-
OMC Case: ఒబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్చిట్
సాక్షి, హైదరాబాద్: ఓఎంసీ(ఒబులాపురం మైనింగ్) కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్చిట్ ఇచ్చింది తెలంగాణ హైకోర్ట్. ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్చిట్ ఇస్తూ మంగళవారం హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను కోర్టు కొట్టివేసింది. కాగా, ఈ కేసులో శ్రీలక్ష్మి ఏడాది పాటు జైలులో ఉన్నారు. ఇక, 2004-09 వరకు శ్రీలక్ష్మి మైనింగ్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి సీబీఐ.. ఆమెపై నేరారోపణకు సంబంధించిన సరైన వివరాలను కోర్టుకు అందించలేకపోయింది. కేవలం ఆరోపణలు మాత్రమే ఉండటంతో కోర్టు ఆమెకు క్లీన్చిట్ ఇచ్చింది. -
జూపల్లి వారి ఇంట పెళ్లి సందడి
సాక్షి, హైదరాబాద్: మై హోమ్స్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త జూపల్లి రామేశ్వరరావు సోదరుడు జగపతిరావు కుమార్తె శ్రీలక్ష్మి వివాహం జస్టిస్ నవీన్రావు కుమారుడు నృపుల్తో ఘనంగా జరిగింది. శుక్రవారం హైదరాబాద్లోని మాదాపూర్ హెచ్ఐసీసీ నోవాటెల్లో ఈ వివాహ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ, మహారాష్ట్ర గవర్నర్లు ఈఎస్ఎల్ నరసింహన్, విద్యాసాగర్రావు, సీఎం కె.చంద్రశేఖర్రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిలు నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పి.రవీంద్రనాథ్రెడ్డి, కాటసాని రామిరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, వ్యాపార, వాణిజ్యసంస్థల అధినేతలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
ఛార్మి నృత్య గీతానికి ధీటుగా నర్తనం..
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: భరత వేదముగా.. నిరత నాట్యముగా.. అంటూ పౌర్ణమి సినిమాలో కథానాయకి ఛార్మి చేసిన నృత్య గీతం సంగీతాభిమానులనే కాదు.. నాట్యాభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ నృత్య గీతికలో ఛార్మి ప్రదర్శించిన నాట్య హోయలు.. నాట్య భంగిమలు.. అభినయాలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాల్లో ఆ నృత్యాన్ని తిలకిస్తున్నామన్న అనుభూతిని అమలాపురానికి చెందిన ఓ నాట్య మయూరి తన ప్రదర్శనలతో కలిగిస్తోంది. తలపైన... రెండు అరచేతుల్లో అగ్ని కీలలతో మండతున్న ముంతలను ఉంచుకుని నాట్యమాడే ఆ ఎనిమిది నిమిషాల గీతానికి ఈ నర్తకి నయన మనోహరంగా నాట్యం చేస్తుంది. అమలాపురంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న అడపా శ్రీలక్ష్మి గత ఎనిమిదేళ్లలో అనేక నృత్య ప్రదర్శనలతో ఎంతో పేరు తెచ్చుకుంది. తన పదో ఏట నుంచే నృత్యం వైపు నడక మొదలు పెట్టింది. ఫ్రెంచి యానానికి చెందిన నాట్య గురువు నల్లా హైమావతి వద్ద నాట్యం నేర్చుకుంది. జిల్లాలో ఎక్కడ నృత్య పోటీలు ఏర్పాటు చేసినా. ఏదైనా సభలు, వేడుకలు జరిగినా ఆరంభంలో శ్రీలక్ష్మి నృత్య ప్రదర్శన విధిగా ఉంటుంది. శ్రీలక్ష్మి తల్లిదండ్రులు అడపా శ్రీమన్నారాయణ, మల్లేశ్వరి కూడా ఆమె అభీష్టానికి బాసటగా నిలిచి ప్రోత్సహించారు. ఓ సారి తన నృత్య ప్రదర్శనను ఆద్యంతం తిలకించిన సినీ నటుడు కృష్ణంరాజు దంపతులు శ్రీలక్ష్మిని అభినందించి ఆశీర్వదించారు. పౌర్ణమి సినిమాలో ‘భరత వేదముగా...నిరత నాట్యముగా’ నృత్య గీతికను ప్రదర్శిస్తే ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు.. బహుమతుల పంటలు పరిపాటి. శ్రీలక్ష్మికి నృత్యంతో పాటు ఇటీవల కాలంలో సినిమాల్లో నటించాలన్ని కోరిక కూడా తోడైంది. సినీ ఆర్టిస్ట్ కావాలన్న లక్ష్యంతో కోనసీమలోని ఔత్సాహిక సినీ కళాకారులకు వేదికగా ఇటీవల ఏర్పాటైన కోనసీమ ఫిలిం క్లబ్లో శ్రీలక్ష్మి సభ్యత్వాన్ని పొంది ఏదైనా సినిమాలో అవకాశం వస్తే అల్లుకుపోయేందుకు సిద్ధంగా ఉంది. నర్తకిగా కీర్తిని సాధించాలని.. నటిగా సినిమాల్లోకి వెళ్లాలన్న ఆమె లక్ష్యాలు నెరవేరాలని ఆశిద్దాం. -
జెట్టి శ్రీలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య
ఒంగోలు సబర్బన్: దివంగత న్యాయవాది జెట్టి ప్రభాకరరెడ్డి సతీమణి జెట్టి శ్రీలక్ష్మి (54) గురువారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. జయరాం సెంటర్లోని శ్రీగిరి అపార్టుమెంట్స్లో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇది గమనించిన కుటుంబీకులు, స్థానికులు శ్రీలక్ష్మి సంబంధీకులకు సమాచారం అందించారు. ఫ్యాన్కు వేలాడుతున్న మృతదేహాన్ని కిందకు దించి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 2017 నవంబర్ 12న ఒంగోలు వాకర్స్ క్లబ్ సభ్యులు విజయవాడ కృష్ణానగర్ ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ ఘాట్లో బోటు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. అప్పట్లో మృతి చెందిన వారిలో శ్రీలక్ష్మి భర్త జెట్టి ప్రభాకరరెడ్డి కూడా ఉన్నారు. కార్తీకమాసంలో విహారయాత్రకు వెళ్లి బోటు ప్రమాదంలో 18 మంది మృతి చెందటంతో విషాదయాత్రగా మిగిలిపోయింది. బోటు ప్రమాదం జరిగినప్పుడు శ్రీలక్ష్మి బోటులో వెళ్లకుండా అప్పట్లో ఒడ్డునే ఆగిపోయారు. అప్పుడు జరిగిన ప్రమాదంతో శ్రీలక్ష్మి కుటుంబం విలవిల్లాడింది. అప్పటి నుంచి భర్త మరణాన్ని జీర్ణించుకోలేని శ్రీలక్ష్మి మనోవేదనతో కుంగిపోసాగింది. అప్పటికి వారి కుమార్తెలు ఎంతో సముదాయిస్తూ వచ్చారు. అయినా భర్త తోడు లేకపోవడం ఆమె మనోవేదన గురవుతూ వచ్చింది. చివరకు ఆయన లేని జీవితం వృథా అనుకుందో.. ఏమో.. చివరకు బలవన్మరణానికి పూనుకుంది. జెట్టి శ్రీలక్ష్మి దంపతులకు సంతానం లేదు. అయినా ప్రభాకరరెడ్డి రక్తసంబంధీకులకు చెందిన ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకున్నారు. వాళ్లిద్దరినీ పెంచి పెద్ద చేశారు. వారికి వివాహాలు కూడా చేసి స్థిరపరిచారు. ఒక కుమార్తె అమెరికాలో స్థిరపడగా, రెండో కుమార్తె బెంగుళూరులో స్థిరపడింది. ఇటీవలే కుమార్తెలు వచ్చి దగ్గరుండి మరీ సపర్యలు కూడా చేశారని బంధువుల నోట వస్తున్న మాటలు. తల్లికి ఎంతో ధైర్యం చెప్పారు. అవేమీ ఆమెలో మనోస్థైర్యం నింపలేదు. చివరకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి భర్త చెంతకు చేరింది. -
నాలుగు స్తంభాలాట స్ఫూర్తితో...
శేఖర్, దిలీప్, శ్రీలక్ష్మి, గాయత్రీ గుప్తా ముఖ్య పాత్రలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో కార్తీక్ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాణంలో రూపొందిన సినిమా ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కృష్ణవర్మ మాట్లాడుతూ –‘‘గొప్ప దర్శకులైన జంధ్యాల రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రజెంట్ ట్రెండ్కి అనుగుణంగా అన్ని కమర్షియల్ హంగులను కథకు జోడించాం’’ అన్నారు. సంగీతం: గోపి. కెమెరా: రత్నబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
అకాల వర్షంతో ఆందోళన
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement