-
25 శాతం భార్యాబాధిత కేసులే
ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని వెల్లడి సాక్షి, అమరావతి: మహిళా కమిషన్కు అందుతున్న కేసుల్లో 25 శాతం మహిళా బాధితులైన పురుషుల నుంచి వస్తున్నవేనని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. భార్యలు కొడుతున్నారంటూ సాక్ష్యాలుగా వీడియోలు కూడా చూపిస్తున్నారని చెప్పారు. బుధవారం తాత్కాలిక అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్ర మోహన్రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతుండగా నన్నపనేని అటువైపుగా వెళ్తూ ఆగారు. ఆమెను చూసిన సోమిరెడ్డి.. మహిళా కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. మగవాళ్లు తమను చూస్తున్నారంటూ ఎవరైనా మహిళ ఫిర్యాదు చేయగానే కేసులు పెట్టేయడం ఎంతవరకు సబబని ఆయన నవ్వుతూ అడిగారు. ఈ విషయంలో పురుషుల పట్ల మహిళా కమిషన్ దయ చూపించాలన్నారు. దీంతో నన్నపనేని స్పందిస్తూ.. చూస్తేనే కేసులు పెడుతున్నారనడం సరికాదని, అసభ్యంగా చూస్తేనో, ప్రవర్తిస్తేనో మాత్రమే కేసులుంటాయని జవాబిచ్చారు. -
లోకేష్కు ఎమ్మెల్సీ పదవి
⇒ టీడీపీ పొలిట్బ్యూరోలో నిర్ణయం ⇒ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత చంద్రబాబుకు సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్కు ఎమ్మెల్సీ పదవి ఖాయమైంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఆయనకు ఇవ్వాలని ఆదివారం జరిగిన పొలిట్బ్యూరో సమావే శంలో నేతలు పార్టీ అధినేత చంద్రబా బుని కోరినట్లు సమాచారం. దీనిపై ఆయన ఏమీ మాట్లాడక పోయినా ఈ విషయం ఖరారైనట్లు తెలిసింది. ఈసారి శాసనమండలిలో కచ్చితంగా లోకేష్ ఉంటారని పొలిట్ బ్యూరో నిర్ణయాలు వెల్లడించిన ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని ఏకగ్రీవంగా కోరినట్లు చెప్పారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఈ అంశాన్ని లేవనెత్తి లోకేష్ను మండలికి పం పాలని ప్రతిపాదించగా ఇతర సభ్యులందరూ బలపరిచారు. సీఎం మాట్లాడుతూ అభ్యర్థు ల ఎంపిక తాను చూసుకుం టానని చెప్పినట్లు సమాచా రం. పాత వారితో పాటు కొత్తగా పార్టీలో చేరిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తానని, పార్టీకి సేవలందించిన వారికీ న్యాయం చేస్తానని చెప్పారు. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపిక బాధ్యతను చంద్రబాబుకు అప్పగిస్తూ పొలిట్బ్యూరోలో తీర్మానించారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తే మనకే మంచి జరుగుతుందని నేతలకు చంద్ర బాబు వివరించారు. ఒకేసారి ఎన్నికలు జర పాలనే కేంద్రం నిర్ణయానికి మద్దతివ్వాలని సమావేశంలో నిర్ణయించారు. జగన్ కేసులపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా సమావేశంలో చర్చకు వచ్చాయని తెలిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement