-
ఆ మాంత్రికుడు ఎక్కడున్నాడు: ప్రధాని మోదీ
భోపాల్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై ప్రధాని మోదీ సెటైర్లు వేశారు. ఇన్నాళ్లూ ఈ రాయల్ మాంత్రికుడు ఎక్కడ దాక్కున్నాడని రాహుల్ను ఉద్దేశించి ప్రధాని ప్రశ్నించారు. దేశంలో పేదరికాన్ని ఒకే ఒక్క దెబ్బకు లేకుండా చేస్తానన్న రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని ఎద్దేవా చేశారు. ఆదివారం(ఏప్రిల్14) మధ్యప్రదేశ్లోని హొషాంగాబాద్లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి మేనిఫెస్టోలోని ప్రతీ హామీ దేశాన్ని దివాతా తీయిస్తుందని హెచ్చరించారు. కాగా, గత వారం రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్గాంధీ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఒకే ఒక దెబ్బతో దేశంలో పేదరికాన్ని లేకుండా చేస్తామన్నారు.‘మీరు గనుక దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే మీ ఖాతాల్లోకి లక్ష రూపాయాలు వచ్చి పడతాయి. డబ్బులు వస్తూనే ఉంటాయి మీ ఖాకతాల్లోకి. ఒకే ఒక్క దెబ్బకు పేదరికం లేకుండా పోవాలి’అని రాహుల్ ప్రజలకు హామీ ఇచ్చారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుంటుంబాల్లోని మహిళలకు ఒక్కొక్కరికి ఖాతాల్లో లక్ష రూపాయల చొప్పున జమ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల -
‘శీష్మహల్ టు తీహార్’.. కేజ్రీవాల్పై బీజేపీ సెటైర్లు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో 14రోజుల జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లిన కొద్ది గంటల్లోనే ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ సోషల్ మీడియాలో సెటైర్లు మొదలు పెట్టింది. ఢిల్లీలోని కేజ్రీవాల్ అధికారిక నివాసం శీష్మహల్ నుంచి జైలుకు వెళుతున్నట్లుగా ఉన్న ఫొటోతో ఢిల్లీ బీజేపీ శాఖ తన అధికారిక ఎక్స్(ట్విటర్) ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. शराब घोटाले के सरगना - Sheesh Mahal To Tihar pic.twitter.com/MbLH0pn1JA — BJP Delhi (@BJP4Delhi) April 1, 2024 ‘గిల్టీ ఆఫ్ లిక్కర్ స్కామ్.. శీష్ మహల్ టు తీహార్’ అనే క్యాప్షన్ను పోస్టుకు జత చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసానికి బీజేపీ నేతలు శీష్మహల్ అనే పేరు పెట్టి పిలుస్తారు. రూ.45 కోట్లతో ఈ నివాసాన్ని కేజ్రవాల్ సుందరీకరించుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. కాగా, లిక్కర్ కేసులో అరెస్టయి 6 రోజులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీలో ఉన్న తర్వాత కోర్టు సోమవారం( ఏప్రిల్ 1) జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదీ చదవండి.. మీరు వారితో పోల్చుకోవద్దు.. ఉదయనిధికి సుప్రీం చురక -
తమిళనాడులో ప్రచార వేడి.. ప్రధానిపై ఉదయనిధి సెటైర్లు
చెన్నై: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీపై మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామనాథపురం, తేనిలలో జరిగిన ప్రచార సభల్లో మాట్లాడుతూ మోదీ 28 పైసల ప్రధాని అని సెటైర్లు వేశారు. కేంద్ర పన్నుల వాటాలో తమిళనాడు నుంచి వెళ్లే ప్రతి రూపాయిలో తిరిగి 28 పైసలు మాత్రమే కేంద్రం ఇస్తోందని, ఇందుకే ప్రధాని 28 పైసల పీఎం అని విమర్శించారు. ఎన్నికలున్నప్పుడే తమిళనాడుకు ప్రధాని వస్తారని మండిపడ్డారు. మధురైలో ఎయిమ్స్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు తయారైందన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) తీసుకువచ్చి తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును కేంద్రం నాశనం చేస్తోందన్నారు. నీట్పై నిషేధంతో పాటు ప్రతి అంశంలోనూ తమిళనాడుపై ప్రధాని వివక్ష చూపుతున్నారని ఉదయనిధి మండిపడ్డారు. కాగా, తమిళనాడులోని 39 ఎంపీ సీట్లకు గాను ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇదీ చదవండి.. కేజ్రీకి దక్కని ఊరట -
చన్నీటితో స్నానం చేస్తే పాత పార్టీ, వేడి నీళ్లైతే కొత్త పార్టీ..! ఇంతకీ ఎవరాయన?
ఆయన నిన్న రాత్రి డిన్నర్ చేసి పడుకొనే సమయానికి ఒక పార్టీలో ఉన్నాడు. పొద్దున్న లేచి బ్రష్ చేసుకొని... మరో పార్టీ లో చేరేందుకు సిద్ధం అయ్యాడు . టిఫిన్ చేస్తుంటే .. పాత పార్టీ వారు వచ్చి నచ్చ చెప్పారు . సాయంకాలం టీ తాగే సమయానికి తిరిగీ పార్టీ మారే ప్రయత్నం చేసారు . రేపు లేచి స్నానం చేసి , ఏ పార్టీ లో చేరుతారో తెలియదు . అయన రేపు చన్నీటితో స్నానం చేస్తే పాత పార్టీలోనే కొనసాగవచ్చని .. వేడి నీటితో స్నానం చేస్తే మాత్రం పార్టీ మారడం ఖాయం అని ప్రముఖ రాజకీయ జ్యోతిష్యుడు పేను స్వామి విశ్లేషించారు. గవ్వల శాస్త్రం ప్రకారం అయన పాత పార్టీ లో కొనసాగే అవకాశం ఉందని యూట్యూబ్ ఛానల్ కిచ్చిన ఇంట్వ్యూ లో గవ్వల గన్నా రావు గారు సెలవిచ్చారు . చిలుక జ్యోతిష్యం ప్రకారం ఆయన కొత్త పార్టీ లోకి పోతాడు అని ఒక యూట్యూబ్ ఛానల్ తీసిన వీడియోకు ఒక్క రోజులో వెయ్యి కోట్ల వ్యూస్ వచ్చాయి . ఒక రోజులో వెయ్యి కోట్ల వ్యూస్ బోగస్ అని యూట్యూబ్ చానెల్స్ వ్యూస్ ను డబ్బులిచ్చి కొనుక్కొంటారని..... గిట్టని.. గిట్టుబాటు లేని కొన్ని యూట్యూబ్ చానెల్స్ వారు సణుక్కొంటున్నారు. అయన ఏ పార్టీలో ఉంటాడు అనే దాని పై ఇప్పుడు జోరుగా బెట్టింగ్ సాగుతోంది. దుబాయ్ కేంద్రంగా వున్న ప్రముఖ బెట్టింగ్ సంస్థ వారు ఆయన కొత్త పార్టీ లో చేరే అవకాశముందని చెప్పారు. ఇదిలా ఉండగా ఆయన పాత పార్టీ లోనే కొనసాగాలని కోరుతూ... ఆ పార్టీ కి చెందిన నలుగురు కార్యకర్తలు ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మ హత్య ప్రయత్నం చేసారు . వారు ఒంటికి నిప్పంటించుకొంటారేమో కెమెరా లు ఆన్ చేసి ఆశగా ఎదురు చూసిన ముప్పై అయిదు యూట్యూబ్ చానెల్స్ వారికి నిరాశ ఎదురయ్యింది . కాల్ షీట్స్ అయిపోవడంతో మరో షూటింగ్ కోసం ఆ కార్యకర్తలు బండెక్కి వెళ్లిపోయారు. షూటింగ్ పూర్తి కాకుండానే వారి వెళ్లిపోవడం అన్యాయమని ఇలా అయితే తాము జూనియర్ ఆర్టిస్ట్ల కోసం మరో కంపెనీని చూసుకొంటామని ఆ పార్టీ కీలకనాయకుడు వ్యాఖ్యానించినట్టు తెలిసింది . ఆయన కొత్త పార్టీలో చేరాలని కోరుతూ ఆ నాయకులు నగర బంద్కు పిలుపునిచ్చారు. మద్యం దుకాణాలు లాంటి వాటి జోలికి తాము పోమని విద్యా సంస్థలు తెరిస్తే మాత్రం ఫర్నిచర్ ధ్వసం చేస్తామని వారు హెచ్చరించారు . ఢిల్లీకి చెందిన ప్రముఖ సర్వే సంస్థ జరిపిన సర్వేలో ఆయన కొత్త పార్టీలో చేరడం ఖాయం అని అరవై శాతం ప్రజలు తెలిపారు. ఆయన పాత పార్టీలోనే కొనసాగాలని కోరుతూ సర్వ మత ప్రార్ధనలు నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ నాయకుడు ఒకరు చెప్పారు . ఆయన పార్టీ మారుతారు లేదా అనే విషయంపై ఇప్పుడు ప్రజానీకం ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఊపిరి ఆడక ఇప్పటికే యాభై మంది గుండెపోటుకు , ఇరవై మంది మెదడు పోటుకు గురయ్యారు . మీ పిల్లాపాపల ఆలనా పాలన గాలికి వదిలి .. మీ శ్రీమతి గారిని టీవీ సీరియళ్లకు వదిలేసి .. మీరు మాత్రం మా ఛానల్ చూస్తూనే ఉండండి. ప్రతి క్షణం మారుతున్న పరిస్థితిని మీకు అర్ధ రాత్రి అయినా అప రాత్రి అయినా అందిస్తూనే ఉంటాము. గమనిక: ఇవన్నీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కమెంట్లు. వీటిని చదువుతోంటే.... గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకుండా చతికిలపడిన నేత, కేకలు, కూకలు తప్ప, ప్రసంగాల్లో మేటర్ లేని , వేల బుక్స్ చదివిన అపర మేధావి (అంతా ఉత్తిదే) గుర్తొస్తే మాత్రం మా బాధ్యత కాదు. -
చంద్రబాబు రాత్రి లోకేష్ ని రూమ్ లోకి పిలిచి
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కాంగ్రెస్కు షాక్.. నామినేషన్ వెనక్కి తీసుకున్న ఇండోర్ అభ్యర్థి
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
Advertisement