-
సరదాగా కాల్చేస్తుండ్రు!
బడాబాబుల కాల్పుల సరదా మూగజీవుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. పూడూరు మండల పరిధిలోని ఫాంహౌస్ల సమీపంలో చోటు చేసుకున్న రెండు సంఘటనలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో నాటు తుపాకీతో కుక్కలను కాల్చి.. ఈ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వేటగాళ్లు..అప్పట్లో సంచలనం సృష్టించారు. గత శనివారం మళ్లీ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎన్కెపల్లి శివారులో కాడెద్దుపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతిచెందింది. సంపన్న వర్గాలకు చెందిన వారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుండటంతో పోలీసులు, అధికారులు అటువైపు తొంగి చూడటం లేదు. రక్తం మరిగిన పులుల్లా గన్ కల్చర్కు అలవాటుపడిన దుండగులు మనుషులపై ఎక్కుపెట్టే రోజు రాకముందే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పరిగి : అసాంఘిక కార్యకలాపాలు, కాల్పుల సంఘటనలు జరిగిన సమయంలో హల్చల్ చేస్తున్న పోలీసులు ఆ తర్వాత మిన్నకుండిపోతున్నారు. ప్రధాన కేసులన్నీ ఇలాగే నీరుగారుతుండటం.. వీరి పని తీరుపై విమర్శలకు తావిస్తోంది. ఈ కేసులన్నింటిలో బడాబాబులు, ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధుల హస్తం ఉంటుండటంతో పోలీసుల విచారణ సైతం ఎక్కడో ఒక చోట ఆగిపోతోందనే ఆరోపణలున్నాయి. సరదా కోసం కొందరు బడాబాబులు గన్తో కుక్కలు, ఎద్దులను వేటాడి చంపుతున్న ఘటనలు చోటుచేసుకోవడం స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పరిగి నియోజకవర్గ పరిధిలోని పూడూరు మండల పరిసరాలు దీనికి వేదికవుతున్నాయి. కాల్పల ఘటనలే కాకుండా అసాంఘిక కార్యకలాపాలు, నేరస్తులు తలదాచుకోవటం తదితర కార్యకలాపాలకు ఈ ప్రాంతం అడ్డాగా మా రిందని ప్రజలు చెబుతున్నారు. ఇది తమను ప్ర మాదంలో పడేస్తోందని ఆవేదన వ్యక్తంచేసు ్తన్నా రు. ఏడాది క్రితం తుపాకీతో కుక్కలను వేటాడి.. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంఘటన జరిగి ఏడాదిన్నర కావస్తుండగా.. సరిగ్గా ఇలాంటి సంఘటనే మళ్లీ జరగడం కలకలం రేపుతోంది. తాజాగా ఎద్దును గన్తో కాల్చి చంపి కళేబరాన్ని మాయం చేసిన ఉదంతం హాట్ టాపిక్గా మారింది. గతంలో కుక్కల వేట.. కొందరు బడా బాబులు తమ సరాదా కోసం అటుగా వెళ్లే పెంపుడు కుక్కలను గన్తో వేటాడి చంపారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ విషయం రెడ్క్రాస్ సొసైటీ దృష్టికి వెళ్లడంతో.. కేంద్ర మంత్రి మేనకాగాంధీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందో వివరాలు సేకరించాలని ఆమె సొసైటీ ప్రతినిధులకు సూచించారు. పోలీసుల సహకారంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సంఘటన జరిగింది పూడూరు మండల పరిధిలోని మన్నెగూడ సమీపంలోని ఓ ప్రైవేటు ఫాంహౌస్లో అని ప్రా థమి కంగా గుర్తించారు. అనంతరం చన్గొముల్ పోలీసులను ఆశ్రయించటంతో వారు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత చేవెళ్ల డీఎస్పీ శృతకీర్తి రెడ్క్రాస్ సొసైటీ సభ్యులతో కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కానీ ఇప్పటి వరకూ దీనిపై చార్జిషీట్ వేయలేదు. తాజాగా ఎద్దుపై కాల్పులు.... తాజాగా గన్తో ఎద్దుపై కాల్పులు జరిపి చంపిన ఘటన స్థానికంగా మరో సారి సంచలనం రేపింది. పూడూరు మండల పరిధిలోని ఎన్కెపల్లి శివారులో ఎద్దుపై తుపాకితో కాల్పులు జరపగా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అయితే ఈ విషయమై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బాధిత రైతు ముందుగా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. కాల్పులకు పాల్పడిన వ్యక్తులు ఎద్దును కొనిస్తామని చెప్పడంతో అతను మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. దీంతో మృతిచెందిన ఎద్దును వెంటనే అక్కడ నుంచి మాయం చేశారు. స్థానికుల్లో ఆందోళన... కాల్పుల ఘటనలకు పాల్పడింది బడాబాబులు, పలుకుబడి, ఆర్థికంగా బాగా ఉన్న వారు కావటంతో కేసు ముందుకు సాగటంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పై నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగానే ఈ కేసు దర్యాప్తులో పురోగతి కనిపించటంలేదని సమాచారం. ఏది ఏమైనా.. గన్ కల్చర్ మంచిది కాదని.. ప్రభుత్వం, పోలీసులు ఈ సంఘటనను కుక్కలు, పశువులపై వేటగానే చూడకుండా తీవ్రంగా పరిగణించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీరిని ఉపేక్షిస్తే మున్ముందు మరిన్ని దుర్ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందని పేర్కొంటున్నారు. ఫిర్యాదు అందలేదు ఇటీవల ఎద్దుపై తుపాకీతో కాల్పులు జరిపి చంపేశారనే విషయంపై మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా కేసు నమోదు చేసి విచారణ చేస్తాం. గతంలో గన్తో కుక్కలను వేటాడిన కేసుకు సంబంధించి పురోగతి సాధించాం. త్వరలోనే దీనిపై చార్జిషీటు వేస్తాం. – శ్రీనివాస్, డీఎస్పీ, పరిగి -
కాగజ్ నగర్ లో పిడుగుపాటు
కాగజ్ నగర్ (ఆదిలాబాద్) : పిడుగుపాటుకు ఓ ఎద్దు మృతి చెందింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిలా కాగజ్నగర్ మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని వల్లకొండ పంచాయతీ పరిధిలోని సీతానగర్లో పిడుగుపడటంతో డి.మహేందర్కు చెందిన ఎద్దు మృతి చెందింది. సంఘటనా స్థలంలోనే వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న మహేందర్ భార్య కూడా పిడుగుపాటుతో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం బాధితురాలు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement