-
ఆర్బీఐ కీలక నిర్ణయం, ఆశ్చర్యపోయిన నిర్మలా సీతారామన్!
ముంబై: పాలసీ రేట్లను పెంచాలన్న ఆర్బీఐ నిర్ణయం కన్నా..అందుకోసం ఎంచుకున్న సమయమే ఆశ్చర్యపర్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వడ్డీ రేట్ల పెంపు వల్ల నిధుల సమీకరణ వ్యయాలు పెరిగినా.. ప్రభుత్వం తలపెట్టిన ఇన్ఫ్రా పెట్టుబడుల ప్రణాళికలపై ఎటువంటి ప్రభావం ఉండబోదని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత తొలిసారిగా స్పందించిన మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘ఆర్బీఐ రేట్లను పెంచుతుంది అన్నది అందరూ ఊహిస్తున్నదే. కాకపోతే అందుకోసం ఎంచుకున్న సమయమే ఆశ్చర్యపర్చింది. రెండు ఎంపీసీ (ద్రవ్య పరపతి విధాన కమిటీ) సమావేశాలకు మధ్య ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యపర్చింది‘ అని ఆమె తెలిపారు. రేట్ల పెంపు విషయంలో ఆర్బీఐ గత ఎంపీసీ సమావేశంలోనే సంకేతాలు ఇచ్చిందని, అంతర్జాతీయంగా ఇతర ప్రధాన సెంట్రల్ బ్యాంకుల తీసుకుంటున్న చర్యల్లో ఇది కూడా భాగమని మంత్రి వివరించారు. ‘ఇటీవలి కాలంలో సెంట్రల్ బ్యాంకుల మధ్య అవగాహన మరింతగా పెరిగింది. ఒక రకంగా అవన్నీ ఒకదానితో మరొకటి కలిసికట్టుగా పని చేస్తున్నాయి. ఆస్ట్రేలియా వడ్డీ రేట్లు పెంచింది. ఆర్బీఐ పెంచిన రోజు రాత్రే అమెరికా కూడా పెంచింది. అయితే, మహమ్మారి ప్రభావం నుంచి కోలుకునే ప్రక్రియను ఎలా నిర్వహించాలన్న అంశం అర్థం కావడం లేదు. ఈ సమస్య కేవలం భారత్కు మాత్రమే ప్రత్యేకం కాదు. అంతర్జాతీయంగా అన్ని చోట్లా ఇలాగే ఉంది‘ అని ఆమె చెప్పారు. 2018 ఆగస్టు తర్వాత ఆర్బీఐ తొలిసారిగా ఈ ఏడాది మే 4న పాలసీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని 50 బేసిస్ పాయింట్ల మేర పెంచిన సంగతి తెలిసిందే. దీనితో రెపో రేటు (బ్యాంకులకు తాను ఇచ్చే నిధులపై ఆర్బీఐ విధించే వడ్డీ రేటు) 4.40 శాతానికి చేరింది. -
యథాతథంగా ఆర్బీఐ రేట్లు!
న్యూఢిల్లీ: ముడిచమురు రేట్లు, కనీస మద్దతు ధరల పెంపు వంటి అంశాలతో ద్రవ్యోల్బణం ఎగిసే అవకాశం ఉన్నప్పటికీ.. రిజర్వ్ బ్యాంక్ ఈ దఫా పరపతి విధాన సమీక్షలో కీలక పాలసీ రేట్లను పెంచకపోవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతానికి యథాతథ స్థితే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సోమవారం రెండో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సారథ్యంలో పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల పాటు ఈ సమీక్ష జరగనుంది. ఆగస్టు 1న కీలకపాలసీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయాన్ని ప్రకటించనుంది. ధరల పెరుగుదల భయాల నేపథ్యంలో జూన్లో ఆర్బీఐ రేటును 0.25% పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది 6.25%. రేట్ల పెంపు విషయంలో ఆర్బీఐ ప్రధానంగా పరిగణనలోకి తీసుకునే రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో ఏకంగా 5 నెలల గరిష్టమైన 5 శాతానికి ఎగిసింది. ఇంధన ధరలు ఎగియడమే ఇందుకు కారణం. ప్రస్తుతం క్రూడాయిల్ రేట్లు మూడేళ్ల గరిష్ట స్థాయి నుంచి కిందికి దిగి వచ్చినప్పటికీ.. ద్రవ్యోల్బణం, కరెంటు అకౌంటు లోటు పెరగొచ్చన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆర్బీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు శాతం అటూ, ఇటూగా ద్రవ్యోల్బణం 4% స్థాయికి పరిమితమయ్యేలా చూడటంపై రిజర్వ్ బ్యాంక్ ప్రధానంగా దృష్టి పెట్టడం తెలిసిందే. ఎస్బీఐ, ఎడెల్వీస్ అంచనాలివి.. ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లను పెంచడం కన్నా యథాతథ స్థితి కొనసాగించడమే శ్రేయస్కరం కాగలదని భావిస్తున్నట్లు ఎస్బీఐ అధ్యయన నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణ రిస్కులు పెరగడం, తగ్గడానికి సమాన అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించింది. మరీ తప్పకపోతే రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచిందంటే .. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేలా మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోవాలన్న అభిప్రాయం ఒక్కటే కారణం కాగలదని ఎస్బీఐ పేర్కొంది. మరోవైపు, రాబోయే పాలసీ సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకుండా తటస్థ వైఖరి అవలంబించే అవకాశం ఉందని ఎడెల్వీస్ సెక్యూరిటీస్ మరో నివేదికలో అభిప్రాయపడింది. అటు హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా ఆర్బీఐ యథాతథ స్థితే కొనసాగించవచ్చని తెలిపింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మరిన్ని దఫాలు వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు గణనీయంగా ఉన్నాయని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం డీబీఎస్ పేర్కొంది. -
బ్యాంకుల ‘వడ్డింపు’ ప్రారంభం
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను పావుశాతం పెంచడం (6.25 శాతానికి)తో, వాణిజ్య బ్యాంకులు తక్షణం ఈ భారాన్ని వినియోగదారులకు బదలాయించడం ప్రారంభించాయి. దీంతో ఆటో, గృహ, వ్యాపార రుణాలకు సంబంధించి కస్టమర్లపై ఈఎంఐ భారం ప్రారంభమయినట్లయ్యింది. ఇందుకు సంబంధించిన పరిణామాలను గమనిస్తే... ► నాలుగున్నరేళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఆర్బీఐ రెపో రేటును బుధవారం పావుశాతం పెంచిన విషయం విదితమే. రేటు పెంపును ముందే అంచనావేసిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ప్రైవేటు రంగంలో అతిపెద్ద రెండు బ్యాంకులు– ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సహా పలు బ్యాంకులు తమ మార్జినల్ కాస్ట్ (నిధుల సమీకరణకు సంబంధించి వ్యయాలు) ఆధారిత రుణ రేటును అప్పటికే కొంత పెంచేశాయి. ►ఈ పెద్ద బ్యాంకులకు తాజాగా ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్లు తోడయ్యాయి. వివిధ మెచ్యూరిటీలపై ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు పెంచినట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలిపాయి. ►ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ మూడు నెలల నుంచి ఐదేళ్ల కాలానికి సంబంధించిన రుణ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ►కరూర్ వైశ్యా బ్యాంక్ కూడా 6 నెలలు, ఏడాది కాల వ్యవధి రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ► త్వరలో రుణరేటు పెంపు దిశలో నిర్ణయం తీసుకోనున్నట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పేర్కొంది. ► కాగా తక్షణం బ్యాంకింగ్ వడ్డీరేట్ల పెంపు భారీగా ఏమీ ఉండకపోవచ్చని ఎస్బీఐ చైర్మన్ రజ్నీష్ కుమార్ పేర్కొన్నారు. ఎఫ్ఏఎల్ఎల్సీఆర్ (ఫెసిలిటీ టూ అవీల్ లిక్విడిటీ ఫర్ లిక్విడిటీ కవరేజ్ రేషియో)లో పెంపు వల్ల బ్యాంకుల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండడమే దీనికి కారణమన్నారు. -
వచ్చే జనవరి నుంచి ఆర్బీఐ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2019 జనవరి–మార్చి) నుంచి ఆర్బీఐ కీలక రేట్లను పెంచడం మొదలు కావచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల కంపెనీ మోర్గాన్స్టాన్లీ అంచనా వేసింది. ఆర్థిక రికవరీ అప్పటి నుంచి నిలకడగా ఉండడంతోపాటు ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రిత లక్ష్య స్థాయి నుంచి మరీ పెరిగే అవకాశాల్లేకపోవడం రేట్ల పెంపునకు సానుకూలతలుగా పేర్కొంది. ఈఏడాది చివరికి ప్రైవేటు మూలధన వ్యయాలు పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో మరింత స్పష్టత, స్థిరమైన ఆర్థిక రికవరీ దన్నుగా ఆర్బీఐ స్వల్ప మొత్తంలో రేట్ల పెంపు చేపట్టొచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ తొలి పాలసీ సమీక్ష గత వారం ముగియగా, కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు డాయిష్ బ్యాంకు కూడా ఇదే అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ‘‘75 బేసిస్ పాయింట్ల మేర రేట్ల పెంపు ఉంటుందని అంచనా వేస్తున్నాం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది కాకుండా రేట్ల పుంపు వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం కావచ్చు’’ అని పేర్కొంది. -
ఆర్బీఐ రేట్ల నిర్ణయం నేడు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రెండు రోజుల ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం బుధవారం ప్రారంభమైంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ గురువారం ప్రధాన పాలసీ విధానాన్ని ప్రకటించనుంది. 2018–19లో ఆర్బీఐ మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఇది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 6 శాతం) ఆర్బీఐ యథాతథంగా కొనసాగించే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల తీవ్రత, దేశంలో పెట్రో ధరల పెంపు, వర్షపాతం, పంట దిగుబడులపై అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలను ఇందుకు వారు కారణంగా చూపుతున్నారు. ఆగస్టు తర్వాత ఇప్పటివరకూ రెపోను ఆర్బీఐ తగ్గించలేదు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement