-
తెలంగాణ ఉద్యమ నేతకు రూ.10లక్షలు
ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో జరిగిన ఉద్యమంలో పాల్గొని పోలీస్ కాల్పుల్లో గాయపడ్డ హైదరాబాద్ వాసి పగడాల పరంధామకు రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని సీఎం కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. 1969 ఏప్రిల్ 4న సికింద్రాబాద్ జనరల్ బజార్లో జరిగిన కాల్పుల్లో పరంధామ ఛాతిలో, కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన కొడుకు ఈతకు వెళ్లి మరణించాడు. కూతురును పోషించుకుంటూ పరంధామ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇటీవల సీఎం కేసీఆర్ను కలసి పరంధామ తన పరిస్థితిని వివరించాడు. దీంతో స్పందించిన సీఎం రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. -
మంత్రి.. ఇక మాజీనే!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న కేంద్రకేబినెట్ నిర్ణయంతో రాజకీయ నాయకుల హవాకు తాత్కాలిక బ్రేకులు పడనున్నాయి. కేంద్రకేబినెట్ సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తే మళ్లీ కొత్త ప్రభుత్వం వచ్చేంతవరకు జిల్లాలో పాలనాపగ్గాలు చేతులుమారనున్నాయి. జిల్లా నుంచి మంత్రిమండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాంరెడ్డి వెంకటరెడ్డి మాజీ కానుండగా, జిల్లా పాలనా వ్యవహారాల్లో కలెక్టర్ పూర్తిస్థాయిలో కీలకపాత్ర పోషించనున్నారు. అసెంబ్లీ సుప్తచేతనావస్థలోనికి వెళ్లనుండడంతో ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితిలోకి వెళతారు. కానీ వారి పదవులకు ఎలాంటి ఢోకా ఉండదు. ఒకవేళ రాష్ట్రపతి పాలనకు ఆమోదం తెలిపే ఉత్తర్వుల్లో శాసనసభను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తే మాత్రం ఎమ్మెల్యే పదవులు కూడా పోనున్నాయి. మంత్రి గారి పదవి గోవిందా... రాష్ట్ర ఉద్యానవన శాఖా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి పోగొట్టుకోనున్నారు. రాష్ట్రపతి పాలనకు ఆమోదం లభిస్తే రాష్ట్రంలో మంత్రిమండలి రద్దవుతుంది కనుక ఆ మంత్రి మండలిలో సభ్యుడయిన రాంరెడ్డి కూడా ఆ హోదా కోల్పోతారు. జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తొలిసారి వైఎస్ కేబినెట్లో మంత్రిపదవి చేపట్టారు. వైఎస్ రెండోసారి అధికారంలోకి రాగానే మంత్రివర్గంలో చేర్చుకుని సహకార, కార్మిక, ఫ్యాక్టరీలు, బ్రాయిలర్లు మంత్రిత్వ శాఖను అప్పగించారు. అప్పటినుంచి కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంతవరకు ఆ శాఖల మంత్రిగా పనిచేశారు. కిరణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేయడంతో రాంరెడ్డి పోర్టుఫోలియో మారింది. ఈయనకు కిరణ్ హయాంలో ఉద్యానవన, పట్టుపరిశ్రమ,మేఘమథనం మంత్రిత్వ శాఖలను అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే పదవిలో ఉన్న ఆయన రాష్ట్రపతి పాలన వస్తే మాజీ కానున్నారు. మంత్రి హోదాలో ఆయనకు ఉండే ప్రొటోకాల్ రద్దవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఆయన ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతారు. పూర్తిగా రద్దు కావు...కానీ మంత్రిమండలి రద్దయినప్పటికీ జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం పదవుల్లో ఉంటారు. ఎందుకంటే అసెంబ్లీ సుప్తచేతనావస్తలోనికి వె ళ్తుందే తప్ప పూర్తిగా రద్దు కాదు. ఎన్నికలు జరిగేలోపు మళ్లీ ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తే గవర్నర్ సభను సమావేశపర్చవచ్చు. అందుకోసం ఎమ్మెల్యే పదవులు రద్దు కావని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇక జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీస్పీకర్, ఎంపీలు, ఎమ్మెల్సీల పదవుల్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఎందుకంటే రాష్ట్రపతి పాలనతో వీరికి సంబంధం లేదు. ఎంపీలు కేంద్రానికి బాధ్యత వహిం చాల్సి ఉండగా, ఎమ్మెల్సీ హోదా కేవలం మండలికి మాత్రమే పరి మితం అవుతుంది. ఇక డిప్యూటీస్పీకర్ రాజ్యాంగబద్దమైన పదవి కనుక సభ రద్దయ్యేంతవరకు ఆ ప దవి కొనసాగుతుందని అధికారవర్గాలంటున్నాయి. ఇక నామినేటెడ్ పోస్టు లు, సర్పంచ్ పదవులకు కూడా ఎ లాంటి ఢోకా ఉండదు. స్థానిక ప్రభుత్వాలు యథావిధిగా పనిచేస్తాయి. అన్నింటికీ ప్రభుత్వ యంత్రాంగమే రాష్ట్రపతి పాలన వస్తే జిల్లాలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోనుంది. ఇప్పటివరకు రాజకీయ నాయకుల కనుసన్నల్లో సాగిన పాలనా వ్యవహారాలన్నీ పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం చేతుల్లోకి వెళ్లిపోతాయి. రాష్ట్ర గవర్నర్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ పూర్తిగా జిల్లాలో పాలన సాగిస్తారు. రాజకీయ పలుకుబడులకు బ్రేకులు పడతాయి. పాలన వ్యవహారాల్లో కలెక్టర్ నిర్ణయమే ఫైనల్ కానుంది. ఆయనతో పాటు ఇతర అధికారులపై రాజకీయ నాయకుల ప్రమేయం కానీ, పెత్తనం కానీ ఉండదు. ఏ నిర్ణయమైనా కలెక్టర్ తీసుకోవాల్సిందే. ఆయన నేరుగా గవర్నర్కే జవాబుదారీగా ఉంటారు. ప్రజల సమస్యల పరిష్కారం కూడా కలెక్టర్ చేతుల్లోనే ఉంటుంది. అయితే, మాజీమంత్రులు, ఎమ్మెల్యేల హోదాలో ప్రజాప్రతినిధులు కూడా ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టర్, ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు సిఫారసులు పంపవచ్చు. మళ్లీ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం కొలువు తీరినా, రాష్ట్రపతి పాలనను ఎత్తివేసినా పాత పరిస్థితులు పునరుద్ధరింపబడతాయి. -
సంబురాల ‘తెలంగాణ’
తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది మన గడ్డ మీదే. ప్రత్యేక పోరాటానికి ఊపిరులూదింది జిల్లా నేతలే. వారి అకుంఠిత పట్టుదల, దీక్షాదక్షలతోనే నేడు తెలంగాణ స్వప్నం సాకారమైంది. చారిత్రక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన కొండా వెంకట రంగారెడ్డి 1968లో ‘ఆంధ్ర’ పాలకులపై సమర భేరి మోగించారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కుతున్న వైనంపై నినదించిన కేవీ, అల్లుడు మర్రి చెన్నారెడ్డితో కలిసి 1969లో ‘ప్రత్యేక తెలంగాణ’కు పురుడు పోశారు. వికారాబాద్ కేంద్రంగా ఉద్యమానికి ఊపు తెచ్చిన మర్రి.. విద్యార్థులు, యువతను సంఘటితం చేశారు. తెలంగాణ ప్రజా సమితి పేర పార్టీని స్థాపించి రికార్డు స్థాయిలో ఎంపీ సీట్లను గెలుచుకోగలిగారు. ఆ తర్వాత పార్టీని కాస్తా కాంగ్రెస్లో విలీనం చేసి ఉద్యమానికి తెరిపిచ్చారు. కొన్నాళ్లపాటు ఒడిదొడుకులను ఎదుర్కొన్న ఉద్యమాన్ని మళ్లీ క్రియాశీలం చేసింది ఉద్యోగ సంఘాలే. 1985లో ఆరుసూత్రాల పథకం అమలులో సమైక్య ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంపై గళమెత్తిన ఉద్యోగ సంఘాలకు జస్టిస్ మాధవరెడ్డి అండగా నిలిచారు. స్వర్గీయ పి.ఇంద్రారెడ్డి, ఎంపీ దేవేందర్గౌడ్ కూడా తెలంగాణ పోరాటంలో తమ వంతు పాత్ర పోషించారు. 2009 తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగడంలోనూ.. జాతీయస్థాయిలో ఉద్యమ తీవ్రతను తెలియపరచడంలో మనవారి ఆత్మత్యాగం ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ యాదయ్య ఆత్మబలిదానం చేసుకోవడం విద్యార్థిలోకాన్ని కదిలించింది. పార్లమెంటు సాక్షిగా ప్రాణాలర్పించిన యాదిరెడ్డి ఘటనతో యావ త్ భారతావని ‘తెలంగాణ’కు అనుకూలంగా గళం వినిపించేందుకు కారణమైంది. అంతేకాకుండా 2001లో ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా టీఆర్ఎస్ స్థాపించిన కేసీఆర్ ఉద్యమానికి వ్యూహరచన చేసింది కూడా కందుకూరు మండలంలోని ఆయన ఫాంహౌస్లోనే. ఇలా తెలంగాణ ఉద్యమంలో ఆది నుంచి రాష్ట్ర సాధన వరకూ రంగారెడ్డి జిల్లా వేదికగా నిలిచింది. - సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి -
మళ్లీ నిరాశ
మంచిర్యాల సిటీ, న్యూస్లైన్ : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్రకు చెందిన ఏపీఎన్జీవో ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. టెట్ను ఈ నెల 9వ తేదీన నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్ష నిర్వహణకు ఉద్యోగులు సహకరించని నేపథ్యంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్)ను వాయి దా వేస్తున్నట్టు ప్రభుత్వం గురువారం రాత్రి ప్రకటించింది. ఫిబ్రవరి నెలాఖరులోగా నిర్వహిస్తామని మంత్రి పార్థసారథి ప్రకటించారు. దీం తో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఫిబ్రవరిలో రెవెన్యూ, ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ అర్హత పరీక్షలు ఉన్నాయని, అదే విధంగా తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అల్లర్లకు అవకాశం ఉండటంతో టెట్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని జనవరి 7వ తేదీన సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. వాయిదాల పర్వం మొదట సెప్టెంబర్ 30 తేదీన నిర్వహించనున్నామని విద్యాశాఖ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో వాయిదా పడటంతో నవంబర్లో నిర్వహిస్తామని రెండోసారి ప్రకటించారు. రెండో ప్రయత్నంలో కూడా వాయిదా పడటంతో నిరుద్యోగులు నిరాశకు లోనయ్యారు. ఎట్టకేలకు మూడోసారి ఫిబ్రవరి 9న పరీక్ష నిర్వహిస్తున్నామని ప్రకటించి, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మూడోసారి కూడ వాయిదా పడటంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వేలాది రూపాయలు వెచ్చించి శిక్షణ పొందిన అభ్యర్థులు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రకటన వెలువడే నాటికి 7,998 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
‘శీతాకాలం’లోనే టీ-బిల్లు: షిండే
* పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పెడతామని వెల్లడి * 18న కీలక సమావేశాలు జరపనున్న జీవోఎం * రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో, సీఎంతో భేటీలు * 20న ముసాయిదా నివేదికకు తుది మెరుగులు * వీలైతే అదే రోజున కేబినెట్కు తెలంగాణ బిల్లు! * శరవేగంగా సాగుతున్న విభజన ప్రక్రియ సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు బిల్లు పార్లమెంట్కు ఎప్పుడు వస్తుందనే విషయమై సాగుతున్న ఊహాగానాలకు, నెలకొన్న సస్పెన్స్కు తెరపడింది. బిల్లును రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే గురువారం స్వయంగా వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనపై కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జీవోఎం) కేబినెట్కు నివేదిక సమర్పించడానికి శరవేగంగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది. ఇందుకోసం ఈ నెల 11 నుంచి వరుస భేటీలు నిర్వహిస్తున్న జీవోఎం తాజాగా గురువారం సాయంత్రం దాదాపు నాలుగు గంటల పాటు కార్యదర్శుల స్థాయి ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించింది. ఏడు శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో వరుసగా సమావేశమై ఆయా శాఖల నివేదికలపై చర్చించింది. ప్రధానంగా ఆర్థిక, హోం, న్యాయ శాఖల ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షల్లో విభజనతో ముడిపడిన అత్యంత కీలకాంశాలు- హైదరాబాద్ ప్రతిపత్తి, 371-డి, ఆస్తులు-అప్పులు, రెవెన్యూ పంపకంపై విస్తృతంగా చర్చించింది. ముసాయిదా బిల్లు అంశాలపై న్యాయశాఖ ఉన్నతాధికారులతో లోతుగా మాట్లాడింది. ఇక్కడితో శాఖలన్నింటితో చర్చల కసరత్తును దాదాపుగా ఓ కొలిక్కి తీసుకొచ్చిన జీవోఎం ఈ నెల 18న మూడు కీలక భేటీలు జరపనుంది. ఆ రోజు ఉదయం10.30కు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులతో, 11.30కు సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులతో, 12.30కు సీఎం కిరణ్కుమార్రెడ్డితో భేటీ కానుంది. విభజనపై వారి సూచనలు, సలహాలు, అభిప్రాయాలను విన్న మీదట ముసాయిదా నివేదిక తయారు చేసి.. 20న తుది మెరుగులు దిద్దుతోంది. 21న కేంద్ర కేబినెట్ సమావేశంలోనే నివేదికను చర్చకు పెట్టవచ్చని, ఇందుకోసమే 20న జీవోఎం చివరి సమావేశాన్ని నిర్వహించనుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. 26కల్లా అసెంబ్లీకి బిల్లు అనుకున్న రీతిలోనే అన్నీ జరిగితే, కేబినెట్ సమావేశంలో నివేదికను ఆమోదించి బిల్లును ఒకటి రెండు రోజుల్లోపే రాష్ట్రపతికి పంపనున్నారు. రాష్ట్రపతి నుంచి బహుశా 26కల్లా రాష్ర్ట శాసనసభకు బిల్లు చేరుతుందని హస్తినలో ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ అభిప్రాయంతో బిల్లు వెనక్కి వచ్చిన వెంటనే అంతిమంగా శీతాకాల సమావేశాల్లో బిల్లును కచ్చితంగా ఏ రోజున పెట్టాలనేదానికి కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ఆదేశాల మేరకు ముహూర్తాన్ని కేంద్రం నిర్ణయిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. బాలల చిత్రోత్సవం వల్లే కిరణ్ రాలేకపోయారు హోం శాఖ కార్యాలయం ఉన్న నార్త్బ్లాక్లో ఈ సమీక్షా సమావేశాల్లో పాల్గొనడానికి సాయంత్రం 4 గంటలకు చేరుకున్న షిండే.. కార్యాలయం లోపల కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ బిల్లుపై నెలకొన్న సందిగ్ధతకు, ఉత్కంఠకు ఫుల్స్టాప్ పెట్టారు. జీవోఎం ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది, బిల్లును ఎప్పుడు తీసుకొస్తారనే ప్రశ్నించగా, తమకప్పగించిన పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని, శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో బిల్లు పెడతామని పునరుద్ఘాటించారు. గురువారం జీవోఎంతో చర్చలకు రావాల్సిన కిరణ్కుమార్రెడ్డి ఎందుకు రాలేదని అడగ్గా బాలల చలనచిత్రోత్సవమే కారణమని షిండే చెప్పారు. ‘‘ఆయన్ను మేం 18న కలుస్తాం. సీఎంతో భేటీ తర్వాత మా నివేదిక తయారీపై దృష్టి పెడతాం’’ అని చెప్పారు. ఈ నెల 21న జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణపై మీ నివేదికను చర్చకు పెడతారా అని ప్రశ్నించగా, ఆ సంగతి తాను చెప్పలేనంటూ శీతాకాల సమావేశాల్లో బిల్లు వస్తుందని పునరుద్ఘాటించారు. అధికారులకు షిండే ఆదేశాలు జీవోఎంకు అప్పగించిన పని రానున్న కొద్ది రోజుల్లో పూర్తికానున్నందున కేబినెట్కు సమర్పించాల్సిన నివేదిక రూపకల్పనకు సన్నాహాలను చకచకా చేయాలని హోంశాఖ ఉన్నతాధికారులను షిండే ఆదేశించినట్టు తెలిసింది. దాంతో జీవోఎంకు వివిధ శాఖల నుంచి అందిన నివేదికలు, అభిప్రాయాలు, సూచనలన్నింటినీ వారు క్రోడీకరిస్తున్నారని సమాచారం. అధికారులు ఒక పద్ధతి ప్రకారం వాటికి సమగ్ర రూపమిస్తున్నారని, వీటి ఆధారంగానే ముసాయిదా నివేదిక తయారవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముసాయిదా నివేదిక తయారయ్యాక జీవోఎం దాన్ని పరిశీలించి చివరగా అవసరమనుకున్న మార్పుచేర్పులు చేస్తుందని, ఆ తుది మెరుగులు పూర్తయ్యాయంటే అది కేబినెట్కు వెళ్లిపోతుందని చెప్పాయి. ఈ ప్రక్రియ మొత్తాన్ని రానున్న వారంలోపే జీవోఎం పూర్తి చేస్తుందని ఆ వర్గాలు వివరించాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement