-
రైజింగ్ స్టార్: 16 ఏళ్లకే రూ.100 కోట్ల ఏఐ స్టార్టప్
పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు టెక్ పరిశ్రమలోకి తన ఘనతను చాటుకుందో 16 ఏళ్ల బాలిక. డెల్వ్.ఏఐ (Delv.AI) స్టార్టప్తో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. రూ.100 కోట్ల విలువతో సక్సెస్ రూల్స్ను తిరగరాసింది ఈ యువ పారిశ్రామిక వేత్త. ఈ సంస్థ పరిశోధన కోసం డేటా వెలికితీతకు సంబందించిన సేవలను అందిస్తుంది. ఇప్పుడు తన సంస్థలో పది మందికి ఉపాధి కల్పిస్తోంది. ప్రాంజలి అవస్థి 2022లో Delv.AIని ప్రారంభించింది. ఈ స్టార్టప్ ఇప్పటికే రూ.100 కోట్ల (12 మిలియన్ల డాలర్లు) విలువను కలిగి ఉంది. డెల్వ్.ఏఐ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇప్పటికే 10 మంది ప్రత్యేక నిపుణుల బృందాన్ని కలిగి ఉండటం విశేషం.పాఠశాలల్లో కంప్యూటర్ సైన్స్ విద్యను ప్రోత్సహించడం ద్వారా ఆమె తండ్రి అవస్థి ఉన్నతికి పునాది వేశారు. ఈ ప్రోత్సాహంతోనే ఆమెను కేవలం ఏడు సంవత్సరాల వయస్సులో కోడింగ్ ప్రారంభించింది. ఆమెకు 11 ఏళ్లున్నపుడు కుటుంబం భారతదేశం నుంచి ఫ్లోరిడాకు మారింది. 13 ఏళ్ల వయసులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీకి చెందిన రీసెర్చ్ ల్యాబ్స్లో ఆమె ఇంటర్న్షిప్ ద్వారా వ్యాపార ప్రపంచంలోకి ఆమె ప్రవేశించింది. ఇంటర్న్షిప్ సమయంలో, కోవిడ్ మహమ్మారి కారణంగా వర్చువల్ హైస్కూల్లో చదువుతున్నప్పుడు ప్రాంజలి మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్లలోకి ప్రవేశించింది. ఓపెన్ ChatGPT-3 బీటా విడుద లైన క్రమంలోనే ఈ వెంచర్ కూడా మొదలైంది.హైస్కూల్ విద్యార్థిని లూసీ గువో, బ్యాకెండ్ క్యాపిటల్కు చెందిన డేవ్ ఫాంటెనోట్ నాయకత్వంలో మియామిలో AI స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్లోకి అడుగుపెట్టింది. తరువాత ఆన్ డెక్, విలేజ్ గ్లోబల్ నుంచి పెట్టుబడులను పొందడంలో యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అవస్థికి సహాయపడింది. ఆ తర్వాత ఆమె వ్యాపార ప్రయాణం ప్రారంభమైంది. ప్రాంజలి అవస్తి తన కంపెనీని జనవరి 2022లో స్థాపించింది. దాదాపు రూ3.7 కోట్లతో ప్రారంభ నిధులను సేకరించింది. కేవలం ఒక ఏడాదిలోనే రూ100 కోట్లకు చేరింది. -
సెమీకండక్టర్లను ఎగుమతి చేస్తున్న భారత్.. ప్రధాన స్టార్టప్లు ఇవే..
సెమీకండక్టర్లను దిగుమతి చేసుకునే దశ నుంచి వాటిని తయారుచేసుకుని ఇతర దేశాల్లోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేసే స్థాయికి భారత్ చేరుతోంది. దాంతో దేశీయంగా ఉన్న లిస్టెడ్ కంపెనీలు ఇప్పటికే వీటి తయారీలో దూసుకుపోతున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ రంగం మరింత వృద్ధి చెందుతుందని భావించి చాలా స్టార్టప్ కంపెనీలు ఈ సెమీకండక్టర్ల తయారీకి సిద్ధం అవుతున్నాయి. అందులో ప్రధానంగా ఈ కింది కంపెనీలు దేశీయంగా సెమీకండక్టర్ చిప్లను తయారుచేస్తున్నాయి.సాంఖ్యల్యాబ్స్మైండ్గ్రోడ్టెర్మినస్ సర్క్యూట్స్మార్ఫింగ్ మిషన్ఫెర్మియానిక్ఓక్టర్ఆగ్నిట్ఇన్కోర్సైన్ఆఫ్సిలిజియం సర్క్యూట్స్ఔరసెమిసెమీకండక్టర్ విభాగంలో అంకుర సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో టి-హబ్, నీతి ఆయోగ్తో కలిసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద కోహర్ట్-2 కార్యక్రమాన్ని గతంలో చేపట్టాయి. ఈ కార్యక్రమం కింద అంకుర సంస్థలను ఎంపిక చేసి, 6 నెలల పాటు వాటి ఎదుగుదలకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తాయి. దీని కోసం ఇప్పటికే అంకుర సంస్థలను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇందులో ఫేస్ఇంటెల్ సిస్టమ్స్, క్లూపే సైంటిఫిక్, డీప్ గ్రిడ్ సెమి, సెగో ఆటోమొబైల్ సొల్యూషన్, స్పైడెక్స్ టెక్నాలజీస్, జియోకాన్, ఛిపెక్స్ టెక్నాలజీస్, జీలీ స్మార్ట్ సిస్టమ్ ఉన్నాయి. -
1000 ట్రక్కుల భారీ ఆర్డర్.. దక్కించుకున్న బెంగళూరు స్టార్టప్
ఎలక్ట్రిక్ ట్రక్కులు తయారు చేసే బెంగళూరు ఆధారిత స్టార్టప్ ట్రెసా మోటార్స్ లాజిస్టిక్స్ కంపెనీ భారీ ఆర్డర్ దక్కించుకుంది. జేఎఫ్కే ట్రాన్స్పోర్టర్స్ నుండి 1,000 ట్రక్కుల కోసం ప్రీ-ఆర్డర్ను పొందింది. ఈ కంపెనీ మోడల్ V0.1ని అందిస్తోంది. దీన్ని గతేడాది జూలైలో ఆవిష్కరించింది. ట్రెసా కంపెనీ 18T-55T స్థూల వాహన బరువు విభాగంలోనూ ఎలక్ట్రిక్ ట్రక్కులను అభివృద్ధి చేస్తోంది. ట్రెసా ట్రక్కులు ప్రస్తుతం 300kWh బ్యాటరీ ప్యాక్, 24,000Nm మోటరును కలిగి ఉన్నాయి. ఇవి 15 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జీకి సపోర్ట్ చేస్తాయి. 120kmph గరిష్ట వేగాన్ని ఇస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులు ఒక్కసారి పూర్తి ఛార్జ్తో ఎంత రేంజ్ ఇస్తాయన్నది కంపెనీ వెల్లడించలేదు."మేము ఈ స్థితికి చేరుకోవడానికి చాలా సంవత్సరాలు కష్టపడ్డాం. ఇంకా ఇది ప్రారంభం మాత్రమే. జేఎఫ్కే ట్రాన్స్పోర్టర్స్ వంటి ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీలు ముందుకు రావడం మరియు మాపై విశ్వాసం ఉంచడం మాకు చాలా ఆనందంగా ఉంది" అని ట్రెసా మోటర్స్ సీఈవో రోహణ్ శ్రవణ్ పేర్కొన్నారు. ట్రెసా మోటార్స్ అధునాతన ఎలక్ట్రిక్ ట్రక్కులను తమ ఫ్లీట్లో చేర్చడం ద్వారా కార్బన్ ఫుట్ప్రింట్ను తగ్గించే తమ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తున్నామని జేఎఫ్కే ట్రాన్స్పోర్టర్స్ ఎండీ ఆదిల్ కొత్వాల్ అన్నారు. -
ది గ్రేట్ వడా పావ్ వార్
దిల్లీ ‘వైరల్ వడా పావ్ గర్ల్’గా పాపులర్ అయిన చంద్రికా గెరా దీక్షిత్ తాజాగా తన ఫుడ్ కార్ట్ సార్టప్తో రాత్రికి రాత్రి సెన్సేషన్గా మారింది. దీక్షిత్ పాపులారిటీ మాట ఎలా ఉన్నా ఆమెకు పోటీదారులు పెరిగారు. దీక్షిత్ ఫుడ్ కార్ట్ చుట్టుపక్కల పోటీదారులు వడా పావ్ బండ్లను ఏర్పాటు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ‘పాపులారిటీనే కొంప ముంచిందా!’ లాంటి హెడ్లైన్స్ నెటిజనుల నుంచి లైన్ కట్టాయి. ‘నిన్న నేను రానందున తన బండిని ఉంచానని ఆంటీ చెప్పింది. ఈరోజు కూడా ఇక్కడే పెట్టింది. ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకోవడం సమంజసమా!’ అని తన ఆవేదనను వెళ్లగక్కింది దీక్షిత్. ఫుడ్ వ్లాగర్ పూడీ మానేహా ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోటీదారు ఆంటీ ‘ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా పని నేను చేసుకుపోతున్నాను’ అని ఎర్రటి ఎండల్లో కూల్గా బదులిచ్చింది. ‘బండి ఎవరు పెట్టారనేది కాదు... రుచి ముఖ్యం’ అని కూడా సెలవిచ్చింది. -
భారత్ స్టార్టప్ల దూకుడు
న్యూఢిల్లీ: దేశీ అంకుర సంస్థలు జోరు మీదున్నాయి. స్టార్టప్లు ఈ ఏడాది దాదాపు 8–12 బిలియన్ డాలర్ల వరకు నిధులు సమీకరించే అవకాశం ఉందని వెంచర్ క్యాపిటల్ సంస్థ పీక్ ఫిఫ్టీన్ ఎండీ రాజన్ ఆనందన్ తెలిపారు. దాదాపు 20 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయతగిన ప్రైవేట్ నిధులు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ సంస్థలు.. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపుదారులు ఆసక్తిగా ఉన్నారని స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2021, 2022లో భారతీయ స్టార్టప్లలో ఏటా 8–10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని ఆనందన్ చెప్పారు. దీంతో ఆ రెండు సంవత్సరాల్లో అంకుర సంస్థల్లోకి వచి్చన పెట్టుబడులు 60 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. ‘గతేడాది 7 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ మొత్తం తక్కువని చాలా మంది అంటున్నారు. కానీ, నిజం చెప్పాలంటే ఆరేళ్లకు సరిపడా పెట్టుబడులు రెండేళ్లలోనే వచ్చేసిన నేపథ్యంలో గతేడాది అసలు పెట్టుబడుల పరిమాణం శూన్యంగా ఉండేది. ఈ ఏడాది మనం 8–10 లేదా 12 బిలియన్ డాలర్ల వరకు సమీకరించే దిశగా ముందుకు వెడుతున్నాం. రాబోయే రోజుల్లో 10–12 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టే స్థాయికి స్టార్టప్ వ్యవస్థ చేరుకోగలదు‘ అని ఆనందన్ తెలిపారు. దేశీ స్టార్టప్ వ్యవస్థను పటిష్టంగా నిర్మించుకోవడానికి ఏటా 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 80,000 కోట్లు) సరిపోతాయని చెప్పారు. ప్రస్తుతం భారత్లో 20 స్టార్టప్లు లిస్ట్ అయ్యాయని, వచ్చే 7–8 ఏళ్లలో 100 అంకుర సంస్థలు లిస్టింగ్కి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డీప్టెక్ స్టార్టప్స్ కోసం పాలసీ.. డీప్టెక్ స్టార్టప్స్ కోసం ప్రత్యేక పాలసీని త్వరలోనే ప్రకటించనున్నట్లు పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ తెలిపారు. అంకుర సంస్థలకు నిధులే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా ఆర్డర్లు దక్కాల్సిన అవసరం ఉందని, గవర్నమెంట్ ఈ–మార్కెట్ప్లేస్తో ఈ అవకాశం లభిస్తోందని సింగ్ వివరించారు. స్టార్టప్స్ నుంచి జీఈఎం ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 22,000 కోట్ల విలువ చేసే కొనుగోళ్లు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. -
రూ.100 కోట్ల కంపెనీ స్థాపించిన యంగ్ లేడీ.. ఎలాగంటే..
ఇంటికో వ్యాపారవేత్త... వీధికో స్టార్టప్ అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఐఐటీల్లో చదవాలని పిల్లలు ఎంతగా కలలు కంటున్నారో ఆ చదువవగానే సొంతంగా ఓ పరిశ్రమ పెట్టాలనీ అంతగానే కలలు కంటున్నారు. ఆ కలలకు దన్నుగా నిలుస్తోంది పారిశ్రామిక రంగం. దీంతో చాలా మంది యువత తమకు నచ్చిన పని చేసుకునేందుకు ఉద్యోగాలను మానేస్తున్నారు. అలా సొంత వ్యాపారాలను ప్రారంభించి విజయం సాధిస్తున్నారు. ఐఐటీలో చదివి స్టార్టప్ను స్థాపించి ఏకంగా రూ.100 కోట్ల కంపెనీగా అభివృద్ధి చేసిన ఆ యువ వ్యాపారవేత్త ఎవరు.. తను చేస్తున్న బిజినెస్ ఏమిటి.. తనను ఆ దిశగా ప్రేరేపించిన సంఘటనలు ఏవైనా ఉన్నాయా అనే అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం. రాజస్థాన్లోని భరత్పూర్కు చెందిన అహానా ఐఐటీ బాంబే నుంచి కెమికల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 2014-16 మధ్య కాలంలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పట్టా తీసుకున్నారు. అక్కడ చదువుతున్న రోజుల్లో యూఎస్లో ఒక హోటల్కు వెళ్లినప్పుడు అధిక కొవ్వు, క్రీముతో కూడిన ఆహార పదార్థాలను తయారుచేయడం చూశారు. అప్పుడే ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రజలకు అందించాలనే ఆలోచన తనకు తోచింది. సొంతంగా తానే పౌష్టిక ఆహార ఉత్పత్తులను తయారు చేసి తనలాంటి ఆరోగ్య ప్రియులకు అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచనతో ‘ఓపెన్ సీక్రెట్’ పేరుతో రుచికరమైన పోషకాలతో కూడిన చిరుతిళ్లను ఉత్పత్తి చేసే కంపెనీని 2019లో స్థాపించారు. బయట మార్కెట్లో లభిస్తున్న ఫ్యాటీ ఫుడ్స్కు దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ పోషకాహార ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నారు. దాంతో అహానా ఉత్పత్తులు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. దీనికి తోడు అవి గొప్ప రుచి, పోషకాహారాన్ని కలిగి ఉన్నందున వ్యాపారం ఊపందుకుంది. ముప్పై ఏళ్ల వయస్సులో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించిన అహానా ప్రస్తుతం ‘ఓపెన్ సీక్రెట్’ కంపెనీకి సీఈవోగా కొనసాగుతున్నారు. అమెరికాలో భారీగా సంపాదిస్తున్నప్పటికీ ఆ ఉద్యోగాన్ని వదిలేసి ప్రస్తుతం రూ.100 కోట్ల విలువైన ఆహార ఉత్పత్తుల సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అహానా గోద్రెజ్ టైసన్ ఫుడ్స్ లిమిటెడ్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్గా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. ఇదీ చదవండి: యాప్లు అవసరంలేని మొబైల్ ఫోన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా.. గతంలో చదువు అయిపోయాక నాలుగు ఏళ్లు ప్రోక్టర్ అండ్ గాంబుల్లోనూ పనిచేశారు. కృత్రిమ రంగులు, రుచులు, జంక్ ఫుడ్ నుంచి భారతీయులకు పూర్తిగా పౌష్టికాహారాన్ని అందించే దిశగా కృషిచేస్తున్నట్లు అహానా లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. -
Ambitio: ధైర్యం ఇస్తూ... దారి చూపుతూ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో విదేశీ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ను సులభతరం చేసి ‘అంబిటియో’ పేరుతో ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు ఐఐటీ గ్రాడ్యుయేట్స్ దీర్ఘాయు కౌశిక్, విక్రాంత్ శివాలిక్, వైభవ్ త్యాగీ. మన దేశంలోని తొలి ఏఐ అడ్మిషన్ ప్లాట్ఫామ్ ‘అంబిటియో’ విజయపథంలో దూసుకు΄ోతోంది.... ఐఐటీ–బీహెచ్యూ(వారణాసి)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కౌశిక్ ఫారిన్ యూనివర్శిటీలో ఎంబీఏ చేయడం కోసం అప్లై చేయాలనుకున్నప్పుడు స్టూడెంట్స్కు సహాయపడే ప్లాట్ఫామ్లాంటిదేమీ తనకు కనిపించలేదు. ‘విదేశీ యూనివర్శిటీలలో చేరే విషయంలో సహాయం అందించడానికి కౌన్సెలర్లు ఉన్నప్పటికీ ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ఆ ఆర్థికభారం అందరికీ సాధ్యం కాదు. మరో విషయం ఏమిటంటే వారు ఒకటి రెండు కాలేజిల గురించి మాత్రమే చెబుతారు’ అంటాడు కౌశిక్. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్స్కు సంబంధించి కాలేజి అప్లికేషన్స్, సరిౖయెన కాలేజీ ఎంపిక చేసుకోవడం, పర్సనల్ ఎస్సేస్...మొదలైన వాటి గురించి ఒక ప్లాట్ఫామ్ను క్రియేట్ చేయాలనుకున్నాడు. కాలేజీ ఫ్రెండ్స్ విక్రాంత్, వైభవ్ త్యాగీలకు తన ఆలోచన చెప్పాడు. వారికి ఐడియా నచ్చి కౌశిక్తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారు. అలా ‘అంబిటియో’ అంకురం మొలకెత్తింది. ‘అంబిటియో’ ప్లాట్ఫామ్ ద్వారా మొదట పాతిక మంది స్టూడెంట్స్కు టాప్ ఇనిస్టిట్యూట్స్లో అడ్మిషన్ దొరికేలా సహాయం చేశారు. స్టూడెంట్స్ ్ర΄÷ఫైల్స్పై ప్రధానంగా దృషి పెట్టి వాటికి మార్పులు, చేర్పులు చేశారు. కార్నెగి మెలన్ యూనివర్శిటీ, ఎన్వైయూ, ఇంపీరియల్ కాలేజ్, యూసీ బర్కిలి...మొదలైన ఇంటర్నేషనల్ యూనివర్శిటీలకు సంబంధించి 175 మంది స్టూడెంట్స్కు సహాయపడ్డారు. ‘అంబిటియో గురించి తెలియడానికి ముందు ఒక కౌన్సెలర్ సలహాలు తీసుకున్నానుగానీ అవి నాకు ఉపయోగపడలేదు. అంబిటియో ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సరిౖయెన దారి కనిపించింది’ అంటున్న ప్రహార్ కమల్కు లండన్లోని వార్విక్ బిజినెస్ స్కూల్లో ప్రవేశం దొరికింది. ‘అంబిటియో’ ప్లాట్ఫామ్లో ఏఐ ఎలా ఉపకరిçస్తుంది అనేదాని గురించి కో–ఫౌండర్, సీయీవో కౌశిక్ మాటల్లో... ‘రెండు ప్రైమరీ ఏరియాలలో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మోస్ట్ సూటబుల్ ప్రోగ్రామ్ లేదా యూనివర్శిటీని ఎంపిక చేసుకోవడంలో స్టూడెంట్స్కు సహాయపడడం అందులో ఒకటి. తమకు అర్హత ఉన్న కోర్సులను ఫిల్టర్ చేసి చూడడానికి ప్రస్తుతం ఫిల్టరేషన్ టూల్స్ ఉన్నప్పటికీ మేము ఏఐ ద్వారా మరో అడుగు ముందుకు వేశాం’ విస్తృతస్థాయిలో సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఈ ప్లాట్ఫామ్ పర్సనలైజ్డ్ రికమండేషన్లను వేగంగా అందిస్తూ స్టూడెంట్స్ టైమ్ను సేవ్ చేస్తుంది. ‘స్టూడెంట్స్ తమకు అవసరమైన కాలేజీని ఎంపిక చేసుకున్న తరువాత, తదుపరి దశ అద్భుతమైన వ్యాసం రాయడం. వివిధ యూనివర్శిటీలకు సంబంధించి 5,000 వ్యాసాలతో మా మోడల్కు శిక్షణ ఇచ్చాం. సరిౖయెన కాలేజిని ఎంపిక చేసుకోవడం నుంచి స్కాలర్షిప్కు అప్లై చేసుకోవడం వరకు మా ప్లాట్ఫ్లామ్లో అన్నీ ఉచితమే’ అంటున్నాడు కౌశిక్. ఏంజెల్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ 1.5 కోట్ల నిధులను సమీకరించింది. ‘భారత్ మార్కెట్లో వేగంగా దూసుకు΄ోయి మరింతగా విస్తరించాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు కౌశిక్. యూనివర్శిటీలలో అడ్మిషన్లకు సంబంధించి విద్యార్థులకు ఇంటెలిజెంట్ డిజిటల్ అడ్వైజర్లుగా సేవలు అందించడమే మా లక్ష్యం. – దీర్ఘాయు కౌశిక్, అంబిటియో–సీయీవో, కోఫౌండర్ -
స్పేస్ స్టార్టప్లకు కొత్త జోష్
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడంతో స్పేస్ స్టార్టప్లకు మరింత ఊతం లభించగలదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. లాంచ్ వెహికల్స్, ఉపగ్రహాల తయారీ, అసెంబ్లింగ్ మొదలైన విభాగాల్లో అంకుర సంస్థలకు ప్రోత్సాహం దక్కగలదని పేర్కొన్నారు. అలాగే, భారతీయ కంపెనీలు అంతర్జాతీయ అంతరిక్ష రంగ సరఫరా వ్యవస్థల్లో మరింతగా భాగం అయ్యేందుకు కూడా ఇది తోడ్పడగలదని డెలాయిట్ పార్ట్నర్ శ్రీరామ్ అనంతశయనం, నాంగియా ఆండర్సన్ ఇండియా డైరెక్టర్ మయాంక్ ఆరోరా తదితరులు చెప్పారు. అంతరిక్ష రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా విదేశీ పెట్టుబడులను 100 శాతం అనుమతిస్తూ ఎఫ్డీఐ నిబంధనలను కేంద్రం సడలించిన సంగతి తెలిసిందే. వీటి ప్రకారం ఉపగ్రహాల సబ్–సెక్టార్ను మూడు వేర్వేరు విభాగాలుగా వర్గీకరించారు. ఉపగ్రహాల తయారీ.. కార్యకలాపాలు, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన వాటిలో 74 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో, అంతకు మించితే ప్రభుత్వ అనుమతులు అవసరమవుతాయి. అలాగే, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్లు మొదలైన వాటిలో 49 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతి ఉంటుంది. అది దాటితే ప్రభుత్వ ఆమోదం ఉండాలి. శాటిలైట్ల కోసం విడిభాగాలు, సిస్టమ్స్ మొదలైన వాటిలోకి 100 శాతం ఎఫ్డీఐలకు అనుమతి ఉంటుంది. గణాంకాల ప్రకారం దేశీయంగా స్పేస్ విభాగంలో దాదాపు 200 పైచిలుకు స్టార్టప్లు ఉన్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష ఎకానమీలో భారత ప్రైవేట్ స్పేస్ రంగం వాటా కేవలం రెండు శాతంగా ఉంది. 2040 నాటికి ఇది 10 శాతానికి చేరవచ్చని అంచనాలు ఉన్నాయి. -
ఇన్నోవేటర్స్..తక్కువ ఖర్చుతో అద్భుత ఆవిష్కరణలు!
పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న వారి కోసం తక్కువ ధరలో, సౌకర్యవంతమైన ఇయర్ ఇంప్లాంట్ను డెవలప్ చేశారు మదురైకి చెందిన ట్విన్స్ రామన్, లక్ష్మణన్. బోయింగ్ ఇండియా (బెంగళూరు) బోయింగ్ యూనివర్శిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ అండ్ డెవలప్మెంట్(బిల్డ్) గ్రాంట్ ΄పొందిన వారిలో రామన్, లక్షణన్ ఒకరు...పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న అమ్మాయికి తల్లిదండ్రులు వైద్యం చేయించాలనుకున్నారు. తమ ఆస్తిని అమ్మగా వచ్చిన డబ్బుతో కూతురుకి నెల రోజులు మాత్రమే వైద్యం చేయించగలిగారు. ఈ విషయం రామ్, లక్షణ్ సోదరులకు తెలిసింది. ఈ ట్విన్స్ మదురైలోని ఒక కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చదువుతున్నారు. స్క్రాప్ మెటీరియల్తో వెంటిలేటర్ను తయారుచేయాలని ప్రయత్నిస్తున్న సోదరులు అమ్మాయి విషయం తెలిసిన తరువాత ఇయర్ ఇంప్లాంట్ను డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నారు. పుట్టుకతో వచ్చే వినికిడి లోపానికి చికిత్స చేయడానికి నాన్–ఇన్వేసివ్ హియరింగ్ ఇంప్లాంట్ డెవలప్ చేయడంలో విజయం సాధించారు. సంప్రదాయ ఇంప్లాంట్లతో పోల్చితే దీని ధర తక్కువ. ఫస్ట్ ప్రోటోటైప్ను తమ పెరట్లో(బ్యాక్ యార్డ్)లో క్రియేట్ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తమ వేంచర్కు ‘బ్యాక్యార్డ్ క్రియేటర్స్’ అని పేరు పెట్టుకున్నారు. ఖర్చును తగ్గించడం తోపాటు సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఇంప్లాంట్ ఇది. బోయింగ్ యూనివర్శిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ అండ్ డెవలప్మెంట్ (బిల్డ్–బెంగళూరు) గ్రాంట్ పొందిన విజేతల్లో రామ్,లక్ష్మణన్లు ఉన్నారు. చెవి వెనుక భాగంలో ఉంచే ఈ పరికరం విద్యుత్ తరంగాలను విడుదల చేసి నరాలను తాకి ఉత్తేజపరుస్తుంది. ఎలాంటి అసౌకర్యం లేకుండా వినడానికి సహాయపడుతుంది. ‘మాగ్నటిక్ ఇంప్లాంట్కు ఉండే పరిమితులు మా డివైజ్లో ఉండవు’ అంటున్నాడు రామన్. మన దేశంలో ప్రారంభ దశ స్టార్టప్లను ప్రొత్సహించడానికి 2019లో ‘బిల్డ్’ను ప్రారంభించారు. కస్టమర్ సెగ్మెంటేషన్ గురించి ఎంత బాగా ఆలోచించారు....మొదలైన విషయాల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది 1200 ఐడియాలు వచ్చాయి. ‘గ్రాంట్’ మొదలైనప్పటి నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఐడియాలు రావడం ఇదే మొదటిసారి. ఒక్కో స్టార్టప్కు పది లక్షల రూపాయలు ఇస్తారు. రామన్, లక్ష్మణన్లతో ΄ాటు ప్రిత్వీష్ కుందు (గ్రీన్ ఎనర్జీ ఫర్ ఏవియేషన్ సెక్టార్), ఐశ్వర్య కర్నాటకి, పరీక్షిత్ మిలింద్ సోహోని–ముంబై (గ్లోవట్రిక్స్–సైన్లాంగ్వేజ్ను స్పీచ్ అంట్ టెక్ట్స్లోకి ట్రాన్స్లెట్ చేసే పరికరం), సత్యబ్రత శతపథి–ఒడిషా (బన్వీ ఏరో), దేవేంద్ర ప్రధాన్, బిశ్వజిత్ (సిటీపీఎల్–భువనేశ్వర్)లు ‘బిల్డ్’ గ్రాంట్కు ఎంపికైన వారిలో ఉన్నారు. అండర్ వాటర్ రోబోటిక్స్.. మన దేశంలో డ్యామ్లు, బ్రిడ్జీలు... మొదలైన వాటికి సంబంధించిన అండర్వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ఇన్స్పెక్షన్, ఆపరేషన్ అనేది సవాలుగా మారింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలాలో చదువుకున్న దేవేంద్ర ప్రధాన్, బిశ్వజిత్ ఈ సమస్యకు పరిష్కారం కనుకొన్నారు. అండర్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్యవేక్షణను వేగవంతం, సురక్షితం చేయాలనే లక్ష్యంతో ‘సిటీపీఎల్’ కంపెనీ స్థాపించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఏఐ–బేస్డ్ టెక్నాలజీతో అటానమస్ అండర్వాటర్ వెహికిల్(ఏయూవీ), రిమోట్లీ ఆపరేట్ వెహికిల్(ఆర్వోవీ)ని డెవలప్ చేశారు. ‘అండర్వాటర్ రోబోటిక్స్కు సంబంధించిన రంగంలో మన దేశంలో నాలుగు స్టార్టప్లు మాత్రమే ఉన్నాయి. అందులో సిటీపీఎల్ ఒకటి’ అంటున్న దేవేంద్ర మెర్సిడెస్ బెంజ్ ‘ఆర్ అండ్ డీ’ విభాగంలో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని జర్మనీ నుంచి ఇండియాకు వచ్చి బిస్వజిత్తో కలిసి ‘సిటీపీఎల్’ను స్టార్ట్ చేశాడు. మెకట్రోనిక్స్, ఆటోమేషన్ ఇంజనీరింగ్ చేసిన బిశ్వజిత్ స్టార్టప్ కోసం చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు. (చదవండి: 'శబ్దమే శాపం' ఆమెకు! అత్యంత అరుదైన వ్యాధి..ఆఖరికి పిల్లల నవ్వులు కూడా..!) -
20 ఏళ్లకే క్యాన్సర్.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్..
ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలు ఈ రోజు ఆకాశంలో సగం అన్నట్టు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. కేవలం ఉద్యోగాలకు మాత్రమే పరిమితం కాకుండా పారిశ్రామిక వేత్తలుగా వ్యాపార సామ్రాజ్యాలను సృష్టిస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'కనికా టేక్రీవాల్'. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సృష్టించిన సామ్రాజ్యం ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. 1990లో భోపాల్లోని మార్వాడీ కుటుంబంలో జన్మించిన కనికా టేక్రీవాల్.. స్కూల్ ఏజికేషన్ మొత్తం లారెన్స్, లవ్డేల్ పాఠశాలల్లో పూర్తి చేసి, కోవెంట్రీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత 2012లో జెట్సెట్గో (JetSetGo) సంస్థ స్థాపించి అతి తక్కువ సమయంలో సక్సెస్ సాధించి.. అతి చిన్న వయసులోనే కంపెనీని సక్సెస్పుల్గా నడిపిస్తూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. చదువుకునే రోజుల్లో క్యాన్సర్ భారిన పడిన కనికా టేక్రీవాల్ ఆ సమయంలో తనను తాను మోటివేట్ చేసుకోవడానికి మంచి బుక్స్ చదివింది. క్యాన్సర్ వ్యాధితో పోరాడి మళ్ళీ సైక్లింగ్ ట్రాక్లో పడిన 'లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్' (Lance Armstrong) జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని తనకు తానే ధైర్యం తెచ్చుకుని జెట్సెట్గో స్టార్ట్ చేసింది. 2012లో కంపెనీ ప్రారంభించిన తరువాత దేశంలోనే గుర్తింపు పొందిన సంస్థగా ఎదిగి 6000 విమానాలను విజయవంతంగా నడుపుతూ ఏవియేషన్ స్టార్టప్ రంగంలో తనదైన ముద్ర వేసింది. ఇందులో చార్టడ్ ఫ్లైట్స్, హెలికాఫ్టర్ కూడా ఉన్నట్లు సమాచారం. నేడు వ్యాపార రంగంలో తనదైన రీతిలో ఎదుగుతూ.. 33 సంవత్సరాల వయసులో 10 సొంత ప్రైవేట్ జెట్లను కలిగి.. సుమారు రూ. 420 కోట్లకు అధినేతగా నిలిచింది. ఇదీ చదవండి: మస్క్, జుకర్బర్గ్ ఎలాంటి వారంటే! చెన్నై నుంచి వెళ్లిన తరువాత.. 20 సంవత్సరాల వయసులో క్యాన్సర్ భారిన పడి రెండేళ్ల కాలంలో కోలుకుని, సంస్థ ప్రారంభించి, ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తూ.. 33 ఏళ్ల వయసులో రూ. 420 కోట్లు సంపాదించగలిగిందంటే.. దాని వెనుక కనికా టేక్రీవాల్ కృషి అన్యన్య సామాన్యమనే చెప్పాలి. ఇది ఎంతోమంది యువతకు మార్గదర్శం కావాలి. -
Pearl Kapur మూడు నెలల్లోనే రూ. 9800 కోట్లు : ఎలా బ్రో..?!
భారతదేశం వందలాది బిలియనీర్లకు నిలయం. అంతేకాదు ది ల్యాండ్ ఆఫ్ స్టార్టప్స్ కూడా. కొత్త పరిశ్రమలకు, ప్రతిభావంతులకు కొదవ లేదు. కొత్త వ్యాపారాలతో బిలియనీర్లుగా అవతరిస్తున్న యువ పారిశ్రామికవేత్తలు చాలామందే ఉన్నారు. అయితే 27 ఏళ్ల యువకుడి సక్సెస్ విశేషంగా నిలుస్తోంది.వ్యాణిజ్య దిగ్గజాలను సైతం అబ్బుర పరుస్తోంది. బిలియనీర్లు అనగానే తక్షణమే గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, టాటా లాంటి వ్యాపార దిగ్గజాలు గుర్తొస్తారు. వీరికి వ్యాపార కుటుంబ నేపథ్యంతోపాటు ఎన్నో ఏళ్ల శ్రమ ద్వారా ఈ స్థాయికి ఎదిగారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతమిచ్చారు. ఆశ్చర్యకరంగా చిన్న వయస్సులోనే వారి సక్సెస్ స్టోరీలను తిరగరాశాడో యువ పారిశ్రామికవేత్త. అతి చిన్న వయసులోనే కోటీశ్వరుడయ్యాడు పెరల్ కపూర్. భారతదేశపు అతి పిన్న వయస్కుడైన బిలియనీర్గా తన పేరును లిఖించుకున్నాడు. గుజరాత్కు చెందిన పెరల్ కపూర్ Zyber 365 అనే కంపెనీని ప్రారంభించాడు. ఈ కంపెనీలో కపూర్ వాటా 90 శాతం. అలాగే స్రామ్ & మ్రామ్ గ్రూప్ 8.3 శాతం పెట్టుబడి పెట్టింది. తొలి పెట్టుబడుల సమీకరణలో భాగంగా 100 మిలియన్ డాలర్లను సంపాదించింది. అలా ఇండియా యునికార్న్ ర్యాంకింగ్లో 109వ స్థానాన్ని పొందింది. గత ఏడాది మే నెలలో ఆవిర్భవించిన ఆ కంపెనీ కేవలం 90 రోజుల్లోనే రూ. 9,840 కోట్ల స్థాయికి ఎదిగింది. ఇది వెబ్3 , AI-ఆధారిత OS స్టార్ట్-అప్. ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన కంపెనీని యునికార్న్ అంటారు. కేవలం మూడు నెలల్లో యునికార్న్గా ఆవిర్భవించింది. లండన్లో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీ భారతదేశం, ఆసియాలో అత్యంత వేగవంతమైన యునికార్న్గా ప్రశంసలందుకుంటోంది. త్వరలోనే ఇండియా ప్రధాన కేంద్రంగా పనిచేయాలని భావిస్తోంది. క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి MSC ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ (CFA పాత్వే) గ్రాడ్యుయేట్ అయిన కపూర్, Web3 టెక్నాలజీ రంగంలో గొప్ప ఆవిష్కర్తగా గుర్తింపు పొందారు. జైబర్ 365కి ముందు, కపూర్ AMPM స్టోర్లో ఆర్థిక సలహాదారుగా, యాంటీయర్ సొల్యూషన్స్ బిజినెస్ సలహాదారుగానూ పనిచేశారు. సొంత కంపెనీ పెట్టాలన్న అతని బలమైన కోరిక 2022, ఫిబ్రవరిలో బిలియన్ పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కి నాంది పలికింది. అలా మొదలైన ప్రయాణం స్టార్టప్ Zyber 365, బిలియనీర్ హొదా దాకా ఎదిగింది. -
తొలిసారిగా మానవ మెదడులో విజయవంతంగా చిప్ ఇంప్లాంటేషన్!
నేరుగా మనుషుల మెదడులోకి చిప్ని ప్రవేశపెట్టే ప్రయోగాలకు టెస్లా అధినేత ఇలాన్ మస్క్కు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. మనిషి మెదడును నేరుగా కంప్యూటర్లతో లింక్ చేయడమే ఈ ప్రయోగం ఉద్దేశం. అమెరికా ప్రభుత్వ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) నుంచి ఈ అనుమతి లభించడంతో ఈ సరికొత్త ఆవిష్కరణకు నాందిపలికింది ఇలాన్ మస్క్ స్టార్ట్ప్ కంపెనీ న్యూరాలింక్. తొలుత కోతుల మెదడులో ఈ చిప్ అమర్చి ప్రయోగాలు చేయగా, అవి సత్ఫలితాలు ఇవ్వడంతో మానవులపై ప్రయోగాలకు సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో ఓ రోగి బ్రెయిన్లో న్యూరాలింక్ తొలిసారిగా వైర్లెస్ బ్రెయిన్ చిప్ని అమర్చింది. ఈ విషయాన్ని ఇలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా మంగళవారం వెల్లడించారు. సదరు రోగి కూడా కోలుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈ చిప్ ఇంప్లాంటేషన్ చిన్నపాటి సర్జరీ అమర్చుతారు . 'ఇన్వాసిస్' అనే సర్జరీ ద్వారా మెదడులో ఐదు నాణేలతో పేర్చబడినట్లు ఉండే చిప్ని అమర్చినట్లు న్యూరాలింక్ పేర్కొంది. ఇది లింక్ అనే ఇంప్లాంట్ ద్వారా పనిచేస్తుంది. మస్క్ కంపెనీ చేస్తున్న ప్రయోగం సత్ఫలితాలిస్తే బ్రెయిన్ మెషిన్ లేదా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ రీసెర్చ్లో గొప్ప పురోగతి లభించినట్లు అవుతుంది. దీనివల్ల నాడీ సంబంధ సమస్యలు, వెన్నుపూస గాయాలతో కాళ్లు, చేతులు చచ్చుబడ్డవారు తమ అవయవాలను కదిలించేందుకు ఈ ఆవిష్కరణ ఎంతగానో సాయపడుతుందని మస్క్ చెబుతున్నారు. అంతిమంగా ఈ ప్రయోగంతో 'మానవాతీత శక్తి'ని పొందగలుగుతాం. అంతేగాదు ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతమయ్యితే గనుక మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞాన విప్లవానికి తెరలేపినట్లు అవుతుంది. మెదడులో చిప్ అమర్చేది ఇలా.. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్లో మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. అందువల్ల సమీపంలోని కణజాలానికి నష్టం ఉండదు. చిప్ను సురక్షితంగా, అత్యంత కచ్చితత్వంతో, చిన్నపాటి సర్జరీతో నేరుగా అమర్చేందుకు ప్రత్యేకంగా ఒక రోబోను 'న్యూరాలింక్' అభివృద్ధి చేసింది. చిప్లోని బ్యాటరీ వైర్లెస్ పద్ధతిలో ఛార్జి అవుతుంది. అందువల్ల దీన్ని ధరించినవారు సాధారణంగానే కనిపిస్తారు. కంటికి చేసే లేసిక్ సర్జరీ తరహాలో భవిష్యత్లో చాలా సులువుగా, తక్కువ ఖర్చుతో బీసీఐ(బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ చిప్)లను అమర్చే స్థాయికి పరిజ్ఞానాన్ని ఆధునికీకరించాలని మస్క్ భావిస్తున్నారు. ఈ సాధనాన్ని మెదడుకు దూరంగా పెడితే సంకేతాలను కచ్చితత్వంతో గుర్తించడం సాధ్యం కాదు. అందువల్లే పుర్రెలో అమర్చాల్సి వస్తోంది. పనిచేసేది ఇలా.. ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి ఎన్1 చిప్కు పంపుతాయి. ఒక చిప్లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్లను ప్రవేశపెట్టొచ్చు. ఇన్స్టాల్ అయ్యాక ఈ బీసీఐ.. మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథమ్లుగా మారుస్తుంది. కలిగే ప్రయోజనాలు.. న్యూరాలింక్ బీసీఐ చిప్ .. మానవులు, కంప్యూటర్ల అనుసంధానానికి బాటలు వేస్తుంది. ఆలోచనశక్తి ద్వారా.. తాకాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లను ఆపరేట్ చేసేందుకు ఇది సాయపడుతుందని ఆ సంస్థ చెబుతోంది. భవిష్యత్లో ఈ సాధనంతో ఎన్నో అద్భుతాలను సాధించొచ్చని పేర్కొంది. నాడీ సమస్యలు, వెన్నుపూసకు గాయాలు, పక్షవాతం వంటి వాటివల్ల కాళ్లు, చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ, కదలికలను మెరుగుపరిచే వీలుంది. వీరు సులువుగా ఉపకరణాలను ఉపయోగించగలుగుతారు. దీర్ఘకాలంలో వీరి అవయవాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే వీలుంది. డిమెన్షియా, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధి, మానసిక సమస్యల చికిత్స కోసం వాడొచ్చు. ఆలోచన శక్తి సాయంతో టెక్స్ట్ లేదా స్వర సందేశాలతో కమ్యూనికేషన్ సాగించడానికి, బొమ్మలు గీయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఈ చిప్ సాయంతో హార్మోన్ స్థాయిని కూడా నియంత్రించొచ్చు. కుంగుబాటును దూరం చేసుకోవచ్చు. అవసరమైన నైపుణ్యాలను మెదడులోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటి చూపును, వినికిడి పరిధిని పెంచుకోవచ్చు. అంతేగాదు సుదీర్ఘ భవిష్యత్లో దీనివల్ల ‘మానవాతీత విషయగ్రహణ సామర్థ్యం’ (సూపర్ హ్యూమన్ కాగ్నిషన్) సాధించడమే తమ లక్ష్యమని మస్క్ చెబుతున్నారు. కృత్రిమ మేధపై పోరాటానికి ఇది అవసరమని స్పష్టంచేస్తున్నారు. అవసరమైతే ఏఐతో 'సురక్షిత సహజీవనం' చేయడానికీ ఇది సాయపడుతుందని కూడా చెబుతున్నారు. (చదవండి: షుగర్ని ఎంతలా స్వాహ చేసేస్తున్నామో తెలుసా? ఎలాంటి చక్కెర్లు బెటర్?) -
'దీపెన్' దారి దీపం..
'సమస్య గురించి నిట్టూర్చేవారు కొందరు. సమస్యకు పరిష్కారం వెదకాలని ప్రయత్నించేవారు కొందరు. దీపెన్ బబారియా రెండో కోవకు చెందిన వ్యక్తి. కాలేజీ రోజుల్లో ఎదురైన సమస్య స్టార్టప్ ఐడియాకు ఊపిరి పోసింది. ఇనోవేటర్గా, ‘రోడ్మాట్రిక్స్’ రూపంలో సక్సెస్ఫుల్ ఎంటర్ ప్రెన్యూర్గా దీపెన్ను మార్చింది..' దీపెన్ బబారియా అతని ఫ్రెండ్ ఒకరోజు రాత్రి పనిపై బైక్పై ఎక్కడికో వెళుతున్నారు. లొకేషన్ తెలియక నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్ను ఓపెన్ చేశారు. ‘ఫాస్టెస్ట్ రూట్’ అని చూపించింది. తీరా చూస్తే అది గుంతలతో కూడిన రోడ్డు. మరోవైపు స్ట్రీటు లైట్లు లేకపోవడంతో బైక్ ముందుకు వెళ్లడానికి ఇబ్బంది ఎదురైంది. ‘దూరం, వేగాన్ని లెక్కలోకి తీసుకొని ఈ మ్యాప్స్ షార్టెస్ట్ రూట్ను గుర్తిస్తాయి తప్ప అధ్వానంగా ఉన్న రోడ్లను మాత్రం గుర్తించవు’ అంటున్న దీపెన్ ఈ సమస్యకు ఏఐ ద్వారా పరిష్కారం చూపాలని కాలేజిరోజులలో గట్టిగా అనుకున్నాడు. సూరత్(గుజరాత్)కు చెందిన దీపెన్ ఏఐ స్పెషలైజేషన్తో ఇంజనీరింగ్ చదువుకుంటున్న రోజుల్లో రోడ్ల స్థితిగతులను తెలిజేసే అప్లికేషన్ను మొబైల్ ఫోన్ల కోసం రూపొందించానుకున్నాడు. ఈ ఆలోచన క్రమంగా పెరిగి పెద్దదై స్టార్టప్ రూపం తీసుకుంది. ఎంటర్ప్రెన్యూర్గా రాణించాలనే కలతో స్టార్టప్ల కేంద్రం అయిన బెంగళూరులో అడుగు పెట్టాడు దీపెన్. అక్కడ దీపెన్ ఐడియాపై నిఖిల్ ప్రసాద్ ఆసక్తి చూపించాడు. యూఎస్లో ఆటోమోటివ్ కారు కంపెనీలలో పని చేసిన నిఖిల్ ఇండియాకు తిరిగి వచ్చాడు. స్టార్టప్ కో–ఫౌండర్లలో నిఖిల్ ఒకరు. తక్కువ సమయంలోనే ఈ స్టార్టప్పై ఇన్వెస్టర్లు ఆసక్తి ప్రదర్శించారు. 100ఎక్స్.వీసి ఫస్ట్ ఫండింగ్ చేసింది. రోడ్ మేనేజ్మెంట్ ప్లానును అందించే ఏఐ–బేస్డ్ స్టార్టప్ ‘రోడ్మెట్రిక్స్’ బెంగళూరు కేంద్రంగా ్రపారంభమైంది. ‘కాలేజీరోజుల్లో ఎన్నో ప్రాజెక్ట్ల్లో పనిచేసిన నాకు ఎంటర్ప్రెన్యూర్గా ప్రయాణం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా అనిపించింది. రోడ్డు సేఫ్టీ అనేది ముఖ్యమైన అంశం. అయితే రోడ్డు హెల్త్ను తెలియజేసే సాఫ్ట్వేర్లు మన దగ్గర లేవు. ఈ లోటును పూరించేలా రోడ్మెట్రిక్స్ను తీసుకువచ్చాం’ అంటాడు దీపెన్. మొబైల్ ఆధారిత సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలని మొదట్లో అనుకున్న ఐడియాపై వర్క్ చేశాడు దీపెన్. మొబైల్ అప్లికేషన్గా పనిచేసే సెన్సర్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం బాగున్నప్పటికీ వైబ్రేషన్స్ను క్యాప్చర్ చేయడానికి రోడ్డు ప్రతి భాగంలో డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఇదొక సమస్య. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర కో–ఫౌండర్లతో కలిసి దీపెన్ మరింత రిసెర్చ్ చేసి ఇమేజ్ బేస్డ్, కంప్యూటర్ విజన్ బేస్డ్ సాఫ్ట్వేర్ను డెవలప్ చేశాడు. వీరు రూపొందించిన ఏఐ అల్గారిథమ్ పది రకాల రోడ్ డిఫెక్ట్స్ను గుర్తిస్తుంది. ఫాస్టెస్ట్, మోస్ట్ కంఫర్టబుల్, ట్రాఫిక్లెస్ రోడ్లను గుర్తించడానికి వినియోగదారులకు ఉపకరించే రోడ్మెట్రిక్స్ మ్యాప్స్ను కూడా అభివృద్ధి చేశారు. మొదట బెంగళూరు, ముంబై రోడ్లను మ్యాపింగ్ చేసిన తరువాత అస్సాం, బిహార్లలో కూడా పనిచేశారు. ‘మా సాఫ్ట్వేర్ అంచనా వేసిన డ్యామేజ్ రిపోర్ట్ల ఆధారంగా మున్సిపాలిటీలు, ప్రైవేటు సంస్థలు నిధుల కేటాయింపు గురించి సరిౖయెన నిర్ణయం తీసుకోవచ్చు’ అంటున్న దీపెన్ రోడ్డు సమస్యలను గుర్తించడంలో జంషెడ్పూర్లోని టాటాగ్రూప్నకు సహాయం అందించాడు. టాటా గ్రూప్, మహీంద్రా గ్రూప్తో కలిసి పనిచేస్తున్న ‘రోడ్మెట్రిక్స్’ ప్రభుత్వ మున్సిపాలిటీలతో పనిచేయడానికి చర్చలు జరుపుతోంది. మన దేశంలో వేలాది కిలోమీటర్లు కవర్ చేసిన కంపెనీ ఇక్కడితో ఆగిపోలేదు. ‘సిటీ ఆఫ్ లండన్’ మ్యాపింగ్ కూడా స్టార్ట్ చేసింది. అక్కడ కూడా స్టార్టప్కు క్లయింట్స్ ఉన్నారు. ‘మన రహదారులను సాధ్యమైనంత సురక్షితంగా మార్చాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలనుకుంటున్నాం’ అంటున్నాడు దీపెన్ బబారియ. ‘రోడ్ మెట్రిక్స్’ స్టార్టప్ మొబిలిటీ ఏఐ గ్రాండ్ ఛాలెంజ్, బెస్ట్ ఏఐ స్టార్టప్ అవార్డ్తో సహా ఎన్నో అవార్డ్లను సొంతం చేసుకుంది. ఇవి చదవండి: వీధి కుక్క దాడిలో చేతిని కోల్పోయిన మహిళ..ట్విస్ట్ ఏంటంటే..? -
అంకురాల అభివృద్ధిలో మనమెక్కడ..?
భారత ఆర్థిక వ్యవస్థకు అంకుర సంస్థలు కొత్త ఊపు తెస్తున్నాయి. స్టార్లప్ల రూపంలో కొత్తదనాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రాయితీలు అందిస్తున్నాయి. అందుకు అనువుగా ఒడుదొడుకులను తట్టుకొని ముందుకు సాగేలా వాటి వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తున్నాయి. యువ జనాభా అధికంగా ఉన్న భారతదేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటికి రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకు రుణాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య అభివృద్ధి విభాగం (డీపీఐఐటీ) గుర్తింపు పొందిన అంకుర సంస్థలకు పన్ను రాయితీలు, ఆర్థిక సహాయంతో పాటు మేధాహక్కులూ వేగంగా మంజూరు అవుతున్నాయి. భారత్లో దాదాపు 110 యూనికార్న్ కంపెనీలు.. ప్రపంచంలో అంకురాల సంఖ్యలో భారత్ మూడో స్థానాన్ని ఆక్రమిస్తోంది. 2023 అక్టోబరు నాటికి దేశంలోని 763 జిల్లాల్లో డీపీఐఐటీ గుర్తింపు పొందిన 1,12,718 అంకురాలు వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రపంచంలో నవీకరణ, నాణ్యత పరంగా చూస్తే మన స్టార్టప్లు రెండో స్థానంలో నిలుస్తున్నాయి. 100 కోట్ల డాలర్ల విలువ సాధించిన అంకురాలను యూనికార్న్లుగా వ్యవహరిస్తారు. అలాంటివి భారత్లో 110 వరకు ఉన్నాయి. అమెరికా, చైనాల తరవాత ఇంత పెద్ద సంఖ్యలో యూనికార్న్లు ఉన్నది భారత్లోనే. ఒక్క 2022లోనే భారత్లో 42 టెక్నాలజీ అంకురాలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ వెన్నుదన్నుతో ఇవి సాధిస్తున్న విజయాలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఐదు విభాగాల్లో డీపీఐఐటీ ర్యాంకింగ్లు.. స్టార్టప్ల వృద్ధికి అనుకూలమైన ఎకోసిస్టమ్ను నిర్మించడానికి 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఇటీవల ఐదు రకాల ర్యాంకులను ఇచ్చింది. ఇందులో బెస్ట్ పర్ఫార్మర్స్, టాప్ పర్ఫార్మర్స్, లీడర్స్, ఆస్పైరింగ్ లీడర్స్, ఎమర్జింజ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ విభాగాల్లో గుర్తింపు ఇస్తున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను వాటి జనాభా ఆధారంగా రెండు విభాగాలుగా విభజించారు. కోటి జనాభా కంటే ఎక్కువ ఉన్నవి, కోటి కంటే తక్కువ ఉన్నవిగా వర్గీకరించారు. ‘లీడర్స్’ కేటగిరీలో ఏపీ టాప్.. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలను 'లీడర్స్' కేటగిరీలో చేర్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, త్రిపుర వరుస స్థానాల్లో ఉన్నాయి. ఆంత్రప్రెన్యూర్ల కోసం బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడంలో గుజరాత్, కర్ణాటకలు బెస్ట్ పర్ఫార్మర్లుగా ర్యాంకులు తెచ్చుకున్నాయి. ఇదే లిస్టులో కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ తరువాత స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ వరుసగా నాలుగోసారి బెస్ట్ స్టేట్గా నిలిచింది. కర్ణాటక ఈ విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయలు టాప్ పర్ఫార్మర్స్గా ఎంపికయ్యాయి. బిహార్, హరియాణా, అండమాన్ నికోబార్ దీవులు, నాగాలాండ్లు ఆస్పైరింగ్ లీడర్స్ విభాగంలో వరుస స్థానాల్లో ఉన్నాయి. ఛత్తీస్గఢ్, దిల్లీ, జమ్మూకాశ్మీర్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, లద్ధాఖ్, మిజోరాం, పుదుచ్చేరి , సిక్కింలు ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ విభాగంలోకి చోటుసాధించాయి. ఇదీ చదవండి: తీరనున్న ఎగిరే ట్యాక్సీ కల! వీటి ఆధారంగానే ర్యాంకింగ్లు.. ఇన్నోవేషన్లను ప్రోత్సహించడం, మార్కెట్ యాక్సెస్, ఇంక్యుబేషన్ ఫండింగ్ సపోర్ట్ వంటి 25 యాక్షన్ పాయింట్ల ఆధారంగా ఈ ర్యాంకులను ఇచ్చామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్లకు ఎలాంటి సాయం అవసరమో తెలుసుకోవాలని అధికారులను కోరారు. స్టార్టప్లు పేటెంట్లు, ట్రేడ్మార్క్ల వంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్లు) నమోదు కోసం డీపీఐఐటీ సాయం తీసుకోవాలని అన్నారు. -
జెప్టో జెట్ స్పీడ్
ఇరవై ఏళ్ల వయసు దాటని వారు ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు ‘ఈ వయసులో ఎందుకు?’ అనే మాట వినిపించడం సాధారణం. కైవల్య వోహ్ర, అదిత్ పలిచా ‘జెప్టో’ స్టార్టప్కు శ్రీకారం చుట్టినప్పుడు కూడా ఇలాంటి మాటలు కాస్త గట్టిగానే వినబడ్డాయి. అయితే ఈ మిత్రద్వయం వెనక్కి తగ్గలేదు. ‘జెప్టో’తో సూపర్ హిట్ కొట్టింది. ‘సక్సెస్కు వయసుతో పనిలేదు’ అని మరోసారి నిరూపించింది. ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ ప్లాట్ఫామ్ ‘జెప్టో’ సూపర్ సక్సెస్ కావడమే కాదు యూనికార్న్ స్టేటస్ సాధించింది. నడక నుంచి పరుగు వరకు ‘జెప్టో’ నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి.... పాఠం నెం 1: క్లారిటీ స్టాన్ఫర్డ్లో కంప్యూటర్ సైన్స్ చదువును వదిలేసి స్వదేశానికి తిరిగి వచ్చిన కైవల్య, అదిత్ల ముందుకు వచ్చి నిలబడిన ప్రశ్న...‘మీరు ఏం చేయాలనుకుంటున్నారో క్లారిటీ ఉందా?’ హండ్రెడ్ పర్సంట్. లాక్డౌన్ సమయంలో వచ్చిన ఐడియాను స్టార్టప్ రూపంలో రోడ్డు ఎక్కించాలంటే ఉత్సాహం మాత్రమే సరిపోదు. సబ్జెక్ట్పై క్లారిటీ ఉండాలి. దీని కోసం ఇ–కామర్స్ ఇండస్ట్రీకి సంబంధించిన సమాచారాన్ని కాచి వడబోసినంత పని చేశారు కైవల్య, ఆదిత్లు. పాఠం నెం 2: నమ్మకం చిన్న వయసు కావడం వల్ల కైవల్య, అదిత్లను ఇన్వెస్టర్లు నమ్మడం అంత తేలికైన విషయం కాదు. ఫండింగ్ విషయంలో ఇది ఇబ్బందిగా మారుతుంది. ‘మీకు ఎలాంటి అనుభవం లేదు కదా. ఎలా నమ్మడం?’ అంటారు. అయితే సక్సెస్ అన్ని సమస్యలకు జవాబు చెబుతుంది. మనపై ఇతరులకు నమ్మకం కలిగిస్తుంది. తొలి అడుగుల్లోనే ‘జెప్టో’ గెలుపు జెండా ఎగరేయడం వల్ల ఫండింగ్ విషయంలో ఇబ్బంది కాలేదు. పాఠం నెం 3: ధైర్యం ‘ఈ పని రాదు అని మేము ఎప్పుడూ భయపడలేదు. ఎందుకు రాదు...ప్రయత్నించి చూద్దాం అనుకొని ముందుకు వెళ్లాం. ఈ క్రమంలో పెద్ద కంపెనీల నుంచి పోటీ ఎదురైంది. ఆ పోటీ నుంచి కూడా ఎన్నో విషయాలను నేర్చుకున్నాం. మేము భయం దగ్గరే ఆగిపోయి ఉంటే మా ప్రయాణం కొనసాగేది కాదు’ అంటాడు ‘జెప్టో’ కో–ఫౌండర్, సీయివో కైవల్య వోహ్ర. స్టార్టప్ మొదలు పెట్టినప్పుడు పెద్ద కంపెనీలతో పోల్చి మాట్లాడుతుంటారు చాలామంది. వారి మాటలకు చిక్కితే భయమే మిగులుతుంది. భయం అనేది అపజయానికి క్లోజ్ఫ్రెండ్. పాఠం నెం 4: టీమ్ స్ట్రెంత్ స్టీవ్ జాబ్స్ను అభిమానించే కైవల్య, అదిత్లకు ఆయన నోటి నుంచి వచ్చిన ‘వ్యాపారంలో గొప్ప విజయాలు అనేవి ఒక వ్యక్తి వల్ల వచ్చేవి కాదు. అది సమష్టి కృషి’ అనే మాట తెలియనిదేమీ కాదు. అందుకే తమ మీద తమకు ఆత్మవిశ్వాసం ఉన్నా అది హద్దులు దాటకుండా చూసుకున్నారు. టీమ్ స్ట్రెంత్ను నమ్ముకున్నారు. వారి నుంచి సలహాలు తీసుకున్నారు. పాఠం నెం 5: రీసెట్ డీఎన్ఏ తమ కంపెనీ తక్కువ టైమ్లోనే ఘన విజయాన్ని సాధించిన సంతోషంలో ‘జెప్టో స్పీడ్’ అనే టర్మ్ను కాయిన్ చేశాడు ‘జెప్టో’ కో–ఫౌండర్, సీయివో అదిత్ పలిచా. అయితే ఈ జెప్టో స్పీడ్కు స్పీడ్ బ్రేకర్లు ఎదురొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి క్లిష్ట సమయాల గురించి అదిత్ పలిచా ఇలా స్పందిస్తాడు ‘మరింత క్రమశిక్షణతో ఉండాలనుకున్న సమయం, సుస్థిరమైన ఎదుగుదల మార్గాలపై మరింత దృష్టి పెట్టాలని అనుకున్న సమయం, కంపెనీ డీఎన్ఏను రీసెట్ చేయాలనుకున్న సమయం అది.’ -
ముగ్గురు మిత్రుల ముచ్చటైన విజయం
‘కాలంతో పాటు నడవాలి’ అంటారు పెద్దలు.‘కాలంతో పాటు నడుస్తూనే భవిష్యత్పై ఒక కన్ను వేయాలి’ అంటారు విజ్ఞులు. అభిషేక్ అనిత, అపూర్వ్ కుషాల్, సంభవ్ జైన్... అనే ముగ్గురు మిత్రులు రెండో కోవకు చెందిన దార్శనికులు. లెర్న్ అండ్ ఎర్న్ ప్లాట్ఫామ్ ‘ఇంట్రాక్ట్’తో వెబ్3 వరల్డ్లో కీలక పాత్ర పోషిస్తున్నారు... ఐటీఐ–దిల్లీలో చదువుకున్న అభిషేక్ అనిత, అపూర్వ్ కుషాల్, సంభవ్ జైన్ సంభాషణాల్లో సరదా విషయాల కంటే సాంకేతిక విషయాలే ఎక్కువగా చోటు చేసుకునేవి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీని మొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారు? వివిధ దేశాల్లో ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు? ఏ రంగాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? మన దేశంలో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు, ఇంటర్నెట్ అభివృద్ధిలో మూడు ప్రధాన దశలు, వెబ్3 టెక్నాలజీతో అపారమైన ఉద్యోగావకాశాలు...ఇలా ఒకటా రెండా బ్లాక్చైన్, క్రిప్టో టెక్నాలజీ, వెబ్3 టెక్నాలజీ గురించి గంటల తరబడి మాట్లాడుకునేవారు. వారు మాట్లాడుకున్న విషయాలేవి వృథా పోలేదు.‘ఇంట్రాక్ట్’ ప్లాట్ఫామ్కు పునాదిగా ఉపయోగపడ్డాయి.ప్రజలకు బ్లాక్ చెయిన్, క్రిప్టో టెక్నాలజీని చేరువ చేయాలనే లక్ష్యంతో 2022లో ‘ఇంట్రాక్ట్’ అనే స్టార్టప్ స్టార్ట్ చేశారు ముగ్గురు మిత్రులు. ‘వెబ్3 టెక్నాలజీకి సంబంధించి కేవలం సమాచార వేదికగానే కాకుండా ప్రతిఫలదాయక వేదికగా ఇంట్రాక్ట్ని నిర్మించాం. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ అనేది ఇంట్రాక్ట్ లక్ష్యం. క్వెస్ట్, ఇంటరాక్టివ్ టాస్కుల ద్వారా బ్లాక్ చెయిన్, క్రిప్టో, వెబ్3 టెక్నాలజీతో యూజర్లను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం’ అంటున్నాడు కో–ఫౌండర్ అభిషేక్.సంక్లిష్టమైన రీతిలో కాకుండా ఫన్ అండ్ ఇంటరాక్టివ్ పద్ధతిలో కొత్త ప్రాడక్టులు, సర్వీసులను యూజర్లకు పరిచయం చేయడంలో ‘ఇంట్రాక్ట్’ విజయం సా«ధించింది. టాస్క్లను విజయవంతంగా పూర్తి చేసిన యూజర్లకు క్రిప్టో, ఎన్ఎఫ్టీ, లాయల్టీ పాయింట్స్ రూపంలో ప్రోత్సాహకాలు’ అందిస్తోంది. ఎన్నో కలలతో ముగ్గురు మిత్రులు ‘ఇంట్రాక్ట్’ను ప్రారంభించారు. ఆ కలలకు కష్టాన్ని జోడించారు. ఆ కష్టం వృథా పోలేదు. లక్షలాది యూజర్లతో ‘ఇంట్రాక్ట్’ వెబ్3 వరల్డ్లో కీలక పాత్ర పోషిస్తూప్రాఫిటబుల్ ప్లాట్ఫామ్గా ఎదిగింది. ‘ఇంట్రాక్ట్’ ఇన్వెస్టర్లలో ఆల్ఫా వేవ్ గ్లోబల్, గుమీ క్రిప్టోస్, ఆల్కెమీ, మూన్ పే, వెబ్ 3 స్టూడియోస్, కాయిన్ బేస్...మొదలైన కంపెనీలు ఉన్నాయి. సమీకరించిన నిధులలో కొంత మొత్తాన్ని తమ టీమ్ సభ్యుల సంఖ్యను రెట్టింపు చేయడానికి, సాంకేతిక అవసరాలకు ఉపయోగించారు. సాధించిన విజయంతో సంతృప్తి పడడం లేదు ముగ్గురు మిత్రులు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వెబ్3 టెక్నాలజీపై మార్కెటింగ్ నిపుణులు, కంపెనీల ఫౌండర్లు దృష్టి పెట్టారు. మరో వైపు ఉద్యోగావశాలు లేదా ఆవిష్కరణల కోణంలో యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో పోటీగా ఎన్నో కంపెనీలు మార్కెట్లోకి రావచ్చు. వాటిని తట్టుకొని ముందుకు వెళ్లాలంటే ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాల గురించి ఆలోచించాలనేది ముగ్గురు మిత్రులకు తెలియని విషయం కాదు.‘వెబ్3 క్రియేట్ చేసిన సరికొత్త ఆర్థిక అవకాశాలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థల గురించి పరిచయం చేసి యూజర్లకు ఉపయోగపడాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు సంస్థ కో–ఫౌండర్, సీయీవో సంభవ్ జైన్. -
Agapi Sikkim: ప్రకృతి ఇచ్చిన ప్రేమ కానుక గెలుపు దారి
పెద్ద నగరాలలో పెద్ద ఉద్యోగం చేస్తున్నప్పటికీ రిన్జింగ్ భూటియా మనసులో ఏదో లోటు ఉండేది. విశాలమైన ప్రకృతి ప్రపంచంలో పుట్టి పెరిగిన రిన్జింగ్ రణగొణ ధ్వనులకు దూరంగా తన మూలాలను వెదుక్కుంటూ సిక్కిం వెళ్లింది. హిమాలయాలలోని అరుదైన మొక్కలతో తయారు చేసే స్కిన్కేర్ ప్రాడక్ట్స్కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ స్టార్టప్తో ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించింది. సొంతకాళ్ల మీద నిలబడడానికి పునరావాస కేంద్రాల్లోని మహిళల కోసం ఉచిత వర్క్షాప్లు నిర్వహిస్తోంది. సిక్కింలోని అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య పుట్టి పెరిగిన రిన్జింగ్ వృత్తిరీత్యా దిల్లీ, బెంగళూరు, కోల్కత్తాలాంటి మహానగరాల్లో గడిపింది. ఆర్థిక సమస్యలు లేనప్పటికీ ఏదో లోటుగా అనిపించేది. ప్రకృతి మధ్య తాను గడిపిన కాలాన్ని గుర్తు చేసుకునేది. మరో ఆలోచన లేకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి సిక్కిం బాట పట్టింది. ఎంటర్ప్రెన్యూర్ కావాలనే రిన్జింగ్ చిరకాల కల అక్కడ రెక్కలు విప్పుకుంది. ‘ఉద్యోగ జీవితానికి సంబంధించి ఏ లోటు లేకపోయినప్పటికీ పెద్ద నగరాలలో కాలుష్యం, ఇరుకు ప్రదేశాలలో నివసించాల్సి రావడంతో బాగా విసుగెత్తిపోయాను. నా బిడ్డ పచ్చని ప్రకృతి ప్రపంచంలో పెరగాలనుకున్నాను. అందుకే వెనక్కి వచ్చేశాను’ అంటుంది రిన్జింగ్. ఉద్యోగం లేదు కాబట్టి బోలెడంత ఖాళీ సమయాన్ని చర్మ సంరక్షణకు సంబంధించిన పరిశోధనకు కేటాయించింది. ప్రకృతిలోని ఎన్నో వనమూలికల గురించి లోతుగా అధ్యయనం చేసింది. హిమాలయాలలో లభించే అరుదైన మొక్కలతో హ్యాండ్ క్రాఫ్టెడ్ స్కిన్కేర్ ప్రాడక్ట్స్కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ అనే అంకుర సంస్థను ఆరంభించింది. ‘అగాపి’ అనేది గ్రీకు పదం. దీని అర్థం... ప్రేమ. సిక్కింలోని అనేక ప్రాంతాలలో చర్మవ్యాధులకు ఔషధంగా తమ చుట్టుపక్కల ఉండే మొక్కలను ఉపయోగించడం అనేది తరతరాలుగా జరుగుతోంది. ఈ సంప్రదాయమే తనకొక దారి చూపింది. చర్మవ్యాధులను తగ్గించే ఎన్నో ఔషధాల వాడకం పరంపరగా వస్తున్నప్పటికీ వాటి గురించి స్కిన్కేర్ ఇండస్ట్రీకి తెలియదు. బిజినెస్ మోడల్ను డిజైనింగ్ చేసుకున్న తరువాత కబీ అనే ప్రాంతంలో తొలిసారిగా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది రిన్జింగ్. ఇరవైమందికి పైగా మహిళలు హాజరయ్యారు. ఈ ఉత్సాహంతో మరిన్ని ప్రాంతాలలో మరిన్ని ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది.‘మా వర్క్షాప్లో శిక్షణ తీసుకున్న పదిమందికి పైగా మహిళలు సొంత ప్రాజెక్ట్లు మొదలు పెట్టడం సంతోషంగా అనిపించింది. ఏదో సాధించాలనే పట్టుదల వారిలో కనిపించింది. వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాను’ అంటుంది రిన్జింగ్. మాదక ద్రవ్యాలు, మద్యవ్యసనంతో శిథిలం అవుతున్న వారికి ఆ వ్యసనాల నుంచి బయటకు తీసుకువచ్చే సాధనంగా వర్క్షాప్లను ఉపయోగించుకుంటోంది రిన్జింగ్. పునరావాస కేంద్రాల్లో కూడా వర్క్షాప్లు నిర్వహించి వారిలో ఆర్థికస్థైర్యాన్ని నింపింది. మాస్కులు, షాంపులు, స్క్రబ్లు, ఫేషియల్ ఆయిల్... మొదలైనవి ఎన్నో ఉత్పత్తి చేస్తుంది అగాపి సిక్కిం. స్థానిక రకాల కలబంద, జనపనార... మొదలైన వాటిని తమ ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగించుకుంటోంది. మొదట సిక్కిం చుట్టుపక్కల నగరాలలో ప్రాడక్ట్స్ను విక్రయించేవారు. ఆ తరువాత బెంగళూరు, కోల్కతాతో పాటు దేశంలోని ఎన్నో ప్రాంతాలకు మార్కెట్ విస్తరించింది. ‘అగాపి’ చెప్పుకోదగిన బ్రాండ్గా ఎదిగినప్పటికీ ‘ఇక చాలు’ అనుకోవడం లేదు రిన్జింగ్. స్కిన్ కేర్ సైన్స్కు సంబంధించి ఎప్పటికప్పుడు తన పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంగ్లాండ్లోని ‘ఫార్ములా బొటానికా’కు సంబంధించి ఆన్లైన్ కోర్సులు చేస్తోంది. ప్రాచీన ఔషధాలపై కొత్త వెలుగు ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్న సంప్రదాయ ఔషధాలు వెలుగు చూసేలా, ప్రపంచానికి తెలిసేలా కృషి చేస్తోంది రిన్జింగ్. తాను కంపెనీ స్థాపించడమే కాదు ఇతరులు కూడా స్థాపించేలా వర్క్షాప్లు నిర్వహిస్తోంది. ‘ఇక్కడ అడుగు పెట్టడానికి ముందు ఎన్నో ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు వాటికి సమాధానం దొరికింది. అగాపి విజయం నాకు ఎంతో ఉత్సాహం ఇచ్చింది’ అంటుంది రిన్జింగ్ భూటియ. -
మనీమంత్ర కవితాగానం
‘కష్టపడగానే సరిపోదు... ఆ కష్టానికి తగిన ఫలితం ఉండాలి. ప్రతిభ ఉండగానే సరిపోదు... దానికి తగిన ప్రతిఫలం ఉండాలి’ అంటుంది కవితా షెనాయ్. అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన కవితకు వినియోగదారుల నాడి తెలుసు. తగిన ప్రతిభ, సామర్థ్యాలు ఉండి కూడా నష్టాలతో చతికిల పడుతున్న కంపెనీలను చూసిన తరువాత ‘వోయిరో’ స్టార్టప్కు శ్రీకారం చుట్టింది. ఈ సాస్(సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్) స్టార్టప్ దక్షిణ ఆఫ్రికాలోని ‘డీఎస్టీవీ’ చానల్తో సహా మనదేశంలోని పెద్ద వోటీటీ ప్లాట్ఫామ్లు, డిజిటల్ పబ్లిషర్లతో కలిసి పనిచేస్తోంది.... మేకప్ ఆర్టిస్ట్, వీడియో ఎడిటర్గా మంచి పేరు తెచ్చుకున్న కవిత షినాయ్ ఆ తరువాత ఎడ్వర్టైజింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఆనంద్ గోపాల్, అనీల్ కారట్, జితిన్ జార్జ్లతో కలిసి బెంగళూరు కేంద్రంగా ‘వోయిరో’ సాస్ స్టార్టప్ మొదలుపెట్టింది. దీనికిముందు కంటెంట్ క్రియేటర్లు, డిజిటల్ ప్లాట్ఫామ్లు ఎదుర్కొనే సమస్యలను అర్థం చేసుకోవడానికి తన బృందంతో కలిసి స్వయంగా కంటెంట్ క్రియేట్ చేసేది. ముంబై యూనివర్శిటీలో ఎకనామిక్స్ చదువుకున్న కవిత మార్కెటింగ్ కమ్యూనికేషన్ కంపెనీ ‘లోవ్ లింటస్’ తో కలిసి పనిచేసింది. ఆ తరువాత యూ ట్యూబ్ టీమ్తో పనిచేసింది. చదివిన చదువు, పెద్ద సంస్థలతో కలిసి పనిచేసిన అనుభవం ‘వోయిరో’ ప్రయాణంలో తనకు ఉపకరించాయి. ఒక స్టార్టప్కు తొలి విజయ సంకేతం... నిధుల సమీకరణ. నిధుల సమీకరణకు సంబంధించి ‘వోయిరో’కు ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదు. ఇక రెండో సవాలు ఇతరులు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. ఎంతోమందితో మాట్లాడి, ఎన్నో సలహాలు తీసుకోవడం ద్వారా రెండో సవాలును కూడా అధిగమించింది. డిజిటల్ పబ్లిషర్స్, వోటీటీ ప్లాట్ఫామ్ల ఆదాయ వృద్ధికి కంటెంట్ను మానిటైజేషన్ చేయడం అనేది కీలకం. మార్కెట్, సాంకేతికత, డేటా అనే మూడురకాల అంశాలలో పట్టు ఉండాలి. అది కవితా షెనాయ్ పనితీరులో కనిపిస్తుంది. డిజిటల్ పబ్లిషర్లు, వోటీటీ ప్లాట్ఫామ్స్తో ‘వోయిరో’కు సంబంధించి సేల్స్ టీమ్, యాడ్ ఆపరేషన్ టీమ్, ఫైనాన్స్ టీమ్, స్ట్రాటజీ టీమ్ అనే నాలుగు బృందాలు కలిసి పనిచేస్తాయి. మీడియా కంపెనీలకు రెవెన్యూ అనలటిక్స్ను అందుబాటులో తీసుకురావడం నుంచి బలమైన ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్) స్ట్రాటజీని అనుసరించడం వరకు తనదైన దారిలో ప్రయాణిస్తోంది వోయిరో. కోవిడ్ కల్లోల సమయంలో అన్ని కంపెనీల లాగే ‘వోయిరో’కు సమస్యలు ఎదురైనప్పటికి వోటీటీ పరిశ్రమ, కంటెంట్ స్పేస్ పుంజుకోవడంతో పెద్దగా ప్రభావం చూపలేదు. ‘మీడియాతో అంటే నాకు ఉన్న ఇష్టం, అభిమానం వోయిరో ఆవిర్భావానికి కారణం అయింది. డిజిటల్ పబ్లిషర్లు, కంటెంట్ క్రియేటర్లకు వివిధ విషయాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం అవసరం అనే ఉద్దేశంతో ఈ వెంచర్ ప్రారంభించాం. లాభాల కంటే కూడా ఇతరులకు సహాయం చేయాలి, వారి విధానాలలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో వోయిరో ప్రారంభించాం. అయితే అది అంత సులువైన విషయం కాదని అర్థమైంది. మా ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకొని ముందుకు వెళుతున్నాం. మీడియా, డిజిటల్ పబ్లిషర్లు నష్టపోకుండా మార్గనిర్దేశం చేయడం మా లక్ష్యం’ అంటుంది కవిత షెనాయ్. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది వ్యాపార ప్రస్థానంలో ‘ఇక ముందుకు వెళ్లలేము’ అని నిరాశపడే పరిస్థితి రావచ్చు. దీనికి లొంగిపోకుండా పట్టుదలతో ముందుకు వెళితే విజయం మనల్ని వెదుక్కుంటూ వస్తుంది. ఎంత పెద్ద సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార మార్గాలను అన్వేషించడంలో మన ఓపిక, కష్టపడేతత్వం గెలుపును నిర్ణయిస్తాయి. ‘వోయిరో’ ప్రారంభానికి ముందు ఇండస్ట్రీ పెద్దల నుంచి కుటుంబసభ్యులు, స్నేహితుల వరకు ఎంతోమంది నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నాం. అవగాహన చేసుకుంటూ, అధ్యయనం చేస్తూ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. ఓటీటీకి సంబంధించి మార్కెట్ తీరుతెన్నులను విశ్లేషిస్తూ మా పనితీరును మెరుగు పరుచుకుంటూ, పరిధిని విస్తరిస్తూ వెళ్లాం. – కవితా షెనాయ్, వోయిరో–ఫౌండర్, సీయివో -
'సహస్రనామం' సమ్మోహన విజయం!
‘ఎడారిలో రెయిన్ కోట్లు అమ్మకూడదు’ అనేది వ్యాపారానికి సంబంధించి అప్రకటిత ప్రాథమిక సూత్రం! ఎక్కడ ఏది అవసరమో అది అందుబాటులోకి తీసుకువచ్చినప్పుడే ఎంటర్ప్రెన్యూర్ గెలుపు జెండా ఎగరేయగలడు. సంప్రదాయ విధానాలకు భిన్నంగా సంస్థలకు సంబంధించిన డేటా–ఎనాలటిక్స్ ప్రాసెస్ను సులభతరం చేయడానికి, కాలాన్ని, ఖర్చును తగ్గించడానికి ఏఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో ఏఐ స్టార్టప్లకు ప్రాధాన్యత పెరిగింది. చెన్నైకి చెందిన అజిత్ సహస్రనామం ఏఐ స్టార్టప్ ‘ఆన్గిల్’తో విజయం సాధించాడు. ‘రైట్ మోడల్ అనేది ముఖ్యం’ అంటున్న అజిత్ స్టార్టప్ కలల యువతరం రోల్మోడల్స్లో ఒకరిగా నిలిచాడు. 'ప్రాసెసింగ్ ఆఫ్ డేటా’కు సంబంధించి వివిధ సంస్థలకు రకరకాల సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఐఏ) సాంకేతికత డేటా–డ్రైవెన్ మెథడాలజీలతో ఖర్చును తగ్గిస్తుంది. టైమ్ సేవ్ చేస్తోంది. రిపోర్ట్స్ తయారీని సులభతరం చేస్తోంది. అందుకే ఇప్పుడు ఏఐ స్టార్టప్లకు ప్రాధాన్యత పెరిగింది. ‘ఒకప్పుడు రోజుల్లో మాత్రమే పూర్తయ్యే పని ఇప్పుడు నిమిషాల వ్యవధిలో పూర్తవుతుంది’ అంటున్నాడు ఏఐ స్టార్టప్ ‘ఆన్గిల్’ ఫౌండర్, సీయీవో అజిత్. ఒక్క మాటలో చెప్పాలంటే డేటా ఆధారిత నిర్ణయాలకు సంబంధించి ఏఐ–డ్రైవెన్ సొల్యూషన్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయి. బిజినెస్ ప్రాసెస్కు డైనమిక్ లుక్ ఇస్తున్నాయి. కొన్ని నెలల క్రితం బెంగళూరులో జరిగిన ఎర్లీ–స్టేజ్ స్టారప్ ఫౌండర్స్ సమావేశంలో స్టారప్ ప్రయాణ ప్రారంభంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో వివరంగా చెప్పాడు అజిత్ సహస్రనామం. ‘రైట్ మోడల్ లేకుండా ఎలా ముందుకు వెళ్లగలం?’ అంటాడు అజిత్. రైట్ మోడల్ మాట ఎలా ఉన్నా స్టార్టప్ కలల యువతరం ‘రోల్ మోడల్స్’లో అజిత్ సహస్రనామం ఒకరు. ఏఐ స్టార్టప్ ‘ఆన్గిల్’ ఫౌండర్, సీయివోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అజిత్. ఇన్స్టంట్ మెసేజింగ్ ΄ప్లాట్ఫామ్ ‘ఆన్గిల్’ పరిశ్రమలకు సంబంధించి డేటా కలెక్షన్ నుంచి ఇన్సైట్స్ వరకు ఎనాలటిక్స్ టాస్క్లను వేగవంతం చేస్తుంది. ‘ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లు అందుబాటులో ఉన్న మోడల్స్పై ఆధారపడడం అనేది ఒక విధానం. రెండోది పబ్లిక్ సోర్స్ శాంపిల్స్ ద్వారా సొంత డేటా తయారుచేసుకోవడం. అన్నిటికంటే పెద్ద సవాలు యూజర్స్ ఓకే అనేలా ప్రొడక్ట్ను బిల్డ్ చేయడం’ అంటాడు అజిత్. ‘ఆన్గిల్’ సాధించిన విజయం ఏమిటి? 2017లో ప్రారంభమైన ‘ఆన్గిల్’ రియల్–టైమ్ విజువలైజేషన్, ప్రిడెక్టివ్ ఎనాలటిక్స్ ఫీచర్ల ద్వారా పరిశ్రమలకు సంబంధించి ఎనాలటిక్స్ టాస్క్లను వేగవంతం చేస్తోంది. 2025 నాటికి మన దేశంలో ఏఐ మార్కెట్ మరింతగా విస్తరించనుంది అని నిపుణులు చెబుతున్నారు. డొమెస్టిక్ ఏఐ మార్కెట్లోకి యువతరం సారథ్యంలో మరెన్నో స్టార్టప్లు అడుగు పెట్టనున్నాయి. ఔత్సాహికులకు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ల మాటలే పాఠాలు అవుతాయి. ‘ఆన్గిల్’తో విజయం సాధించిన అజిత్ సహస్రనామం నోటి మాటల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. -
నిమిషం వీడియో.. వెయ్యి కోట్ల కంపెనీని ఎలా కూప్పకూల్చింది! గూగుల్ సైతం
ఒకే ఒక్క నిమిషం వీడియో దెబ్బకు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్తో పాటు ఇతర కంపెనీలు రూ.1000 కోట్లు నష్టపోయేలా చేసింది. నమ్మడం లేదా? లేదంటే ఎందుకు? ఎలా అంటారా? జ్యూసెరో మెషిన్. ప్రపంచంలోనే స్మార్ట్ వైఫై యాప్ కోల్డ్ ఫెష్ జ్యూసర్. ఈ జ్యూసెరో మెషిన్ సాయంతో జ్యూస్ తయారు చేయాలంటే ఫ్రూట్స్ అవసరం లేదు. జస్ట్ ఆ కంపెనీ తయారు చేసిన జ్యూస్ ప్యాకెట్లు ఉంటే చాలు. ఆ ప్యాకెట్లను మెషిన్లో పెట్టి బటన్ నొక్కితే చాలు. మెషిన్లో నుంచి జ్యూస్ డైరెక్ట్గా గ్లాస్లోకి పడిపోతుంది. అనంతరం ఆ జ్యూస్ను తాగొచ్చు. ఇక ఈ కంపెనీ జ్యూస్ ప్యాకెట్లను సబ్స్క్రిప్షన్ ధర పొందాల్సి ఉంటుంది. డౌగ్ మాస్టర్ మైండ్ శాంపిల్ మెషిన్ తయారైంది. మరిన్ని జ్యూస్ మెషిన్లను తయారు చేసేందుకు, వాటిని మార్కెటింగ్ తయారు చేసేందుకు డబ్బులు కావాలి. అప్పుడు జ్యూసెరో ఫౌండర్ డౌగ్ ఎవాన్స్ తన మాస్టర్ మైండ్కి పదును పెట్టాడు. వెంటనే జ్యూసెరో మెషిన్ గురించి ప్రచారం చేశాడు. ప్రచారంతో ఊదర గొట్టాడు ఈ మెషిన్ తయారీ కోసం టెక్ కంపెనీలు టెస్లా, యాపిల్ తరహాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేశామని చెప్పుకొచ్చాడు. యాపిల్ మాజీ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ నుంచి యాపిల్ కంప్యూటర్ను ఎలా తయారు చేశారో నేను కూడా మెయిన్ఫ్రేమ్ జ్యూస్ మెషిన్ నుంచి జ్యూసెరో మెషిన్ను తయారు చేస్తున్నట్లు ఊదరగొట్టారు. ప్రొడక్ట్ వీక్.. పబ్లిసిటీ పీక్ ఎవాన్స్ పబ్లిసిటీ సూపర్ హిట్ అయ్యింది. గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు జ్యూసెరో కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు పోటీపడ్డాయి. ఫలితంగా రూ.1000 కోట్ల కంపెనీగా అవతరించింది. ఇంకేం చేతిలో పుష్కలంగా డబ్బులు.. జ్యూసెరో మెషిన్ను, జ్యూస్ ప్యాకెట్లను పెద్ద ఎత్తున తయారు చేసింది. జ్యూసెరో మెషిన్ ధరను రూ.30000 వేలు పైగా నిర్ణయించింది. ఫ్రూట్స్ను బట్టి జ్యూస్ ప్యాకెట్ను ధరను నిర్ణయించి మార్కెట్లోకి విడుదల చేసింది. మార్కెట్లోకి లాంచ్ అయిన కొద్దిరోజులు బాగానే ఉన్నా.. మెల్లిమెల్లిగా జ్యూసెరో చేసిన మోసం వెలుగులోకి రావడం మొదలైంది. ఆ సమయంలో మీడియా సంస్థ బ్లూమ్బెర్గ్ జ్యూసెరో మెషిన్ పనితీరును వివరిస్తూ నిమిషం వీడియోను ప్రసారం చేసింది. ఆ వీడియోలో జ్యూసెరో మెషిన్లో నుంచి జ్యూస్ రావడానికి ఎంత సమయం పడుతుంది. అదే జ్యూస్ ప్యాకెట్లను చేతులతో పిండితే ఎంత జ్యూస్ వస్తుందో అంతే సమయం పడుతుందని వివరించింది. ఆ వీడియో చూసిన వినియోగదారులు జ్యూసెరో మెషిన్ను కొనుగోలు చేయడం మానేశారు. పైగా మెషిన్ ఖరీదైందని, సంస్థ తయారు చేసిన జ్యూస్ ప్యాకెట్లు ఎంత కాలం నిల్వ ఉంటాయి. ప్యాకెట్లలో నిల్వ చేసిన జ్యూస్ను తాగొచ్చా? లేదా? ఇలా విషయాల గురించి కొనుగులో దారులు, వినియోగదారులు ఎవాన్స్ను నిలదీయడం మొదలు పెట్టారు. దీంతో సంస్థ అప్రతిష్టను మూటగట్టుకుంది. సేల్స్ ఆగిపోయాయి. ఉద్యోగులు ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు. నష్టాలు రావడంతో సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది. చివరికి చేసేది లేక ఆ కంపెనీని మూసేస్తూ నిర్ణయం తీసుకున్న ఆ సంస్థ అధినేత డౌగ్ ఎవాన్స్. ఫలితంగా గూగుల్తో పాటు ఇతర సంస్థలు సైతం నష్టపోయేలా చేసింది. -
స్టార్టప్లకు రూ. కోటి ఫండింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువతను నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) ‘‘లీప్ ఎహెడ్’’ పేరిట ప్రత్యేక పథకాన్ని చేపట్టింది. ఈ పథకం ద్వారా ప్రారంభ దశలో (స్కేలింగ్) ఉన్న స్టార్టప్లతో పాటు గ్రోత్ స్టేజ్, ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్, కొత్త ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలో ఉన్న స్టార్టప్లకు కోటి రూపాయల వరకు నిధులు సమకూర్చనుంది. ఈ పథకం కింద ఎంపికైన స్టార్టప్లకు మూడు నెలల పాటు హైబ్రీడ్ మోడల్లో శిక్షణ ఇచ్చి మెంటారింగ్ చేస్తూ మార్కెటింగ్, ఫండ్ రైజింగ్ వంటి అవకాశాలను కల్పి స్తుంది. ఇందుకోసం డిసెంబర్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్టీపీఐ కోరింది. ఇప్పటివరకు రాష్ట్రం నుంచి 75 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 15 స్టార్టప్లను ఎంపిక చేసి ఆర్థిక సాయం అందిస్తారు. ఎన్జీఐఎస్ కింద 95 స్టార్టప్స్ నమోదు స్టార్టప్లను ప్రోత్సహించే నెక్టŠస్ జనరేషన్ ఇంక్యుబేషన్ స్కీం (ఎన్జీఐఎస్) కింద రాష్ట్రంలో 95 స్టార్టప్లు నమోదు చేసుకున్నట్లు వినయ్కుమార్ తెలిపారు. ఇందులో 28 స్టార్టప్స్కు రూ.25 లక్షల చొప్పున సీడ్ ఫండింగ్ అందించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్స్కు ప్రోత్సాహం అందిస్తుండటంతో పలు కాలేజీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లలో యువత స్టార్టప్స్పై ప్రయోగాలు చేస్తున్నారన్నారు. విశాఖలో నాలుగో తరం సాంకేతిక పరిజ్ఞానం పెంచేలా ఏర్పాటు చేసిన కల్పతరువు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ, ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నాస్కామ్ ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీలు స్టార్టప్స్కు మంచి వేదికలుగా మారాయని ఆయన వివరించారు. 6న విజయవాడలో ఔట్రీచ్ కార్యక్రమం లీప్ ఎహెడ్ కార్యక్రమంపై విద్యార్థులు, ఔత్సాహిక స్టార్టప్స్కు అవగాహన కల్పి ంచడానికి ఈ నెల 6న విజయవాడలో ఔట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్టీపీఐ విజయవాడ జాయింట్ డైరెక్టర్ బి.వినయ్కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంక్యుబేషన్, స్టార్టప్ సెంటర్లు ఉన్న పలు ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా సదస్సులు నిర్వహిస్తామన్నారు. -
ఉద్యోగులకు షాకిచ్చిన ‘ఫిజిక్స్వాలా’!
ప్రముఖ దేశీయ ఎడ్టెక్ యూనికార్న్ సంస్థ ఫిజిక్స్ వాలా ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. 70 నుంచి 120 మంది ఉద్యోగుల్ని తొలగించింది. దీంతో నిధుల కొరత కారణంగా ఉద్యోగుల్ని తొలగించిన జాబితాలో ఫిజిక్స్ వాలా చేరిపోయింది. అయితే ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. పిడబ్ల్యూలో మేం మిడ్ టర్మ్, అక్టోబర్ నెల ముగిసే సమయానికి ఎండ్ టర్న్ సైకిల్స్లో ఉద్యోగుల పనితీరును అంచనా వేస్తాం. ఫిజిక్స్ వాలా మొత్తం వర్క్ ఫోర్స్లో 0.8శాతం కంటే తక్కువ అంటే 70 నుండి 120 మంది ఉద్యోగుల్లో పనితీరులో సమస్యలు ఉన్నట్లు గుర్తించాము’ అని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సతీష్ ఖేంగ్రే ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో అదనంగా 1000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నామని, ఇది వృద్ధి పట్ల తమ నిబద్ధతను బలపరుస్తుందని ఖేంగ్రే తెలిపారు. ఫిజిక్స్ వాలా గత ఏడాది రూ.100 కోట్ల యూనికార్న్ క్లబ్లో చేరింది. ఈ కంపెనీలో వెస్ట్బ్రిడ్జ్ కేపిటల్, జీఎస్వీ వెంచర్స్ వంటి కేపిటల్ మార్కెట్ కంపెనీలు 1 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయి. పెట్టుబడి దారులు తమ ఫోర్ట్ ఫోలియో కంపెనీ ఫిజిక్స్ వాలాలో పెట్టిన పెట్టుబడులతో లాభాల్ని గడించాలని భావిస్తున్న సమయంలో ఆ సంస్థ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో ఫిజిక్స్ వాలా తన విస్తరణ ప్రయత్నాల్లో భాగంగా కేరళకు చెందిన సైలెమ్ లెర్నింగ్ లో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
భవిష్యత్నే మార్చేసిన స్టార్టప్ బిజినెస్.. విదేశాల్లోనూ పాపులర్
‘భవిష్యత్ అనేది రకరకాల వస్తువులతో కూడిన బాక్స్లాంటిది. మనం తీసినప్పుడు ఏ వస్తువు చేతికందుతుందో తెలియదు. కొన్నిసార్లు నిరాశపరిచే వస్తువు, కొన్నిసార్లు అత్యంత విలువైన వస్తువు చేతికి అందవచ్చు’... ఈ సినిమా డైలాగ్ను ప్రమోద్ గాడ్గే, షాహీద్ మెమన్లు విన్నారో లేదో తెలియదుగానీ ‘అన్బాక్స్’ రూపంలో వారికి బాక్స్ నుంచి విలువైన కానుక లభించింది. తమ భవిష్యత్నే మార్చేసిన స్టార్టప్ కానుక అది. లాజిస్టిక్ ఆటోమేషన్ స్టార్టప్ ‘అన్బాక్స్ రోబోటిక్స్’తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రమోద్, షాహీద్లు... ‘మన దేశంలో ఇ–కామర్స్ వేగం పెరిగింది’ అనే వార్త చదివి ‘ఓహో అలాగా!’ అనుకోవచ్చు. అద్భుతమైన ‘ఐడియా’ కూడా రావచ్చు. ఆ ఐడియా జీవితాన్నే మార్చేయవచ్చు. ప్రమోద్ గాడ్గే, షాహీద్ మెమన్ల విషయంలో జరిగింది ఇదే. మన దేశంలో ఇ–కామర్స్ స్పీడ్ను గమనించిన వీరు సప్లై చైన్ రోబోటిక్స్ స్టార్టప్ ‘అన్బాక్స్ రొబోటిక్స్’తో విజయపథంలో దూసుకుపోతున్నారు. ఇండియా దాటి యూఎస్, యూరప్ మార్కెట్లోకి కూడా అడుగు పెట్టనున్నారు.పుణే కేంద్రంగా మొదలైన ‘అన్బాక్స్ రోబోటిక్స్’ సప్లై చైన్ ఆటోమేషన్ సోల్యూషన్స్లో మార్పు తీసుకువచ్చింది. వినూత్న ఏఐ–ఆధారిత కంట్రోల్ సిస్టమ్ ద్వారా రోబోట్ల ఉత్పాదకతను పెంచింది. పనితీరును మార్చింది. ‘మావన శక్తి నుంచి రోబోట్స్ వరకు ప్యాకేజీలను క్రమబద్ధీకరించడం, రవాణా చేయడం... మొదలైన విధానాలు మన దేశంలో ఇ–కామర్స్ వేగాన్ని అందుకోలేకపోతున్నాయేమో అనిపించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొబైల్ రోబోటిక్స్ సిస్టమ్ను నిర్మించాలనుకున్నాం. లాజిస్టిక్స్, రిటైల్ ప్లేయర్ల కోసం ప్యాకేజీ సార్టింగ్, ఆర్డర్ కన్సాలిడేషన్ ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి శక్తిమంతమైన రోబోటిక్స్ వ్యవస్థను నిర్మించాలనుకున్నాం’ గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు ‘అన్బాక్స్ రోబోటిక్స్’ సీయివో ప్రమోద్ గాడ్గే. ‘అన్బాక్స్ రోబోటిక్స్’కు ముందు ఫ్లిప్కార్ట్లో సార్టింగ్కు సంబంధించి ఆటోమేషన్ విభాగంలో, మన దేశంలోని తొలి రోబోట్–బేస్డ్ సార్టింగ్ ప్రాజెక్ట్లో పనిచేశాడు ప్రమోద్. ‘అన్బాక్స్ రోబోటిక్స్’ కో–ఫౌండర్, సీటీవో షాహీద్ రోబోటిక్స్. ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, స్వోర్మ్ ఇంటెలిజెన్స్లో మంచి అనుభవం ఉంది. రోబోటిక్స్, ఆటోమేషన్ ఫీల్డ్స్లో సీటీవోగా పనిచేశాడు. ‘అన్బాక్స్’కు ముందు ‘వనోర రోబోట్స్’ అనే స్టార్టప్ ప్రారంభించాడు. చిత్తశుద్ధి, కష్టపడే తత్వం, అంకితభావం లేకపోతే పేపర్ మీద రాసుకున్న కాన్సెప్ట్ అక్కడే నిలిచిపోతుంది. అయితే ఈ ఇద్దరు మిత్రులు వారి బృందం బాగా కష్టపడి ‘అన్బాక్స్’ను సూపర్ హిట్ చేశారు. స్టార్టప్ కాన్సెప్ట్లో సత్తా ఉంటే ఇన్వెస్టర్లు వెనకడుగు వేయరు. ‘అన్బాక్స్’ విషయంలోనూ అదే జరిగింది. టీమ్ను విస్తరించడానికి, అంతర్జాతీయ స్థాయిలో కస్టమర్ల డిమాండ్ను నెరవేర్చడానికి, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై సమీకరించిన నిధులను వాడారు. 2021లో థర్డ్–పార్టీ లాజిస్టిక్స్, ఇ–కామర్స్ ప్లేయర్స్తో కంపెనీ బీటా పైలట్స్ లాంచ్ చేసినప్పుడే లీడింగ్ ఇ- కామర్స్ లాజిస్టిక్స్ కంపెనీల నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది. ఇది భవిష్యత్ విజయానికి సూచికలా పనిచేసింది. ఇన్వెస్టర్ట్లలో మరింత నమ్మకాన్ని నింపింది. ‘అన్బాక్స్’ స్టార్టప్ ఇ–కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్లాంటి సెక్టార్లలో ఏడు పెద్ద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. క్లయింట్ సబ్స్క్రిప్షన్ మోడల్ ‘రోబోట్ యాజ్ ఏ సర్వీస్’ను కూడా కంపెనీ ప్రారంభించింది. ఇ–కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్ రంగాలకు సంబంధించి రోబోటిక్–బేస్డ్ పుల్ఫిల్మెంట్, డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీలో ప్రత్యేకత సాధించిన ‘అన్బాక్స్ రోబోటిక్స్’ అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుతుంది. స్టార్టప్ కాన్సెప్ట్లో సత్తా ఉంటే ఇన్వెస్టర్లు వెనకడుగు వేయరు. ‘అన్బాక్స్’ విషయంలోనూ అదే జరిగింది. -
కొత్త అవతారం ఎత్తిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ
న్యూఢిల్లీ: సెలబ్రిటీ దంపతులు విరాట్ కోహ్లి, ఆయన భార్య అనుష్క శర్మ తాజాగా ఈవెంట్ల నిర్వహణ కోసం కొత్త వెంచర్ ప్రారంభించారు. నిసర్గ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. తొలుత మోటార్ స్పోర్ట్స్, వినోద కార్యక్రమాల నిర్వహణ సంస్థ ఎ లీట్ ఆక్టేన్తో నిసర్గ జట్టు కట్టింది. ఎలీట్ ఆక్టేన్కు ది వేలీ రన్ వంటి ఈవెంట్లకు సంబంధించి మేథోహక్కులు (ఐపీ) ఉన్నాయి. ప్రస్తుతం మూడు మోటార్స్పోర్టింగ్ ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు, ఒక మ్యూజిక్ కాన్సర్ట్ మొద లైనవి నిర్వహించనున్నట్లు నిసర్గ పేర్కొంది. తాహా కోబర్న్ కూటే ఈ సంస్థకు సీఈవోగా, సీవోవోగా అంకుర్ నిగమ్ నియమితులయ్యారు. -
7 ఏళ్లకే కోడింగ్.. 16 ఏళ్లకే రూ.100 కోట్ల సామ్రాజ్యం!
పాతికేళ్ళు దాటినా.. ఇప్పటికీ జీవితంలో ఎలాంటి సొంత నిర్ణయం తీసుకోవాలో చాలామందికి తెలియదు. కానీ 16ఏళ్ల అమ్మాయి ఏకంగా రూ. 100 కోట్లు సామ్రాజ్యాన్ని స్థాపించి అందరి చేత ఔరా అనిపించుకుంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 'ప్రాంజలి అవస్థి' (Pranjali Awasthi) అనే 16 ఏళ్ల భారతీయ అమ్మాయి Delv.AI అనే స్టార్టప్ ప్రారంభించి ఏఐ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. ఈమెకు ఇప్పటికే 10 మందితో కూడిన ఒక టీమ్ కూడా ఉండటం గమనార్హం. ప్రాంజలి వ్యాపారం అభివృద్ధి కావడానికి ఆమె తండ్రి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడు సంవత్సరాల వయసులోనే కోడింగ్ ప్రారంభించింది. అయితే ప్రాంజలి 11ఏళ్ల వయసులోనే వారి కుటుంబం ఇండియా నుంచి ఫ్లోరిడాకు మారింది. ఆ తరువాత 13ఏళ్ల వయసులో ఇంటర్న్షిప్ ప్రారంభించింది. చాట్జీపీటీ ప్రారంభమైన మొదట్లోనే డెల్వ్.ఏఐ స్టార్ట్ చేసింది. ఆ తరువాత తన వ్యాపార ప్రయాణం ప్రారంభించింది. ఇదీ చదవండి: రొమాంటిక్ ఫోటో క్లిక్ చేసిన ఏఐ కెమెరా.. వావ్ అంటున్న నెటిజన్లు! ప్రాంజలి అవస్థి వ్యాపారానికి మద్దతుగా ఆన్ డెక్, విలేజ్ గ్లోబల్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దీంతో ఈమె కంపెనీ 450000 డాలర్ల నిధులను (రూ.3.7 కోట్లు) సేకరించగలిగింది. కాగా మొత్తం కంపెనీ విలువ ప్రస్తుతం రూ. 100 కోట్లు ఉంటుందని సమాచారం.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
బీజేపీపై కర్ణిసేన ఆగ్రహం.. అమేథీలో ఎదురుగాలి?
24 రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన ప్రముఖు నటుడు
విజయ్ సేతుపతి కొత్త సినిమా.. టీజర్ చూశారా?
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
MI: అర్జున్ టెండుల్కర్ ‘ఓవరాక్షన్’.. ఆ తర్వాత ఇలా డగౌట్లో!
టీడీపీ అరాచకాలపై కిషోర్ బాబు ఫైర్
జూన్ 4న జగన్ ప్రభంజనం..
'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
TG: మేడిగడ్డపై మరో కమిటీ?
తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు
తప్పక చదవండి
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట
- చివరి బెర్త్ ఎవరిదో?
Advertisement