-
సెన్సార్ పూర్తి.. ఇక సంక్రాంతికి సంబరాలే
సాక్షి, హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకొంది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బృందం... యూ/ఏ సర్టిఫికేట్ను జారీ చేసింది. ‘సెన్సార్ పూర్తయింది. గతంలో ఎన్నడూలేనివిధంగా ఈ సంక్రాంతికి భారీ సంబరాలతో మేం సిద్ధమవుతున్నాం. పండుగ సరదాల కోసం మేం మిమ్మల్ని మీ కుటుంబంతో సహా థియేటర్లకు ఆహ్వానిస్తున్నాం. డోన్ట్ మిస్’ అంటూ గీతా ఆర్ట్స్ తన ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. అయితే, వినూత్నంగా రిలీజ్ చేసిన సెన్సార్ సర్టిఫికేట్ పోస్టర్లోనూ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్ వెల్లడించలేదు. ఈ నెల 12న సినిమా విడుదల కానున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే, కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో, తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లోనూ రిలీజ్ డేట్ లేదు. జస్ట్ సంక్రాంతి రిలీజ్ అని మాత్రమే మెన్షన్ చేశారు. దీంతో విడుదల తేదీపై కొంత సందిగ్ధం నెలకొందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ ‘మ్యూజికల్ కాన్సెర్ట్’ (ప్రీ రిలీజ్ వేడుక) జనవరి 6వ తేదీన యుసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో జరగనుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్కు సంబంధించి కర్టెన్ రైజర్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో పోతన భాగవతంలో రచించిన ‘అల వైకుంఠపురములో..’ పాటను గాయనీమణులు ఆలపించారు. చదవండి: అల.. వైకుంఠపురములో.. ‘దోశ స్టెప్పు’ -
జూలైలో జాయినింగ్
వాల్మీకి సెట్లో హీరోయిన్ లేకుండా వరుణ్ తేజ్ షూటింగ్ చేస్తున్నారు. ఈ వాల్మీకి జోడీ జూలైలో ఎంట్రీ ఇస్తారని లేటెస్ట్గా తెలిసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ‘వాల్మీకి’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజాహెగ్డే కథానాయిక. తమిళ నటుడు అధర్వ మురళి కీలక పాత్రలో నటిస్తారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర నిర్మింస్తున్న ఈ చిత్రం తమిళ సూపర్హిట్ ‘జిగర్దండ’ సినిమాకి రీమేక్. ఇందులో వరుణ్ తేజ్ తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోందట. జూలై నుంచి ‘వాల్మీకి’ టీమ్లో జాయిన్ అవుతారట పూజా హెగ్డే. మరోవైపు ఈ సినిమాను సెప్టెంబర్ 6న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం
‘మహర్షి’ చిత్రం రిలీజ్కి రెడీ అవుతోంది. దాంతో ప్రమోషనల్ కార్యక్రమాల స్పీడ్ పెంచింది చిత్రబృందం. ఇటీవలే ఫస్ట్ సాంగ్, టీజర్ను రిలీజ్ చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్గా సెకండ్ సాంగ్ ‘నువ్వే సమస్తం... నువ్వే సిద్ధాంతం..’ను శుక్రవారం రిలీజ్ చేసింది. మహేశ్బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయిక. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో కీలక సన్నివేశాల్లో వచ్చే ‘నువ్వే సమస్తం. నువ్వే సిద్ధాంతం..’ సాంగ్ ఉత్తేజ గీతంలా అనిపిస్తోంది. హీరోను ఎలివేట్ చేసేలా ఈ సాంగ్ కనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా యాజిన్ నిజర్ పాడారు. మే9న ‘మహర్షి’ రిలీజ్ కానుంది. -
ప్రకాశంలో పూజా సందడి
ఒంగోలు (ప్రకాశం): స్థానిక గుంటూరు రోడ్డులో నూతనంగా నిర్మించిన రవిప్రియ మాల్ అండ్ మల్టీప్లెక్స్ను ప్రముఖ సినీనటి పూజాహెగ్డే బుధవారం ప్రారంభించారు. పూజాహెగ్డేతో పాటు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మాల్ చైర్మన్ కంది రవిశంకర్, అతని కుటుంబ సభ్యులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలుత మాల్ అండ్ మల్టీప్లెక్స్ ముందువైపు ఏర్పాటుచేసిన వాటర్ ఫౌంటైన్ను పూజాహెగ్డే ప్రారంభించారు. అనంతరం ప్రధాన భవనాన్ని మంత్రి శిద్దా రాఘవరావు, గ్రౌండ్ఫ్లోర్లోని మాక్స్షాపింగ్ మాల్, ఫుడ్కోర్టును ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, కేఎఫ్సీ సెంటర్ను మాజీ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి, క్రీమ్స్టోన్ను మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు ప్రారంభించారు. తదుపరి మొదటి అంతస్తులో 65 అడుగుల భారీ స్క్రీన్తో నిర్మితమైన స్క్రీన్–1 థియేటర్ను బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించగా, స్క్రీన్–2ను ఎమ్మెల్సీ కరణం బలరాం, స్క్రీన్–3ని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గేమ్జోన్ను ప్రారంభించారు. అభిమానులను చూస్తుంటే ఆనందంగా ఉంది : పూజాహెగ్డే పూజా హెగ్డే రాకతో రెండు గంటల ముందు నుంచే ఆ ప్రాంతానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. మాల్ ఎదురుగా రోడ్డు పక్కన, డివైడర్లపై బారులుదీరి ఆమెను చూసేందుకు, ఫొటోలు తీసేందుకు ఉత్సాహం చూపారు. భారీ బందోబస్తు మధ్య డప్పులతో పూజా హెగ్డేకు స్వాగతం పలికారు. మాల్ ప్రారంభం అనంతరం పూజాహెగ్డే మాట్లాడుతూ అభిమానులను చూస్తుంటే తనకెంతో ఆనందంగా ఉందన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన రవిశంకర్ గ్రూప్ వారికి కృతజ్ఞతలు ప్రకటించారు. త్వరలోనే తాను నటించిన అరవింద సమేత విడుదలవుతుందని, ఆదరించాలని కోరారు. కేవలం కేకలు కాకుండా ఈలలు వేసి అభిమానాన్ని చాటాలంటూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. లవ్యూ సోమచ్ అంటూ గాలిలోకి ముద్దులు విసిరి కుర్రకారును గిలిగింతలు పెట్టారు. ఐదేళ్ల క్రితమే మాల్ నిర్మించాలనుకున్నాం : చైర్మన్ రవిశంకర్ ఐదేళ్ల క్రితం 2013లోనే ఒంగోలులో మాల్ అండ్ మల్టీప్లెక్స్ నిర్మించాలని తాము భావించినట్లు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ వెల్లడించారు. అది ఇప్పటికి కార్యరూపం దాల్చిందని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రాండ్లు అయిన మ్యాక్స్, కేఎఫ్సీ, క్రీమ్స్టోన్, పిజ్జాహట్లు, థియేటర్లతో పాటు పిల్లలకు అవసరమైన గేమ్జోన్ వంటి వాటిని మాల్లో ఏర్పాటు చేశామన్నారు. అన్నింటినీ సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం తాను, తన గ్రూప్ ఉన్నతంగా ఉండటానికి ఒంగోలు, పరిసర ప్రాంతాల ప్రజల ఆశీర్వాదమే కారణమన్నారు. అందుకే ఈ మల్టీప్లెక్స్ను ఒంగోలు ప్రజలకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయత కలిగిన కార్నివాల్స్ సినిమా గ్రూప్ స్క్రీన్లు మూడింటిని సినిమాలకు ఏర్పాటు చేశామన్నారు. మాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంది సాయినాథ్ మాట్లాడుతూ 65 అడుగుల పూర్తిస్థాయి స్క్రీన్పై సినిమా చూడటం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కేవలం ఒంగోలు ప్రేక్షకులకే సాధ్యమన్నారు. హైదరాబాద్లోని ఐమాక్స్లో సైతం కొన్ని సినిమాలను మాత్రమే పూర్తిస్థాయి స్క్రీన్పై చూడటం సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో రవిశంకర్ గ్రూప్ డైరెక్టర్లు ప్రియదర్శిని, విష్ణుమోహన్, విజయసాయి పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
డబ్బు కోసం ఏది పడితే అది చేయను
‘‘ఈ బిళ్లలు మింగండి. ఎంచక్కా సన్నబడిపోండి’ అనే యాడ్ చూస్తే.. లావుగా ఉన్నవాళ్లల్లో చాలామంది ఎట్రాక్ట్ అయిపోతారు. ఏముంది? ఓ మందు బిళ్లే కదా.. మింగేస్తే పోలా? అనుకుంటారు. డబ్బు గురించి ఆలోచించకుండా కొనేస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా ఆలోచించరు. కానీ, ప్రమోట్ చేసేవాళ్లు మంచివాళ్లైతే ఆలోచిస్తారు. పూజా హెగ్డే ఈ కేటగిరీలోకే వస్తారు. ఓ ప్రముఖ ఉత్పత్తిదారులు ‘వెయిట్ లాస్ పిల్’ను ప్రమోట్ చేయమని పూజా హెగ్డేని సంప్రదించారు. భారీ పారితోషికం ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ, పూజా ఆ ఆఫర్ని తిరస్కరించారు. డబ్బు కోసం ఏది పడితే అది చేయనని తెగేసి చెప్పారు. ‘‘స్ట్రిక్ట్ డైట్, యోగ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో అయితే బరువు తగ్గటం పెద్ద కష్టం కాదు. వెయిట్ లాస్కు నేచురల్ పద్ధతిని ఫాలో అవ్వడమే మంచిది. టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల బరువు తగ్గుతారని మిస్ గైడ్ చేయడం నాకిష్టం లేదు. ఆరోగ్యం పట్ల అందరూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఈ రోజుల్లో హెల్త్ ఈజ్ వెల్త్ అని గుర్తించుకోవాలి. ఎట్లీస్ట్ 45 మినిట్స్ డైలీ వ్యాయామం చేసేలా లైఫ్స్టైల్ను చేంజ్ చేసుకోవాలి. అప్పుడే హెల్త్ పరంగా గుడ్ రిజల్ట్ ఉంటుంది’’ అని పేర్కొన్నారు పూజా.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
అకాల వర్షంతో ఆందోళన
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement