-
ఐశ్వర్య ప్రదాయిని.. వరలక్ష్మీ
సందర్భం– నేడు వరలక్ష్మీ వ్రతం అనంతపురం కల్చరల్ : శ్రావణం దేవతలకు ఇష్టమైన మాసమని పురాణాలు చెబుతున్నాయి. ముత్తైదువలు దీర్ఘ సుమంగళీతనం కోసం భర్తతో కలిసి ఆచరించే వరమమాలక్ష్మీ వ్రతానికి విశేష ప్రాముఖ్యత ఉంది. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి మొదట వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఎనిమిది విధాల సకల సౌభాగ్యాలనిచ్చే అష్టలక్ష్ములకు మహిళలు పూజిస్తారు. జిల్లాలోని వివిధ ఆలయాలతో పాటు నగరంలోని స్థానిక పాతూరులో వెలసిన ఏకైక మహాలక్ష్మీ ఆలయంలో వ్రత వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండెక్కిన పూల ధరలు వరలక్ష్మి వ్రతం సందర్భంగా గురువారం సాయంత్రం నుండే నగరంలోని పలు చోట్ల మామిడాకులు, పళ్లు, పూల దుకాణాలు కిటకిటలాడాయి. అన్ని రకాల పూల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒక కేజీ కనకాంబరాలు రూ.150, గులాబీలు రూ.300, మల్లెలు రూ. 130 కాగా చామంతి పూలు రూ. 400 పలుకుతున్నా ప్రజలు పెద్ద ఎత్తున కొంటున్నారు. వరలక్ష్మీ విధానం ఇలా ఆచరిద్దాం.. సాధారణంగా శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఆ రోజున వీలు కాకపోతే శ్రావణంలో వచ్చే ఏ శుక్రవారమైనా దీనిని ఆచరించుకోవచ్చు. - వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే వారు ఆరోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. - పూజా మందిరంలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసుకుని దానిపై బియ్యపు పిండితో ముగ్గు వేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. - పసుపు రాసుకున్న తెల్లటి దారాలను ఐదు లేదా తొమ్మిదిపోగులు తీసుకుని తోరాలుగా చేసుకున్న వాటిని చేతికి కట్టుకోవాలి. - తొలుత గణపతి పూజలతో ప్రారంభించి అమ్మవారిని అష్టోత్తర నామాలకు అనుగుణంగా పూజించాలి. - పాలు, పండ్లు, గంధం, వివిధ రకాల పూలను అమ్మవారికి సమర్పించాలి. - దీపారాధనలో అమ్మవారి ప్రతిరూపంగా ఉంటుందని కనుక మహా మంగళహారతి ఇవ్వాలి. - వ్రత కథలను శ్రద్ధగా విన్న తర్వాత ఐదు మంది ముత్తైదువులను పిలిచి చందన తాంబూలిస్తే ఆ ఇంట సిరులొలుకుతాయని అందరి విశ్వాసం. సకల ఐశ్యర్యాలు కలుగుతాయి సహజంగా మహిళలకు పుట్టింటిపై మమకారం ఉంటుంది. ఇదే విషయాన్ని వరలక్ష్మి వ్రతం ప్రతిబింభిస్తుంది. ఈ వ్రతం నిష్టగా జరుపుకునే వారికి పుట్టినింటిలో, మెట్టినింటిలో అపూర్వ ఆదరణ, ఆప్యాయతలు, సకల ఐశ్యర్యాలు కలుగుతాయని అందరి నమ్మకం. –రమాదేవి, గృహిణి, అనంతపురం -
వరుణదేవా.. కరుణించు !
రాయదుర్గం టౌన్ : వరుణుడి కరుణం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. వరుణదేవా...కరుణించవయ్యా అంటూ పూజలు చేస్తున్నారు. రాయదుర్గం పట్టణంలోని సిద్దేశ్వర , బైలాంజనేయస్వామి కాలనీవాసులు వర్షం కోసం శుక్రవారం 28వ వార్డులోని పురాతన పాలబావిలో పూజలు, ఊరువాకిలి, బళ్లారి రోడ్లలోని బొడ్రాయికి పూజలు నిర్వహించారు. శాంతినగర్లోని బైలాంజనేయస్వామి గుడి వద్ద నుంచి మల్లికార్జున, మారెప్ప ఆధ్వర్యంలో యువతీయువకులు కలశాలతో పాలబావి వద్ద పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి బొడ్రాయి వద్దకు చేరుకుని 101 బిందెల నీరు పోసి అభిషేకం, 101 టెంకాయలు సమర్పించి వర్షాలు కురిసి ప్రజల్లో సుఖసంతోషాలు నింపాలని ప్రార్థించారు. వర్షాలు లేక తాగునీరు, సాగునీటితో పాటు పశుపక్షాదులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తిందని, వర్షాభావం నుంచి గట్టెక్కించాలని పూజలు చేశారు. -
కుటుంబ కథా చిత్రాలకే ప్రాధాన్యం
∙‘శతమానం భవతి’ డైరెక్టర్ సతీష్ రాజు ∙ఆత్రేయపురం వెంకన్నకు పూజలు ఆత్రేయపురం: (కొత్తపేట) : కుటుంబ కథా చిత్రాలకే అధిక ప్రాధాన్యమి స్తానని శతమానం భవతి సినిమా డైరెక్టర్ వేగేశ్న సతీష్రాజు అన్నారు. మంగళవారం ఆయన ఆత్రేయపురం శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లమ్మ, కనక మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాల్లో కుంకుమ పూజలు చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ 45 చిత్రాలకు కథ, మాటలు రాసి, స్క్రీ¯ŒS ప్లే చిత్రీకరించడంతో పాటు డైరెక్టర్గా శతమానం భవతి మంచి హిట్ను అందించడంతో సతీష్రాజును క్షత్రియ యూత్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్రేయపురంతో ఎంతో ఆత్మీయబంధం ఉందన్నారు. అందుకే శతమానం భవతి సినిమాలో ఆత్రేయపురం పేరుతో సినిమా రూపొందించడం సెంట్మెంట్గా భావిస్తున్నానని వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఓడూరు తన స్వగ్రామమని, అందుకే గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ కథా చిత్రాలపై దృష్టి సారించానని తెలిపారు. ప్రస్తుతం దిల్రాజ్ నిర్మాణంలో ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరిస్తూ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేపడుతున్నామని తెలిపారు. ఆలయంలో ఘన స్వాగతం.. శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చిన సతీష్ రాజుకు నిర్మాత పాతపాటి సత్యనారాయణరాజు (రమణరాజు) ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని, స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. వేదపండితులు ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయంలో స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వామి వారి ఫొటోను ఆలయ నిర్మాత రమణరాజు ఆయనకు అందజేశారు. అనంతరం గ్రామంలో ‘వేగేశ్న’ వారి ఇంట్లో భోజనం చేసి, బంధుమిత్రులతో కాలక్షేపం చేశారు. సతీష్ రాకతో ఆయన అభిమానులు తరలివచ్చి ఆటోగ్రాఫ్ల కోసం పోటీపడ్డారు. విఘ్నేశ్వరుని ఆలయంలో పూజలు అయినవిల్లి : విఘ్నేశ్వరస్వామి ఆలయంలో వేగేశ్న సతీష్ మంగళవారం పూజలు చేశారు. ఆయనకు ఆలయ ప్రధానార్చకుడు సూరిబాబు, చైర్మ¯ŒS సుబ్బరాజు స్వాగతం పలికారు. స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. -
సిద్ధేశ్వరస్వామి ఆలయంలో డీఐజీ పూజలు
అమరాపురం : మండలంలో వెలసిన హేమావతి సిద్ధేశ్వరస్వామి ఆలయాన్ని డీఐజీ ప్రభాకర్రావు శనివారం సందర్శించారు. అర్చకులు, సర్పంచు సదాశివ, గ్రామపెద్దలు ప్రకాష్, కుమారస్వామి తదితరులు డీఐజీకి స్వాగతం పలికారు. అనంతరం మానవాకారంలో ఉన్న సిద్ధేశ్వరస్వామికి ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం కాలభైరవేశ్వరస్వామి, దొడ్డేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు చేయించారు. ఆలయ విశిష్టతను అర్చకులు డీఐజీకి వివరించారు. పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు, మడకశిర సీఐ దేవానంద్, ఎస్ఐ వెంకటస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. -
‘బాబు’కు మంచి బుద్ధి ప్రసాదించుస్వామీ
ఆలయాల్లో ‘కాపు’వర్గీయుల పూజలు సాక్షిప్రతినిధి, కాకినాడ : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త నిరసనల్లో భాగంగా మంగళవారం జిల్లాలో కాపు సామాజికవర్గీయులు ఆలయాల్లో పూజలు, అభిషేకాలు చేసి వినతిపత్రాలు అందచేశారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ ఆధ్వర్యంలో పలు దశల్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ది ప్రసాదించాలంటూ వారు ప్రార్థించారు. కాకినాడలోని భానుగుడి జంక్ష¯ŒS సమీపాన ఉన్న భానులింగేశ్వరస్వామి దేవాలయంలో కాపు జేఏసీ నాయకుడు వాసిరెడ్డి ఏసుదాసు, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు ఫ్రూటీకుమార్, కాపు సద్భావనా సంఘం నాయకుడు బసవా ప్రభాకరరావు తదితరులు దేవుడికి వినతిపత్రం అందచేశారు. అమలాపురంలో రాష్ట్ర కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, కాపు జేఏసీ నాయకులు నల్లా పవన్, మిండగుదిటి మోహన్, కలవకొలను తాతాజీ తదితరులు వెంకటేశ్వరస్వామి ఆలయం, గడియారస్తంభం సెంటర్లో లక్షీ్మగణపతి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. రావులపాలెం కళావెంకట్రావు సెంటర్లో భక్తాంజనేయస్వామి ఆలయం వద్ద జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామికి పూజలు చేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు దోసాలమ్మ ఆలయంలో రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరజాల బాబు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ అయ్యప్పస్వామి ఆలయంలో చంద్రబాబుకు జ్ఞాపకశక్తి ప్రసాదించాలని నగర కాపు సంఘ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు కొబ్బరికాయ కొట్టి దేవుని ప్రార్థించారు. కాపు నాయకులు నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కడియంలో కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement