-
కర్ణాటక కెప్టెన్గా రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చిన్న కొడుకు అన్వయ్ ద్రవిడ్ కర్ణాటక క్రికెట్ జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఓ ఇంటర్ జోనల్ అండర్-14 టోర్నమెంట్లో అన్వయ్ కర్ణాటక టీమ్ను లీడ్ చేయనున్నాడు. వికెట్కీపర్ కమ్ బ్యాటర్ అయిన అన్వయ్.. గతకొంతకాలంగా విశేషంగా రాణిస్తూ, తన స్వయం కృషితో సారధిగా నియమించబడ్డాడు. రాహుల్ ద్రవిడ్ పెద్ద కొడుకు, అన్వయ్ అన్న సమిత్ ద్రవిడ్ కూడా క్రికెటర్గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. సమిత్.. 2019-20 సీజన్లో అండర్-14 క్రికెట్లో రెండు డబుల్ సెంచరీలు బాది వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు సమిత్ తమ్ముడు అన్వయ్ కూడా అన్న తరహాలోనే రాణించి, తండ్రికి తగ్గ తనయుడనిపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అన్వయ్ కూడా తండ్రి రాహుల్ ద్రవిడ్ లాగే వికెట్కీపర్ కమ్ బ్యాటర్ కావడంతో తండ్రిలాగే సక్సెస్ అవుతాడని అందరూ అనుకుంటున్నారు. ధోనికి ముందు టీమిండియాకు సమర్ధవంతుడైన రెగ్యులర్ వికెట్కీపర్ లేకపోవడంతో ద్రవిడ్ చాన్నాళ్ల పాటు వికెట్కీపింగ్ భారాన్ని మోసాడు. ధోని రాకతో ద్రవిడ్ బ్యాటింగ్పై మాత్రమే ప్రత్యేక దృష్టి సారించి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్తో బిజీగా ఉన్నాడు. ద్రవిడ్ కోచింగ్లో భారత్ ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా అతని ఆధ్వర్యంలో టీమిండియా.. న్యూజిలాండ్ను తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో ఓడించి, 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. జనవరి 21న రాయ్పూర్ వేదికగా టీమిండియా-కివీస్ జట్ల మధ్య రెండో వన్డే జరుగనుంది. -
26 ఫోర్లతో డబుల్ సెంచరీ
బెంగళూరు: టీమిండియా వాల్, దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ వారసుడు సమిత్ ద్రవిడ్ తండ్రిదగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. రెండు నెలల వ్యవధిలో రెండో డబుల్ సెంచరీ సాధించి సత్తా చాటాడు. తన స్కూల్ మాల్యా అదితి ఇంటర్నేషనల్(ఎంఏఐ) తరపున బరిలోకి బ్యాట్ ఝళిపించాడు. బీటీఆర్ షీల్డ్ అండర్-14 గ్రూప్ వన్ డివిజన్ 2 టోర్నమెంట్లో ద్విశతకంతో జూనియర్ ద్రవిడ్ చెలరేగాడు. కేవలం 144 బంతుల్లోనే 26 ఫోర్లు, సిక్సర్తో 211 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. సమిత్ విజృంభణతో ఎంఏఐ టీమ్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 386 పరుగులు భారీ స్కోరు చేసింది. ఎంఏఐతో పోటీ పడిన బీజీఎస్ నేషనల్ పబ్లిక్ స్కూల్ జట్టు వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి 132 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. క్రికెట్లో సత్తా చాటడం సమిత్ ద్రవిడ్ కొత్త కాదు. అండర్-14 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో భాగంగా గతేడాది డిసెంబర్ 20న జరిగిన మ్యాచ్లో వైస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు తరపున బరిలోకి సమిత్ డబుల్ సెంచరీ(201)తో మోత మోగించాడు. అండర్-12 విభాగంలో 2015లో జరిగిన టోర్నమెంట్లో మూడు అర్ధసెంచరీలు బాదడంతో సమిత్ పతాక శీర్షికలకు ఎక్కాడు. అప్పటి నుంచి స్థిరంగా రాణిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుంటున్నాడు. (చదవండి: సచిన్ను గంగూలీ వదలట్లేదుగా!) -
అదరగొట్టిన ‘వాల్’ వారసుడు!
బెంగళూరు : టీమిండియా వాల్, దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ వారసుడు సమిత్ ద్రవిడ్ అదరగొట్టాడు. ఇప్పటి వరకు క్రికెటర్ల తనయుల పేర్లలో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పేరే వినిపించగా.. తాజాగా ద్రవిడ్ కొడుకు సైతం వార్తల్లో నిలిచాడు. బెంగళూరులో జరిగిన అండర్-14 టోర్నీలో ఈ 12 ఏళ్ల చిన్న ద్రవిడ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అధితి ఇంటర్నేషనల్ స్కూల్ తరపున బరిలోకి దిగిన సమిత్ అర్థ సెంచరీతో పాటు 4 వికెట్లు పడగొట్టి విజయం కీలక పాత్ర పోషించాడు. దీంతో కెంబ్రిడ్జి పబ్లిక్ స్కూల్పై సమిత్ జట్టు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ద్రవిడ్ అండర్-19 కోచ్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ అండర్ 19 కోచ్ పెద్దకొడుకైన సమిత్.. ఇలా ఆకట్టుకోవడం ఇదే తొలిసారేం కాదు. జనవరిలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ (కేఎస్సీఏ) నిర్వహించిన బీటీఆర్ కప్లో సమిత్ 150 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా అండర్-12 టోర్నీల్లో అత్యధిక పరుగుల సాధించిన క్రికెటర్గా గుర్తింపు కూడా పొందాడు. 2015లో అండర్-12 గోపాలన్ క్రికెట్ చాలెంజ్ పోటీల్లో బెస్ట్ బ్యాట్స్మన్గా నిలిచాడు. ఇక సచిన్ కుమారుడు అర్జున్ శ్రీలంక పర్యటనలోని భారత అండర్-19 జట్టు తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. చదవండి: ద్రవిడ్కు గొప్ప బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన కొడుకు -
ద్రావిడ్కు గొప్ప బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన కొడుకు
ముంబయి : భారత్ క్రికెట్కు వన్నె తెచ్చిన దిగ్గజాల్లో మిస్టర్ వాల్ (రాహుల్ ద్రావిడ్)ది ప్రత్యేక స్థానం. ఒదిగి ఉండే మనస్తత్వానికి, ఎలాంటి సమయంలోనూ చెక్కుచెదరని వ్యక్తిత్వానికి ఆయనే నిదర్శనం. ద్రావిడ్గా కంటే మిస్టర్వాల్గా, మిస్టర్ డిపెండబుల్గానే ఆయనను ఎక్కువగా పిలుచుకుంటారు. నేడు ఆయన జన్మదినం. ఈ నేపథ్యంలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 'నిబద్ధత, నిలకడ, క్లాస్'వంటి గొప్పలక్షణాలు గల వ్యక్తి రాహుల్ ద్రావిడ్ అని, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. పలువురు క్రికెటర్లు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కుమారుడి కానుక ఇండియా అండర్ 19 టీమ్ కోచ్ గా ఉన్న రాహుల్ ఐసీసీ వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్లో ఉన్నారు. వార్మప్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీంపై 189పరుగుల తేడాతో ఇండియా అండర్ 19టీం విజయం సాధించింది. కొత్త ఏడాదిలో ద్రావిడ్కు ఇది తొలి విజయం కాగా, సరిగ్గా ఆయన పుట్టిన రోజుకు రెండు రోజులు ముందు కుమారుడు సమిత్ ద్రావిడ్ 150 పరుగులు చేశాడు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ (కేఎస్సీఏ) నిర్వహిస్తున్న బీటీఆర్ కప్లో మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ టీంలో ఆడుతున్న సమిత్ 150 పరుగులు చేసి తండ్రికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఈ మ్యాచ్లో సమిత్ టీం మొత్తం 50 ఓవర్లలో 500/5 పరుగులు చేసింది. Commitment, Consistency, Class. Here's wishing a very Happy Birthday to Former #TeamIndia Skipper Rahul Dravid #HappyBirthdayDravid pic.twitter.com/FTgk1SjdT9 — BCCI (@BCCI) 11 January 2018 -
జూనియర్ ద్రవిడ్ వచ్చేశాడు!
స్కూల్ క్రికెట్లో సెంచరీ చేసిన సమిత్ బెంగళూరు: భారత మాజీ ఆటగాడు, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ బాటలోనే అతని కొడుకు కూడా పోటీ క్రికెట్లోకి దూసుకొస్తున్నాడు. అండర్-14 స్థాయి క్రికెట్లో ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న 11 ఏళ్ల సమిత్ ద్రవిడ్ ఈ సీజన్లో సెంచరీతో సత్తా చాటాడు. ‘టైగర్ కప్’ టోర్నీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో బెంగళూరు యునెటైడ్ క్రికెట్ క్లబ్ (బీయూసీసీ)కి ప్రాతినిధ్యం వహించాడు. ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్తో జరిగిన మ్యాచ్లో సమిత్ 125 పరుగులు సాధించాడు. సహచర ఆటగాడు ప్రత్యూష్ (143)తో కలిసి సమిత్ 213 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్లో బీయూసీసీ 246 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గత సంవత్సరం స్కూల్ క్రికెట్లో ఆకట్టుకున్న సమిత్, అండర్-12 విభాగం టోర్నీ గోపాలన్ క్రికెట్ చాలెంజ్లో ఉత్తమ బ్యాట్స్మన్గా నిలిచాడు. తనతో పోలిస్తే సమిత్ బాగా దూకుడుగా ఆడతాడని, ప్రతీ బంతిని బాదే ప్రయత్నం చేస్తాడని కొన్నాళ్ల క్రితం స్వయంగా ద్రవిడ్ చెప్పుకున్నాడు. సచిన్ కుమారుడు అర్జున్ తర్వాత ఇప్పుడు సమిత్ రాకతో మరో తరం వారసులు కూడా సిద్ధమైనట్లే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement