-
వీఎంసీలో డిజిటల్ పేమెంట్స్
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగర ప్రజలు ఆస్తి, డ్రెయినేజీ, నీటి, ఖాళీస్థలాలు ఇతర పన్నులను ఇక తమ ఇంటి నుంచే చెల్లించేలా నగర పాలక సంస్థ (వీఎంసీ) చర్యలు చేపట్టింది. ఈ – పోస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్) యంత్రాల ద్వారా డిజిటల్ పద్ధతిలో పన్నులు వసూలు చేసుకునేందుకు ఇప్పటికే ఒక దఫా బ్యాంకర్లతో చర్చలు జరిపింది. డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా ప్రజలు పన్నులు చెల్లించేందుకు వీలు కల్పించింది. అతి త్వరలోనే డిజిటల్ పేమెంట్ విధానం అమలుకు చర్యలు తీసుకుంటోంది. డిజిటల్ దిశగా అడుగులు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చు కుంటున్న వీఎంసీ మరో స్మార్ట్ ఆలోచనతో ముందుకెళ్తోంది. ఇప్పటికే నగరపాలక సంస్థ వాహనాలకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషన్ సిస్టమ్) అమర్చింది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో డంపర్ బిన్లను పర్యవేక్షిస్తోంది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పంపిణీ వంటి తదితర అంశాలను స్కాడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజేషన్) ద్వారా ఎప్పటికప్పుడు నీటి సరఫరా వివరాలను పర్యవేక్షిస్తోంది. ఇటీవల నగరంలోని సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేందుకు సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్ తోపాటు వాట్సాప్, టెలిగ్రాంను అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో పన్నులను కూడా డిజిటల్ విధానంలో వసూలు చేసేందుకు చర్యలు చేపట్టింది. డిజిటల్ విధానంలో పన్నులు వసూలు చేయడం ద్వారా ఆడిట్ సక్రమంగా ఉంటుందని, అవినీతి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ–పోస్ ఎలా పనిచేస్తుందంటే.. వీఎంసీ పరిధిలో ఉన్న ఆస్తులు, నీటి సరఫరా, డ్రెయినేజీ, ఖాళీ స్థలాల సమాచారాన్ని డివిజన్ల వారిగా ఈ–పోస్ యంత్రాల్లో నిక్షిప్తం చేస్తారు. ఈ సమాచారం ఆధారంగా వార్డు సచివాలయాల సెక్ర టరీల ద్వారా సంబంధిత పన్నులు వసూలు చేస్తారు. చలానాలు, పన్నులు, చార్జీలు తదితర చెల్లింపులను డెబిట్, క్రెడిట్ కార్డులతోపాటు మొబైల్ పేమెంట్స్ ద్వారా కూడా స్వీకరిస్తారు. ఇప్పటి వరకు మీ–సేవ, ఆన్లైన్, ట్యాక్స్ కలెక్షన్ పాయింట్ల ద్వారా మాత్రమే ఆయా పన్నులు, చార్జీలు చెల్లింపులు జరిగాయి. అయితే కొన్ని రకాల సేవలు మాత్రమే ఇకపై మీ–సేవ ద్వారా చెల్లింపులకు ఆస్కారం ఉందని వీఎంసీ అధికారులు పేర్కొన్నారు. డిజిటల్ పేమెంట్లకు సంబంధించి ఆయా వార్డు సచివాలయ కార్యదర్శులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. వార్డు వలంటీర్ల ద్వారా ప్రతి 50 ఇళ్ల పూర్తిస్థాయి సమాచారాన్ని (డోర్నంబర్, అసెస్మెంట్ నంబరు తదితర వివ రాలు) ఈ–పోస్ యంత్రాల్లో నమోదు చేశారు. చెల్లింపుదారులకు సంబంధించిన పూర్తివివరాలు ఈ–పోస్ యంత్రాల్లో ఉండటంతో క్షణాల్లో చెల్లింపులు జరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయిల్ రన్ సందర్భంగా కొన్ని డివిజన్లలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. శివారు, కొండప్రాంతాల్లో సిగ్నల్స్ సరిగ్గా ఉండకపోవటం, ఈ–పోస్ యంత్రాల బ్యాటరీ బ్యాకప్ చాలకపోవటం తదితర సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలను పూర్తిస్థాయిలో అధిగమించి నగరవ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ పేమెంట్లు అమలు చేయటానికి వీఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇక పక్కాగా ఆడిట్ పన్నులు, ఇతర యూజర్ చార్జీలను డిజిటల్ విధానంలో వసూలు చేయడం ద్వారా ప్రతి పైసాకు ఆడిట్ సక్రమంగా ఉంటుంది. సిబ్బంది పనితీరు మెరుగుపడుతుంది. క్షేత్రస్థాయిలో జరిగే అవినీతి కొంత వరకు తగ్గుతుంది. ఇప్పటికే కొన్ని డివిజన్లలో ట్రయల్ రన్ నిర్వహించాం. త్వరలో నగరవ్యాప్తంగా అన్ని డివిజన్లలో పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. – స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కమిషనర్, వీఎంసీ -
మటన్ కొనేటప్పుడు జాగ్రత్త!
సాక్షి,విజయవాడ: ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న మటన్ మాఫియా గుట్టును కార్పొరేషన్ అధికారులు శనివారం రట్టు చేశారు. విజయవాడకు అక్రమంగా తరలించిన పోటెళ్ళ తలలు ,కాళ్ళును స్వాధీనం చేసుకున్నారు. హౌరా ఎక్స్ప్రెస్ రైల్లో వచ్చిన పదహారు బాక్సులను పట్టుకున్నారు. సీజ్ చేసిన పదహారు బాక్సులను వీఎంసీ సిబ్బంది నిర్జన ప్రదేశంలో పూడ్చేశారు. వీటిని యూపీ నుంచి ఢిల్లీకి, అక్కడినుంచి విజయవాడ కు తెచ్చినట్టు అధికారులు గుర్తించారు. రేపు ఆదివారం కావటంతో నిల్వ ఉంచిన మాంసం అమ్మి సొమ్ము చేసుకునేందుకు ఈ మాఫియా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కబేళాలోని మాంసం మాత్రమే కొనుగోలు చేయాలని వీఎంసీ అధికారులు సూచించారు. చదవండి: అద్దె మాఫీ.. వారికి ఉపశమనం.. -
వీఎంసీలో ఇకపై ఎలక్ట్రిక్ కార్లు
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ నగరపాల క సంస్థ నగరంలో పర్యావరణ హితమైన ప్రయాణానికి శ్రీకారం చుట్టనుంది.. ఇందన ఖర్చు పొదుపుతో పాటు, పర్యావరణ పరిరక్షణకోసం ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశ పెట్టనుంది.. ముందుగా వీఎంసీ అధికారులకు ఆ వాహనాలు కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.. వచ్చే నెలలో విజయవాడ నగర రోడ్లపై ఎలక్ట్రికల్ వాహనాలు రయ్మంటూ దూసుకుపోనున్నాయి వాణిజ్యరాజధానిగా పేరున్న విజయవాడ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని నివా రణతో పాటు వీఎంసీ నిర్వాహణలో ఉన్న వాహనాల ఇంధన ఖర్చును పొదుపుచేసే క్రమంలో పర్యావరణ హితమైన వాహనాలను వినియోగించేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్ వాహనాలను విజయవాడలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది.. వచ్చే అక్టోబర్ నెలాఖరులోపు నగరపాలక సంస్థ కు ఈ కార్లును అందుబాటులోకి తేనున్నారు.. తొలివిడతగా వీఎంసీ అధికారులు ఈ వాహనాల ను ఉపయోగించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.. ఈక్రమంలో వీఎంసీలో ఉన్న 24 మంది అధికారులకు ఈ–కార్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. నోయీడా కంపెనీతో ఒప్పందం వీఎంసీ నోయీడాకు చెందిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్తో ఆరునెలల క్రితం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి 24 కార్లను వీఎంసీ రిజర్వ్ చేసింది. ఒక్కో కారు ఖరీదు రూ.12 నుంచి 15 లక్షల లోపు ఉంటుం దని అధికారులు తెలిపారు.. ఒక్కో కారుకు ప్రతి నెల రూ. 20 వేల ఈఎంఐ చొప్పున 72 నెలలపాటు చెల్లించేలా, అలాగే ఐదేళ్ల ఏళ్లపాటుసర్వీస్ కలిపి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. అధిక బ్యాటరీ సామర్థ్యంతో గంట చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు తిరిగే ఈ కార్లకు నగరంలోని బ్యాటరీ బంక్లు కూడా ఏర్పాటవుతాయని, నగరంలోని ప్రధాన ప్రాంతాలైన ఏలూరు, బందరురోడ్డులో తొలుత రెండుబ్యాటరీ బంకులను ఏర్పాటు చేయటానికి ఈఈఎస్ఎల్ సంస్థ ప్రణాళికలు రూపొం దిస్తుందని అధికారులు తెలిపారు. సొంతకార్లే అద్దెకార్లుగా..! వీఎంసీలో వివిధ విభాగాల్లో ఉన్న అధికారులు దొడ్డిదారిలో వారి సొంతవాహనాలనే అద్దెవాహనాలుగా చూపుతూ వీఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నారు. సొంతకార్లకు కూడా వీఎంసీ నుంచి అద్దె తీసుకుంటూ తమ సొంతపనులకు సైతం వినియోగిస్తున్నారని ఆరోపణల ఉన్నాయి. వీఎంసీలో దాదారు 80 శాతం అధికారులు ఒనర్ప్లేట్తో ఉన్న కార్లను వినియోగించటంపై కౌన్సిల్ల్లో కూడా పలుమార్లు ఈ అంశంపై రచ్చజరిగిన సంగతి తెల్సిందే.. సొంత కార్ల వినియోగంపై పలుమార్లు చర్చ జరిగినా అధికారులు పట్టించుకోక పోగా దర్జాగా సొంత అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఈ– కార్లతో తగ్గనున్న ఆర్థిక భారం వీఎంసీలో వివిధ విభాగాల అధికారులకు కేటా యించిన వాహనాల నిర్వహణ అంతా వీఎంసీనే చూసుకుంటుంది. కమిషనర్, అడిషనల్ కమీషనర్, సీఎంవోహెచ్ మినహా మిగిలిన అధికారుల కార్లన్నీ అద్దెప్రాతిపదికన ప్రతినెలా రూ. 25–45 వేల వరకు అద్దె చెల్లిస్తున్నాయి. కార్పొరేషన్లో ఆయా విభాలకు చెందిన 50 మంది అధికారులకు కారును సమకూర్చాల్సి వస్తుంది. దీనికిగాను ఆయా కార్ల నిర్వహణకు 12 లక్షల నుంచి రూ. 15 లక్షల చొప్పున ఏడాదికి రూ. కోటిన్నర అవుతుం ది. వీటి నిర్వహణలో తొలుత 24 కార్లను ఆయా విభాగాల అధికారులకు కేటాయింపు జరిపేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రెండో విడతగా మిగిలిన అధికారులకు కూడా సమకూర్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. -
భిక్షగాళ్ల దీనవ్యథ : కదిలిస్తే కన్నీరే..!
మాసిన గడ్డం..ఏపుగా పెరిగిన జుట్టు.. దుర్వాసన వచ్చే దుస్తులు. కాళ్లు, చేతులకు గాయాలతో అమ్మా, అయ్యా అంటూ చేయి చాస్తూ నగరంలో సంచరించే భిక్షగాళ్లను చూస్తే కొందరు జాలి చూపి చేతిలో చిల్లర వేస్తారు..మరికొందరు చీదరించుకుంటారు.. కానీ ఆ చీదరింపు వెనుక గాయపడిన మనస్సు ఉంటుంది.. ఒకప్పుడు అందరిలా దర్జాగానే బతికిన వారే.. కానీ విధి రాతకు తలొగ్గి కడుపు నింపుకొనేందుకు చేతులు చాస్తున్నారు.. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్యర్యంలో జరిపిన ప్రత్యేక డ్రైవ్లో పట్టుబడిన వారి మనోగతం వింటే కళ్లు చెమ్మగిల్లాల్సిందే.. – సాక్షి,అమరావతిబ్యూరో బంగారు లచ్చన్న విజయవాడకు చెందిన లచ్చన్న గతంలో నగరపాలక సంస్థలో వెహికల్ డిపోలో కార్మికుడిగా పనిచేశాడు. విశాఖజిల్లా గుడిచర్లకు చెందిన నాగమణితో వివాహమైంది. వారికి ముగ్గురు కొడుకులు, ఒక కూమార్తె. అందరిలానే వారికి చదువులు చెప్పించి వారిని ఉన్నతంగా బతికేలా చేశారు. ముగ్గురు కొడుకులు ప్రస్తుతం వివిధ వృత్తులు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. కుమార్తెను బావమరిదికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. చేతికొచ్చిన పిల్లలు ఆదుకుంటారని ఆశించిన లచ్చన్నకు నిరాశే మిగిలింది. 2013లో ఉద్యోగ విరమణ చేసిన ఆయన్ను కొన్నేళ్లు ఇంట్లో ఉంచుకున్న బిడ్డలు ఆపై మొహం చాటేశారు. ప్రస్తుతం పక్షవాతం రావడంతో కాలు, చేయి పనిచేయడం లేదు. కర్రసాయంతో రెండేళ్లుగా భిక్షమెత్తుకుంటున్నాడు. ఈయన సతీమణి మాత్రం పుట్టింటి వారి దగ్గరే ఉంటుంది. జేమ్స్ అంథాల్ విశాఖజిల్లా రేగడ ప్రాంతానికి చెందిన వాడు. అదే ప్రాంతానికి చెందిన రాములమ్మను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. ఆ బిడ్డలను ఉన్నతస్థాయిలో ఉంచాలని ముఫ్పై ఏళ్లు సికింద్రాబాద్లోని బొయినపల్లి వద్ద ఫంక్షన్ హాలులో వర్కర్గా పనిచేశాడు. అనుకున్నట్లే బిడ్డలను చదువులు చదివించి ఉన్నతస్థాయికి ఎదిగేలా చేశాడు. ఈయన పెద్దకుమారుడు విశాఖ జిల్లాలో ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్నాడు. మరో అబ్బాయి పెయింటర్ వృత్తి చేసుకుంటున్నాడు. కుమార్తె చదువుకొని మంచి స్థాయిలోనే ఉంది. కానీ వారికి తండ్రి భారమయ్యాడు.రెండేళ్లుగా ఇంటిని వదిలి తమిళనాడుతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భిక్షమెత్తుకుంటూ పొట్టపోసుకుంటున్నాడు. రంజిత్ తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన వ్యక్తి. మెకానిక్గా పనిచేసే∙రంజిత్ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఏఎన్ఎంను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కానీ కుటుంబ కలహాలతో రంజిత్ ఇంట్లో గొడవపడి గత 8 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వచ్చేశాడు. విజయవాడలో మెకానిక్గా పనిచేస్తూ మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. అనారోగ్యం బారిన పడి భిక్షమెత్తుకోవడం అలవాటు చేసుకున్నాడు. అందరిలాగానే కుటుంబంతో కలిసి దర్జాగా జీవించాల్సి ఉన్నా.. తన విధి రాత బాగా లేక దీనస్థితిలో బతుకుతున్నానంటూ బాధను వ్యక్తం చేశాడు.. పగవాడికి ఇలాంటి కష్టం రాకూడని ఆవేదన చెందాడు. -
గ్రీన్ అంబులెన్స్...చెట్టంత అండ...
మొక్కలు నాటడం ఒక్క ఎత్తయితే... వాటిని పరిరక్షించుకోవడం మరో ఎత్తు. చాలామందికి మొక్కలను నాటడం మాత్రమే తెలుసు. ఆ తరువాత ఆ విషయాన్ని మరిచిపోతారు. మనిషిలాగే చెట్లు కూడా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటాయి. మనిషి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అంబులెన్స్లు ఆఘమేఘాల మీద సంబంధిత ప్రదేశానికి చేరుకుంటాయి. చెట్లకు మాత్రం ఈ సౌకర్యం ఎందుకు ఉండకూడదనే ఉద్దేశంతో వడోదర(గుజరాత్)లోని స్వచ్ఛందసంస్థ ‘పగ్డాండ్’ వడోదర మున్సిపల్ కార్పోరేషన్ (వియంసీ) సహకారంతో ‘గ్రీన్ అంబులెన్స్’ సదుపాయాన్ని ప్రారంభించింది.నగరంలో ఒకప్పుడు వేలాది మొక్కలు నాటిన ఈ సంస్థ... ఆ మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి, వాటిని ప్రమాదకర పరిస్థితుల నుంచి తప్పించడానికి మూడు చక్రాల గ్రీన్ అంబులెన్స్లను ఉపయోగిస్తుంది.‘ఫలానా చోట మొక్కల ఆలనా పాలనా ఎవరూ పట్టించుకోవడం లేదు’‘ఫలానా చోట మొక్కలను పశువులు తింటున్నాయి’‘నీళ్లు లేక మొక్కలు ఎండిపోతున్నాయి’... ఇలాంటి ఫోన్ కాల్స్ ఆ స్వచ్ఛంద సంస్థ హెల్ప్ లైన్కు రాగానే... వెంటనే ‘గ్రీన్ అంబులెన్స్’ రంగంలోకి దిగుతుంది. నీళ్లు, ఎరువులు... ఇలా చెట్ల సంరక్షణకు అవసరమైన అన్ని రకాల వస్తువులు, ఏర్పాట్లు ఇందులో ఉంటాయి. నగరంలో నాటిన మొక్కల్లో 13 శాతం మాత్రమే బతుకుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ‘గ్రీన్ అంబులెన్స్’లతో రంగంలోకి దిగింది ‘పగ్డాండ్’మొక్కల విలువ గురించి విస్తృత అవగాహన కలిగించడం, మొక్కల్ని నాటడం, ఇతరుల చేత నాటించడం, వాటి సంరక్షణకు పాటు పడడం... తన కార్యరంగాలుగా ఎంచుకుంది ‘పగ్డాండ్’పర్యావరణ సంరక్షణలో స్థానిక ప్రభుత్వ శాఖలను క్రియాశీలంగా భాగస్వాములను చేయడం, బడులలో ఎకో క్లబ్లను స్థాపించడంలాంటి పనులు చేçస్తుంది ‘పగ్డాండ్’.‘‘గ్రీన్ అంబులెన్స్ల గురించి చాలామంది ఆసక్తిగా అడుగుతుంటారు. వినూత్నమైన ఆలోచన అని ప్రశంసిస్తుంటారు. నగరంలో గ్రీన్ అంబులెన్స్ల ప్రవేశం తరువాత మొక్కల సర్వైవల్ రేట్ పెరిగింది’’ అంటున్నారు ‘పగ్డాండ్’ ఫౌండర్ ట్రస్టీ నిషిత్ దాండ్.కొన్ని సందేశాలకు వేదికలు, ఉపన్యాసాలు అక్కర లేదని ఈ గ్రీన్ అంబులెన్స్లు నిరూపిస్తున్నాయి. రోడ్డు మీద వెళుతున్న ఈ గ్రీన్ అంబులెన్సులు చెట్ల విలువ, పరిరక్షణ గురించి మౌనసందేశాన్ని మోసుకెళుతున్నట్లుగా ఉంటాయి. ఒకరి నుంచి ఒకరికి గ్రీన్ అంబులెన్స్ల గురించి మాత్రమే కాదు... పర్యావరణ పరిరక్షణ గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. వడోదర ‘గ్రీన్ అంబులెన్స్’ల స్ఫూర్తి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరిస్తే... నాటిన ప్రతి చెట్టు క్షేమంగా ఉంటుంది. మనల్ని క్షేమంగా చూస్తుంది. ఫీజు అక్కర్లేదు మొక్క నాటితే చాలు! చత్తీస్గడ్, అంబికాపూర్లోని ‘శిక్షా కుటీర్’ అనే స్కూల్ చెట్ల సంరక్షణకు వినూత్నంగా ప్రయత్నిస్తుంది. పిల్లలను స్కూల్లో చేర్పించే సమయంలో పేరెంట్స్ కొన్ని మొక్కలను తప్పనిసరిగా నాటాల్సి ఉంటుంది. తాము నాటిన మొక్క ఒకవేళ చనిపోతే దాని స్థానంలో వేరొక మొక్క నాటాల్సి ఉంటుంది. పేరెంట్స్ ఫీజులు కట్టలేని స్థితిలో ఉంటే కొన్ని మొక్కలు నాటితే చాలు! ట్రీ హెల్ప్లైన్ ఢిల్లీ ప్రభుత్వం చెట్ల సంరక్షణకు చాలా కాలం క్రితమే ‘ట్రీ హెల్ప్ లైన్’ను ప్రారంభించింది. చెట్లకు ఎవరైనా హాని కలిగిస్తున్నా, ఎక్కడైనా చెట్లు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా ఈ హెల్ప్లైన్కు ఫోన్ చేయవచ్చు. ‘ఫలానా చోట ఉన్న చెట్టుకు ఇలాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది’లాంటి సలహాలు కూడా ఇవ్వవచ్చు. ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ శాఖ ప్రవేశపెట్టిన ఈ టోల్–ఫ్రీ నంబర్ ట్రీ హెల్ప్ లైన్ మంచి ఫలితాన్ని ఇచ్చింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement