-
RCB vs LSG: 'గ్రీన్ను పక్కన పెట్టండి.. వారిద్దరిని జట్టులోకి తీసుకోండి'
ఐపీఎల్-2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా మంగళవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. అయితే ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ.. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. మిగితా మూడు మ్యాచ్ల్లో ఘోర ఓటములను చవిచూసింది. ఆర్సీబీ జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్ మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమవుతున్నారు. కెప్టెన్ డుప్లెసిస్, మాక్స్వెల్, గ్రీన్ వంటి స్టార్ ఆటగాళ్లు తమ స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. బౌలింగ్లో కూడా ఆర్సీబీ పూర్తిగా తేలిపోతోంది. మరి లక్నోతో మ్యాచ్లో ఆర్సీబీకి ఏ మెరకు రాణిస్తుందో వేచి చూడాలి. ఈ నేపథ్యంలో ఆర్సీబీని ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ వంటి స్టార్డమ్ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవకపోవడం తనకు ఆశ్చర్యంగా ఉందని బ్రాడ్ తెలిపాడు. ఆర్సీబీపై చాలా మందికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందుకు కారణం వారు ఒక్కసారి కూగా టైటిల్ను గెలవకపోవడం. తొలి సీజన్ నుంచి ఆర్సీబీ జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికి ట్రోఫీని ఎందుకు గెలవలేకపోయిందో నాకు అర్ధం కావడం లేదు. డివిలియర్స్, గేల్ వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఆర్సీబీకి ఆడారు. విరాట్ కోహ్లి ఇంకా ఆర్సీబీతోనే ఉన్నాడు.. ప్రతీ సీజన్లోనూ విరాట్ తన వంతు న్యాయం చేస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది కూడా కోహ్లి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతడు టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుత సీజన్లో విరాట్ మినహా మిగితా ఏ బ్యాటర్ కూడా తమ స్ధాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నారు. మాక్స్వెల్, ఫాప్ డుప్లెసిస్ తిరిగి ఫామ్లోకి రావాల్సిన అవసరం చాలా ఉంది. నావరకు అయితే ఆర్సీబీ బౌలింగ్ పరంగా చాలా వీక్గా ఉంది. వారు ఇద్దరు ఓవర్సీస్ బౌలర్లతో బరిలోకి దిగాలని నేను భావిస్తున్నాను. తదుపరి మ్యాచ్లకు లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్ రీస్ టోప్లీ ,లాకీ ఫెర్గూసన్లను తీసుకువస్తే బాగుంటుంది. కెమరూన్ గ్రీన్, జోషఫ్ను కొన్ని మ్యాచ్లకు పక్కనపెట్టాల్సిన అవసరముందని స్టార్ స్పోర్ట్స్ షోలో బ్రాడ్ పేర్కొన్నాడు. -
వారెవ్వా.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు?: సౌతాఫ్రికా దిగ్గజం
ఐపీఎల్ తాజా సంచలనం మయాంక్ యాదవ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ‘ఢిల్లీ ఎక్స్ప్రెస్’ స్పీడుకు మాజీ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. మయాంక్ పేస్ నైపుణ్యాలు అద్భుతమని కొనియాడాడు. వేగంగా బంతిని విసరడంతో పాటు లైన్ అండ్ లెంగ్త్పై కూడా మయాంక్ పూర్తి నియంత్రణ కలిగి ఉండటం ముచ్చటగొలుపుతోందని బ్రాడ్ హర్షం వ్యక్తం చేశాడు. అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలవడం పట్ల సాటి ఫాస్ట్బౌలర్గా ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. అంతేగాకుండా త్వరలోనే మయాంక్ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని.. రానున్న టెస్టు సిరీస్లో అతడు గనుక ఆడితే.. జాగ్రత్తగా ఉండాలని స్టీవ్ స్మిత్కు ఇప్పటికే సందేశం పంపినట్లు బ్రాడ్ పేర్కొన్నాడు. మరోవైపు.. సౌతాఫ్రికా స్పీడ్గన్ డేల్ స్టెయిన్ సైతం మయాంక్ యాదవ్ సూపర్ఫాస్ట్ డెలివరీలు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. ‘‘గంటకు 155.8 కిలో మీటర్ల వేగం. మయాంక్ యాదవ్.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు!’’ అంటూ ఎక్స్ వేదికగా మయాంక్ను అభినందించాడు. ఇక భారత మాజీ బ్యాటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం ఢిల్లీ ఎక్స్ప్రెస్ అంటూ అతడిపై ప్రశంలస వర్షం కురిపించాడు. 𝗦𝗽𝗲𝗲𝗱𝗼𝗺𝗲𝘁𝗲𝗿 goes 🔥 𝟭𝟱𝟱.𝟴 𝗸𝗺𝘀/𝗵𝗿 by Mayank Yadav 🥵 Relishing the raw and exciting pace of the debutant who now has 2️⃣ wickets to his name 🫡#PBKS require 71 from 36 delivers Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL |… pic.twitter.com/rELovBTYMz — IndianPremierLeague (@IPL) March 30, 2024 155,8 KPH Mayank Yadav where have you been hiding! — Dale Steyn (@DaleSteyn62) March 30, 2024 కాగా ఐపీఎల్-2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 21 ఏళ్ల మయాంక్ యాదవ్ శనివారం అరంగేట్రం చేశాడు. పంజాబ్ కింగ్స్తో తన తొలి మ్యాచ్ ఆడిన ఈ రైటార్మ్ పేసర్.. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గంటకు 155.8 కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తూ ఐపీఎల్ తాజా ఎడిషన్లో ఫాస్టెస్ట్ డెలివరీని నమోదు చేశాడు. తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. సొంతమైదానంలో పంజాబ్పై లక్నో విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. కాగా మయాంక్ యాదవ్ దేశవాళీ క్రికెట్లో సొంత జట్టు ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో తొలి మ్యాచ్లో ఓడిన లక్నో సూపర్ జెయింట్స్.. తాజాగా పంజాబ్పై 21 పరుగుల తేడాతో గెలుపొందింది. తదుపరి మంగళవారం ఆర్సీబీతో తలపడనుంది. చదవండి: #Mayank Yadav: నేను ఆరాధించే ఫాస్ట్ బౌలర్ ఆ ఒక్కడే: నయా ‘స్పీడ్గన్’ -
#MIvsGT: సూపర్ టాలెంట్.. బుమ్రాకు మాత్రమే సాధ్యం! వీడియో
#MIvGT- JASPRIT BUMRAH Super Spell Video: గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఈ పేస్ గుర్రం నైపుణ్యాలకు అభిమానులతో పాటు దిగ్గజ బౌలర్లు సైతం ఫిదా అయ్యారు. 0,0,0,4,0,వికెట్,1,0,1,0,0,0,వికెట్,1,వికెట్,0,0,1,1లెగ్బై,1,2,1,1,1 - నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు(3/14). గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో బుమ్రా అద్భుత స్పెల్ను చాటిచెప్పే గణాంకాలు. Just Bumrah Things 🤷♂️@Jaspritbumrah93 on target in his first over 👏#GT reach 47/1 after 6 overs Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Match Updates ▶️ https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI pic.twitter.com/Zt6vIEa0me — IndianPremierLeague (@IPL) March 24, 2024 ఈ నేపథ్యంలో బుమ్రా ఆట తీరును ప్రశంసిస్తూ ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా సాహాను బౌల్డ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘తన ట్రేడ్మార్క్ స్కిల్ ఇది. పేస్తో బ్యాటర్ను ముప్పుతిప్పలు పెట్టగల సత్తా అతడి సొంతం. అత్యద్భుతమైన నైపుణ్యాలు, ప్రతిభ అతడికి ఉన్నాయి. అందుకే వ్యూహాలను పక్కాగా అమలు చేసి ప్రతిసారి విజయవంతమవుతాడు’’ అని బ్రాడ్.. బుమ్రాను కొనియాడాడు. 1️⃣ brings 2️⃣ Three wickets in the match for @Jaspritbumrah93 👏 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Match Updates ▶️ https://t.co/oPSjdbb1YT#TATIPL | #GTvMI | @mipaltan pic.twitter.com/XXH33C7Yq6 — IndianPremierLeague (@IPL) March 24, 2024 కాగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆరంభంలోనే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(19) అద్భుత రీతిలో బౌల్డ్ చేసిన బుమ్రా.. అనంతరం సాయి సుదర్శన్(45), డేవిడ్ మిల్లర్(12) రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అహ్మదాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై.. గుజరాత్ విధించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఆఖరి వరకు పోరాడి ఆరు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. తద్వారా ముంబై ఇండియన్స్ కెప్టెన్గా తొలిసారి బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. మరోవైపు.. గుజరాత్ సారథిగా శుబ్మన్ గిల్ మాత్రం తొలి మ్యాచ్లోనే విజయం అందుకున్నాడు. చదవండి: #HardikPandya: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్.. మండిపడ్డ రోహిత్! పక్కనే అంబానీ.. -
కోహ్లి లేడు.. పుజారా కెరీర్ ముగిసినట్లేనా? ఎందుకీ దుస్థితి?
India vs England, 4th Test Day 2: టీమిండియా నయా వాల్గా పేరొందిన ఛతేశ్వర్ పుజారాను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుజారా లాంటి బ్యాటర్ జట్టులో ఉండి ఉంటే బాగుండేదన్నాడు. అతడు గనుక తుదిజట్టులో ఉండి ఉంటే నాలుగో టెస్టులో భారత్కు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నాడు. కాగా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా 2-1తో ముందంజలో ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య రాంచి వేదికగా శుక్రవారం నాలుగో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్లో ఫలితం తేల్చి సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా బరిలోకి దిగింది. అయితే, తొలిరోజు అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు అమలు చేసినా.. జో రూట్ అద్భుత ఇన్నింగ్స్(122 నాటౌట్)తో ఇంగ్లండ్కు మంచి ఆరంభం అందించాడు. ఈ నేపథ్యంలో శనివారం నాటి రెండో రోజు ఆటలో 353 పరుగులకు ఇంగ్లండ్ను ఆలౌట్ చేసింది టీమిండియా. అయితే, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బ్యాటింగ్ మొదలుపెట్టిన రోహిత్ సేన 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 73 పరుగులతో రాణించగా.. ఆట పూర్తయ్యే సరికి 219/7 (73) స్కోరు వద్ద నిలిచింది. ఇంగ్లండ్ స్పిన్నర్లు షోయబ్ బషీర్ 4, టామ్ హార్లే రెండు.. పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం.. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ కంటే 134 పరుగులు వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర ట్వీట్తో ముందుకు వచ్చాడు. స్పిన్ బౌలింగ్ ఆడటంలో టీమిండియా బ్యాటర్ల వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అనుభవజ్ఞుడైన, వరల్డ్క్లాస్ బ్యాటర్ కోహ్లి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామంలో టీమిండియా బ్యాటింగ్ లైనప్లో పుజారాను తిరిగి తీసుకురావాలనే తలంపు వస్తోందా? లేదంటే అతడి అంతర్జాతీయ కెరీర్ పూర్తిగా ముగిసిపోయినట్లేనా? ఒకవేళ ఈరోజు అతడు గనుక జట్టుతో ఉండి ఉంటే కచ్చితంగా పట్టుదలగా నిలబడి.. ఆంకర్ ఇన్నింగ్స్ ఆడేవాడు’’ అని స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. కాగా జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో రంజీ ట్రోఫీ టోర్నీ బరిలో దిగిన సౌరాష్ట్ర బ్యాటర్ పుజారా.. ప్రస్తుతం తమిళనాడుతో క్వార్టర్ ఫైనల్ ఆడుతున్నాడు. చదవండి: Ind Vs Eng 4th Test: ‘ఛీ.. ఛీ.. చీటింగ్కు కూడా వెనుకాడరు’.. ఇలా ఉన్నారేంట్రా బాబూ! With the experience & world class talent of Kohli missing, would there have been temptation to bring back Pujara into this India batting line up? Or is his international career over? Feels like he could have brought some consistency and an anchor ⚓️ — Stuart Broad (@StuartBroad8) February 24, 2024 -
అవమానం లాంటిదే: కోహ్లి ఆడకపోవడంపై స్టువర్ట్ బ్రాడ్ వ్యాఖ్యలు
Ind vs Eng Test Series 2024- Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గురించి ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి లేకుండానే భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టులు జరగడం ఒకరకంగా సిరీస్కే అవమానం లాంటిదని వ్యాఖ్యానించాడు. కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా విరాట్ కోహ్లి స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలుత రెండు మ్యాచ్ల నుంచి వైదొలిగిన అతడు.. సెలవు పొడిగించాలని బీసీసీఐని కోరడంతో.. బోర్డు అందుకు అంగీకరించింది. మిగిలిన మూడు టెస్టులకూ దూరం ఈ క్రమంలో మిగిలిన మూడు టెస్టులకు కోహ్లి సెలక్షన్కు అందుబాటులో లేని కారణంగా అతడిని ఎంపిక చేయలేదని తెలిపింది. నిజానికి కోహ్లి మూడో టెస్టు నుంచైనా తిరిగి వస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. ఇంగ్లండ్తో సొంతగడ్డపై మ్యాచ్ అంటే కోహ్లికి పూనకాలే అని.. అలాంటిది ఈసారి మాత్రం తన ఆటను మిస్సవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అంతకంటే ఎక్కువగా వారిని బాధిస్తున్న అంశం మరొకటి ఉంది. కోహ్లి ఆడకపోవడం సిరీస్కే అవమానం లాంటిది కోహ్లి ఈ సిరీస్కు దూరం కావడానికి గల అసలు కారణం ఇంతవరకు తెలియకపోవడంతో.. ఈ రన్మెషీన్కు ఏమై ఉంటుందా అని సందిగ్దంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టువర్ట్ బ్రాడ్ తాజాగా IANS(వార్తా సంస్థ)తో మాట్లాడుతూ కోహ్లి గైర్హాజరీపై స్పందించాడు. ‘‘కోహ్లి లేకుండానే ఈ సిరీస్ జరగడం సిరీస్కే ఓ అవమానం లాంటిది. కోహ్లి నాణ్యమైన నైపుణ్యాలు గల బ్యాటర్. ఆట పట్ల అతడి అంకిత భావం అమోఘం. అతడిలోని ఫైర్ ప్రత్యర్థులకూ మజాను అందిస్తుంది. అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి ఏదేమైనా కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత విషయాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, కోహ్లి జట్టులో లేకపోవడం యువ ఆటగాళ్లకు గొప్ప వరం లాంటిది. అతడి గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మున్ముందు మరిన్ని ఛాన్స్లు పొందే అవకాశం ఉంటుంది’’ అని ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్ తరఫున 167 టెస్టులాడిన బ్రాడ్ 604 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. తాజా సిరీస్లో తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్టులో టీమిండియా గెలుపొంది సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 15 నుంచి మూడో మ్యాచ్ ఆరంభం కానుంది. చదవండి: Adudam Andhra: విశాఖలో ముగింపు వేడుకలు..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement