేవి, కోలేటి దామోదర్, సి.జె.శ్రీనివాస్, కుమార్రావు, వేణుగోపాలరావు, కుసుమకుమార్, జయప్రకాశ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. గ్రామస్థాయి నుంచి ఈ ఉప ఎన్నికల్లో పార్టీ శ్రేణులు బాధ్యతగా పనిచేసేలా చూడాలని ఉత్తమ్కుమార్ రెడ్డి సూచించారు. మండల, నియోజకవర్గ, లోక్సభ స్థాయిలో కమిటీలను వేయాలని నిర్ణయించారు. వరంగల్, హైదరాబాద్లో కంట్రోల్ రూమ్లు, మీడియా సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాయకులందరితో సోమవారం చర్చించిన తర్వాత పని విభజన కూడా పూర్తిచేసుకుందామని ఉత్తమ్ వివరించారు. -
ఎక్కడివక్కడే!
ఎన్నికల కోడ్తో నిలిచిన పథకాలు ఇన్నాళ్లూ అధికారుల అలసత్వంతో నత్తనడకే.. అనుమతి కోసం ఎన్నికల కమిషన్కు లేఖలు అక్కడ ఓకే అంటేనే ముందడుగు వరంగల్ : ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో అధికారులు ఇంతకాలం చూపిన నిర్లక్ష్యం జిల్లా ప్రజలకు పెనుశాపంగా మారింది. అధికారుల అలసత్వానికి తాజాగా వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక కోడ్ తోడైంది. ఈ ఏడాది జనవరిలో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ఏ క్షణాన్నైనా వరంగల్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందనే విషయం అందరికీ తెలుసు. ఇంత స్పష్టత ఉన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. తీరా ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ వెల్లడైన తర్వాత తమ శాఖల పరిధిలో పథకాలను ఎలా కొనసాగించాలనే విషయంలో హైరానా పడుతున్నారు. పథకాలను కొనసాగించాలా, వద్దా అనే విషయంపై వివరణ కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖలు రాస్తున్నారు. ఎన్నికల సంఘం నుంచి సానుకూల స్పందన వస్తే సరే... లేకుంటే లబ్ధిదారుల పరిస్థితి ఏమిటన్నది అర్థం కావడం లేదు. అధికారులు చేసిన నిర్వాకానికి ఇప్పుడు అర్హులైన తాము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందని దరఖాస్తుదారులు అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అమలులో జాప్యమైన కొన్ని సంక్షేమ పథకాల పరిస్థితి... ఎస్సీ స్టడీ సర్కిల్... జిల్లాలో దళిత అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు గ్రూప్స్ పోటీ పరీక్షలపై శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలోనే రెండో శిక్షణ కేంద్రాన్ని జిల్లాలో ఏర్పాటు చే యాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం దళిత అ భివృద్ధి శాఖ డెరైక్టరు స్వయంగా జిల్లాకు వచ్చి భవనాన్ని పరిశీలించగా.. పలువురు అభ్యర్థులు దరఖాస్తు కూడా చేసుకున్నారు. అలాగే, స్టడీ సెంటర్ డెరైక్టర్ పో స్టు కోసం అధికారులు ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రవేశ అర్హత పరీక్షలు నిర్వహించడంతో పాటు గత నెల మొదటి వారంలోనే స్టడీ సెంటర్ ప్రారంభించాల్సి ఉంది. అరుుతే, అధికారు ల నిర్లక్ష్యం కారణంగా పనులు సకాలంలో పూర్తికాలేదు. కొత్త కార్యక్రమం కావడంతో ఎన్నికల నియమావళి పే రు చెప్పి పనులు నిలిపివేశారు. ఎన్నికల కోడ్ విషయం ముందే తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడతో... గ్రూప్స్ పరీక్షల కోచింగ్ కోసం వేచి చూస్తున్న పేద వి ద్యార్ధుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. అనుమ తి కోసం ఎన్నికల కమిషన్కు లేఖ రాశామని.. అక్కడి నుంచి వచ్చే సమాధానం ఆధారంగా మిగిలిన పనులు పూర్తి చేస్తామని దళిత అభివృద్ధి శాఖ డీడీ శంకర్ తెలిపారు. కార్పొరేషన్ రుణాలు... ఎస్సీ కార్పొరేషన్ నుంచి కొత్తగా రుణాల మంజూరుపై ఇటీవలే జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు. 80 శాతం సబ్సిడీతో కొన్ని రకాల రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించడం తో అర్హులు చాలా మంది సంతోషపడ్డారు. వీరిలో కొం దరు ఇప్పటికే బ్యాంకర్లతో ఒప్పందాలు చేసుకున్నా రు. కోడ్ ప్రభావంతో ఎస్సీ కార్పొరేషన్ రుణాల మం జూరు ప్రక్రియ డిసెంబర్ వరకు వాయిదా పడింది. రుణాలు అందుతాయని ఆశించిన వారు ఇప్పుడు రెం డు నెలల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు బీసీ కార్పొరేషన్ నుంచి ఇప్పటివరకు రుణాలకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన రాయితీల విషయం అధికారులు వెల్లడించకపోగా.. ఆయూ వర్గాలు కూడా ఎన్నికల పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. అరుుతే, పాత మంజూరీలు సైతం కోడ్ పూర్తయిన తర్వాతే ఉంటాయని అధికారులు తెలిపారు. అయ్యో ‘దీపం’... అర్హులైన పేదలకు కట్టెల పొయ్యి ఇబ్బందులను తొలగించే దీపం వంట గ్యాస్ కనెక్షన్ల పథకం అమలు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. పథకం మంజూరై మూడు నెలలవుతున్నా ఇప్పటికీ అమలుకు నోచుకోని పరిస్థితి. దీపం పథకం కింద జిల్లాలోని 12 నియోజకవర్గాలకు మొత్తం 60 వేల కనెక్షన్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు పది వేల మంది లబ్ధిదారులనే ఎంపిక చేశారు. అంతేకాకుండా లబ్ధిదారుల ఎంపిక గడువును ఎప్పటికప్పుడు పొడిగిస్తుండగా.. ఇప్పుడు ఏకంగా ఎంపిక ప్రక్రియకే బ్రేక్ పడింది. భూ పంపిణీ... రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూపంపిణీ కార్యక్రమం జిల్లాలో మంచిగానే సాగుతోంది. ఈ పథకం అమలులో మన జిల్లా మూడో స్థానంలో నిలవగా.. ప్రస్తుతం 500 ఎకరాల వరకు భూమి పంపిణీకి సిద్ధంగా ఉంది. వారంలో చివరి దశ పనులు పూర్తయి పంపిణీ చేయూల్సి ఉండగా.. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఈ విషయంలో అధికారులు ముందుగానే స్పందిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘వరంగల్’పై టీఆర్ఎస్ కసరత్తు
♦ టి.రాజయ్య భార్య వివరాలు సేకరించిన ఇంటెలిజెన్స్ ♦ టికెట్ రేసులో పలువురు ఆశావహులు ♦ వారంలోగా షెడ్యూల్ వస్తుందని అంచనా సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్సభ ఉప ఎన్నికపై అధికార టీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి వారంలోపే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందన్న అంచనాతో అందుకు తగినట్లే ఏర్పాట్లు చేసుకుంటోంది. తమకు టికెట్ ఇవ్వాలని ఇప్పటికే పలువురు నేతలు అధినేత కేసీఆర్ను కోరారు. వరంగల్ జిల్లాకు చెందిన నాయకులకు తోడు జేఏసీలో పనిచేసి తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో పాల్గొన్న వారూ ఆశావహుల్లో ఉన్నారు. పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడిగా పనిచేసిన డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తనకు అవకాశం వస్తుందన్న ఆశతో ఉన్నారు. మొదటి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనకు టికెట్ ఇవ్వాలని అగ్రనేతలను కోరారు. తానూ పోటీకి సిద్ధంగా ఉన్నానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న పిడమర్తి రవి తన మనసులోని కోరికను బయట పెట్టారు. ఉప ఎన్నికపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికే వివిధ సమీకరణలను ముందు పెట్టుకుని విశ్లేషించినట్లు చెబుతున్నారు. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కుటుంబ సభ్యుల్లో ఒకరికి అవకాశం ఇస్తారనే ప్రచారమూ జరుగుతోంది. రాజయ్య భార్య ఫాతిమా మేరీకి సంబంధించిన వివరాలను నిఘా వర్గాల ద్వారా సేకరించినట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం సీనియర్ లైబ్రేరియన్గా వరంగల్ జిల్లాలోనే పనిచేస్తున్నారు. ఆమెకు ఇంకా ఎంత సర్వీసు ఉంది? జీతమెంత? తదితర సర్వీసు పరమైన వివరాలు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించాయని తెలిసింది. డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంపై ఎస్సీ వర్గాల్లో కొంత వ్యతిరేక ప్రచారం జరిగింది. ఈ అపప్రదను తొలగించుకోవడానికి వరంగల్ ఎంపీ స్థానం నుంచి ఆయన కుటుంబ సభ్యులనే నిలబెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన మేరకే ఈ వివరాలు సేకరించినట్లు చెబుతున్నారు. అయితే, ఆయన తనయుడు కూడా రేసులో ఉన్నాడని అంటున్నారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో కూడా రాజయ్య వరంగల్ ఉప ఎన్నికపై స్పందించినా, తమ కుటుంబం రేసులో ఉందని స్పష్టంగా చెప్పలేదు. రాష్ట్రంలో అత్యంత సానుభూతి తనపైనే ఉందని మాత్రం వ్యాఖ్యానించారు. ఎస్సీ రిజర్వుడు స్థానమైన వరంగల్లో మాదిగ వర్గ నేతలకే అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది. ‘గెలుపోటముల విషయాన్ని పక్కన పెడితే, మాదిగలకు టికెట్ ఇవ్వకుంటే పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది’ అని పార్టీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement