-
సౌదీ జైల్లో భారతీయుడు.. విడుదలకు రూ.34 కోట్ల నిధుల సేకరణ
కోజికోడ్: ప్రపంచంలో ఏమూల ఉన్నాసరే విపత్కర సమయాల్లో కేరళ ప్రజలంతా ఒక్కటవుతుంటారు. ఈ క్రమంలో సౌదీ అరేబియాలో మరణ శిక్ష పడిన ఓ వ్యక్తి కోసం ఇప్పుడూ వాళ్లంతా ఏకం అయ్యారు. ఓ హత్య కేసులో మరణశిక్ష పడ్డ వ్యక్తి జైల్లో మగ్గుతున్న ఆ వ్యక్తిని కాపాడటానికి ఏకంగా రూ. 34 కోట్లు నిధుల సేకరణకు ముందుకొచ్చారు. కోజికోడ్కు చెందిన అబ్దుల్ రహీమ్.. 2006లో సౌదీలో ఓ బాలుడికి అబ్దుల్ రహీమ్ కేర్టేకర్గా చేరారు. అయితే ప్రమాదవశాత్తు ఆ బాలుడు రహీమ్ సంరక్షణలో మృతి చెందాడు. దీంతో ఈ కేసులో అక్కడి న్యాయస్థానం రహీమ్కు మరణశిక్ష విధించింది. సుమారు 18 ఏళ్ల నుంచి సౌదీ అరేబియాలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో రహీమ్కు క్షమాభిక్ష ప్రసాదించడానికి బాధిత కుటుంబం తొలుత నిరాకరించింది. అయితే.. బ్లడ్మనీ (నష్ట పరిహారం రూపంలో) చెల్లిస్తే క్షమించేందుకు ఎట్టకేలకు ఒప్పుకుంది. బ్లడ్ మనీ కింద రూ.34కోట్లు చెల్లించాలని ఆ బాలుడి కుటుంబం షరతు విధించింది. అయితే రహీం ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కదా!. ఈ క్రమంలో సౌదీలోని కేరళీయులు అంతా ఏకమై నిధలు సేకరించడానికి ఓ కమిటిగా ఏర్పడ్డారు. ముందుగా నిధులు సమీకణకు పెద్దగా స్పందన రాలేదు. కొన్ని రోజుల అనంతరం కేరళీయుల నుంచి భారీ విరాళాలు రావటం ప్రారంభమైందని నిధుల సేకరణ కమిటీ మీడియాకు వెల్లడించింది. రియాద్లోని సుమారు 75 సంస్థలు, కేరళకు వ్యాపారవేత్తలు, స్థానిక రాజకీయ సంస్థలు విరాళాలు అందిచినట్లు తెలుస్తోంది. విరాళాల్లో పారదర్శకత కోసం సదరు కమిటి ప్రత్యేక నిధులకు సేకరణకు యాప్ను కూడా తయారు చేసింది. ‘ఇంత పెద్ద భారీ నిధులు సేకరణ సాధ్యం అవుతుందని అస్సలు ఊహించలేదు. రూ. 34 కోట్లు సేకరిస్తామన్న నమ్మకం మొదట్లో లేదు. కానీ మెల్లగా విరాళాలు పెరగటంతో సాధ్యం అయింది’ అబ్దుల్ రహీం తల్లి సంతోషం వ్యక్తం చేసింది. త్వరలోనే రహీమ్ జైలు నుంచి విడుదల కానున్నాడని అతని కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. -
14న మరో అద్భుత ఆలయాన్ని ప్రారంభించనున్న మోదీ
సుమారు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యానగరిలోని భవ్యమైన ఆలయంలో రామ్లల్లా కొలువయ్యాడు. తాజాగా ఒక ముస్లిం దేశంలోని హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధం అయ్యింది. ఈ నెల ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఆలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో నిర్మితమయ్యింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 13న అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ప్రవాస భారతీయులు పాల్గొనే ‘హలో మోదీ’ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14న యూఏఈ రాజధాని దుబాయ్లోని బీఏపీఎస్లో నిర్మితమైన హిందూ దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ప్రధాని మోదీ యూఏఈ పర్యటనపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ ‘హలో మోదీ’ కార్యక్రమానికి వేలాది మంది తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. యూఏఈలోని 150 భారతీయ కమ్యూనిటీ సొసైటీలు సంయుక్తంగా ‘హలో మోదీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. యూఏఈలో మూడేళ్ల వ్యవధిలో ఈ ఆలయాన్ని రాజస్థాన్, గుజరాత్లకు చెందినవారు నిర్మించారు. ఫిబ్రవరి 13న షేక్ జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ప్రవాస భారతీయుల సమావేశం నిర్వహించనున్నట్లు యూఏఈ రాయబారి తెలిపారు. 2020 నివేదిక ప్రకారం యూఏఈలో 35 లక్షలమంది ప్రవాస భారతీయులు ఉన్నారు. పురాతన, పాశ్చాత్య శిల్పకళల కలయికతో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. 2018లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. -
రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు?
ఉక్రెయిన్తో యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా సహా సంపన్న దేశాలు ఆంక్షలు విధించాయి. ఆదాయం పెంచుకోవడానికి తన మిత్ర దేశాలకు రష్యా రాయితీపై ముడి చమురు సరఫరా చేసింది. దీన్ని భారత్ అనుకూలంగా మార్చుకుని రష్యా నుంచి ముడి చమురు దిగుమతి పెంచుకుంది. అయితే క్రమంగా యుద్ధ భయాలు తొలగిపోతుండడంతో రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ ఖరీదుగా మారుతోంది. ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్ క్రూడ్ను చాలా తక్కువ రేటుకు ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్పై ఇస్తున్న డిస్కౌంట్ను రష్యా తగ్గించింది. ప్రస్తుతం బ్యారెల్పై 3-4 డాలర్ల వరకు మాత్రమే డిస్కౌంట్ ఇస్తోంది. కానీ, రవాణా ఛార్జీలను మాత్రం తగ్గించలేదని, సాధారణం కంటే ఇంకా ఎక్కువగానే ఉన్నాయని క్రూడ్ విక్రయిస్తున్న కంపెనీలు చెబుతున్నాయి. పశ్చిమ దేశాలు రష్యన్ క్రూడ్పై బ్యారెల్కు 60 డాలర్ల ప్రైస్ లిమిట్ను విధించిన విషయం తెలిసిందే. ఈ ధర కంటే కొద్దిగా తక్కువకు ఇండియన్ కంపెనీలు క్రూడాయిల్ కొంటున్నాయి. అదే ఆయిల్ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్కు 11 నుంచి 19 డాలర్ల వరకు రవాణా ఛార్జీని వసూలు చేస్తున్నాయని సమాచారం. దాంతో రష్యా నుంచి వరుసగా క్రూడాయిల్ దిగుమతులు తగ్గుతున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా గత నెలలో సౌదీ అరేబియా నుంచి ముడి చమురు దిగుమతులు పెరిగాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి 22 శాతం నుంచి 16 శాతానికి తగ్గితే, సౌదీ అరేబియా నుంచి నాలుగు శాతం పెరిగింది. చెల్లింపుల సమస్య తలెత్తడంతో రష్యా నుంచి గత నెలలో క్రూడాయిల్ కొనుగోళ్లు 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రష్యాలోని సొకోల్ తదితర ప్రాంతాల నుంచి ఐదు క్రూడాయిల్ చమురు రవాణా నౌకలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాయని తెలుస్తుంది. భారత్లో టాప్ రిఫైనరీ సంస్థగా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రమే సొకోల్తోపాటు రష్యాలోని రోస్ నెఫ్ట్ ప్రాంతం నుంచి చమురు కొనుగోళ్లకు వార్షిక ఒప్పందం కుదుర్చుకుంది. చెల్లింపు సమస్యను తగ్గించుకోవడానికి గత నెలలో సౌదీ అరేబియా సహా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చమురు కొనుగోలు ప్రారంభించిందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఇదీ చదవండి: రూ.10 వేలకోట్లు అప్పు చేసిన ‘రిచ్డాడ్ పూర్డాడ్’ పుస్తక రచయిత.. చమురు దిగుమతి చేసుకున్నందుకు రష్యాకు రుబెల్స్, రూపీల్లో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ చెల్లింపులకు చాలా విలువ ఉంటుంది. దాంతో కంపెనీలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు చమురుపై ఇస్తున్న డిస్కౌంట్ను తగ్గిస్తూ, రవాణా ఛార్జీలు తగ్గించకపోవడంతో ఈ పరిస్థితులు ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. -
సౌదీ స్మార్ట్ సిటీ ‘నియోమ్’ ప్రపంచాన్ని ఎందుకు ఆకర్షిస్తోంది?
ఆధునిక నిర్మాణాలకు సౌదీ అరేబియా పెట్టిందిపేరు. ప్రపంచంలోని ఏ పెద్ద కట్టడానికి సంబంధించిన ప్రస్తావన వచ్చినా ముందుగా సౌదీ అరేబియా పేరే వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం సౌదీ అరేబియా భారీ స్మార్ట్ సిటీ నిర్మాణంలో తలమునకలై ఉంది. ఇది ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలవనుంది. నియోమ్.. ఇది అనేది వాయువ్య సౌదీ అరేబియాలోని టబుక్ ప్రావిన్స్లో నిర్మాణంలో ఉన్న అద్భుత స్మార్ట్ సిటీ. ఈ ప్రదేశం ఎర్ర సముద్రానికి ఉత్తరంగా, ఈజిప్టుకు తూర్పున అకాబా గల్ఫ్ సమీపంలో, జోర్డాన్కు దక్షిణంగా ఉంది. 500 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ భవిష్యత్ నగరం సంపూర్ణంగా ‘స్వచ్ఛమైన శక్తి’తో మనుగడ సాగించనుంది. ఈ అధునాతన సిటీలో కార్లు ఉండవు. రోడ్లు కూడా ఉండవు. జీరో కార్బన్ ఉద్గారాలతో స్మార్ట్ సిటీ కాలుష్య రహితంగా ఉండనుంది. కాగా ఈ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనలో 20 శాతం పనులు పూర్తయ్యాయని నియోమ్ సీఈఓ నద్మీ అల్ నాస్ర్ మీడియాకు తెలిపారు. మానవాళి ఎదుర్కొంటున్న అనేక కీలక సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నామన్నారు. నియోమ్ అనేది గ్రీకు పదం. నియో అంటే కొత్తది. ఎం అనేదానిని అరబిక్ పదం ముస్తాక్బాల్ నుంచి తీసుకున్నారు. దీని అర్థం భవిష్యత్తు. నియోమ్ అనే పదాన్ని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పేరు నుంచి కూడా తీసుకున్నారని చెబుతారు. ఎర్ర సముద్ర తీరంలో 26,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మెగాసిటీ ప్రాజెక్ట్ను చేపట్టనున్నట్లు 2017 అక్టోబరులో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) ప్రకటించారు. రియాద్లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ కాన్ఫరెన్స్లో ఎంబీఎస్ ఈ ప్రకటన చేశారు. ఇది సౌదీ అరేబియా- 2030 విజన్లలో ఒకటి. దీనిని సౌదీ ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి చేసే లక్ష్యంలో నిర్మిస్తున్నారు. నియోమ్ అనేది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నిర్మాణాలకు భిన్నంగా స్వతంత్రంగా పనిచేస్తుందని, దానికంటూ సొంత పన్ను, కార్మిక చట్టాలు, ‘స్వయంప్రతిపత్త న్యాయ వ్యవస్థ’ ఉంటుందని ఎంబీఎస్ తెలిపారు. నియోమ్లో పోర్ట్లు, ఎంటర్ప్రైజ్ జోన్లు, పరిశోధనా కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, క్రీడా కేంద్రాలు, వినోద వేదికలు ఉంటాయని ఎంబీఎస్ తెలిపారు. నియోమ్ పునరుత్పాదక ఇంధన వనరుల నుండి వంద శాతం శక్తిని అందుకుంటుంది. సూర్యరశ్మి, గాలి, హైడ్రోజన్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని మాత్రమే నియోమ్ వినియోగిస్తుంది. ఫలితంగా ఈ సిటీలో కర్బన ఉద్గారాల విడుదల ప్రస్తావనే ఉండదు. ఈ నగరానికున్న మరొక ప్రత్యేకత ఏమిటంటే కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలతో కూడిన నీటిని సముద్రంలోకి తరలించరు. దానిని తిరిగి పారిశ్రామిక ముడి పదార్థంగా వినియోగిస్తారు. వ్యవసాయం విషయంలో కూడా నియోమ్ ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలవనుంది. గ్రీన్హౌస్ల ఏర్పాటుతో ప్రపంచంలోనే ఆహార స్వయం సమృద్ధిగల నగరాన్ని సృష్టించనున్నారు. సౌదీ అరేబియా ప్రస్తుతం 80 శాతం మేరకు ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్నది. ఇది కూడా చదవండి: అమెరికా అంతరిక్ష ప్రయోగాలలో హిట్లర్ సన్నిహితుడు? 1969లో ఏం జరిగింది? -
ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబం.. ఒక షిప్ విలువే వేల కోట్లు!
ప్రపంచంలో ఎలాన్ మస్క్, ఇండియాలో ముఖేష్ అంబానీ అత్యంత ధనవంతులని అందరికి తెలుసు. అయితే వీరికంటే కూడా సంపన్న కుటుంబం ఒకటుందని నివేదికలు చెబుతున్నాయి తెలుస్తోంది. ఇంతకీ ఆ ఫ్యామిలీ ఏది, ఎక్కడుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, సౌదీలోని కింగ్ 'సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్' నేతృత్వంలో ఉన్న కుటుంబం అత్యంత సంపన్న కుటుంబం అని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ కుటుంబంలో 15,000 కంటే ఎక్కువమంది ఉన్నట్లు సమాచారం. వీరికి చమురు నిల్వల నుంచి భారీగా సంపద వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కుటుంబంలో అత్యంత ధనవంతుడు అల్వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్.. ఆయన నికర విలువ దాదాపు 20 బిలియన్ డాలర్లు. అయితే కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ తమ ఖచ్చితమైన నికర విలువను వెల్లడించలేదు. కొన్ని నివేదికల ప్రకారం, సౌదీ అరేబియా రాజు ప్రస్తుతం విలాసవంతమైన అల్ యమామా ప్యాలెస్లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సుమారు 4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 1000 గదులు, సినిమా థియేటర్, అనేక స్విమ్మింగ్ పూల్స్ మరియు మసీదు వంటి అదనపు సౌకర్యాలు ఉన్నట్లు సమాచారం. ఈ రాజ కుటుంబం విలాసవంతమైన పడవలు, ఖరీదైన బంగారు పూతతో కూడిన కార్లు, ఖరీదైన దుస్తులు వినియోగిస్తున్నట్లు సమాచారం. వీరి వద్ద ఉన్న అనేక లగ్జరీ క్రూయిజ్ షిప్లలో ఒక దాని విలువ సుమారు రూ. 400 మిలియన్ డాలర్లు. ఇంకా వీరు రెండు హెలిఫ్యాడ్స్, స్పోర్ట్స్ పిచ్ వంటి వాటితో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ విమానం బోయింగ్ 747-400 కలిగి ఉన్నారు. టర్కీ బిన్ అబ్దుల్లా ఏకంగా 22 మిలియన్స్ ఖరీదైన కార్లు కలిగి ఉన్నట్లు సమాచారం. ఇందులో అనేక అన్యదేశ్య మోడల్స్ అయిన లాంబోర్ఘిని అవెంటడోర్ సూపర్వెలోస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూపే, మెర్సిడెస్, జీప్, బెంట్లీ మొదలైనవి ఉన్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement